4, జూన్ 2024, మంగళవారం

नूतन संस्कृत वस्तु शब्दकोषः।

 नूतन संस्कृत वस्तु शब्दकोषः।


1.अल्पाहारः(Tiffin)

2.Hotel - उपाहारशाला

3.Canteen - उपाहारगृहम्

4.Tiffin center - उपाहारकेन्द्रम्

5.Breakfast - प्रातराशः

6.Idly - शाल्यपूपः

7.Puri - पूरिका

8.Blackgram dosa - माषदोसा

9.Moong dosa - मुद्गदोसा

10.Onion dosa - पलाण्डुदोसा

11.Masala dosa - सोपस्करदोसा

12.Wheet upama - गोधूमपिष्टिका

13.Vada - वटिका

14.Vada pav -वटिकरोटिका

15.Samosa - समाशः

16.Kachori - मुद्गपूर्णिका

17.Pani puri - जलपूरीका

18.Bread - मृदुरोटिका

19.Cake – स्निग्धपिष्टकम्

20.Biscuit - सुपिष्टकम्

21.Burger - शाकरोटिका

22.Pizza - पिष्टजा

23.Fruit jam - फलपाकः

24.Butter - नवनीतम्

25.Milk cream - मस्तु

26.Snacks - उपाहारः

27.Mirchi bajji - मरीचभर्जी

28.Brinjal bajji - वार्ताकभर्जी

29.Alu bajji - आलुकभर्जी

30.Chips - कासालुः

31.Pakodi - पक्ववटी

32.Palak pakodi - जीवन्तीपक्ववटी

33.Tamarind chutney - तिन्त्रिण्युपसेचनम् 

34.Groundnut power - कलायचूर्णम्

35.Mirchi power - मरीचचूर्णम्

36.Ginger chutney - आर्द्रकोपसेचनम्

37.Sand witch - सम्पुटाशः

38.Alu chips with pounded rice - आलुपृथुकम्

39.Tea centre - चायकेन्द्रम्

40.Tea party - सपीतिः

41.Milk - क्षीरम्

42.Tea powder -चायचूर्णम्

43.Coffee powder - काफीचूर्णम्

44.Decoction - क्वाथः

45.Sugar - शर्करा

46.Tea - चायम्

47.Coffee - काफी

48.Grean tea - हरितचायम्

49.Cold coffee - शीतलकापी

50.Cool drink - शीतलपानीयम्

51.Straw - नालम्

52.Honey - मधु

53.Fruit juice - फलरसः

54.Brittel milk - पीयूषः

55.Chocolate - चाकलेहः

56.Chewing gum - चर्वणकम्

57.Jaggery water -गुडपानकम्

58.Sharbath - फलपानीयम्

59.Soda water - विक्षारजलम्

60.Vegetable soup -शाकतरला

61.Sprouts - अङ्कुराः

62.Moong sprouts - मुद्गाङ्कुराः

63.Groundnut sprouts - कलायांकुराः

64.Channa sprouts - चणकाङ्कुराः

65.Fluffed rice laddu - लाजमोदकम्

66.Pounded rice - पृथुकम्

67.Fluffed rice - लाजः

68.Fried chana - अभ्यूषः

69.Mango paste layer - आम्रमण्डकः

70.Shiraa - मोहनभोगः

71.Boondi laddu - लड्डुकम्

72.Ravva laddu -चुर्णलड्डुकम्

73.Besan laddu -कुट्टितलड्डुकम्

74.Motichur laddu - मुक्ताचूर्णलड्डूकम्

75.Poli(Holige) - पोलिकः

76.Atraasa - अतिरसः

77.Jilebi - अमृतशष्कुली

78.Mysorepak - मैसूरपिष्टकम्

79.Rasagulla - रसगोलकम्

80.Gulab jamun - पानकगोलकम्

81.Kova - गव्या

82.Kova cake - गव्यपिटकः

83.Agra halwa - आग्रारसवती

84.Kara boondi - क्षारबिन्दवः

85.Kara mixture - मिश्रितम्

86.Chakli - शष्कुली

87.Lunch - अहराशः

88.Dinner - नक्ताशः

89.Leaf plate - विस्तरी

90.Curry - व्यञ्जनम्

91.Dal curry - शाकसूपः

92.Dal - सूपः

93.Stuffed curry - सोपस्करशाकः

94.Fried roti - अङ्गाररोटिका

95.Wheet roti - गोधूमरोटिका

96.Jowari roti - जूर्णरोटिका

97.Ragi grain - कोद्रवकबलम्

98.Ragi roti - कोद्रवरोटिका

99.Oiled roti - तैलरोटिका

100.Rice - अन्नम्

101.Mango rice - आम्रोदनम्

102.Chitranna - चित्रान्नम्

103.Pulihora - कृसरान्नाम्

104.Fried rice -भर्जितोदनम्

105.Seasoned cooked rice - उपस्कृतोदनम्

106.Lemon rice - जंबीरोदनम्

107.Fried curry - भर्जितशाकम्

