4, నవంబర్ 2024, సోమవారం

మహిమాన్వితమైన మాసం "కార్తికమాసం

 కార్తిక మాసం.                          స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తికమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తికమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తికమాసం" అని పేరు వచ్చింది.



కార్తికమాసంలో ఆచరించాల్సిన విధులు.


కార్తిక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తిక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను. ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను. ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తిక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు

శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ

దీనికే యమద్వితీయ, భగినీహస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి " నాగుల చవితి

కార్తిక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రబోధన ఏకాదశి

ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.


శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి

పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.


శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి

వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను


శుక్లపక్ష పూర్ణిమ :

ఈ దినం శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ, వైష్ణవాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.


కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి

ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.

వృశ్చిక సంక్రమణం

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది. 


కార్తికమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు..

కార్తీక పురాణం 1

 *కార్తీక పురాణం ప్రారంభం*


*కార్తీకపురాణం 1 అధ్యాయం*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*కార్తీక మాసం విశేషం*


 ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.


శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.


పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.


అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.


మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.


దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.


వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.


*కార్తీక వ్రతవిధానం*


”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.


వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి.


ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.


ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

సంస్కృతి

 🔔 *మన సంస్కృతి* 🔔


★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.


★ *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.


★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.


★ *వ్యాస (గురు) పౌర్ణమి:-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.


★ *నాగుల చవితి:-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.


★ *వరలక్ష్మి వ్రతం:-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.


★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


★ *వినాయక చవితి (నవరాత్రులు):-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.


★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.


★ *దసరా (ఆయుధ పూజ):-* ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.


★ *దీపావళి:-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.


★ *కార్తీక పౌర్ణమి:-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.


★ *సంక్రాంతి:-*  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.


★ *మహాశివరాత్రి:-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.


★ *హోలీ:-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.


ఆధ్యాత్మికం 🙏🏻: https://www.youtube.com/playlist?list=PLop7xw7dpnht5jX2Vs0WknVTBfO6w98yz


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

1, నవంబర్ 2024, శుక్రవారం

ధర్మం తెలుసు.

 జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః

జానామి అధర్మం న చ మే నివృత్తిః

కేనాపి దేవేన హృది స్థితేన

యథా నియుక్తోస్తి తథా కరోమి’


నాకు ధర్మం తెలుసు. కానీ దాన్ని ప్రవృత్తిగా స్వీకరించలేకపోతున్నాను. నాకు అధర్మం తెలుసు కాని దాని నుండి బయటకు రాలేకపోతున్నాను. ఏదో దైవం హృదయంలో తిష్టవేసి ఎలా  నడిపిస్తోంటే అలాగే చేస్తున్నాను’

... ఇవి సుయోధన సార్వభౌముడి మాటలు. దుర్యోధనుడి ఔచిత్యాన్ని తెలియజెప్పే పద్యం ఇది. తన లోపాలను కూడా ఆయన చక్కగా ఒప్పుకున్నాడు. కానీ శోచనీయమైన విషయం ఏంటంటే.. దుర్యోధనుడిలోని ఈ సద్బుద్ధి మనకి లేదు... మనలోని లోపాలు కూడా మనకి తెలుసు వాటిని సరిదిద్దుకుని సమాజంలో ముందుకు వెళ్ళాలి

*శ్రీ ధన్వంతరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 486*


⚜ *కేరళ  : నెల్లువాయ, త్రిశూర్*


⚜ *శ్రీ ధన్వంతరి ఆలయం*



💠 మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలు మరియు దాని ప్రతిమ గురించి తెలుసుకున్నప్పుడు, మహావిష్ణువు యొక్క 10 అవతారాలు మాత్రమే మనం సాధారణంగా ఎందుకు ప్రస్తావిస్తాము అని  ఆశ్చర్యపోతాము


💠 నిజానికి కూర్మావతారం (తాబేలు అవతారం) సమయంలో మహా విష్ణువు మోహినిగా (అమృతాన్ని పంచిపెట్టిన అమ్మాయి) మరియు అమృతం ధన్వంతరి (ఖగోళ వైద్యుడు) కుండను తీసుకువచ్చిన వ్యక్తిగా కూడా వచ్చాడు. 


