4, అక్టోబర్ 2024, శుక్రవారం

అవధానం

 


అవధానం నిర్వహించడంఆషామాషీవ్యవహారంగాదు.దానికి కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి. అని  దివాకర్ల వారు చెప్పిన పద్యం. 


" అసమానంబగు పాండితీగరిమ సద్యస్ఫూర్తి హాస్యోక్తి వి 


న్యసనం బాసుకవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధక్రియా 


భ్యసనం బద్భుత ధారణామహిమ అత్యావశ్యకంబుల్ సుదీ 


రసికుల్ మెచ్చ వధాన కార్యము సభారమ్యంబుగా జేయఁగన్

   నేటి యవధానులందరకు నిది మార్గదర్శకమే!

                           స్వస్తి!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐🌷🌷💐a

33. " మహా దర్శనము

 33. " మహా దర్శనము " --ముప్పై మూడవ భాగము--అగ్ని దేవుని కృప


33. ముప్పై మూడవ భాగము-- అగ్ని దేవుని కృప


         

         దేవరాతుడు కొడుకుకు ఇప్పుడు తానే యజుర్వేదమును మరలా నేర్పిస్తున్నాడు . అలాగే బ్రాహ్మణోపనిషత్తులు కూడా అయినవి . కుమారుడు ఋగ్వేదము కోసము బుడిలులను ఆశ్రయించినాడు . సామవేదము కోసము ఉద్ధాలకుని వద్దకు పంపవలెను అని ఆచార్యుని అభిమతము . అయితే కొడుకు అగ్నిదేవుని అనుమతి లేనిదే దేనినీ చేయడు .  


         ఇలాగ ఒక సంవత్సరమైనది . తండ్రి ఎక్కడైననూ యాగము నడచి తనను అధ్వర్యుడిగా పిలిస్తే , తన వెంట కొడుకును కూడ పిలుచుకొని వెళ్ళును . అక్కడ యాజ్ఞవల్క్యుడు తండ్రికి తన వయసు మీరి సహాయము చేయును . అయినా ఎవరి దగ్గరా వినయమును వదలి మాట్లాడలేదు . ఆ భీమ కాయుడు అలాగు వినయముగా ఉండుట చూసి , " ఇదేమిటిది , మహా సర్పము పుష్పహారమైనట్లు ఉన్నాడే ! ఆచార్యుని అదృష్టము ఎంత గొప్పది ! ఇక ఇతడు అధ్వర్యుడై నిలబడు కాలము ఇంకెంతో దూరం లేదు ! " అంటారు . కొందరు తెలియని వారు కుతూహలము చేత , " నీకు శిక్షణ అయినది ఎక్కడయ్యా ? " అంటారు . యాజ్ఞవల్క్యుడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ తండ్రిని చూపించును . ఇంకా కొందరు పెద్దవారు , " ఎక్కడైనా గానీ , నువ్వు దీర్ఘ కాలము సుఖముగా ఉండవయ్యా ! " అంటారు . యాజ్ఞవల్క్యుడు ఆ ఆశీర్వాదమును నమస్కార పూర్వకముగా గ్రహణము చేయును . 