108.Sambar - क्वथितम्

109.Rasam - सारः

110.Chutuney - उपसेचनम्

111.Pickle - उपदंशः

112.Ghee - घृतम्

113.Paayasa - पायसम्

114.Saabakki paayasa - सागुपायसम्

115.Shaavige kheer - सूत्रिकापायसम्

116.Papad - पर्पटः

117.Moong papad - मुद्गपर्पटः

118.Disigned papad - परिकल्पवर्ध्यम्

119.Rice papad - सागुवर्ध्यम्

120.Vada - माषवटिका

121.Curd vada - दधिवटिका

122.Buttermilk - तक्रम्

123.Curd rice - दद्यन्नम्

124.Ice cream - पयोहिमम्

125.Lassi - स्वादुमथितम्

వైశాఖ పురాణం🚩*_ *26

 🍁 *మంగళవారం  - జూన్ 4, 2024*🍁

  _*🚩వైశాఖ పురాణం🚩*_   

       *26వ అధ్యాయము*


*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||*


            *వాల్మీకి జన్మ*


నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.


తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.


శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.


ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.


ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టుతొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.


శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.


ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!


శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.


ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.


శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.


అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట  బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.



అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.


కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.


శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదుకలను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.


*వైశాఖ పురాణం ఇరవై ఆరవ* 

  *అధ్యాయము సంపూర్ణము*

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

ప్లేస్‌మెంట్స్‌లో

 *🔊ప్లేస్‌మెంట్స్‌లో ఏమేం చూస్తారు? ఈ స్కిల్స్‌ తప్పనిసరా?!*


*🛟క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభ్యర్థుల్లో ఎలాంటి నైపుణ్యాలు ఉండాలంటే..?*


*🍥ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ పోటీ ప్రపంచంలో మేటి సంస్థల్లో జాబ్‌ కొట్టడం అభ్యర్థులకు ఎంత కష్టమో..  తమ సంస్థని సమర్థంగా నడిపించే మానవ వనరుల్ని ఎంపిక చేసుకోవడం యాజమాన్యాలకూ అంతే పెద్ద సవాల్‌. అందుకే రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొన్నవారిలో తమ సంస్థకు నప్పే నైపుణ్యాలున్న వారి వైపే  ఆయా సంస్థలు మొగ్గుచూపుతాయి.  కేవలం సబ్జెక్టు పరిజ్ఞానం ఉంటే సరిపోదు.. లోకజ్ఞానంతో పాటు కొన్ని నైపుణ్యాలూ అవసరమే. అందువల్ల ఉద్యోగార్థులు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలివే..*


*♦️ఈ డిజిటల్‌ యుగంలో సాంకేతికపరమైన నైపుణ్యాల్లేకపోతే కెరీర్‌లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేం. చురుగ్గా ఉండటంతో పాటు శరవేగంగా వస్తోన్న మార్పులకనుగుణంగా కొత్త కోర్సులు, టూల్స్‌ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. నిర్ణయాలు తీసుకోవడంలో చురుగ్గా వ్యవహరిస్తూ గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి వ్యవహరించగలిగే  శైలి మేలు చేస్తుంది. ఇతరుల అనుభవాల నుంచీ నేర్చుకోగల సామర్థ్యాన్ని అలవరుచుకోవాలి.*


