12, జూన్ 2021, శనివారం

మంత్రం అందరికి

 *మంత్రం అందరికి ఎందుకు సిద్దించడం లేదు ?*


మంత్ర సాధనా నియమాలలో కొన్నైనా ఈ నేపథ్యంలో చెప్పుకుందాం.


ఒక మంత్రం కానీ, పూజ కానీ పరిహారంగా చేయమని చెప్పినప్పుడు దానికి లక్షల్లో జపం చేయమని ఎవ్వరూ చెప్పరు....ఎందుకంటే అవి పరిహారం కోసం ఇవ్వబడ్డాయి. సమస్యని తొలగించి, ఉపశమనం కలిగించే మంత్రాలు అవి. 


ఇన్ని వారాలు, లేదా ఇన్ని రోజులు, ఇన్నిసార్లు చేయాలి అనే నియమమే ఉంటుంది.....{సందర్భాన్ని బట్టి మారుతుంది}


సిద్ది పొందడానికి చేసే ఉపాసనలు మటుకే, దశమభాగం విధులు చేయాలి. గనుక దాన్ని లక్షల్లో జపం చేయవలసి ఉంటుంది..


ఏదైనా సమస్య పరిష్కారం కావాలి అని ఆ మంత్రం జపం చేస్తే పని అయిపోతుంది అని ఎప్పుడెప్పుడు జపం పూర్తి అయిపోతుందో దానిపైనే దృష్టి పెట్టి ఉంటారు , కానీ భక్తి శ్రద్ద అనేది ఉండదు. ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నామో ఆ మంత్రాదిష్ఠాన దేవత పైన భక్తి ఉండాలి, 


ఆ దేవతా స్త్రోత్రం చేయాలి. త్రికరణ శుద్ధితో జపం చేయాలి. 


జప సంఖ్య కన్నా కాస్త ఎక్కువ సార్లు చేయాలి. 


జపం చేసే వాళ్ళు మాసిన వస్త్రాలు ధరించకూడదు. నిన్న కాసేపు వేసుకున్నదే కదా అని మరుసటి రోజు ధరించ కూడదు.... మెడలో ధరించిన మాలని జపానికి వాడకూడదు.


శ్వాసలో దుర్వాసన రాకూడదు, పొద్దు వచ్చాక స్నానం చేయాకుడదు.....


అనగా ఋషి స్నానమే చేయాలి. మీరు జపం ఆలస్యంగా మొదలు పెట్టిన స్నానం మటుకు సూర్యోదయం కి ముందే చేయాలి. 


ఇది చాలా మందికి తెలియక 7,8,9 అలా ప్రొద్దెక్కిన తర్వాత స్నానం చేయడం వల్ల జప ఫలితము కూడా దక్కదు.. ఇది నిజం. స్నానానికి

 అంత  ముఖ్యమైన పాత్ర ఉందా! అనుకోకండి. 


మీరు ఒక నెల రోజులు పాటు వరుసగా , వేకువ ఝామునే, 4- 00 గంటలకే  స్నానం ముగించండి. (ఈ సమయంలో చేసే స్నానమే ఋషి స్నానం).


మీరు చేసే పూజ కానీ జపం కానీ ఎంత త్వరగా ప్రభావం చూపిస్తుందో చూడండి......సూర్యుడికి  అర్ఘ్య ప్రదానం చేస్తే రోజు మీకు అన్నివిధాల శుభం కలుగుతుంది. 


కొన్ని మంత్ర జపాలకు మటుకే ఆహార నియమం పాటించాలి, కానీ అన్ని పరిహారాలకు ఆహార నియమం అవసరం లేదు. మంత్ర సాధన ఉన్నంత కాలం....శాకాహారం తినడమే ఉత్తమం.


ఏ మంత్ర జపం, ఏ పరిహారం చేసే వాళ్ళు అయినా వారి కుల దేవతని మంగళవారం విశేషం గా ఆరాధించాలి. 


బియ్యం పిండితో దీపం పెట్టి స్త్రోత్రం చేసి దేనికోసం పరిహార జపం చేస్తున్నారో అది ఫలించే లాగా అనుగ్రహించమని సంకల్పం చేయాలి. అప్పుడు ఆటంకాలు రాకుండా కులదేవత కూడా అనుగ్రహిస్తుంది..


వివాహం ,ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు, ఆస్తి తగాదాలు, శత్రు బాధలకై ముఖ్యంగా పరిహారం చేసుకుంటూ ఉంటారు. 


ఎంత కోపం ఉన్నా జపం చేసే సమయంలో కోపంతో జపం చేయాకుడదు.. మీకు ద్రోహం చేసి వారు అయితే ఖచ్చితంగా వారికి ఎలాగో శిక్ష పడుతుంది. కానీ ఉపాసించే మంత్రం జపం చేస్తూ మనసులో శతృభావంతో చేయాకుడదు. అది మీకు కూడా మంచిది కాదు , ఎవరు తప్పు చేశారో ఖచ్చితంగా తెలియనప్పుడు *ఆముకం* దగ్గర శత్రువు అనిపెట్టాలి. కానీ ఎవరి పేరు చదవకూడదు .


దేవీ ఉపాసన మంత్రాలు స్ట్రోత్రాలు చదివే వారు ముందు గా గణేషుడి కి నమస్కారం చేసి దక్షణామూర్తి ని స్త్రోత్రం చేసే దేవీ ఉపాసన మొదలు పెడితే పూజ ఫలిస్తుంది..


 అలాగే దశమహావిద్యల లోని దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ, ఆ మంత్రం జపం చేసే వాళ్ళు, బైరవుడి ని ఆరాధించి ఆ మంత్రం జపించి తర్వాత ఆ దేవత ఆరాధన మొదలు పెట్టాలి.... అప్పుడే ఆ సాధన ఫలిస్తుంది. లేకుంటే ఎంత చేసినా ఫలితం త్వరగా రాదు.


రాహుకాలంలో భోజనం చేసిన, స్నానం చేసిన, మైధునం జరిగిన మీరు చేసుకున్న జప ఫలితం, పూజ ఫలితం అంతా రాహువుకి పోతుంది.. ఆ సమయం దాటాక భోజనం చేయాలి. 


లేదా ముందుగా చేయాలి.. అటువంటి పగటి సమయంలో గర్భం నిలిస్తే తల్లితండ్రులను హింసించే పిల్లలు పుడతారు. 