          ఇప్పుడు ఇంటి వెనుక తోటలో యాజ్ఞవల్క్యుని కోసము ఒక గుడిసె ఏర్పడింది . అక్కడ కుమారుడు పయోవ్రతములో ఉన్నాడు . హవిస్సును పాలతో పాటు ఒకసారి భుజించి , మరొక పూట పాలు మాత్రము సేవిస్తాడు . మొదటి జాములో చెరువు నీటి స్నానము , సూర్యోదయము వరకూ జపము . సూర్యోదయము అగుచుండగనే అర్ఘ్య ప్రదానము . మరలా జపము . సూర్యోపస్థానము , దాని తరువాత అగ్ని కార్యము . అనంతరము వచ్చి తలిదండ్రులకు , యజ్ఞేశ్వరునికీ నమస్కారము చేసి మరలా వెనుకకు గుడిసెకు వెళ్ళును . తల్లి భోజనమును తెచ్చి ఇచ్చును . కుమారుడి వీణ మాత్రము అక్కడే ఉంటుంది . అతడు మంత్ర పునశ్చరణ లో లేనపుడు వీణను వాయించును . ఇప్పుడు బుడిలుల ఇంటికి కూడా వెళ్ళుట లేదు . ఒక దినము రాత్రి ఆలంబిని అకస్మాత్తుగా పెరటి తలుపు తీసి బయటికి వచ్చింది . యాజ్ఞవల్క్యుని గుడిసెలో ప్రదీపమును వెలిగించినట్టు దేదీప్యమానముగా వెలుగు నిండిఉంది . అక్కడక్కడా గుడిసె కంతల నుండీ మిణుగురు పురుగులు ఎగురునట్లు కాంతి వెదజల్లుతోంది . యాజ్ఞవల్క్యుని గుడిసె కడకు వెళ్ళినది . ఆలంబిని గాభరాపడు జాతి కాదు , అయినా, " కొడుకేమైనాడో , గుడిసెకు నిప్పు అంటుకున్నదా ? " అని గాభరా పడింది . అయితే పొగ లాంటిదేమీలేదు . మంట కనిపించుట లేదు . కాబట్టి ఏదో విలక్షణముగా ఉండవలెననుకొని శబ్దము చేయకుండా వెళ్ళి గుడిసెలోకి వంగి చూచినది . యాజ్ఞ వల్క్యుడు పద్మాసనములో ధ్యాన ముద్రలో కూర్చున్నాడు . అతడి శరీరము నుండీ ఏదో మంట వలె లేస్తున్నది . అయినా ముఖములో ఏ మార్పూ లేదు . కొంచము దూరములో ఆరేసిన బట్టలు దండెము మీద తమ పాటికి తామున్నాయి . ఆశ్చర్యమేమంటే , తాను వాకిలి వద్దకు వచ్చినా ఆ మంటల శాఖము లేదు . మంట , కట్టెలు వేసినపుడు కనిపించు మంట వలె నాలుకలు చాచుట లేదు . నేతి దీపపు మంటవలె ఘనముగా , చాంచల్యము లేకుండా మండుచున్నది . 


        ఆలంబిని ఒక్క ఘడియ లాగే నిలచి చూచినది . ఔను , మంట చంచలముగా లేదు . నేరుగా రత్న ప్రభ వలె కనబడుతున్నది . ఆమెకు అర్థము కాలేదు . ఏమైనా కానీ యని , యజ్ఞేశ్వరుని స్మరించి చేతులు జోడించి " నేను వెళ్ళి వారిని పిలుచుకొని వస్తాను . వారికి కూడా ఈ దర్శనము కానీ ! " యని ప్రార్థించి , అక్కడినుండీ వెడలినది . 


         దేవరాతుడు మంచి నిద్రలో ఉన్నాడు . నిద్రలో ఉన్నపుడు లేపుట ఎలా అని ఆమె కొంత సేపు వేచింది . చివరికి సన్నగా చేతులతో చప్పట్లు కొట్టింది . దేవరాతునికి మెలకువయై ’ ఎవరది ’ అన్నాడు . ఆలంబిని చిన్నగొంతుతో , ’ నేను , మెలకువ అయిందా ? ’ అని అడిగింది . 


దేవరాతుడు ’ ఏమిటి విశేషము ? ’ అని ఆమె వైపుకు తిరిగినాడు.


          ఆలంబిని తాను తోటలో చూచినది చెప్పింది . దేవరాతునికి ఆశ్చర్యమైనది . అందులోనూ , యాజ్ఞవల్క్యుడు ఆసన ముద్రా ధారణ చేసి కూర్చున్నాడని విని ఇంకా ఆశ్చర్యమై , ’ పదవే , వెళ్ళి చూసి వద్దాము ’ అని దారిలో బచ్చలి ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి గుడిసెకు వెళ్ళినాడు . 


