12, సెప్టెంబర్ 2021, ఆదివారం

భగవద్గీత

 🌹🙏🌹శ్రీ శివాయగురవే నమః.🌹🙏🌹

🌹🙏🌹శ్రీ పరమాత్మనే నమః.🌹🙏🌹


           🌹🙏🌹భగవద్గీత🌹🙏🌹

ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము నుంచి

3వ శ్లోకము, పదచ్ఛేద, టీకా, తాత్పర్యసహితముగా.

   🌹🙏ఓం నమో భగవతే వాసుదేవాయ.🙏🌹


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ౹

యతాతమపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ౹౹

                                                     ౹౹ 3 ౹౹


మనుష్యాణామ్ , సహస్రేషు , కశ్చిత్ , యతతి , 

సిద్ధయే ౹

యతతామ్ , అపి , సిద్ధానామ్ , కశ్చిత్ , మామ్ , 

వేత్తి , తత్త్వతః ౹౹ ౹౹ 3 ౹౹


మనుష్యాణామ్ , సహస్రేషు = వేలకొలది    

                                           మనుష్యులలో ;

కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే ;

సిద్ధయే = భగవత్ప్రాప్తి సిద్ధించుటకై ;

యతతి = ప్రయత్నించును ;

యతతామ్ = (అట్లు) ప్రయత్నించినట్టి ;

సిద్ధానామ్ , అపి = యోగులలోగూడ ;

కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే( మత్పరాయణుడై) ;

మామ్ = నన్ను ;

తత్త్వతః = నా యథార్ధ స్వరూపమును ;

వేత్తి = ఎఱుంగును .


తాత్పర్యము : ౼ వేల మనుష్యులలో ఎవడో ఒకడు

మాత్రమే నన్నుగూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించు ను . అట్లు ప్రయత్నించినవారిలో గూడ ఒకానొకడు

మాత్రమే మత్పరాయణుడై నా తత్త్వమును అనగా

నా యథార్ధ స్వరూపమును ఎఱుంగును . ౹౹ 3 ౹౹


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹కృష్ణం వందేజగద్గురుమ్. శ్రీ కృష్ణం వందేజగద్గురుమ్.

    🌹🙏🌹సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.🌹🙏🌹


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

   అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

    మళ్ళీకలుసుకుంద్దాం.. జై శ్రీ మన్నారాయణ.


🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

                         Yours.....

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi and State President Legal Cell AP Reddy Sangam and Chairman AP Advocates Associations JAC Andhra Pradesh State

ప్రశ్న పత్రం సంఖ్య: 30

 ప్రశ్న పత్రం సంఖ్య: 30  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 తత్వ వేదాంత సంబంధిత ప్రెశ్నలు. 

జీవకోటిలో దుర్లభము, ఉత్తమము అయిన మానవజన్మ కలిగి మనం ఉన్నామంటే అది కేవలం మనం గతజన్మలలో చేసుకున్న సుకృతం మాత్రమే.  ఈ జన్మను మనము జన్మ రాహిత్యానికి అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించాలని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. ముముక్షువులారా క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. ధృతరాష్ట్రునికి భగవత్గీతను వినిపించింది ఎవరు. 

2. యుద్ధవీరుడు, ధనుర్విద్యా పారంగతుడు అయిన అర్జనుడు యుద్ధం చేయటానికి ఎందుకు వెనుకాడడు. 

3. తత్త్వం అంటే ఏమిటి. 

4. వేదాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది. 

5. సాధకునికి తానూ చేసే సాధనకు మూడు విధాల విజ్ఞాలు కలుగవచ్చ అని అంటారు అవి ఏవి. 

6. మహావాక్యాలు అంటే ఏమిటి. 

7. అరిషడ్వార్గం అంటే ఏమిటి. 

8. అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యం ఏ ఉపనిషతులోనిది. 

9. మోక్షము సిద్ధవస్తువా లేక సాద్యవస్తువా. 

10. ప్రస్నోపనిషత్తులో ప్రశ్నలకు సమాదానాలు తెలిపిన మహర్షి పేరు ఏమిటి. 

11. త్రిగుణాలు అంటే ఏమిటి. 

12. తమోగుణవంతులు మోక్షానికి అర్హులా 

13. కృష్ణ భగవానులు అన్నిధర్మాలు పరిత్యజించి ఏమి చేయమన్నారు. 

14. సంసారం, సన్యాసం రెంటిలో మోక్షసాధకుడు దీనిని ఎంచుకుంటారు. 

15. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు. 

16. సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటి. 

17. అహమాత్మా బ్రహ్మా అంటే అర్ధం ఏమిటి. 

18. తత్వమసి ఏ ఉపనిషత్తులోది 

19.  పంచేంద్రియాలు ఏవి. 

20. నాలుగు మహావాక్యాలు ఏవి 

21. ప్రస్థానత్రయం అని వీటిని అంటారు 

22. శ్రీ ఆదిశంకరాచాయులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 

23. శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 

24. శ్రీ మద్వాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. 

25. చారువాకవాదం ఏమిటి 

26. షడ్ దర్శనాలు అంటే ఏమిటి. 

27. నిర్వాణ షట్కామ్ వ్రాసింది ఎవరు. 

28. జనక మహారాజుకు వేదాంతాన్ని బోధించింది ఎవరు 

29. భగవత్గీత ప్రకారం కర్మలు చేయాలా లేక చేయవలదా. 

30. మోక్షం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు. 

పరమాచార్య స్వామి వారి సమీక్ష

 ॐ గాణపత్యం పై కాంచి పరమాచార్య స్వామి వారి సమీక్ష 


    వినాయకుణ్ణి ధారణచేసి మనం కొంచెం యోచిస్తే, ప్రతి చిన్న విషయంలోనూ అయనను గూర్చి మన కొక తత్త్వం నయన పర్వంగా దీపిస్తుంది.


    వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం. ఎందుకు? 

    ఒకప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రియైన పరమశివుని చూచి, 'నాకు నీ తలను బలిగా ఇవ్వు' అని అడిగాడట. 

    తలను ఉత్తమాంగం అని అంటారు. మనకున్న వస్తువులో పరమ శ్రేష్ఠమైన వస్తువును త్యాగంచేసి అర్చిస్తే కదా అది భక్తి.  

    ఈశ్వరుడు త్రయంబకుడు - మూడుకళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువునొకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడుకళ్ళుకల కొబ్బరికాయ.     

   "వినాయకునికి మీరు కూడా మూడుకళ్ళ కొబ్బరికాయ కొట్టండి" అని ఈశ్వరుడు అనుగ్రహించినట్లున్నది. 

    తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసివేసి ఒక్కవ్రేటులో పగిలేటట్లు కొట్టడం ఒక అలవాటు. దానిని వాళ్ళు "సిదిర్ తేంగాయ్" అని వ్యవహరిస్తారు. 


    ఒకప్పుడు నేను చాతుర్మస్యదీక్షలో నాగపట్నంలో ఉన్నాను. అక్కడ వినాయకుని ముందు విస్తారంగా కొబ్బరికాయలు కొట్టేవారు. ఆలయం ముందు ఒకటే పిల్లల సందడి. కాయను కొట్టీ కొట్టకముందే పిల్లలు మూగి చెదిరే కొబ్బరిముక్కలకై పోట్లాడుకునేవారు. కొందరు పెద్దలు వారిని గద్దించారు. 

   "కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించారు. "కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించడానికి మీకేవరు అధికారం ఇచ్చారు?" అని పిల్లలు తిరగబడ్డారు .

    ఔను, ఆ చిట్టిదైవానికి ఆ చిట్టిపిల్లలే సొంతం అని నాకు అనిపించింది. 

    కొబ్బరికాయను పగలకొడితే అందులొని నారికేళ జలం లభించినట్లు, అహంకారం అణిగితే ఆత్మానుభూతి కల్గుతుంది.  


    గణపతిది స్థూలదేహం. ఆయన నామాలలో స్థూలకాయుడు అన్నదొకటి. అయన పర్వతంవలె ఉన్నాడు. కాని అతడేమో చిన్నబిడ్డ. 

    బిడ్డలకు పుష్టియే అనందం. చిక్కిపోయిన శిశువూ, బొద్దుగా వున్న సన్యాసీ ఒక విరోధాభాసం. వయసు ముదిరే కొద్దీ ఉపవాసం వుండి శరీరాన్నికొంచెం శుష్కింపచేయడం మంచిది. 

    చిన్న బిడ్డలు ఉపవాసముండనక్కర్లేదు. 


    గణపతి వాహనం ఎలుక. ఈయన ఎంత స్దూలకాయుడో, అది అంత సూక్ష్మమైన దేహం కలది. ఈయనకు వాహనం వలన వచ్చే గౌరవం ఏమిలేదు. 