లేదా పిల్లల వల్ల ఏదో విధంగా బాధ పడుతూనే ఉంటారు..ఇది కొత్త దంపతులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. 


పొద్దు వాలే సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా ఇవే నియమాలు పాటించాలి. 


అయితే సూర్యుడు అస్తమించే సమయంలో స్నానం చేసిన పర్వాలేదు కానీ భోజనం నిద్ర చేయాకుడదు.


మంత్ర జపం చేస్తున్నవారు ఎవరితో గొడవ పడకూడదు, దూషించ కూడదు, అమాయకులను బాధ పెట్టకూడదు ఎవ్వరిని కాలితో తన్న కూడదు...


కాకికి , కుక్కకి తరచుగా అన్నం పెట్టడం వల్ల మీ దోషాలు చాలా వరకు తగ్గుతుంది.... జప సంఖ్య పూర్తి అయ్యాక వదిలేయ కూడదు. కొద్దిగా అయినా రోజు కాసేపు జపం చేస్తూ ఉండాలి.....


లేదా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరుకొని సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామం  పారాయణ చేయండి మీకు మీ కుటుంబానికి మంచి కలుగుతుంది.

Mumbai - Bombay *

 *Mumbai - Bombay *

Lengthy but worth reading...

Superb answer by a Mumbai-lover to a question "Why Mumbai​ is a likable place?"


I took a Cab from Lower Parel to Worli. The fare was Rs.67. Since I was coming from Bangalore, I gave Rs.100 to the cab driver and started walking towards my office. The driver called me back. He gave me Rs.30 back. I started walking again. He called me back again and gave me 3 bucks back.


This is why I love Mumbai.


It was Holi Morning. I had to come to office. My cab fare was again 70 bucks. The driver did not have change. He went ahead and bought a Vada (a typical Mumbai snack) worth Rs.10 and returned me the balance. When I was walking away. The driver took his plate of Vada, offered me half of them. "Boss, ek lelo, Holi hai!"


This is why I love Mumbai.


It was my first night out on Marine Drive. The rainy days were about to start.I sat on the rocks with my friend. And suddenly it started raining. Ohh, I can't even start to tell you how much people love the first rain here. It was 3 a.m. I saw a group of 3 girls, all dressed up in their short LBDs , probably coming back after party. They got out of their car. And started drenching and dancing in the rain. And no, not a single guy catcalled them.


This is why I love Mumbai.


Just on the opposite side of the road ,where the girls were dancing, there was an old traditional Muslim couple. They were completely wet . The rain poured like nothing I have ever seen. Yet they sat there enjoying the view of the sea, holding hands. They were in their 60s.


This is why I love Mumbai.


Every Time I took the local train, I realized there is always a place for another person. It always looked impossible from the outside to get in. But somehow "we" always used to fit in those small coaches.


That is why I love Mumbai.


Every time it rains here, I wonder if the city is coming to a stop. It literally is like the hell broke down. I saw platform being overflown by rainwater. Then when I reached my office, I saw everyone came to work. People somehow manage to live here, irrespective of anything. The best part is they do it with a smile.


That is why I love  Mumbai.


There used to be a couple, just below my first apartment, on the street. They did not have a place to stay. They were homeless. I used to take the cab for my office from the front of their tent. I saw the old guy reading his news paper, sipping tea and I saw his wife combing hair of one of the street dogs. I never saw them sad in their happy little home (tent?). The wife always wore a little lilly on her hair.


That is why I love Mumbai.


I was at Dadar Station . It was 9 in the morning. It is pointless to say that it is one of the busiest hour. I saw a couple smooching on the platform. They were probably saying goodbyes to each other. From what I figured out later the girl was moving to another city on a long distance train. And then I realized I am one of the very few people watching. Everyone else is busy about their own train.


That is why I love Mumbai.


The city is an infrastructural mess. The air is so polluted at times I could not see the top of my own building due to dust. The place is so over crowded that there is probably more space in a first world country's prison than in Mumbai. Yet, I saw a young Punjabi guy, dressed in formal, singing his heart out while coming back from office on a bike. I saw a Jaguar stuck in the same traffic light. And they coexisted happily, side by side.


That is what Mumbai is for you "naked, sheer raw acceptance of truth"

I saw thousands of small homes. Homes of the size of washrooms of my place in Kolkata . Yet, I never saw a permanent sad face in any of those windows. People ran, people fought, people struggled for their dreams . "One does not live in Mumbai, One struggles in Mumbai".


Mumbai is still the city of dreams. Mumbai can give you respect, happiness, irrespective of your caste, creed, gender and economical status. As the tea stall owner just outside my office used to say.. "Ambani bhi petrolpump pe petrol deta tha.. To hum konsi maal hai?"

 

One more thing , just shout Ganpati Bappa anywhere in Mumbai u will hear  MORYA next minute 


That spirit is the greatness of Mumbai..

పదాల తేడా

 🍃🥀పదాల తేడా చదువుకోడానికి మాత్రమే..చర్చకోసం కాదు

🙂  🙂  🙂  🙂  🙂  🙂

'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట.  ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు. కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.  

'వాడెదవ'  అంటే తిట్టనుకునేరు .చెరకుగడ  చివరిభాగం. tip of the sugar cane అన్నాడు బ్రౌన్.

'సమాజం'  అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా !)

'శ్రీ' అంటే  విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.

'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)

 ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి  " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట. తండ్రికి తగ్గ ఆ కొడుకు  " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట  ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు.  పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.

 ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)

సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ " శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.

ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది. 

' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.

గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం'  అని రాస్తున్నాం.

'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.

గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే?  కర్ర లేని గొడుగు.

పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.

బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది 

'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో  కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.