*♦️క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన ప్రతి అభ్యర్థికీ ఆ సంస్థలో పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయి. అయితే మార్పులను అర్థం చేసుకుంటూ తమ నైపుణ్యాలను అప్‌డేట్‌ చేసుకునేవారికే ఈ అవకాశాలెక్కువ. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలనుకున్న విద్యార్థుల్లో చాలామంది దృష్టి ఆ సంస్థలో ఉద్యోగిగా ఎంపికవడం వరకే పరిమితమవుతుంది. అందుకు అవసరమైన శిక్షణ తీసుకుని, తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇది స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అభ్యర్థిలోని ఈ వైఖరి ఉన్నత స్థాయికి చేరడానికి ఏమాత్రం పనికిరాదు.*


*♦️ఇతరులతో కలిసి పనిచేసే సమయంలో వారితో ప్రవర్తించే తీరు, సంభాషణలు, నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వత కలిగిన ప్రవర్తన కనిపించాలి. ప్రతి సంఘటననూ అర్థం చేసుకుని, నేర్చుకుని తదుపరి కార్యాచరణ చేయగలిగిన సామర్థ్యం ఉద్యోగ సాధనకు మేలు చేస్తుంది.*


*♦️ఉద్యోగంలో చేరాక ఇతరులకంటే భిన్నమైన నైపుణ్యాలున్నవారు ‘ఫాస్ట్‌ట్రాక్‌ కేటగిరీ’లో ఉంటూ సంస్థలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలెక్కువ. వర్క్‌ కల్చర్‌ని గ్రహించి వృత్తిని ప్రేమించే వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ఇలాంటి అభివృద్ది వ్యక్తిగత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. వృత్తి, సంస్థల పట్ల అంకిత భావంతో పనిచేసేవారిని ఏ సంస్థా వదులుకోదు. మీ పైఅధికారుల్ని పనితీరుతో ఇంప్రెస్‌ చేయగలిగే తీరు మరింత ప్రయోజనకరం.*


*♦️నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, ప్రతి పనినీ అందరికంటే భిన్నంగా చేయగలిగే వారికే సంస్థలు ప్రాధాన్యమిస్తుంటాయి. ఉద్యోగం వచ్చింది కదా చాల్లే.. ఇంకేం నేర్చుకుంటాంలే.. అనే ధోరణి మీ కెరీర్‌నే ప్రమాదంలోకి నెడుతుందని మరిచిపోవద్దు. నిరంతరం నేర్చుకునే తత్వం కలిగిన విద్యార్థులు.. ఉద్యోగం వచ్చాకా కొత్త విషయాలు నేర్చుకోవటం కొనసాగిస్తారు. ఇలాంటివారికే నియామకాల్లో మొగ్గు ఉంటుంది. కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది.*


*♦️అకడెమిక్‌లో, ఇతర ఎంపిక ప్రక్రియల్లో నెగ్గాక ఇంటర్వ్యూ ప్యానెల్‌ను ఎలా ఆకట్టుకుంటున్నారనేది కీలకం. మొదటి చూపులోనే తాము ఎదురుచూస్తున్న అభ్యర్థి మీరేనన్న అభిప్రాయం సెలక్టర్లకు కల్పించగలగాలి. అదే మీ ప్రాథమిక ఉద్దేశం కావాలి. అది మీ ఇతర అంశాలతో పాటు వస్త్రధారణలోనూ కనిపిస్తుంది. చాలామంది అలక్ష్యం చేసే అంశాల్లో ప్రొఫెషనల్‌ వస్త్రధారణ ఒకటి.*


*♦️ప్రాంగణ నియామకాల్లో ఆయా సంస్థల బాధ్యులు తమ సంస్థ ప్రొడక్ట్‌, మార్కెటింగ్‌, విజన్‌, మిషన్‌ లాంటివి ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ ప్రజెంటేషన్‌పై విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపాలి. చాలా సందర్బాల్లో విద్యార్థుల ఆసక్తినీ, శ్రద్ధనూ తెలుసుకు నేందుకు ప్రజెంటేషన్‌లోని అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగవచ్చు. విద్యార్థుల పరిశీలన, అప్రమత్తత, ఆసక్తులను వెల్లడించే అంశమిది. ఇలాంటివాటిలో ముందున్న విద్యార్థులపై రిక్రూటర్లకు నమ్మకం పెరుగుతుంది.*