💠 తాబేలు అవతారం ప్రసిద్ధి చెందినప్పటికీ ఈ ఇద్దరు మోహిని మరియు ధన్వంతరి గురించి మాట్లాడలేదు. 


💠 ఉత్తర భారతదేశంలో ధన్వంతరికి అంకితం చేయబడిన ఆలయాలు చాలా లేవు కానీ దక్షిణాదిలో కొన్ని ఉన్నాయి.  

దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో కేరళలో అనేక ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి.  వీటిలో నెల్లువాయ, తొట్టువ, కూజాకొట్టు, అనక్కల్, మారుతోర్ వట్టం, ప్రయిక్కరా ప్రాంతాలు ఎక్కువగా సందర్శిస్తారు.  


💠 వైద్యశాస్త్ర దేవుడుగా భావింపబడుతున్న ధన్వంతరి పేర కేరళ రాష్ట్రంలోని నెల్లువాయ దేవాలయం వెలసింది. 

భారతదేశంలోని అరుదైన ధన్వంతరి దేవాలయాలలో ఇది ఒకటి.  


💠 మనవారు ధన్వంతరిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తున్నారు. దేవ దానవులు కలిసి పాల సముద్రాన్ని వాసుకి సర్పాన్ని కవ్వంగా చేసి చిలికినప్పుడు ధన్వంతరి ఉదయించినట్లు ప్రాచీన హిందూపురాణం చెబుతోంది.

 ఆయన చేతిలో అమృత కలశం తీసుకుని తన దివ్య ఆకారంతో వెలువడినట్లు రాయబడింది.


💠 అన్ని రకాల రోగాలను ఈ అమృతం దూరం చేస్తుంది. ఆ కారణంగా ఆయుర్వేదాన్ని, అల్లోపతి మందుల్ని అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్కరితోపాటు రోగ విముక్తిని కోరే లక్షలాది మంది రోగులకూ ఈ క్షేత్రం పవిత్రమైన ముఖ్య యాత్రాస్థలంగా మారింది.


🔆 స్థల పురాణo


💠 ఈ రోజు ఆలయంలో ఉన్న ధన్వంతరి విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని తల్లిదండ్రులు వసుదేవ మరియు దేవకి పూజించారని నమ్ముతారు.

ఈ విగ్రహం ఆలయానికి చేరుకోవడానికి ఒక కథనం ఉంది. 


💠 నెల్లువాయ గ్రామస్థులు ఆయుర్వేద ప్రభువు ధన్వంతరికి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.  అక్కడ అనువైన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సమీపంలోని మురింగతేరిలోని చిన్న కొండపై నుంచి కృష్ణ శిలను తీసుకొచ్చి దానిపై విగ్రహాన్ని నిర్మించారు. 


💠 ఆలయ నిర్మాణం పూర్తయి, సంప్రోక్షణకు సన్నాహాలు జరుగుతుండగా, ఎక్కడినుండో ఇద్దరు తెలివైన అబ్బాయిలు ముందుకు వచ్చి, ప్రతిష్టించడానికి ప్రతిపాదించిన విగ్రహం కంటే దివ్యమైన విగ్రహం ఉందని చెప్పారు. 

 దీంతో వారితో పాటు సమీపంలోని వరిగడ్డి వద్దకు వెళ్లిన స్థానికులు ఈ విగ్రహాన్ని గుర్తించి ఆలయంలో ప్రతిష్ఠించారు.  


💠 తొలుత ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహాన్ని సమీపంలోని క్షేత్రంలో ప్రత్యేక ఆలయంలో ప్రతిష్ఠించారు.  అనంతరం దానిని ధన్వంతరి క్షేత్ర ప్రాకారానికి తరలించారు.  


💠 ఈ క్షేత్రాన్ని నేడు 'చెరుతేవర్' అని పిలుస్తారు.  చోరేవను విష్ణువుగా భావిస్తారు.  విగ్రహాన్ని కనుగొన్న పిల్లలు అశ్విని దేవతలు, గొప్ప వైద్యం చేసేవారు అని నమ్ముతారు.