    స్థూలకాయుడైనా, తన వాహనానికి ఏ విధమైన శ్రమా ఉండరాదని, అయన లఘిమాసిద్ధితో బెండువలె తేలికగా ఉంటాడు. అదొక విశేషం. 

    

    ఒక్కొక్కప్రాణికీ, ఒక్కొక్క విషయంలో ప్రీతి. 

    చమరీమృగానికి తోక అంటే ప్రీతి. 

    నెమలికి దాని ఫింఛమే బంగారం. 

     ఏనుగుకు దంతాలంటే ప్రాణం.   

     కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భంలో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి, దానిని కలంగా చేసుకొని, వ్యాసులవారు గంగా స్రవంతిలా భారతాన్ని కవనం చేస్తుంటే, పద్దెనిమిది పర్వాలు చకచకా వ్రాసిముగించి వేశాడు.         


"ఆనందాద్థ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే"             

    పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణవంలో నుంచి ఉద్భవించిన వీచికలాంటివాడు మన గణపతి. 


    శ్రీదేవి సేనలను ప్రతిఘటించడానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణమధ్యంలో స్థాపించాడు. 

    ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరుని చూచి ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ హాసచంద్రికలనుంచి ఒక దేవుడు, మదజలాక్త కుంభస్థలంతో గజానుడై పుట్టాడు. ఆ దేవుడు ఇరువదెనిమిది అక్షరములు మంత్రానికి అధిపతి. 

    ఆయన భండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నంచేసి తల్లికి ఎనలేని సహాయం చేశాడు. 


    ఏకార్యం తలపెట్టినా మనం ముందు, విఘ్నేశ్వరుని తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే ,అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆది దైవం ఆయనే. గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణపత్యులని అంటారు.  


    వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం. సంస్కృతంలో దానిని 'దోర్భి:కర్ణ'మని అంటారు. దోర్భి: అంటే చేతులు. కర్ణమంటే చెవులు.దోర్భి:కర్ణమంటే చేతులతో చేవులని పట్టుకొని గుంజిళ్ళూ తీయటం. 

    ఒకప్పడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కోని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహవిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట. 

    ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లిదొర్లి నవ్వాడట. చిన్నబిడ్డకదా!సుదర్శన చక్రం విషయం మఱచిపోయాడు! అంతటితో అమ్మయ్యా! అని చక్రం తో బాటు విష్ణువు బయటపడ్డాడట. 


    ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే, 

    విఘ్నేశ్వరుని అనుగ్రహం జరగాలంటే, 

    విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి. 

    అందుకే ఆయనకు, 

"యన్నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.

11, సెప్టెంబర్ 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *11.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2258(౨౨౫౮)*


*10.1-1374-వ.*

*10.1-1375-*


*శా. జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను*

*ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ లక్షించి పౌరప్రజా*

*సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థి యై*

*లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్.* 🌺



*_భావము: ఇలా కంసుడు మంత్రులకు ఆజ్ఞలిస్తుండగానే, కొండ మీద వేగంగా పరిగెత్తే జింక మీదికి దూకటానికి ఉత్సాహపడే సింహం లాగా, కంసప్రాణ హరణము కొరకు ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు సమరోత్సాహంతో కంసుడు కూచున్న మంచె మీదికి దూకాడు. ఇది చూచిన ప్రజలు కలవరపాటుకు లోనయ్యారు._* 🙏



*_Meaning: As Kamsa was commanding his ministers, like the lion cub jumping on to a speedy deer, Sri Krishna leapt on to Kamsa’s throne. Seeing this, there was an uproar in the onlookers.”_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

మన చరిత్ర చెప్పని యుద్ధం.

 మన చరిత్ర చెప్పని యుద్ధం....ప్రాన్స్ పాఠ్యపుస్తకాల్లో

పిల్లులకు బోధిస్తున్న వైనం 10 వేల మంది అఫ్గాన్ల మఠాలను మట్టు బెట్టిన 21 మంది సిక్కు యెధుల సాహసం


మన దేశ చరిత్రలో చెప్పని విరులు ఎందరో ఉన్నారు ఈ పోరట వీరులు గురించి విదేశాల్లో పాఠ్యపుస్తకాలు..గా కధ చెప్పుకుంటారు


అక్కడ పిల్లలకు దైర్యం, దేశ భక్తి, త్యాగం గురించి ఉదాహరణగా మన రాజులు, మన సైనిక వీరుల పోరాటాలను పాఠ్య పుస్తకాల్లో పొందుపరచబడ్డాయి. అలాంటి చరిత్ర చెప్పని వీరులు ఎందరో ఉన్నారు.