                🍃🥀🍃🥀🍃

సేకరణ: అంతర్జాలం

శ్రీ చక్రం వక పరిశీలన

 శ్రీ చక్రం వక పరిశీలన. బిందు త్రికోణ మధ్యే త్రికోణాంతర దీపికా. శక్తి బిందువు నుండి వ్యాప్తంగా అనంతమైనది. అది తెలియాలంటే పదార్ధ రూపం దాల్చవలెను. అటువంటిది షట్కోణాకృతిగల త్రిగుణములతో గూడిన ప్రకృతి తత్వమే.షట్కోణము అనంతమైన 64 చతుషష్టుపచారాఢ్యా, చతుషష్టి కళామయి, 64 కోణములు గలది అనగా శక్తి రూపమైనది.శ్రీ చక్రము. యిది సమస్త ప్రకృతి పరమైన శక్తి లక్షణములు గల భూమియే శ్రీ చక్రం. ఊర్ధ్వకోణ, అధోకోణ త్రిభుజ మిశ్రమమైన పురుష, ప్రకృతి శక్తుల కలయికయే శ్రీచక్రమునకు యంత్ర శక్తికి మూలము.దానిని పదార్ధ రూపమే మేరువు.మరియు మేరు పర్వత రూపంలో సుమేరు శృంగ మధ్యస్థయైన బిందు రూపమే కైలాస పర్వతం.దానినే మనం మేరువుగా పూజించుట. కైలాసపర్వతం ప్రకృతి పరంగా మేరు పర్వతమని తెలియుచున్నది. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే ,దేవతాస్తత్ర మెూదన్తి తన్మే మనః శివసంకల్ప మస్తు.సమస్త దేవతలకు మెూదము కలిగించేది కైలాసశిఖరం. యిది బిందు పూర్వక శ్రీచక్రమే మేరువుగా మనం తెలియవచ్చును. అచ్చటికి ప్రయాణం. గఛ్చంతు మహా మేరు అని వేదములో అరుణ ప్రశ్న తెలుపు చున్నది. అనగా దానిని అధిరోహించుటయనగా మెూక్మే పునరావృత్తి లేని జీవుడు. జీవునికి పునః పునః జన్మ లేకుండుట. దాని శక్తి తెలియాలి అంటే యీ రెండిటిని వ్యతిరేకముగా చూచిన ఎక్స్ ఆకారము దాల్చును.ఎక్స్ యనగా ఆరుద్ర,మూల రాహు కేతు మరియు మఘ, శతభిషం నక్షత్రముల కేతు రాహువులు రేఖల కలయిక వలన ఏర్పడిన శక్తి ఎక్స్ కిరణాలు వాని లక్షణములు. సమస్త ప్రకృతి శక్తి రూపము బిందువునుండి విశ్వ వ్యాప్తమైనది. ఏదైనా తెలియాలి అనగా దానిగురించి వివిధ కోణములలో ఆలోచించాలి. దానినే పరా ఙ్ఞానమని మూడవ నేత్రము పర అనబడే ఙ్ఞానము. ప్రతీ వ్యక్తి మూడవ నేత్రం కలిగియున్నాడు.మనస్సనే నేత్రముతో ఆలోచన చెయ్యాలి.శ్రీచక్రమనగా భూమండలమే దానికి మధ్యస్ధానమైన బిందువు కైలాస శిఖరం. సృష్టి శక్తి మూలము పార్వతీ పరమేశ్వర తత్వం. మనకు అటువంటి శక్తి అవగాహన కొరకు విష్ణు తత్వముగా తెలియుట. అదియును అసంపూర్ణమైన. బ్రహ్మ తత్వము స్పష్టంగా జీవ పరిణామం మునకు మెదటి తత్వం బ్రహ్మంగా తెలియుట. అది ప్రాకృతికంగా స్పష్టంగా తెలియుటకు వామనావతార తత్వం. అప్పటి వరకు మిగిలిన అవతార తత్వములు  సృష్టించిన పరబ్రహ్మ తత్వానికి కూడా తెలియదు. వామనుడినుండి పరశురామ రామ, కృష్ణ తత్వం పూర్ణ మానవ జీవ పరిమాణము తెలసినది.వామనూన౦ి అవతారం 5 అవతారం మానవునికి కూడా 5 వ నెలలోనే పూర్ణాకృతి దాల్చును.అయిననూ ఙ్ఞానమూ కలుగదు 6 వ నెల నుడి జీవికి ఙ్ఞాన పరంపర మెుదలు. అంతకుముందు వరకూ అసంపూర్ణ మానవ తత్వమైన జంతు లక్షణ సంబంధమైన ప్రకృతి.సాధనవలననే సమస్త విషయములు అవగాహన.అది సవ్యమైన రీతిలో కుతర్కాన్ని విడిచి సత్యదర్శనం చేయుట వలననే. ఎవరికి వారే ఆలోచన చేసిన తత్వం బోధ పడును.మనం అనంతమైన శక్తి రూపంలో గల తత్వమును  తెలుసుకొనే ప్రయత్నమే సాధన. అదే ఙ్ఞానం.ప్రతీ విషయాన్ని ఋషులు దర్శించి పరిపూర్ణ మానవుడు ఎలా మెులగవలెనో తెలిపి యుండిరి.మానవుడే తెలియవలెను. వేరే జీవ రూపంలో తెలియుట అసంభవం.ఋషులు దార్శనీకులు కావున.మనం కూడా అటువంటి దార్శనీయతకు సాధన ద్వారా ప్రయత్నం చేద్దాం. తెలుసుకుంటూనే వుందాం. 

ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..*


*(యాభై ఆరవ రోజు)*


శ్రీ స్వామివారి పేరు, ప్రఖ్యాతులు చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యాపించసాగాయి..శ్రీధరరావు గారింటికి అనేకమంది పండితులూ..ముముక్షువులూ.. సాధకులు  రావడం..శ్రీ స్వామివారిని కలవాలని కోరడం..శ్రీ స్వామివారి అవకాశాన్ని బట్టి వారితో మాట్లాడటం..జరుగుతోంది..


దాదాపుగా అందరి నోటా ఒకటే మాట.."ఈయన సాధారణ మానవుడు కాదు..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి ప్రతి రూపమే ఈ మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకొని సాధకుడి గా మారి నడయాడుతున్నాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యమే ఇది!.." అని..


శ్రీ విక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు (వీరిద్దరూ సంస్కృతాంధ్రములలో మహా పండితులు..శతావధానం చేసిన వారు..శ్రీ వైష్ణవులు..ఆదిదంపతులే కలసి వచ్చినట్లుగా భావిస్తారు వారిని చూసిన వారు..వీరి గురించి ఈ చరిత్ర మొదట్లో ప్రస్తావించడం జరిగింది..) శ్రీ స్వామివారిని చూడటానికి మొగలిచెర్ల వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారు కూడా ఈ దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్లు..వారితో ఎంతో సేపు చర్చ చేశారు..దాదాపు రెండు గంటలపాటు ఆ దంపతుల తో శ్రీ స్వామివారు ఓపికగా మాట్లాడారు..