💠 నెల్లువాయ ఆలయానికి ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంతో చాలా దగ్గరి సంబంధం ఉంది. 

రెండు దేవాలయాల విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి (గురువాయూరప్పన్ తూర్పు ముఖంగా మరియు నెల్లువై తేవర్ పడమర వైపు). 


💠 ఇక్కడి గర్భగృహం రాగిరేకులతో కప్పబడి ఉంది. సరిగ్గా మధ్య భాగంలో 4 భుజాల ధన్వంతరి విగ్రహం విరజిల్లుతోంది. 

ఈ నాలుగు చేతులలో వరుసగా అమృతం, జలగ, చక్రం, గద ఉన్నట్లు విగ్రహం చెక్కబడింది.


💠 జలగలు చిత్తడి ప్రదేశాలలో కనిపించే గగుర్పాటు పురుగులు. అవి సాధారణంగా రక్తం పీల్చేవి  కానీ ధన్వంతరి దానిని తన చేతిలో ఎందుకు పట్టుకుంటాడు అనేది ప్రశ్న? 


💠 సముద్ర మథన సమయంలో ధన్వంతరితో జలగలు వచ్చాయి.  శరీరం నుండి గడ్డకట్టిన రక్తాన్ని బయటకు తీయడానికి ఆయుర్వేదం జలగలను ఉత్తమమైనదిగా పరిగణిస్తుంది.  యుద్ధంలో సైనికులకు రక్తం గడ్డకట్టినప్పుడు మరియు తెగిపోయిన అవయవాలను తిరిగి జత చేయడంలో పురాతన భారతదేశంలో జలగ చికిత్సను ఉపయోగించారు, ఇక్కడ జలగలు క్రమానుగతంగా సిరల నుండి స్తబ్దుగా ఉన్న రక్తాన్ని కోలుకునే వరకు పీల్చుకునేవి.  అద్భుతమైన భాగం ఏమిటంటే, జలగ కాటు అనుభవించబడదు, ఎందుకంటే దాని లాలాజలం మత్తుమందు లక్షణాలను కలిగి ఉంటుంది;  రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఎంజైమ్‌లు మరియు సీరమ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.


💠 ఇంగ్లీషు నెలలు నవంబర్, డిసెంబరులో ఈ నెల్లువాయలో నెల్లువాయ ఏకాదశి పేరుతో వార్షికోత్సవాలు జరుగుతాయి. 

ఈ ఉత్సవాలు 37 రోజులపాటు జరుగుతాయి. 


💠 ఈ ఉత్సవాల సందర్భంగానే ముఖ్యంగా ఏకాదశి రోజున మొత్తం కేరళ రాష్ట్రంలో ఉన్న ఆయుర్వేద వైద్యులు, అల్లోపతి వైద్యులు గుమికూడి ధన్వంతరి దేవుడి ఆశీస్సులను వ్యక్తిగతంగా పొందడానికి ఆ రోజున నెల్లువాయలో గడుపుతారు.


💠 ఈ ఆలయం త్రిస్సూర్ జిల్లాలో ఉంది మరియు కేరళలోని త్రిస్సూర్ మరియు గురువాయూర్ మధ్య ఉంది.

గోదావరి పుష్కరాల ముహూర్తం

 _*గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు - ఈ సారి ప్రత్యేకత..!!*_


కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు - యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.


_*ముహూర్తం ఖరారు*_

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు చేసారు.


_*నిధుల కేటాయింపు*_

అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేశారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.


_*ముందస్తు ఏర్పాట్లు*_

ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని మంత్రులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలు 2047కు విజనరీతో ముందుకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన నిధులను సమీకరించుకుని, సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనునున్నారు.

31, అక్టోబర్ 2024, గురువారం

దీపావళి

 దీపావళి


వెలిగింపవే! వీధి వీధుల విజ్ఞాన దివ్యప్రభాజాల దీపమాల! కట్టింపవే! కమ్ర కల్యాణ భారతీ ద్వారాల మంగళ తోరణాలు! వినిపింపవే! విశ్వవీణపై విద్యాప్ర వీణవై స్వాతంత్ర్య వీరగీతి! మ్రోగింపవే! జగన్మోహకమ్ముగ దిగ్ది గంతాల విజయ సంక్రాంతి భేరి!