వారిలో కొన్ని సంవత్సరాల క్రితం 12 వేల ఆఫ్ఘన్ ముష్కర ముఠాను ఓడించిన 21మంది సిక్కు యోధుల గురించి ఈరోజు తెలుసుకుందాం..


యూరోప్‌లోని ముఖ్యంగా ఫ్రాన్స్‌లోని విద్యార్థులకు బోధించబడుతున్న పోరాటం ‘సరగర్హి’. ఒకవైపు 10 వేలకు పైగా ఆఫ్ఘని దొంగలు.. మరోవైపు కేవలం 21 మంది సిక్కు యోధులు.. వీరి మధ్య పోరాటం ఒళ్ళు గగురు పొడిచెంతగా నడించింది.


ఇప్పటి వరకూ సినిమాల ద్వారా లేక చరిత్రలో "గ్రీక్ సపర్త" , "పర్షియన్" వంటి యుద్ధం గురించి తెలుసుకున్నారు. 


అయితే మనదేశ చరిత చెప్పని. గొప్ప యుద్ధం.. సరగర్హి. సిక్లాండ్‌లో జరిగిన గొప్ప "సరగర్హి". బ్రిటిష్ వారి హయాంలో భారత్, పాకిస్థాన్ కలిసి ఉన్నపుడు పాకిస్థాన్‌లోని సారాగర్హి అనే ప్రాంతంలో 1897 సెప్టెంబర్లో ఈ యుద్ధం జరిగింది. 


నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ స్టేట్‌లో 10,000 ఆఫ్ఘన్‌లు దాడి చేశారు. వారు గులిస్తాన్ మరియు లోఖార్ట్ కోటలను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఈ కోటలను మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు.


ఈ కోటల దగ్గర సారాఘర్‌లోని ఒక భద్రతా స్థానం. 36 వ సిక్కు రెజిమెంట్‌కు చెందిన 21 మంది సైనికులు ఉన్నారు. 


ఈ సైనికులందరూ మజా ప్రాంతానికి చెందినవారు. సిఖ్ రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ 20 మంది సైనికులు నియమించబడ్డారు. 


కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన 10 వేల మందిని చూసి ఈ సిక్కు యోధులు భయపడలేదు.. వారిని నుంచి కోటను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించారు. 


అసాధ్యమైన సరే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ సిక్కు యోధులు పోరాడాలని భావించారు. దీంతో 12 ప్టెంబర్ 1897 న సిక్లాండ్ గడ్డపై గొప్ప యుద్ధం జరిగింది.


ప్రపంచంలోని ఐదు గొప్ప యుద్ధాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఒక వైపు 12 వేల మంది ఉన్నారు ఆఫ్ఘన్ ముష్కరులు.. మరో వైపు 21 మంది సిక్కులు .. 


ఈ యుద్ధంలో 1400 మంది ఆఫ్ఘన్‌లు మరణించారు.అంతేకాదు ఆఫ్ఘన్లు ఓడిపోయారు..


ఈ వార్త బిటిష్ అధికారుల ద్వారా ఐరోపా ఖండానికి చేరుకుంది. అలా ప్రపంచం మొత్తం తెలిసింది. 


21 మంది సిక్కు యోధుల పోరాటానికి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఏకంగా యూకే పార్లమెంటులో ఈ 21 మంది హీరోల ధైర్యసాహసాను ప్రశంసిస్తూ.. అందరూ నిలబడ్డారు. 


పోరాటంలో మరణించిన సిక్కు యొధ్యులకు ఘన నివాళి ఇచ్చారు. అప్పట్లో యుద్ధంలో మరణించిన వీరులకు మరణానంతరం ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. 


అంటే ఇప్పుడు నేటి పరం వీర చక్రానికి సమానం. భారత సైనిక చరిత్రలో యుద్ధ సమయంలో సైనికులు తీసుకున్న అత్యంత విచిత్రమైన తుది నిర్ణయంగా ప్రసిద్ధి గాంచింది.


కేవలం 21 మందితో హవల్దార్ ఇషార్ సింగ్ అన్ని వేల మంది దాడిని ఎలా తిప్పి కొట్టారు అన్న విషయాని ఇప్పటికీ ఫ్రాన్స్ లో పాఠంగా చదువుకుంటున్నారు అక్కడ చిన్నారులు. 


ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా.. 21 మంది సిక్కు సైనికులు.. 10 వేల మంది ఆప్ఘనిస్థాన్ ఆక్రమరణదారులపై సారాగర్హి వద్ద జరిపిన భీకరయుద్ధం నేపథ్యంలో కేసరి సినిమా రూపొందిన సంగతి తెలిసిందే 

శుభోదయం

| పెళ్లి త‌ర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?*

 *🔊Adhar card | పెళ్లి త‌ర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?*





*🌀Adhar card | ఆధార్ ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తిదానికి ఆధార్ అవ‌స‌ర‌మే. అందుకే ఆధార్ కార్డులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూసుకోవాలి. ఒక‌వేళ త‌ప్పులు వ‌చ్చినా వాటిని స‌రిదిద్దుకునేందుకు యూఐడీఏఐ వెసులుబాటు క‌ల్పించింది. అలాగే పెళ్లి త‌ర్వాత అమ్మాయి ఇంటిపేరు మార్చుకునేందుకు కూడా ఆధార్ అవ‌కాశం అవ‌కాశం క‌ల్పించింది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్ల‌య్యాక అమ్మాయి ఇంటి పేరు మార‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఒక్కోసారి అమ్మాయి పేరు కూడా మారుతుంది. ఈ సంగ‌తిని దృష్టిలో ఉంచుకుని పెళ్లి త‌ర్వాత అమ్మాయి పేరును ఎలాంటి రుసుము లేకుండా అప్‌డేట్ చేసుకునే అవ‌కాశాన్ని యూఐడీఏఐ క‌ల్పించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ఆధార్ కార్డులో పేరు మార్చుకోవ‌చ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..*




*💥ఆన్‌లైన్‌లో పేరు మార్చ‌డ‌మెలా..*


*➡️ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.*


*➡️హోం పేజిలోని My aadhaar సెక్ష‌న్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి*


*➡️ఆ త‌ర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.*


*➡️అప్పుడు ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.*


*➡️ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.*


*➡️మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని అక్క‌డ ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.*


*➡️అందులో నేమ్ చేంజ్ ఆప్ష‌న్ ఎంచుకుని మారిన పేరు, ఇంటి పేరు వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి.*


*➡️ఆ త‌ర్వాత అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి స‌బ్‌మిట్ చేయాలి.*


*➡️అప్పుడు మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. ఆ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి వెరిఫై చేయాలి.*


*➡️ఈ మొత్తం ప్రాసెస్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.*


*➡️ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయ‌గానే ఒక స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్(SRN) వ‌స్తుంది.‌ ఈ SRN నంబ‌ర్ ద్వారా అడ్ర‌స్ అప్‌డేష‌న్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.*


*💥ఆఫ్‌లైన్‌లో పేరు మార్చ‌డ‌మెలా..*


*➡️ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చ‌డానికి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.*


*➡️ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు నేరుగా వెళ్లొచ్చు.. లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని నిర్ణీత స‌మ‌యానికి వెళ్లొచ్చు.*


*➡️ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. మ‌న ఆధార్ నంబ‌ర్ ద్వారా మ‌న‌కు అందుబాటులో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌లో.. మ‌న‌కు వీలైన టైంకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌చ్చు.*


*➡️ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లేప్పుడు త‌ప్ప‌నిసరిగా కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజిన‌ల్స్‌ను తీసుకెళ్లాలి.*


*➡️ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ సిబ్బంది ఒరిజిన‌ల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని తిరిగి ఇచ్చేస్తారు.*


*➡️ఆధార్‌లో కొత్త పేరు, ఇంటి పేరు ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పి మార్పించుకోవాలి.*


*➡️అవ‌స‌ర‌మైతే బ‌యోమెట్రిక్ డేటాను కూడా అప్‌డేట్ చేస్తారు.*


*➡️ఈ ప్రాసెస్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.*


*💥ఏ డాక్యుమెంట్లు అవ‌స‌రం?*


*🥏సాధార‌ణంగా పెళ్లి త‌ర్వాత‌ ఆధార్ కార్డులో పేరు మార్చ‌డానికి మ్యారేజి స‌ర్టిఫికెట్‌ను ప్రూఫ్‌గా స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓట‌ర్ ఐడీ, రేష‌న్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు(ఫొటోతో ఉన్న‌వి), విద్యాసంస్థ‌ల ఐడీ కార్డులను కూడా ప్రూఫ్‌గా స‌బ్‌మిట్ చేయొచ్చు. కాక‌పోతే వీటిల్లో పెళ్లి త‌ర్వాత మారిన పేరు, ఇంటిపేరు ఉండాలి*

భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు -*

 ఒక రోజు, దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు -*


        *"నేను రేపు పాండవులను చంపుతాను"*


         * అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది -*


     * భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు...