కోళ్ల ఫారం

 చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామం శ్రీశ్రీశ్రీ ఉండ్రుగోండ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు వెళ్లే దారి చెరువు కట్ట క్రింద పొలములో 5000 కోడి పిల్లలు పెంచే కెపాసిటీ గల కోళ్ల ఫారం కలదు. ముందు బోరు నీటి వసతి గల రెండు మళ్లు కలవు. చుట్టుపక్కల గ్రామాల రైతులు భూమిలేని వారు ఇంటి దగ్గరే ఉండి హౌస్ వైఫ్ గా ఉండాలి అని అనుకునేవారు. నా యొక్క షెడ్డు గ్రామమునకు దగ్గరగా ఉన్నందువలన కూరగాయలను పెంచుకునే వసతి, నాటు కోళ్లను పెంచుకోవడానికి అనువుగా ఒక పాడి గేదెలను పెంచుకొనుటకు వసతిగా ఉన్నందువలన, ఆటో డ్రైవర్ గా పని చేసుకునేవారు సూర్యాపేట పట్టణము దగ్గరలో ఉన్నందువలన ప్రతినిత్యం ఉదయం సూర్యాపేటలో కిరాయి తోలుకొని సాయంకాలము ఇంటికి వెళ్లే వసతి ఉన్నందున వారి పిల్లలు తల్లిదండ్రులు భార్య షెడ్డు దగ్గర చెట్లు పేంచుకొనుట నాటు కోళ్లు పెంచుకొనుట పాడి గేదెలు పెంచుకొనుట కొరకు  వసతిగా ఉన్నది. పిల్లలు చదువుకొనుట కొరకు స్వామినారాయణ్ స్కూల్ కూడా ఉన్నది. సూర్యాపేట పట్టణంలో షాపులలో పనిచేసేవారు,తాపిపనివారికి గదులు కిరయితీసుకోనేవారి కుటుంబ సభ్యులు ఇంటిదగ్గర పనిచేసుకుంటూ ఆర్థిక సమస్యలు తీర్చుకొనుటకు వసతిగా ఉన్నందున ఎవరైనా రెంటుకు తీసుకోవాలని అనుకోనేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9491594139. చకిలం. ఫణి కుమార్ ను సంప్రదించగలరు.

హనుమజ్జయంతి ప్రత్యేకం - 4/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  4/11 

        (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


IV.హనుమ - శిశువుగానే పొందిన వరాలు  

     

*వాయుదేవుని సమ్మె 


    శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,

    సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగిరాడు ఆంజనేయుడు.  

    సూర్యునివద్డ మారుతిని చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు చేయగా,       

    ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. 

    అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. 

    అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. 


*వాయువు ప్రాముఖ్యత -  బ్రహ్మదేవుని మాట


   "శరీరము లేని వాయువు శరీరాన్ని పాలిస్తూ, దానిలో సంచరిస్తూంటుంది. 

    వాయువు లేకపోతే శరీరం కట్టెలాగా అయిపోతుంది. 

    వాయువే ప్రాణము. వాయువే సుఖము. ఈ సమస్త జగత్తూ వాయువే. 

    వాయువు విడిచివేస్తే జగత్తుకు సుఖముండదు. 

    ఆయుర్దాయ స్వరూపుడైన వాయువు జగత్తును ఇప్పుడే విడిచాడు. 

    ప్రాణులన్నీ ఇప్పుడే ఉచ్ఛ్వాసనిశ్వాసలు లేకుండా కర్రలవలే, గోడలవలే అయిపోయాయి. 

    అందుచేత మనము, మనకు అనారోగ్యం కలిగించిన వాయువు ఉన్నచోటుకి వెళదాము. 

    ఆ వాయువును అనుగ్రహింపజేసికొనకుండా మనకు ఆరోగ్యం లేదు." 