తిరిగి వచ్చేటప్పుడు గూడు బండిలో ఆ దంపతులిద్దరూ.."నాయనా శ్రీధరరావు, అమ్మా ప్రభావతీ..మీ పూర్వపుణ్యం వలన ఆ మహనీయుడు మీ బిడ్డగా సేవలందుకొంటున్నాడు.. ఆయనది "పరా" విద్య!..మాది కేవలం పాండిత్యం..జన్మజన్మల  సంస్కారం, తపస్సు, సాధన..ఈ మూడింటిముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచ వంటిది..ఆ మహానుభావుడి ని పరీక్షించడానికి మాబోటి వాళ్ళము వెయ్యిమందిమి వచ్చినా చాలము..అది ఆ తల్లి లలితా దేవి కరుణ తప్ప మరోటి కాదు..ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిద లో వెలిగే దీపం లాంటిది..మీరు అదృష్టవంతులు!.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను మర్యాదచేసి..వారి పాదాలకు నమస్కరించి వాళ్ళను సాగనంపారు..ఆ ప్రక్కరోజే..ప్రభావతి గారి నాన్న గారు కూడా కావలి నుంచి కొంతమంది పండితులను వెంటబెట్టుకొని మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారిని చూసి తిరిగి వెళుతూ..ఆ పండితులందరూ ఈ దంపతుల సేవను పొగిడి వెళ్లారు..


ఈ వరుస ఘటనలతో..ప్రభావతి గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది..తాము ఒక మహనీయుడికి సేవ చేసినందునే ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి..తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో?.. తాము అందరికన్నా అధికులము అనే భావన మెల్లిగా ఏర్పడసాగింది.. మరీ ముఖ్యంగా..పండితులందరూ ఏక కంఠంతో మెచ్చుకోవడం ఆవిడకు ఆనందాన్ని..అహాన్నీ పెంచాయి..


ఆరోజు మధ్యాహ్నం శ్రీధరరావు గారి స్నానానికి నీళ్లు పెట్టి..టవల్ తీసుకొని స్నానాలగదిలో పెట్టబోతున్నారు..అంతలో ఆ టవల్ లో దాక్కొని ఉన్న ఒక తేలు.. అందులోంచి జారి ప్రభావతి గారి కాలిమీద పడి.. ఒక్కసారిగా కుట్టింది..వెఱ్ఱి కేక పెట్టారు ప్రభావతి గారు..ఆ తేలు కూడా ఒక పట్టాన వదిలిపెట్టలేదు..ఈలోపల శ్రీధరరావు గారు వచ్చి తేలును చెప్పుతో కొట్టి చంపేశారు..కానీ అప్పటికే ప్రభావతి గారికి తేలు విషం మోకాలు పై భాగం దాకా ప్రాకిపోయింది..ఆవిడ విపరీతంగా బాధ పడుతున్నారు..సాయంత్రానికి కూడా బాధ తగ్గలేదు..


శ్రీ స్వామివారికి చెపితే ఏదైనా మంత్రం వేస్తారని.. అక్కడికి తీసుకుపొమ్మని గ్రామస్థులు శ్రీధరరావు గారికి చెప్పారు..వద్దని..ఓర్చుకుంటే తెల్లవారేలోపల తగ్గుతుందని శ్రీధరరావు గారు నచ్చచెప్పి వాళ్ళను పంపించివేశారు..


కానీ..శ్రీధరరావు దంపతులను తన తల్లిదండ్రుల వలె భావించే ఒక మనిషి మాత్రం వుండబట్టలేక..సైకిల్ వేసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోయాడు..


అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమం బైట తిరుగుతూ వున్నారు..ఈ మనిషి సైకిల్ దిగి, శ్రీ స్వామివారికి నమస్కరించి..ప్రభావతి గారికి తేలు కుట్టిన విషయమూ..ఆవిడ పడుతున్న బాధనూ వివరించాడు..


శ్రీ స్వామివారి సమాధానం..అహం తొలగడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

11, జూన్ 2021, శుక్రవారం

భిన్నార్థ పదాలు

 భిన్నార్థ పదాలు 

క్రింద కొన్ని మనం రోజు ఉపయోగించే సాధారణ పదాలు వున్నాయి.  వాటికి రెండు అర్దాలుగా వాడ వచ్చు ఉదాహరణకు చేయి అనే పదం వుంది దానిని ఏదైనా పని చేయి అని లేదా హస్తం అనే రెండు అర్ధాల్లో వాడొచ్చు 

క్రింది వాటికి అటువంటి అర్ధాలను కనిపెట్టండి. 

1) తెలుపు 

2) నలుపు 

3) కలుపు 

4)పన్ను 

5) వలువ 

6) కాయ 

7) చెరుపు 

8) నూరు 

9) మీరు 

10) కూర 

11) అడుగు 

12) వాడనివి 

13) 

Caves

 https://docs.google.com/document/d/1-nbs9v6NIrtKdXrXCekjY_T6L9w6YDj3ZzRXVdyviRM/edit?usp=drivesdk

చిలుక కథ

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గారు రాసిన* *🦜చిలుక కథ🦜*

              🌷🌷🌷

 *ఒక చిలుక ఉండేది.  చక్కగా పాడేది.  స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేక పోయేది.  అది రాజు గారి తోటలోని చిలుక.* 


*ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది.  వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.* 


*ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే, మొదట అది కుదురుగా ఉండాలి. అంటే, అది ఎగురకూడదు. వెంటనే ఒక మంచి పంజరం చేయించారు.  చిలుకను అందులో కూర్చోబెట్టారు.* 


*కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. 'ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు. గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.* 


*పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ 'అబ్బా, భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా, ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే' అబ్బా! ఎంత చదువు!' అంటున్నారు.  రాజు గారిని మెచ్చుకుంటున్నారు. మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.  రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని 'ఆహా! ఓహో ' అని కీర్తిస్తున్నారు.* 


*రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు.  చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.* 


 *' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.* 


 *ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో* *చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు, పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు.* 


 *రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించు కోవటం లేదు.  ఎవరూ దాని వైపు చూడటం* *లేదు. పండితుడు ఒక్కడే చూస్తున్నాడు.  ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప, చిలకెలా ఉందో చూడటం లేదు.  చిలుక బాగా నీరసించి పోయింది.* *మానసికంగా బాగా నలిగిపోయి ఉంది* . 


*ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది!  ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు.  ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.* 


*రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, 'చిలుక ఎలా చదువుతోంది?' అని అడిగాడు.* 

*' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు.* 

*రాజుగారు సంతోషించారు. *తన కృషి ఫలించిందన్నమాట.* 

*'ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'* 

*'ఎగరరదు'* 

*'ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '* 

*'పాడదు'* 

*' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'* 

*తీసుకొచ్చాడు మేనల్లుడు.* *చిలుక నోరు తెరవడం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చిలుక కడుపు* *ఉబ్బెత్తుగా ఉంది.  చిలుక అసలు కదలనే కదలటం లేదు.* 


*" ఆ కడుపులోనిది ఏమిటి!"అనిఅడిగారు రాజు గారు.* 

*'జ్ఞానం మామయ్య' అని చెప్పాడు మేనల్లుడు.* 


*'చిలుక చనిపోయినట్లు ఉంది కదా' అన్నారు రాజుగారు.* 

*చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా* *బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.* 


*నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది. ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా!* 

సేకరణ: మానస సరోవరం

బహిరంగ లేఖ :

 “ కోవిడ్ వాక్సిన్”  ల పై  దుష్ప్రచారాన్ని ఖండిస్తూ TV5 యాజమాన్యానికి బహిరంగ లేఖ :


అయ్యా !


          మీ ఛానల్ లో గడచిన రెండురోజులలో కరోనా పై జరిపిన ఒక చర్చకు సంబందించిన 5 ని ల .14 సె.ల నిడివిగల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది . ఆ చర్చకు  moderator గా Mr . సాంబశివరావు చర్చలో ఉన్నారు  మరియు చర్చలో కెమికల్ ఇంజనీర్ Mr . మల్లిక్ పరుచూరి, ఇంకా తదితరులు పాల్గొన్నారు .


 ఈ చర్చ లో కోవిడ్ variants గురించి , వాక్సిన్ ల efficacy గురించి అవాస్తవాలను , అబద్దాలను , అర్ధ సత్యాలను చెప్పి ప్రజలను గందరగోళపరిచారు  .  3rd wave గురించి చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.  


******************************


1. కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


  IGIB సైంటిస్టు డాక్టర్. వినోద్ స్కారియా MedRxiv లో అప్లోడ్ చేసిన కొత్త పేపర్ లో కోవిషీల్డ్ , కోవాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కూడా కోవిడ్ వస్తుంది . వాళ్ళ RTPCR శాంపిల్స్ లో Ct values ( cycle threshold ) దారుణంగా పెరుగుతున్నాయి . దీనివలన కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా శరీరం దారుణమైన స్థితి లో కుళ్ళిపోతుంది . gap ఇవ్వకుండా కుళ్ళ బెట్టేస్థది.లోపల కుళ్ళిపోయిందని బయటకు తెలిసేటప్పటికే , పడిన తర్వాత రోజే వెంటిలేటర్ ఎక్కాల్సివస్తుంది . 


వాస్తవం :


       MedRxiv లోఅప్లోడ్ చేసిన స్టడీ పేపర్ యొక్క title “ Variants of concern responsible for SARS-COV-2 Vaccine breakthrough infections from India “ . ( pdf ను ఈ మెసేజ్ కి అనుబంధం గా పెట్టాను ).


 మార్చి 28 వతేదీ 2021 నుండి ఏప్రిల్ 30 వ తేదీ 2021 వరకు జరిగిన ఈ స్టడీ ని AIIMS న్యూఢిల్లీ మరియు CSIR – IGIB వారు సంయుక్తంగా చేశారు. వాక్సిన్ ఒక డోస్ , రెండు డోస్ లు వేయించుకున్న తర్వాత కోవిడ్ లక్షణాలు ఉండి , స్వచ్చందంగా ఆసుపత్రికి వచ్చిన వారి నుండి శాంపిల్స్ తీసుకొని , 36 శాంపిల్స్ కు జెనెటిక్ పరీక్షలు చేశారు . అందులో 63.9% కోవిడ్ డెల్టా variant కాగా , మిగిలినవి కప్పా variant,  UK variant మరియు ఇతర variant లు. వీరిలో రోగనిర్ధారణ సమయంలో viral load ఎక్కువగా ఉంది ( ఒక డోస్ వాక్సిన్ తీసుకున్నా (లేక) రెండు డోసులు తీసుకున్నా సరే , కోవిషీల్డ్ అయినా.. కోవాక్సిన్ అయినా ) మరియు జ్వరం తీవ్రత.... వాక్సిన్ తీసుకోని రోగులలో వలే 5 నుండి 7 రోజులు ఉంది .


    తరువాత మాత్రం ఈ స్టడీ గ్రూప్ లోని వారికి ఎవ్వరికీ రోగ తీవ్రత పెరగటం లేదు ( అనగా పరీక్షలలో biomarkers / inflammatory markers సాధారణంగా (stable ) గానే ఉన్నాయి ; మరియు ఎటువంటి మరణాలు సంభవించలేదు  ( పరిశోధనా పత్రంలోని పేజీ 4-5). 


అదే పరిశోధనా పత్రంలోని  5 వ పేజీ లో స్టడీ పీరియడ్ సమయంలో  ఢిల్లీ లో ఏ కోవిడ్ variants అయితే అత్యధికంగా వ్యాప్తిలో ఉన్నాయో , అవే వాక్సిన్ వేయించుకున్నవారికి కూడా వచ్చాయి. ( ఏప్రిల్ నెల  2020 లో ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం , ఢిల్లీ లో 60% పైగా కోవిడ్ కేసులు ‘ డెల్టా variant ’ వలనే వచ్చాయి ).


పరిశోధనా పత్రం లోని వాస్తవాలు ఇలాఉంటే .... TV5 చర్చలో ‘ కెమికల్ ఇంజనీర్ గారు ...  “  కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా శరీరం దారుణమైన స్థితి లో కుళ్ళిపోతుంది . gap ఇవ్వకుండా కుళ్ళ బెట్టేస్థది. లోపల కుళ్ళిపోయిందని బయటకు తెలిసేటప్పటికే , పడిన తర్వాత రోజే వెంటిలేటర్ ఎక్కాల్సివస్తుంది “ అని చెప్పడం బుద్ధిపూర్వకంగా అసత్య ప్రచారం చేసి , శాస్త్రీయ విషయాలను వక్రీకరించి,  ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం కాదా !!