         ఔను , యాజ్ఞవల్క్యుడు ధ్యాన ముద్రలో పద్మాసనములో కూర్చున్నాడు . అతడి చుట్టూ లేత నీలి వర్ణములో , ప్రకాశమానముగా నున్ననూ , కళ్ళకు మిరుమిట్లు గొలపక , కంటికి ప్రియమూ , హితమూ అయినట్టి జ్యోతి యొకటి అతడిని ఆవరించి యుంది . అతడే ఒక దీపమై ఉంటే ఎలాగ నిరాటంకముగా వెలిగెడివాడో అలాగ వెలుగుచున్నది . దేవరాతుడు చేతులు జోడించి నిలుచున్నచోటే ప్రదక్షిణ నమస్కారములను , మనసులోనే పంచోపచారమును చేసి , యజ్ఞేశ్వరుని పూజించి , దీని రహస్యమేమో అనుజ్ఞ కావలెనని ప్రార్థించినాడు . చటుక్కున మనసులో మెరసింది , " || ఆర్ద్రం హి జ్యోతిర్జ్వలతి || " తడిసిన వెలుగు జ్వలించుచున్నది . " 


         దేవరాతుడు మరలా నమస్కారము చేసి , మనః పూజను అర్పించినాడు. అతని విచికిత్సా బుద్ధి విచారము చేయసాగినది , " ఆర్ద్ర జ్యోతి యంటే ఆపోజ్యోతి . అది ఏమైననూ ధ్యానములో ఉన్న వాడికి మాత్రమే కనిపిస్తుంది . ఇలాగ దేహము నుండీ బయటికి వెడలి కూడా కనిపించునా ? ఔను , వెనకెప్పుడో వినియున్నాడు , ధ్యానపు ఒక అవస్థలో ఇలాగ జ్యోతి కనిపిస్తుందని . అంటే , యాజ్ఞవల్క్యుడు జ్యోతిరూపమగు అవస్థకు వచ్చినాడా ? ఉండనీ , తెల్లవారు వరకూ ఏమీ చేయుట వద్దు " అని సిద్ధాంతానికి వచ్చి నాడు . అయినా , తాను జనకుడిని యను మోహము వదలక , ఆ మంట వలన కొడుకుకు ఏ ఇబ్బందీ రాకూడదని నిర్ధారణ చేసుకొనుటకు మరలా వంగి చూస్తూ , మరలా దానివలన ఏమీ ఇబ్బంది లేదని మనసుకు నిర్ధారించుకొని, అక్కడినుండీ భార్యతో పాటు వెనుతిరిగినాడు . 


         దారిలో భార్యకు అంతా చెప్పినాడు , " ఉపనయన కాలములో గాయత్రీ మంత్రమును ఉపదేశించినపుడు ఆచార్యుడు శిష్యునికి ఈ జ్యోతిని చూపించును . దానిని కుమారుడు తన స్వంత ప్రయత్నము చేత పెంచుకొని ఎల్లపుడూ చూచుచుండవలెను. ధ్యానము పెరిగి జ్యోతిరూపమగు స్థితి వచ్చినపుడు ఇలాగే జ్వాలలు వెడలును అని విన్నాను . నేనెక్కడా చూడలేదు . చూద్దాము , రేపు కుమారుడినే అడిగితే సరిపోతుంది . "


ఆలంబిని ఆగి ఆగి అన్నది , " ఇటువంటి సందర్భములలో మీరు బుడిలులను అడుగుచుంటిరి కదా ? "


" ఇప్పుడు బుడిలులు ఉన్న స్థితిలో వారిని అడుగునట్లు లేదు "


" అదీ నిజమే , అయితే....."


        " తెల్లవారే వరకూ ఆగు . ఇంతవరకూ మనము స్వతంత్రులై యున్నాము , దానివలన మనకు తోచినట్టు చేయుచుండినాము . ఇప్పుడు కుమారుడు స్వతంత్రుడు . మనము చూసినది అతని ఒక పరిస్థితి. అందుకే , వాడినే అడిగితే సరి అన్నాను . " 


ఆలంబినికి అర్థమైనది . ఎప్పుడు తెల్లవారుతుందా అని కుతూహలముతో కాచుకుని ఉంది. 


         సూర్యోదయమైనది . తెల్లవారు జాములోనే లేచిన ఆలంబిని ప్రాతః కర్మలన్నిటినీ ముగించుకొని , అగ్ని పరిచర్య కూడా కానిచ్చి , పెరుగు చిలుకుతున్నది . అప్పుడు కొడుకు వచ్చి , " అమ్మా , నమస్కారము చేస్తాను " అన్నాడు . ఆలంబిని వెనుతిరిగి , " వారిని చూచి వచ్చినావు కదా ?? " అన్నది .