    శ్రీ కృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు, ఇప్పుడు నాతో రండి. 


    * శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు -*


   శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి -*


       ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు, అతను* -

     * "అఖండ సౌభాగ్యవతి భవ" అని ఆశీర్వదించిన తర్వాత ద్రౌపదిని అడిగాడు !!*


    *"ఏంటమ్మా?! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు? శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా"?*


   అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది -*

      * "అవును తాతయ్యా.! వారు గది బయట నిలబడి ఉన్నారు" అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు.


 *భీష్ముడు చెప్పాడు-*


 *"నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"*


    శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు -*


      * "మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు"* -


       * "మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు -దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు"* -

 *...... అంటే ......*


        * ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం -*

*ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడమే.!*

     *"తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు"*


     * "ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."


      * పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు -*


     *"అభ్యర్థన 🙏 ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ఇల్లు స్వర్గం అవుతుంది."*

               *ఎందుకంటే*:-


         * నమస్కారం ప్రేమ.*

         * నమస్కారం క్రమశిక్షణ.*

         *నమస్కారం చల్లదనం.*

         * నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*

         * నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి.*

         నమస్కారం నమస్కరించడం నేర్పుతుంది.*

         * నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

         * నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*

         * నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది.*

         * ప్రాణం మన సంస్కృతి.*

    

 🙏 * అందరికి నమస్కారం * 🙏🙏🙏🙏🙏

లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు

 దుర్యోధనుని కూతురు లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు ఎవరో మరి.

........................................................


శ్రీకృష్ణుణుకి ఎనిమిది మంది భార్యలు. వారిపేర్లు (1) రుక్మిణి, (2) సత్యభామ, (3) జాంబవతి, (4) నగ్నజితి, (5) కాళింది, (6) మిత్రవింద, (7) భద్ర, (8) లక్ష్మణ. వీరినే అష్టభార్యలంటారు.


శ్రీకృష్ణుడి అష్టభార్యలకు ప్రతి ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు జన్మించారు.

వారెవరంటే 


పట్టపుమహిషి రుక్మిణిదేవికి శ్రీకృష్ణునికి (1) ప్రద్యుమ్నుడు, (2) చారుదేష్ణుడు, (3) సుదేష్ణుడు, (4) చారుదేహుడు, (5) సుబారుడు, (6) చారుగుప్తుడు, (7) భద్రకారుడు, (8) చారుచంద్రుడు, (9) విచారుడు, (10) చారుడు అనే కొడుకులు కలిగారు. 


వీరిలో ప్రద్యుమ్నుడి సంతానమే శ్రీకృష్ణుని వారసులుగా ద్వారకనేలుతారు.


సత్యభామ వల్ల కృష్ణునికి (1) భానుడు, (2) సుభానుడు, (3) స్వర్భానుడు, (4) ప్రభానుడు, (5) భానుమంతుడు, (6) చంద్రభానుడు, (7) బృహద్భానుడు, (8) అతిభానుడు, (9) శ్రీభానుడు, (10) ప్రతిభానుడు అనువారు కలిగారు.


జాంబవతీ శ్రీకృష్ణులకు (1) సాంబుడు, (2) సుమిత్రుడు, (3) పురజిత్తు, (4) శతజిత్తు, (5) సహస్రజిత్తు, (6) విజయుడు, (7) చిత్రకేతుడు, (8) వసుమంతుడు, (9) ద్రవిడుడు, (10) క్రతువు కలిగారు. 


సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో అపహరించి, కౌరవులతో పోరాడి ఓడి బందీగాదొరికి పెదనాన్న బలరాముడి ద్వారా విడుదలైతాడు. దుర్యోధనచక్రవర్తి తన గురువు బలరాముడి మాటలను గౌరవించి సాంబుడికి తన కుమార్తె లక్ష్మణను ఇచ్చి పెండ్లిచేశాడు.ఇలా శ్రీకృష్ణదుర్యోధనులు వియ్యంకులైనారు.