ఎందుకంటే శరీరంలోపల కుళ్ళిపోవటం అంటే “ necrosis జరిగి రోగి తీవ్రమైన sepsis లోకి వెళ్తారు. తద్వారా తీవ్రమైన అనారోగ్యం వచ్చి, బి‌పి పడిపోయి , శ్వాసతీసుకోవడం కష్టమయ్యి , రక్త పరీక్షలలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి . severe sepsis వచ్చిన వారిలో 70% పైగా మరణాలు ఉంటాయి. కానీ ఆయన చెప్పినట్లు  శరీరం లోలోపల కుళ్ళిపోతే ... స్టడీ గ్రూప్ లో ఒక్క మరణం లేదు ! ఒక్క రక్త పరీక్ష లో కూడా  మార్పు లేదు.


***  నిజంగా వాక్సిన్ పనిచేయకపోతే .... స్టడీ లో biomarkers ఎందుకు పెరగలేదు ? ఎందుకు మరణాలు లేవు ?. 


*****************************


2. కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


డెల్టా variant పై ఏ వాక్సిన్ పనిచేయదు . 


వాస్తవం : 


  A )  వాస్తవాల వివరణ లోకి వెళ్ళే ముందు , ప్రపంచ ఆరోగ్యసంస్థ వాక్సిన్ ల యొక్క efficacy , effectiveness నిర్వచనాల గురించి స్థూలంగా అర్ధం చేసుకోవాలి .


 Efficacy అంటే “పరిశోధనా సమయం లో వాక్సిన్ తీసుకున్న ఎంత శాతం మంది కి వ్యాధి సోకలేదు “ అని చెప్తుంది . వాక్సిన్ effectiveness అంటే “ సాధారణ పరిస్థితులలో ( పరిశోధనలలో కాకుండా) వాక్సిన్ తీసుకున్న వారికి ఎంతమందికి వ్యాధి సోకలేదు “.


 ఇందులో ఒక్క వ్యాధి సోకడమే కాకుండా , ఆరోగ్య వ్యవస్థలు / ప్రభుత్వాల ప్రాధాన్యతలు అయినంటువంటి తీవ్రమైన వ్యాధి రాకుండా ఉండటం , ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండటం , మరణాలు సంభవించకుండా ఉండటం లాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటారు.



B ) మనందరి అనుభవం :


          మనందరం మన ఇళ్ళల్లో  ఉన్న చిన్న పిల్లలకు టీకాలు ( వాక్సిన్ లు ) వేయిస్తున్నాము. పోలియో చుక్కలు యొక్క efficacy – 90% మాత్రమే , measles వాక్సిన్ యొక్క efficacy -85% మాత్రమే. అయినా మనమందరం క్రమం తప్పకుండా మన పిల్లలకు టీకాలు వేయిస్తున్నాము . 90% మాత్రమే efficacy ఉన్న వాక్సిన్ ని అందరికీ వేయించి , మన దేశం నుండే పోలియో నే లేకుండా చేశాము . 95% efficacy ఉన్న మశూచి వాక్సిన్ తో , మశూచి అనే వ్యాధి భూమి మీద లేకుండా చేయగలిగాము . దీనికి కారణం 80% మంది కన్నా ఎక్కువమందికి టీకాలు వెయ్యడం ద్వారా , Herd (సామూహిక) ఇమ్యూనిటీ వచ్చి వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమించడం గణనీయంగా తగ్గిపోయి , వ్యాధులు కనుమరుగవటమో (లేక) బాగా తక్కువ మందికి రావటమో జరుగుతుంది. ఇది మన జీవిత కాలం లో,  మనందరం అనుభవంతో తెలుసుకున్న విషయం .


అదే 60% లోపు efficacy ఉన్న BCG , ఫ్లూ వాక్సిన్ లు ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆయా వ్యాధుల యొక్క  తీవ్రతను , ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరాన్ని , మరణాల సంఖ్యను గణనీయం గా తగ్గించాయి. 


C )  ‘ డెల్టా variant పై ఏ వాక్సిన్ పనిచేయదు’ అన్న అవాస్తవం పై వివరణ :-


పూణే లోని  National institute of Virology, ICMR మరియు భారత్ బయోటెక్ సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలిందేమిటంటే.... Covaxin టీకా డెల్టా variant పైన మరియు సౌత్ ఆఫ్రికన్ variant పైన సమర్ధవంతం గా పనిచేస్తుందని.


ఈ విషయంలో మరింత Objectivity కోసం ,  ఇంగ్లాండ్ లో జరిగిన పరిశోధనల ఫలితాలను  చూద్దాము .


 Public Health England ( PHE ) UK వారు 22/05/2021 న వారు డెల్టా variant పై Pfizer వాక్సిన్ , Astrazaneca వాక్సిన్  ల యొక్క effectiveness గురించి 05/04/2021 నుండి 16/05/2021 వరకు 1,054 మంది పై జరిగిన పరిశోధనా ఫలితాలను విడుదల చేశారు.  అందులో “  Pfizer వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలో 88% మందిలో రోగలక్షణాలతో కూడిన డెల్టా variant ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అని ;  అదే astrazaneca వాక్సిన్ అయితే 66% మందిలో  రోగలక్షణాలతో కూడిన డెల్టా variant ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అని చెప్పారు .  ఒక్క డోస్ వాక్సిన్ వేసుకున్న వారిలో 33% మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్ ను నివారించగలుగుతున్నాయి ... అని చెప్పారు  “. 


* దీనివలన astrazaneca వాక్సిన్ రెండు డోసుల మధ్యగల సమయాన్ని తగ్గించాలన్న చర్చ మొదలయ్యింది .


D )  Francis crick institute , లండన్ వారు 250 మంది పై చేసిన ఒక పరిశోధన  Lancet మెడికల్ జర్నల్ లో  ప్రచురితమైంది . ఇందులో రెండు వాక్సిన్ డోసులు తీసుకున్న వారిలో,  డెల్టా variant కి వ్యతిరేకం గా antibody లు 6 రెట్లు తక్కువ స్థాయిలో ఉన్నాయి  అని చెప్పారు. 