         కొడుకు నవ్వుతూ అన్నాడు , " చూచినాను , నమస్కారము చేసిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని అడిగినారు . నిన్నటి అనుభవము ఇది రెండో సారి అయినది . అలాగ అగునపుడు నాకు సగము సగము బాహ్య జ్ఞానము ఉంటుంది . అయితే , బయట జరిగేది తెలిసిననూ , ఆ క్రియకు ప్రతిక్రియ ఏమీ చేయలేను . నువ్వు వచ్చినది తెలుసు . తండ్రిగారు వచ్చినది తెలుసు . మీరిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నది కూడా విన్నాను . కానీ మీమాటకు సమాధానముగా ఏమీ చెప్పలేకనే కూర్చున్నాను . "


" అంటే , నేను వచ్చినపుడూ , తర్వాత వారిని పిలుచుకొని వచ్చినపుడు నీకు ఒంటిపై జ్ఞానముండినదా ? కళ్ళు తెరచే ఉండినావా ? మేము పక్కనే ఉన్నదంతా నీకెలా తెలుసు ? " 


        " నువ్వు వచ్చినపుడు మెలకువ అయినది . తరువాత తండ్రిగారిని పిలుచుకొని వచ్చినావే , అప్పుడు కూడా మెలకువ అయింది . అప్పుడే చెప్పినాను కదా ? కళ్ళు తెరచే ఉన్నావా అన్నావు. నేను కళ్ళు తెరచుకోలేదు , నిజమే . ఈ కన్నులు , అంటే , ముక్కుపైన , కనుబొమల కింద ఉన్న కన్నులు రెప్పలు మూసుకొనే ఉండినవి . కానీ అప్పుడు నాకు ఒళ్ళంతా కన్నులై ఉండెను . ఈ చుట్టుపక్కల ఉన్నదంతా , నా వీపు వెనకాల ఉన్నదంతా కూడా కనిపించుతుండినది . ఇంకొక విశేషమేమంటే , నా కళ్ళకి , అంటే చూపుకు గోడ కూడా అడ్డము కాలేదు . నువ్వు వాకిలి తెరచుకొని తోటలోపలికి వచ్చినది మొదలు అంతా కనిపించుతుండినది . సరేనా ? " 


" అదేమిటా మంటలు లేస్తున్నట్లుండినవి ? ఆ నీలిమంట నిన్ను కాల్చలేదా ? "


        " అది కాల్చే మంట కాదు . అది కాల్చి ఉంటే , మీ కొడుకునై ఈ దినము వచ్చి చూచేవాడినా ? చూడు , వేదములో , ’ చూపు పెద్దదగుటకు కన్నులు ఆకాశమంత కావలెను ’ అని చెప్పియున్నది . అట్లే అయినది , అంతే . ఆ దినము , ఉపనయనము రోజు , సూర్య మండలమునుండీ సావిత్ర కిరణమును పట్టి హృదయము లోపల నింపుకొనుటను నేర్పించినారు . అక్కడ ఆశ్రమములో ఉన్నపుడు దానిని చేస్తూ ఉండిననూ అది కన్నులను ఆకాశమంత చేసియుండలేదు . ఇప్పుడో వారము కింద అది జరిగినది . నిన్న రాత్రి అయినది రెండోసారి . అంతే ! అది సరే , నేనొక మాట చెప్పనా ? "


" చెప్పు " తల్లి పెరుగు కుండను మరచిపోయి , కవ్వమును గోడకు ఆనించి , తానూ గోడకు ఆనుకొని నిలుచుంది . 