మానవానంద మాధవీ మందిరమున భద్రపీఠిక గొల్వయ్యె భాగ్యలక్ష్మి శ్రీపదాబ్జద్వయమ్ము నర్చింపరావె! హృదయ పుష్పాంజలుల్ సమర్పించిపోవె !


~ సుధాంశు

*8 - భజగోవిందం

 *8 - భజగోవిందం / మోహముద్గర*

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


*భజగోవిందం శ్లోకం:-6*


*యావత్పవనో నివసితి దేహేతావత్పృచ్ఛతి కుశలం గేహే।* 

*గతవతి వాయౌ దేహేపాయే భార్యాబిభ్యతి తస్మిన్క యే॥ భజ ॥6.*


*ప్రతి॥* పవనః = ఊపిరి (జీవం); యావత్ = ఎంతవరకు; దేహే = దేహమునందు; నివసితి = వుంటుందో;  తావత్= అంతవరకు; గేహే = ఇంటియందు; కుశలం = క్షేమసమాచారము సంగతిని; పృచ్ఛతి = అడుగుతారు; దేహాపాయే= దేహానికి అపాయము కలిగి న స్థితిలో; వాయౌ= ఊపిరి, జీవము; గతవతి = పోయినట్టి దయితే( అప్పుడు); భార్యా = అర్ధాంగికూడా; తస్మిన్ = ఆ; కాయే =' శరీరమునుగూర్చి; బిభ్యతి = భయపడి పోతుంది.


*భావం:-*


శరీరంలో ఊపిరివున్నంతవరకే ఇంటిలోని ఎవరైనా దగ్గరుకువచ్చి నీ గురించిన కుశల ప్రశ్నలనడిగేది, నీనుంచి ఊపిరి తప్పుకొని వెళ్ళిపోతే, శరీరం నశించిపోయే స్థితిలో అపాయంలో పడిపోతే, అప్పుడు నీ దగ్గరకు వచ్చేవాళ్ళూ క్షేమమడిగే వాళ్ళూ వుండరు. నీ అర్ధాంగియైన స్త్రీ కూడ ఆ శరీరాన్ని చూసి జడుసుకొని భయపడుతుంది.


*వివరణ:-*


విచారణచేత మహోన్నతమైన సత్యపదార్థాన్ని అన్వేషించ టానికిగాను మనసును ఆ పదార్థంవైపుకు నడిపించాలి. అంటే గుడ్డిగా ప్రేమించటం, మమకారం పెంచుకోవటం శుష్కమైన అనుభవాలు పొందాలని కోరటం అనే వైపునుంచి దానిని మళ్ళించటం అన్నమాట. అది చాలా అత్యవసరమైనట్టి సంగతి. నిస్సంగత్వమనేది యీ ప్రాపంచిక వస్తు విషయాలను గూర్చి వుండాలి. కాని నిస్సంగత్వమనే ఈ భావం కొన్ని మతగ్రంథాల్లో అవసరమైనదానికన్న ఎక్కువగానే నొక్కి చెప్పటం జరుగుతోంది. బౌద్ధమతంలో అలాంటిది అతిగ వున్నదనిపిస్తుంది. అలా చెప్పినట్లయితే సాధకుడికి జీవితం మీద బ్రతకటానికి తగిన శ్రమపడడం మీద ఒక విముఖత కలుగుతుంది. జీవితంలో పసకనపడదు. ఉత్సాహం పల్చనై పారి యింకిపోతుంది.


జీవితం మీద ధ్యానం సాధకునికి "ప్రపంచం వట్టి దుఃఖమయం” అనిపించే టట్లుండరాదు. ఎక్కడో చీకటి భోగాలకు అతన్ని లాక్కుపోరాదు. అలాగే జీవితం సుఖమయమని సుఖం అనుభవించటానికే - ఏ పద్ధతైనేమి అనే గుడ్డి పంథాకూడా పనికి రాదు. విద్వాంసులు ఈ విషయంలో చాల జాగ్రత్తగా చెప్పారు. బహిర్గతమైన విషయ ములపై ధ్యాసవుంచి నిస్కారమై ప్రాపంచిక విషయాలమిదా అతిగా మనసుని ప్రవర్తిం పజేయటాన్ని నిరాకరిస్తూ అందరినీ మానవుల సేవలో నిమగ్నులు కావలసిందని అంతర్గతమైన దృష్టిని అలవరుచు కోవలసిందనీ వారు ఆదేశించారు.