సాంబుడు అతని సహచరులు దుర్వాసుని గేలి చేయడం వలన ఆ మహముని శాపంతో సాంబుడి కడుపున ముసలం (రోకలి ) పుట్టి అశేషంగా యదువంశం నశిస్తుంది.

 

నాగ్నజితి, శ్రీకృష్ణులకు (1) వీరుడు, (2) చంద్రుడు, (3) అశ్వసేనుడు, (4) చిత్రగుడు, (5) వేగవంతుడు, (6) వృషుడు, (7) లముడు, (8) శంకుడు, (9) వసుడు, ( 10 ) కుంత అనువారు కలిగారు. 


శ్రీకృష్ణుడికి కాళింది వలన (1) శ్రుతుడు, (2) కవి, (3) వృషుడు, (4) వీరుడు, (5) సుబాహుడు, (6) భద్రుడు, (7) శాంతి, (8) దర్శుడు, (9) పూర్ణమానుడు, (10) శోమకులు జన్మించారు. 


లక్షణకు, శ్రీకృష్ణుడికి (1) ప్రఘోషుడు, (2) గాత్రవంతుడు, (3) సింహుడు, (4) బలుడు, (5) ప్రబలుడు, (6) ఊర్ధ్వగుడు, (7) మహాశక్తి, (8) సహుడు, (9) ఓజుడు, (10) అపరాజితుడు అనేవారు కలిగారు.


మిత్రవింద, శ్రీకృష్ణులకు (1) వృకుడు, (2) హర్షుడు, (3) అనిలుడు, (4) గృద్ధుడు, (5) వర్ధనుడు, (6) అన్నడు, (7) మహాశుడు, (8) పావనుడు, (9) వహ్ని, (10) క్షుధి పుట్టారు.


శ్రీకృష్ణ భద్రలకు (1) సంగ్రామజిత్తు, (2) బృహత్సేనుడు, (3) శూరుడు, (4) ప్రహరణుడు, (5) అరిజిత్తు, (6) జయుడు, (7) (9) సుభద్రుడు, (8) వాముడు, ఆయువు, (10) సత్యకుడు అనేవారు కలిగారు.


శ్రీకృష్ణుడికి అష్టభార్యల వలన కలిగిన కొడుకుల సంఖ్య > 80.


॥సేకరణ॥

........................................................................................................................జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

వినాయక చవితి సందేశం - 7

 ॐ వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 7 


గణపతి పూజ - దూర్వాయుగ్మం (గరిక)          


    గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. 

    ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

   తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

   దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    మగవారికి 

  - సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. 

  - కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

  - చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

  - ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.



    దూర్వాయుగ్మం (జంట గరిక) తీసుకొని, ఈ క్రింది 21 నామాలతో వినాయకునికి పూజచేస్తాం.       


1. సుముఖాయ నమః 

2. గణాధిపాయ నమః 

3. ఉమాపుత్రాయ నమః 

4. గజాననాయ నమః 

5. హరశూనవే నమః 

6. లంబోదరాయ నమః 

7. గుహాగ్రజాయ నమః 

8. గజకర్ణాయ నమః 

9. ఏకదంతాయ నమః 

10. వికటాయ నమః 

11. భిన్నదంతాయ నమః 

12. వటవే నమః 

13. సర్వేశ్వరాయ నమః 

14. ఫాలచంద్రాయ నమః 

15. హేరంబాయ నమః 

16. శూర్పకర్ణాయ నమః 

17. సురాగ్రజాయ నమః 

18. ఇభవక్త్రాయ నమః 

19. వినాయకాయ నమః 

20. సురసేవితాయ నమః 

21. కపిలాయ నమః          


               రామాయణం శర్మ

                    భద్రాచలం

ప్రశ్న పత్రం సంఖ్య: 29 జవాబులు

  ప్రశ్న పత్రం సంఖ్య: 29  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఇది వినాయకచవితి ప్రత్యేకం. దయచేసి ఇందులోని ప్రశ్నలను పూరించటానికి ప్రయత్నించండి.   