         " నిన్న యజ్ఞేశ్వరుని దర్శనము పూర్తిగా చేసుకున్నాను . ఇంతవరకూ ఐతే ఎదురుగా ఉన్న అగ్ని కుండములో పైకి వచ్చే జ్వాలల మధ్యలో మాత్రమే చూచేవాడిని . నిన్న రాత్రి అదేమీ లేకుండా జ్వాలా మాలా విభూషితుడైన యజ్ఞేశ్వరుడి దర్శనమైనది . నేను పూజ చేసి , ఇదేమిటిలాగ దర్శనమిచ్చినావు అని అడిగినాను . యజ్ఞేశ్వరుడు నవ్వి , " నేను ఎల్లపుడూ మీ ఎదురుగ్గానే ఏదో ఒక రూపములో ఉండనే ఉంటాను . మీరు చూడకపోతే నాదేమి తప్పు ? పగటి పూట ఆదిత్యుడనై వెలుగువాడిని నేనే ! పగలూ రాత్రీ యనక నిలిచినచోట నిలువకుండా వీస్తున్న గాలిని కూడా నేనే ! ఇప్పుడు నీ ఎదురుగా నిలచినట్లు ఈ రూపములో ఎల్లపుడూ నేను లేకుంటే , నేననే వాడిని లేనే లేనట్లా ? " అని అడిగినాడు . 


         " నేను మరలా అడిగినాను , " మీరు , దేవతలు , మాకన్నా గొప్పవారు . మీ రహస్యములను మీరే చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది ? " . దానికి యజ్ఞేశ్వరుడు పకాలుమని నవ్వుతూ అన్నాడు , " అది కూడా నిజమే , సరే , ఇప్పుడు చూడు , నేను ప్రసన్నుడనైన దానికి గుర్తుగా , నీ దృష్టి పెద్దదగును . నీదృష్టికి ఏ అడ్డూ ఉండదు . నువ్వు మధ్యాహ్నములలో సూర్య దర్శనము చేస్తావు కదా , దానివలన నాడులలో నిండియున్న కశ్మలము నాశనమగును . నాడి శుద్ధి అయితే , మొదటగా కలిగేది నా దర్శనము . నా దర్శనపు గుర్తుగా నా సాత్త్విక తేజము నీ నాడినాడులలోనూ ప్రసరించును . నీకు ఇంతవరకూ గోచరము కాకుండానే ప్రసారమగుచున్న ప్రాణ శక్తి , ఇప్పుడు ఇంద్రియ గోచరమగు నీలజ్యోతియై దేహమునుండి బయటికి వ్యాపించును. ఇప్పుడు ధ్యానములో కూర్చుంటే మాత్రమే కనిపించు ఆ జ్యోతి , నీకు జ్యోతి స్థితి సహజమైనపుడు ఆదిత్య దర్శనమగును . నువ్వు మధ్యాహ్నము పూట ఆదిత్యుని ఉపస్థానము చేయుచున్నట్లే , ఇక పైన విరామము దొరికినపుడల్లా ఆ ఆదిత్య మంత్రమును జపము చేస్తూ రా. ఇక కొన్ని రోజుల కోసము నువ్వు ఇల్లు వదలి వెళ్ళు ’ అన్నాడు. ఎక్కడికి పోవాలన్నది చెప్పలేదు "


" ఇదంతా వారికి చెప్పినావా ? "


" చెప్పినాను " 


" ఏమన్నారు ? "


        " సరే , నేను పరిగణించినట్లే అయినది . అయితే , నేను సావిత్ర మంత్రము అయితే చాలు అనుకున్నాను . యజ్ఞేశ్వరుని అనుజ్ఞయే అయిన తర్వాత , ఇక చెప్పేదేముంది ? కానీ , ఆదిత్య మంత్రమును జపిస్తూ ఉండు , తర్వాత ఇల్లు వదలి , ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళ్ళిరా ’ అన్నారు . "


" ఇంక చెప్పడానికేముందీ ? ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళితే అక్కడ నువ్వు చదివేది యేముంది ? వారు సామవేదులు కదా ? "


         " చూడమ్మా , సామములో హింకార సామము , హుంకార సామము అని రెండు ఉన్నాయి . వాటిలోని మంత్రాలను విస్తారము చేసి వ్యూహమును కట్టుటను సామము తోనే నేర్వవలెను . అదీకాక, ఉద్ధాలకులు బ్రహ్మిష్ఠులు . వారికి ఉపనిషత్తులపైన శ్రద్ధ ఎక్కువ. కాబట్టి , వారి ఉపనిషత్తైన ఛాందోగ్యోపనిషత్తునూ , మన ఉపనిషత్తులైన తైత్తిరీయ , కఠోపనిషత్తులనూ నేర్చుకుంటే సరిపోవును . అంతే కాక, ఇంకొక రహస్యము . తైత్తిరీయము మహా సంహితలనూ , పంచాత్మ సంక్రమణ విద్యను వివరిస్తుంది . కఠోపనిషత్తు శ్రేయోరూపమైన ఆత్మ విద్యను వివరిస్తుంది . ఛాందోగ్యము అవస్థాత్రయ పరీక్షణమును ముఖ్యముగా వివరిస్తుంది . ఈ మూడు విద్యలూ నేర్చులోపల నేను ముసలి వాడనైపోతాను . "


" అప్పటికి నేనేమౌతానో ఎవరెరుగుదురు ? ....."