    అంటూ, దేవతలతో వచ్చి, 

    ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు. వాయువుకి సంతోషపరిచాడు. 

    సమ్మె విరమించి, వాయువు సకల ప్రాణులకూ మోదం కలిగించాడు. 


*హనుమకి దేవతల వరాలు 


    వాయువుకి సంతోషం కలిగించడానికీ, 

   భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, 

   దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. 

    అప్పుడు, 


1.ఇంద్రుడు: 

    బంగారు పద్మహారమునిచ్చి, 

    హనుమ అని నామమిడి, 

    తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు. 


2.సూర్యుడు: 

    తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, 

     శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, 

    సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, 

    తద్వారా వాక్చతురుడు కాగలడనీ, 

    శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు. 


3.వరుణుడు: 

    తన పాశము వలనగానీ, జలములవలనగానీ, 

    లక్షలకొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు. 


4.యముడు: 

    తన దండము వలన మృత్యువు కలగదనీ, 

    ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, 

    యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు. 


5.కుబేరుడు:  

    సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు. 


6.శంకరుడు: 

    తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు. 


7.విశ్వకర్మ: 

    తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, 

    చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు. 


8.బ్రహ్మ: 

    ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ, 

    దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, 


 వాయుదేవునితో మారుతిని గూర్చి 

  - శత్రువులను గడగడలాడించగలడనీ, 

  - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, 

  - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, 

  - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, 

  - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, 

  - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, 

  - యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, 

    లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు. 


    ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు.


*సందేశం 


    జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు. 


    మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.   

    ప్రతిరోజూ ఆరాధిస్తూ, 

    సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. 

    మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.04.06.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే త్రయోదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే త్రయోదశ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.27

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం

త్రయోదశి రా.9.05 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం భరణి  రా.10.07 వరకు.

అమృతం రా.10.36 ల 12.06 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.04 ల 8.56 వరకు. 

దుర్ముహూర్తం రా.10.51 ల 11.35 వరకు. 

వర్జ్యం ఉ.8.37 ల 9.58  వరకు. 

యోగం శోభన ఉ.5.48 వరకు. 

యోగం అతిగండ తె. 3.16 వరకు. 

కరణం గరజి ప.10.05 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు.    

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ త్రయోదశి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

గంధర్వ గానం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

04.06.2024


ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం. ఆయన గళం విప్పితే పాటే ఆయనకు ప్రణమిల్లుతుంది. అందుకే ఆయన గాన గంధర్వుడయ్యారు. స్వర బ్రహ్మగా జన నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం మన బాలు అయ్యారంటే ఆయన కృషి పాలు ఎంతుందో మనకు అర్థమవుతుంది.


శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.


పదాల మాధుర్యాన్ని గమనించి.. బాలూ చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకి చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటారు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.

మంగళవారం

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*మంగళవారం, జూన్ 4, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

     *వైశాఖ మాసం - బహళ పక్షం*   

🔔తిథి : *త్రయోదశి* రా9.09 వరకు

🔯వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)

⭐నక్షత్రం : *భరణి* రా10.10 వరకు

✳️యోగం : *శోభన* ఉ5.59 వరకు

       తదుపరి *అతిగండ* తె3.21 వరకు

🖐️కరణం : *గరజి* ఉ10.11 వరకు

       తదుపరి *వణిజ* రా9.09 వరకు

😈వర్జ్యం : *ఉ8.32 - 10.02*

💀దుర్ముహూర్తము : *ఉ8.03 - 8.55* 

                మరల *రా10.51 - 11.35*

🥛అమృతకాలం : *సా5.37 - 7.08*  

👽రాహుకాలం : *మ3.00 - 4.30*

👺యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *మేషం*

🌄సూర్యోదయం: *5.28* || 🌅సూర్యాస్తమయం: *6.27*

సర్వేజనా సుఖినో భవంతు -

ఇరగవరపు రాధాకృష్ణ 🙏

ఈ బ్లాగు మనందరిది

  ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి. 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ త్రయోదశి  - భరణి -‌‌  భౌమ వాసరే* (04.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*