  1. వినాయక చవితి ఏ తిధినాడు వస్తుంది.-- జ .  ప్రతి సంవత్సరం, దక్షణాయణం, భాద్రపద మాసం, శుక్ల పక్షం, చవితి నాడు వస్తుంది. అందుకే వినాయక చవితి అన్నారు. 
  2. గజాననునికి విఘ్నదిపత్యాన్ని ఇవ్వటానికి పరమేశ్వరుడు పెట్టిన పరీక్ష ఏమిటి.-- జ . మూడు లోకములలో వున్న పుణ్యనదులలో స్నానమాడి రావాలని 
  3. విఘ్నధిపతిగా ఉండటానికి ఎవరు ఎవరు పోటీ పడ్డారు. --జ . 1) గజాననుడు 2) కుమారస్వామి. 
  4. శ్రీ కృష్ణుడు అడవిలో ఎవరితో మల్లయుద్ధం చేసారు, ఎన్ని రోజులు. --- జ . జాంబవంతునితో 28 రోజులు. 
  5. సత్రాజిత్ సోదరుని పేరు ఏమిటి. --- జ . సుసేనుడు 
  6. సమంతకమనోపాఖ్యానం ఏ యుగములో జరిగింది.--- జ . ద్వాపర యుగములో  
  7. శ్రీ కృష్ణుడు తన నగరమున యేమని చాటింపు చేయించారు.--- జ . ఈ రోజు వినాయక చవితి కావున ఎవరు ఆకాశంలో చంద్రుని చూడరాదని.  
  8. వినాయక వ్రతకధలో శ్రీ కృష్ణుల వారు ఎందరిని వివాహమాడారు, వారి పేర్లు ఏమిటి--. జ . శ్రీ కృష్ణుల వారు ఇద్దరినీ వివాహమాడారు వారు 1) జాంబవతి 2) సత్యభామ. 
  9. రామాయణంలోని ఒకరు  వినాయక్ వ్రతకధలో కనపడతారు ఎవరు. ---జ . జాంబవంతుడు 
  10. నేను తొందరగా వెళ్ళాలి ఈ రాజు వినాయక చవితి అని శ్రీ కృష్ణునితో ఎవరు అన్నారు. -- జ . నారద మహర్షి 
  11. పార్వతి దేవి గృహ ద్వారము వద్ద ఎవరు వున్నారు. --- జ . గజాననుడు 
  12. వినాయకుని ఎవరు తయారుచేసారు, వాడిన పదార్ధం ఏమిటి.-- జ . జగన్మాత పార్వతీదేవి తయారుచేసారు,  వాడిన పదార్ధంనలుగుపిండి  
  13. వినాయకునికి అతికించిన శిరస్సు ఎవరిది.--- జ . గజాసురునిది 
  14. శమంతక మణి దినమునకు ఎన్ని బారువుల బంగారమును వసగును. --- జ . దినమునకుఎనిమిది బారువుల బంగారమును వసగును. 
  15. తల్లిదండ్రులకు ప్రణమిల్ల కష్టపడుతున్న వినాయకుని చూసి నవ్వినది ఎవరు. --జ .  చంద్రుడు 
  16. ఒక్క అరుంధతి వేషము తప్ప ఇతర ఋషి పత్నుల వేషము ధరించినది ఎవరు. ---జ . అగ్ని దేముని భార్య స్వాహా దేవి 
  17. శ్రీ కృష్ణ భగవానునికి కలిగిన నీలాపనిందలు ఏమిటీ. ---జ . సుసేనుని చంపి సమంతకమానికి అపహరించినాడని . 
  18. వినాయక చవితి రాత్రి ఎవరిని చూడకూడదని చెపుతారు. --- జ . చంద్రుని 
  19. వినాయకుని కనిష్ట సోదరుని పేరు ఏమిటి. -- జ . కుమారస్వామి. 
  20. విజ్ఞేషుని భార్యల పేర్లు ఏమిటి. -- జ . సిద్ది,బుద్ధి . 
  21. వినాయకుని వాహనం ఏమిటి పేరు తెలపండి. --జ . అనింద్యుడు 
  22. వినాయకునికి ప్రియమైన వంటకం ఏమిటి. --- జ . మోదకం అనగా కుడుములు. 
  23. ఋషి పత్నులకు కలిగిన నీలాపనిందలు ఏమిటి. -- జ . అగ్ని దేమునితో వున్నది తమ పత్నులే అని ఋషులు వారి భార్యలను విడనాడిరి. 
  24. మనం చేసే ప్రతి పూజకు ముందుగా ఆరాధించే దేముడి పేరు ఏమిటి. -జ . గణపతి 
  25. శ్రీ మహావిష్ణువు ఏ ఏ వాద్య పరికరాలను ధరించినట్లు మనం కధలో తెలుసుకున్నాం --జ . చిరుగంటలు, సన్నాయి 
  26. వినాయక చవితి అంటే నాకు ఇష్టం ఎందుకంటె.-- జ . ఇది మీ స్వంత అభిప్రాయము.