      సరిగ్గా అప్పుడే బుడిలుల ఇంటినుండీ వార్త వచ్చింది , " బుడిలులకు ఆఖరి క్షణాలు వచ్చినాయి . ఆచార్య దంపతులతో పాటూ యాజ్ఞవల్క్యుడు కూడా రావలెనంట . " 


        ఆచార్యుడు గబగబా వచ్చి , భార్యా కొడుకులను చూసి , " నువ్వూ ఇక్కడే ఉన్నావా ? మంచిదైంది , పదండి , మనము ముగ్గురూ రావలెనని చెప్పి పంపినారు . యాజ్ఞవల్క్యా, నువ్వు ముందర నడు. నీ వెనకే మేమిద్దరమూ వస్తాము . బుడిలులకి నువ్వంటే చాలా ప్రేమాభిమానాలు . " అన్నాడు . 


యాజ్ఞవల్క్యుడు సరేనని ఉన్నవాడున్నట్లే బయలుదేరినాడు . 





Janardhana Sharma

భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు

 భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు - 


 * బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును .వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును . 


 * వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును . 


 * కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును . 


 * స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము . 


 * అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును . 


 ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు - 


 * అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును . 


 * మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును . 


 * మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును . 


 * రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును . 


 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును . 


 * తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది . 


 * వక్కపెట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును . 


   

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నవరాత్రులలో సువాసిని

 _*నవరాత్రులలో సువాసిని , కుమారి పూజ విధానం*_


పసుపుకొమ్మలను సేకరించి , నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి , కుంకుమరాళ్లను కలిపి , దంచి , జల్లించి , సేకరించినది ఉత్తమమైనది. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించిన అన్నికోర్మెలు నెరవేరతాయి.


కుంకుమను స్త్రీలు ప్రత్యక్షంగా ధరించవచ్చు. పురుషులు ముందుగా చందనమును ధరించి , ఆపైన కుంకుమను ధరించాలి. ఈవిధంగా ధరించనియెడల పురుషత్వము నశిస్తుంది. అదేవిధంగా పసుపును పురుషులు శరీరానికి పూసుకొనరాదు. పూసుకొనిన యెడల పురుషత్వము నశిస్తుంది.


*సువాసినీ పూజ ఏవిధంగా చేయాలి ?*


సలక్షణాలతో ఏవిధమైన అవయవలోపంలేని సౌమ్యమైన , ముతైదువను ఎంచుకొని., అమ్మవారిగా భావించి., షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీ , అష్ణోత్తర , ఖడ్గమాల నామములతో అర్చించి , మంగళహారతి ఇచ్చి , ఆభరణ , పుప్ప , హరిద్ర , కుంకుమ చందనాదులతో సత్కరించి , ఆ సువాసినితో ఆశీర్వచనము తీసుకొనిన సువాసినీపూజ పూర్తియగును


ఈ సువాసినీపూజ శ్రీచక్రనవావరణార్చన అనంతరం దేవీనవరాత్రులలో నిర్వహించాలి.


శక్తి అనుసారం ఒక ముతైదువకుగానీ , ముగురికిగానీ , ఐదుగురికిగానీ , ఏడుగురికిగానీ , తొమ్మిదిమందికిగానీ , పద్దెనిమిదిమందికి గానీ , ఇరవై ఏడుమందికి గానీ , యాభై నాలుగుమందికి గానీ ,  నూట ఎనిమిది మందికిగానీ ,  ఐదువందల యాభై ఎనిమిదిమందికి గానీ , వెయ్యిన్నూట పదహారు మందికిగానీ సువాసినీపూజ చేయవచ్చును.