 ఈ పరిశోధనలో వాక్సిన్ efficacy ను చూడటానికి surrogative పరీక్షగా యాంటీబాడీ ( anti body ) లెవెల్స్ లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు , అంటే స్టడీ లోని వారికి వాస్తవానికి వ్యాధి లక్షణాలు వచ్చాయా? లేదా ? , ఎంత తీవ్రత ఉంది? ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉన్నదా? లేదా ?  లాంటి అతిముఖ్యమైన అంశాలు వారి పరిశోధనలో .... పరిగణలోకి తీసుకోలేదు. 


   *** దీనిపై ఆ స్టడీ గ్రూప్ లోని ప్రిన్సిపల్ సైంటిస్టు Emma C .Wall ఈ విధంగా చెప్పారు “ antibody లెవెల్స్ ఆధారంగా వాక్సిన్ యొక్క effectiveness ను నిర్ధారించలేము. దీనికి మనుషులపై పరిశోధనలు ( prospective population studies) జరగటం ఎంతో అవసరం . తక్కువ antibody లెవెల్స్ ఉన్నా కూడా , వాక్సిన్స్ కోవిడ్ నుండి రక్షించగలవు “.


*****************************

  

3.  కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


    సౌత్ ఆఫ్రికా variant పై పెద్ద పెద్ద Pfizer వాక్సిన్ లు కూడా పనిచేయకుండా పోయాయి , కోవిషీల్డ్ 10% మాత్రమే పనిచేస్తుంది.


వాస్తవం :


         ‘ఖతార్’  దేశం లో వచ్చిన 2 వ వేవ్ మరియు మూడవ వేవ్ లలో  సుమారు 50 % కేసులు సౌత్ ఆఫ్రికన్ variant ( B.1.351)  , 44.5% UK variant (B.1.1.7) . ఆ దేశంలో డిసెంబర్ 21 వ తేదీ 2020 నుండి Pfizer వాక్సిన్ వేస్తున్నారు , మార్చి 31 వ తేదీ 2021 తేదీ వరకు అర్హత కలిగిన వారిలో సుమారు 33% మంది టీకా వేయించుకున్నారు ( ఇందులో 59% మంది ఒక డోస్ , 41% మంది రెండు డోసులు ). సౌత్ ఆఫ్రికన్ variant పై Pfizer వాక్సిన్ 75% effectiveness తో పనిచేస్తుంది . సౌత్ ఆఫ్రికన్ variant తో కోవిడ్ తీవ్రమైన లక్షణాలు రాకుండా , క్రిటికల్ స్టేజ్ రాకుండా , మరణాలు సంభవించకుండా నిరోధించడంలో Pfizer వాక్సిన్ 97.4% effectiveness కనబరిచింది . ( NEJM మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన ఈ స్టడీ రిపోర్ట్ కాపీ ని pdf లో జత చేశాను).


   వాస్తవం ఇలాఉంటే ప్రజలను భయబ్రాంతులను చేయటానికి , వారిని తప్పుదోవ పట్టించడానికి సౌత్ ఆఫ్రికన్ variant పై వాక్సిన్లు పనిచేయవు అని చెప్పడాన్ని ఏమంటారు ?? ఇది బుద్ధిపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా ?? 


******************************


వాక్సిన్ లు వేయించుకున్నవారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ రావటం గురించి CDC , USA వారు 01/01/2021 నుండి 30/04/2021 వరకు దేశవ్యాప్తంగా వచ్చిన కేసులన్నింటినీ పరిశోధించి , క్రోడీకరించి ఇచ్చిన రిపోర్ట్ లోని రెండు  ముఖ్యమైన అంశాలు   :

 ( 28 /05/2021, MMWR ,Vol  70 ..... ఒరిజినల్ కాపీ pdf జత చేశాను ) .


1. 30/04/2021 వరకు అమెరికా లో 10 కోట్ల 11 లక్షల మందికి వాక్సిన్లు వేశారు. వారిలో 10,262 మందికి  vaccine breakthrough infections ( అనగా రెండు డోసుల వాక్సిన్లు వేసుకొన్న 15 రోజుల తర్వాత ) వచ్చాయి . లక్షణాలు లేని వారు , కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారు కోవిడ్ పరీక్షకు వచ్చిఉండకపోవచ్చు.. అందువలన ఈ సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది . ఈ 10,262 మందిలో 2% మంది ( అనగా 160 మంది ) మృతువాత పడ్డారు , వీరి సగటు వయస్సు 82 సంవత్సరాలు . 


2. FDA అనుమతించిన వాక్సిన్ లు చాలా effective గా పనిచేసేవే, అయినా Population immunity (సామూహిక రోగనిరోధక శక్తి) రాకముందు, vaccine breakthrough infection లు ఉండటం అనేది ఒక సాధారణ మైన విషయం. Vaccination మరింత పెరిగి, ప్రజలలో ముందు సూచించిన స్థాయికి Vaccination  జరిగినప్పుడు .... వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం ఆగిపోతుంది . తద్వారా vaccine breakthrough infections ఆగిపోతాయి .


*****************************


4. కెమికల్ ఇంజినీర్ చెప్పిన అవాస్తవం :


 డెల్టా variant పైన , సౌత్ ఆఫ్రికా variant అనే కొత్త variants పైన ఈ వాక్సిన్లు ఏవీ పనిచేయవు . కావున 35,000 కోట్ల రూపాయలు ఈ పనికిరాని వాక్సిన్ల పై ఖర్చు పెట్టడం మానెయ్యండి.


వాస్తవం :


 డెల్టా variant పైన , సౌత్ ఆఫ్రికా variant  పైన వివిధ వాక్సిన్ల పనితీరును పూర్తి ఆధారాలతో పైన వివరించాను , సంబందిత పరిశోధనా పత్రాలు కూడా pdf లో జతచేశాను . 


 Variants మరియు vaccination కు సంబందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా చెప్పింది ...