ఋషులు అన్నారు - జీవితాన్ని యధాతధంగా చూడవలసిందీ అని అలా చూడటంలో అసంగత్వమనేది పాటించ మన్నారు. అప్పుడే ప్రపంచపు సరియైన దృశ్యం చూచినవాళ్ళ మవుతాము. ఆ పైన జీవితానికి వాస్తవికతలేని తనాన్ని చెప్పారు. మనసులో ఏముంటే అదే ఎదుట వున్నదన్నప్పుడు వాస్తవికత ఎక్కడుంటుందిగనక, దీనివల్లనే ఒకానొక స్వాస్థ్యమైన ఆశావాదమును అలవాటు చేయడం జరిగింది. జీవితం మీద సాధకుడికి పూర్వమున్న విలువలు తగ్గిన క్షణాన గురువులు వేదాంతికమైన క్రొత్త విలువ లను వారి మనసులో తగినసమయంలో ప్రవేశపెట్టుతారు.


పాశ్చాత్య దేశాలకు చెందిన విమర్శలకు ఇలాంటి శ్లోకాల్లోని ఈ బహళార్థా లు సాధక ప్రయోజనాలను గుర్తించక వ్యతిరేకంగా మాట్లడతారు, పూర్వ దేశాల జీవితంలో వితాన్ని చీకటిగా దుఃఖమయంగా చిత్రించుతారని మనిషిలో జీవితంలో వుండే బ్రతకాలనే చింతనే పారద్రోలు తారనీ - అభివృద్ధి నిరోధకంగా చెబుతారనీ విమర్శిస్తూ వుంటారు.


 సంగ్రహంగా చెప్పాలంటే దేహాన్నే అన్నిటికన్న మిన్నగా పూజించుట మనేది తగని పని దానికోసమే అన్నీ చేయటం దానికోసమే డబ్బు సంపాదించటం దానికోసమే తగలేయటం చేస్తాం. ఇదే పరమార్థమనకొంటే ఇంతకంటే శోచనీయమై విషయం లేదు. ఇంత కంటే మూర్ఖత్వం లేదు. శరీరమే అన్నిటికంటే గొప్పదైనదీ పూజించ దగింది, అయితే అది శాశ్వతంగా వుండేదైనా కాదే. క్షణాల్లో మారిపోతుంది. కృశించి పోతుంది, ముసలి దవుతుంది. రాలి పోతుంది. శరీరంతో కష్ట పడాల్సిందే, పనిచెయ్యాలి, పోరాడాలి, కూడబెట్టాలి, ఇతర్లను మేపాలి, జనాన్ని సృష్టించాలి, గుడ్డలు గేహాలు యివ్వాలి.-- ఇవన్నీ దేనికది ఆలోచిస్తే అవుసరమైనవే కాని మొత్తం జీవితకాలం యిలానే వెచ్చించి వేయడం మనిషి సామర్థ్యాలను మట్టిపాలు చెయ్యటం వంటిది. ఈ శరీరం పెరిగి సడలి, చేవలేనిదై, చివరకు మట్టిపాలై పోతుంది కదా!


శరీరం కోసమే శరీరంలో నివసించి వుంటామనే దృష్టి రాక్షస దృష్టి రాక్షస రాజు పేరు విరోచనుడు అతడొకప్పుడు విజ్ఞాన వేత్తయయిన బ్రహ్మదగ్గరకు వెళ్ళుతాడు. ఆయన ఉపదేశించిన జ్ఞానం విరోచనుడికి ఇతడి సంస్కారాన్ననుసరించి అర్థమైంది, విరోచనుడు నమ్మినదేమిటంటే- (నేను అనేది వేరు, శాశ్వతుడైన ఆత్మవేరు) ఈ నేను అనేది శరీరమే. ఆ యాత్మను సేవించి పూజించటమే పరమోత్కృష్టమైన మతము! అని ఇది సరియైనది కాదు, ఈ శ్లోకంలో ఒక ఆలోచనా పద్ధతి తెలియ బరచబడింది. ఆ దోవలో విచారించుతూపోతే శరీరంతోగల ప్రేమబంధము అంతమయిపోయి, మనిషిలోని వ్యర్థమైన పై మెరుగులు విచ్ఛిన్నమై పోతవి.