బ్రాహ్మణ ముతైదువలకు సువాసినీపూజ చేసిన భక్తి , జ్ఞాన , వైరాగ్యములు , విద్యాభివృద్ధి కలుగును.


క్షత్రియ ముతైదువలకు సువాసినీపూజ చేసిన ధైర్య సాహసములు వృద్దియగును. ముతైదువలకు సువాసినీ పూజ చేసిన అప్టెశ్వర్య భోగభాగ్యములు వృద్దియగును.


శూద్ర ముతైదువలకు సువాసినీపూజ చేసిన సత్సంతానప్రాప్తి కలుగును. మన యొక్క కామ్యమునుబట్టి సువాసినులను ఎంచుకొని , ఆహ్వానించి , ఆరాధించి , ఆశీస్సులు పొందవలయును.


*కుమారీపూజ ఏవిధంగా చేయాలి ?*


అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో 


మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా ,


రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా


మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా ,


నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా,


ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా ,


ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా ,


ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా ,


ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా ,


తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా ,


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును




పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగా

భావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీనామ , అష్ణోత్తర శతనామ , దేవీఖడ్గమాలా నామాదులతో , హరిద్ర , కుంకుమ పుష్పాదులతో అర్చించి , మంగళహారతులిచ్చి , ఆభరణ , పుష్ప , చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకొనిన సకలశుభములు కలుగును.

04-10-2024) రాశి ఫలితాలు

 రేపు (04-10-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 04-10-2024 

ఆప్తుల  నుండి అవసరానికి  ధన  సహకారం అందుతుంది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై  దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు  లభిస్తాయి.  సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


వృషభం

 04-10-2024 

చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో  ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు  లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.


మిధునం

 04-10-2024 

ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.


కర్కాటకం

 04-10-2024 

మిత్రులకు  మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా  పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.  ఇంటా బయట ఒత్తిడి వలన  మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు  మందకోడిగా సాగుతాయి.


సింహం

 04-10-2024 

ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో  సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


కన్య

 04-10-2024 

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  మీ పనితీరుతో అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు.


తుల

 04-10-2024 

ముఖ్యమైన విషయాలలో స్వంత  నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు  విషయంలో  జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


వృశ్చికం

 04-10-2024 

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన  వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 


ధనస్సు

 04-10-2024 

కీలక వ్యవహారాలలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


మకరం

 04-10-2024 

చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.


కుంభం

 04-10-2024 

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. 


మీనం

 04-10-2024 

ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.  వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది

కోప్పడడానికి కావలసిన ధైర్యం

 🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏         🌹ఎదుటి వారు తప్పు చేసినప్పుడు కోప్పడడానికి కావలసిన ధైర్యం కంటే అదే తప్పు మనం చేసినప్పుడు ఎదుటి వారితో క్షమించమని అడగడానికి ఎక్కువ ధైర్యం కావాలి🌹కోపం తెచ్చుకోవడం అనేది అతి సులభమైన పని.. కానీ సరైన వ్యక్తితో, సరైన సమయంలో, సరైన కారణంతో, సరైన పద్దతిలో కొప్పడ్డం అనేది అంత సులభం కాదు🌹ఆత్మ శరీరం ద్వారానే ముక్తిని పొందాలి.. అందుకే ఆత్మకి శరీరం కావాలి.. ఆకలి, నిద్ర, కోరికలు, బాధలు, బందాలు, బాధ్యతలు, ద్వేషాలు, కోపం, పగ, ప్రతీకారం, ప్రేమ వీటన్నిటి మధ్య నలిగిపోతుంది 🌹కోపం మరియు తుఫాన్ రెండు ఒకే విధంగా ఉంటాయి.. శాంతించిన తరువాతే తెలుస్తుంది.. ఎంత నష్టం జరిగిందో అని🌹కోపం, ద్యేషం, కోరకలు, పగ, ప్రతీకారాం, బాధలు శాశ్వతం కాదు..స్వచమైన ప్రేమ శాశ్వతం..అందుకే అన్నీ వదలి ప్రేమని పంచుదాం మిత్రమా!!🌹🌹మీ అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్‌. గోకవరంస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి .వైద్య సలహాలుఉచితం94408935939 . 9182075510 🙏🙏🙏🙏🙏

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి* 🙏


  *పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరాపాపన్న రాయన్న లే*

  *లే లెమ్మన్న నరంటిపండ్లు గొనితే లేకున్న నే నొల్లనం*

  *టే లాలింపరే తల్లితండ్రు లపు డట్లే తెచ్చి వాత్సల్య ల*

  *క్ష్మీ లీలావచనంబులం గుడువరా శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 52*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! చిన్నపిల్లలు పాలు, అన్నము తెచ్చి తినమంటే, కాదు అరటిపండు కావాలని ఎలా మారాం చేస్తారో, అదే విధముగా నేను కూడా నాకు ఇచ్చిన ఇహలోక సౌఖ్యములను వద్దని మోక్షమార్గము కోసము నిన్ను వేడితిని..... తల్లితండ్రులు ఏ విధముగా ఆ మొండి బాలుని కోరికను తీరుస్తారో అదే విధముగా నీవు నన్నుద్ధరించు ప్రభో....*


✍️🌷🌺🌹🙏

నవరాత్రులు

 నవరాత్రులు - నవ దుర్గలలో దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది.


శైలపుత్రి అమ్మవారి యొక్క ప్రార్ధనా శ్లోకము : 


వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥


కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.


దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.


 వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.


నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.


.చరిత్ర :


పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.


సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.


తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.


సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.


‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. 


నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.

సుదర్శన శతకము*

 *సుదర్శన శతకము*

 *తెలుగు పద్యాను వాదము 17* 

*రచన:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


 *దేవైరాసీయమానౌ*

 


*తే గీ. చక్ర జ్వాలలు పాపాలు చల్లబరుచ*

*అగ్నికీలలు దావాగ్ని నాపివేసి* 

*దొరలె నక్షత్ర గుంపులు నురుగుగ్రక్కి*

 *అన్ని దిక్కుల తీరాలనధిగమించె*

*రాక్షస బుజదండములకు శిక్ష వేయ*

*మదమునందిన బలమంత మట్టుబెట్టె*

*వృక్షముల వోలె వైరులు విరిగినారు*

*చండ శాసన చేయుమో చక్ర రాజ*


*ఓం నమో భగవతే సుదర్శనాయ*


*💐🌹🙏🙏*

సంప్రదాయం

 🕉️ అమూల్య వాక్కులు 🕉️ 

 మన సంప్రదాయం కొనసాగిద్దాం.

---------------------------------------------

 శ్రీ కృష్ణుడు 5 వేల సంవత్సరాలకు పూర్వం అంటే ద్వాపర యుగం లో సత్యభామ తో కలిసి నరకాసురుణ్ణి చంపడం జరిగింది. ఎందుకంటే నరకాసురుడు వేల మంది కన్యలను చెరబట్టి బంధించాడు, వారికి విముక్తి కలిగించాలని శ్రీ కృష్ణుడు యుద్ధం చెయ్యవలసి వచ్చింది. అతడిని చంపే అవకాశం సత్యభామ కు ఇచ్చాడు శ్రీ కృష్ణుడు.. ఇది జరిగింది ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు.  ఆ సంతోషం లో ప్రజలు మర్నాడు అంటే అమావాస్య నాడు అదే దీపావళి బాణాసంచా (టపాకాయలు) కాల్చారు. చతుర్దశి నాడు తెల్ల వారు ఝామున నువ్వుల నూనె రాసుకుని తలంట్టుకోవాలి. సాయంత్రం దీపాలు పెట్టడం పితృదేవతలకు దారి చూపడానికి దీపావళి నాడు టపాకాయలు కాల్చడం మన సంప్రదాయం. ఇది 5 వేల సంవత్సరాలనుండి వస్తోంది. మనం దీనిని కొనసాగిద్దాం. విదేశాల్లో అంటే అమెరికా, జపాన్ లాంటి దేశాలలో ఏదో ఒక సందర్భం లో టపాకాయలు కలుస్తారు అని మనకు తెలుసు.

-------- ఇవటూరి భవానీ శంకర్. 🕉️