జీవి చనిపోయిన తరువాత మిగిలేది కళ్ళకు కనబడటానికి శరీరం మాత్రం ఏ జంతువైనా చనిపోతే దాని శరీరంలోని చర్మం మాంసం మొదలైనవి ఇతర్లకు ఉపయోగిస్తవి. కాని మనుష్యుడు చనిపోతే అతని శరీరానికి యే మాత్రం విలువలేదని చెప్పవచ్చు, ఒక్క జుగుప్సను కలిగించే విలువతప్ప, ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన శరీరం కోసమే బ్రతికినన్నాళ్ళున్నూ ధనం ఆర్జించటం, కూడబెట్టడం, గొంతులు కొయ్యటం, దుష్ప్రవర్తనలో తగులుకోవటం క్రూరమయిన యుద్ధాలు ప జెయ్యటమూనూ జరుగుతూ వున్నాయి. చివరకు ఆ శరీరం పడిపోయిన స్థితిలో ఇన్నాళ్ళు ఎంతో సన్నిహితంగా ప్రియులుగా వున్న భార్యయే జీవిత భాగ స్వామిని యే తన ప్రియుడి శరీరం - భర్త శరీరం అలాంటి స్థితిలో చూసి విపరీతమయిన భయానికి లోనవుతుంది.


జీవితంలోని ఈ భావ తాత్పర్యమును అనుసంధానం చేయటంవల్ల పై మెరు గుల మీదనుంచి మనసు మళ్ళి ప్రయోజనకరమైన అసంగత్వము అలవాటు అగుతుంది. శరీర రక్షణం చేయవలసిందే - ఎందుకంటే అది మనకు ఉపకరిస్తుంది. కనుక దాన్ని శుభ్రముగాను అందంగానూ వుంచాల్సిందె, మేపాలి దుస్తులు తొడగాలి, బాగు చేస్తుండాలి. మనకున్న యితరమైన వాహనాలను యెలా కడిగి శుభ్రముచేసి కాపాడుకొంటామో అలాగే దీన్ని కూడా పోషించు కోవాలి. శరీరాన్ని సేవించాలి. - కాని ఎల్లప్పుడూ - ఆ శరీరం ఒకానొక వస్తువని అది విశాలమైన యితర క్షేత్రాల్లో మనం ఉత్తీర్ణత పొందటాని కనువైన వస్తువు మాత్రమేననే విషయం, జ్ఞాపకంలో వుంచుకొని మరీ సేవించాలి.శరీరం శాశ్వతంగా మనకు వుండేదికాదు. ఇప్పుడున్న సమర్థతనే నిరంతరం కలిగి అది మనకు ఉపయోగపడుతూ వుండేది కాదు. అది నశించి పోతుంది తప్పనిసరి.


ఈ సమ్యగ్విజ్ఞానంతో శరీరంలో మనం మనినట్లయితే- దుఃఖపుంజం తగ్గి అత్యంత స్వాఫ్ట్యపూర్ణమైన జీవితం నడపవచ్చు.


*సశేషం*

🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔

వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ

 మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ  - 


      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను .  అవి 


     *  ప్రేవులు . 

     *  మూత్రపిండములు . 

     *  ఉపిరితిత్తులు . 

     *  చర్మము . 


  *  ప్రేవులు  - 


        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే      " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 


                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 


*  మూత్రపిండములు  - 


 ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 


 *  ఊపిరితిత్తులు  - 


     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము  ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 


 *  చర్మము  - 


     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 


       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 


             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 


            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 


                          సమాప్తం 


        మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం - చతుర్దశి - చిత్ర -‌‌ గురు వాసరే* (31.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*