            “ covid -19 పై మనం చేస్తున్న యుద్ధంలో వాడుతున్న ఆయుధాలలో ‘ వాక్సిన్’ అత్యంత కీలకమైనది . వీటిని వాడటం వలన ప్రజారోగ్యంలోను మరియు ప్రజల ప్రాణాలను కాపాడటంలోను స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి . క్రొత్త variants గురించిన సందేహాలతో , జరుగుతున్న vaccination ను ఆపకూడదు. ఒక వేళ క్రొత్త variants పై వాక్సిన్ ల effectiveness తక్కువగా ఉన్నా కూడా, vaccination కార్యక్రమాన్ని కొనసాగించాలి . వాక్సిన్ లో మార్పుల కోసం ప్రయత్నిస్తూనే , మన చేతిలో ఉన్న అమూల్యమైన ఆయుధం అయినటువంటి వాక్సిన్లను ఉపయోగించుకోవాలి. “


  “ మరిన్ని క్రొత్త variants రాకుండా నివారించాలంటే , vaccination మరింత త్వరగా ... మరింత ఎక్కువమందికి చేరేవిధంగా ఉండాలి . అలా చేస్తే ప్రజలు వైరస్ బారినపడటం తగ్గుతుంది మరియు క్రొత్త variants యొక్క బెడద తగ్గుతుంది . కారణం , ఎక్కువమంది ప్రజలు vaccination చేయించుకుంటే , సమాజంలో వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం ఆగిపోతుంది , తద్వారా ఉత్పరివర్తనం ( mutation ) జరిగే ఆస్కారం చాలా వరకు తగ్గిపోతుంది.”


  (  url:    who.int/news-room/feature-stories/detail/the-effects-of-virus-variants-on-Covid-19-vaccines).



విన్నపం : 


ప్రజలందరికీ vaccination అందించడం ద్వారా ఈ కోవిడ్ వైరస్ దాడి నుండి ( 3rd / 4th /5th … వేవ్ ల ) నుండి దేశాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో సుప్రీం కోర్టు ఎంతో తెగువను ప్రదర్శించింది మరియు అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రతిస్పందించి,   దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ అందించడం ... కేంద్ర ప్రభుత్వం తన భాద్యతగా స్వీకరించింది .   ఇటువంటి పరిస్థితులలో , బుద్ధిపూర్వకం గా , vaccination కు వ్యతిరేకంగా అసత్యాలను – అబద్ధాలను – కల్పితాలను చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేవారికి మీ ఛానెల్ వేదికగా మారటం చాలా బాధాకరం. ఆ చర్చాకార్యక్రమానికి సంబందించిన వీడియో లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి .


Vaccination అనేది ప్రజలు స్వచ్చందంగా చేయించుకునేది .  అవికూడా సామూహిక రోగ నిరోధకశక్తి ( herd immunity )  స్థాయికి రావాలంటే 70% పైగా జనాభా కు vaccination జరగాలి . వాక్సిన్ గురించి misinformation ఇవ్వటం వలన , ప్రభుత్వాలు ఉచితం గా వాక్సిన్ ఇచ్చినా సరే,  ప్రజలు ముందుకురారు . ఇందుకు ఎన్నో ప్రాంతాల , దేశాల అనుభావాలే ఉదాహరణలు గా చెప్పవచ్చు .    

   

మీరు ఇటువంటి చర్చా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు .... మరింత బాధ్యతాయుతంగా వ్యహరించాలి . హైదరాబాద్ లోని CCMB లో పనిచేసిన నిపుణులనో , genetics రంగంలో అనుభవం ఉన్నవారిని లేదా epidemiologist లను , WHO లో వివిధ vaccine ప్రోగ్రామ్స్ లో పనిచేసిన అనుభవం ఉన్నవారినో .... చర్చలో పాలుపంచుకొనేటట్లుగా చూడండి . దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు ... రాజకీయ చర్చలకు , vaccination గురించిన చర్చలకు చాలా వ్యత్యాసం ఉంది . ఈ వ్యత్యాసాన్ని గ్రహించి ... మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. 


ఇట్లు ,


డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ . DNB (Gen.Med), MRCP (UK).


అనుబంధం :- 24 పేజీ ల pdf లో 5 annexure లు ఉన్నాయి.

కీలక పాత్ర

 క్రైస్తవ మత వ్యాప్తి లో భాగంగా  ఒక క్రైస్తవ మిషనరీని అస్సాంకు పంపారు. ఆ క్రైస్తవ మిషనరీ క్రైస్తవ బోధకుడు  పేరు క్రజ్.  అతను అస్సాంలోని ఒక ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన ఒక అబ్బాయికి ఇంగ్లీష్ నేర్పడానికి వెళ్ళాడు( అప్పటిలో ధనవంతుల ఇళ్ళలో ఇంగ్లీష్ నేర్పే సాకుతో ఆ కుటుంబాలకు దగ్గర అవి క్రైస్తవంలోకి దించేవారు ) .  పాస్టర్ నెమ్మదిగా ఇంటిని అధ్యయనం చేయడం ప్రారంభించాడు, ఆ కుంటుబంలో బాలుడి అమ్మమ్మ ఇంట్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని తెలుసుకున్నాడు.


'అమ్మమ్మ మనస్సును క్రైస్తవం వైపుకి మార్చడం వలన మొత్తం కుటుంబాన్ని కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని గ్రామమంతా క్రైస్తవంలోకి మార్చాలి ' అని ఆయన అనుకున్నాడు


పాస్టర్ బామ్మగారికి చెప్పడం ప్రారంభించాడు.  కుష్ఠురోగుల కుష్టు వ్యాధిని యేసు ఎలా నయం చేశాడు, అంధులకు ఎలా దృష్టి పెట్టాడు అని...


కానీ సనాతన ధర్మాన్ని నిష్ఠతో ఆచరించే అమ్మమ్మ "మా రాముడు రాయిని తాకినప్పుడు ఒక రాయి సజీవ మహిళగా (అహల్య) మారిపోయింది అని మరియు రామ సేతు గురించి మాట్లాడింది మరియు రాముడి పేరుతో ఎంత ప్రభావితమైంది, లంకా మార్గంలో సముద్రపు నీటిలో రాళ్ళు తేలుతున్నాయి  , మరియు అవి నేటికీ తేలుతున్నాయి. "అని చెప్పేది


  పాస్టర్ తన ప్రయత్నాలను కొనసాగించాడు కాని అతని ఉపాయాలన్నీ ఫలించలేదు.


ఒక రోజు అతను చర్చి నుండి ఒక కేక్ తెచ్చాడు, అమ్మమ్మ కేక్ తినదని అతను నమ్మాడు.  కానీ అతని నిరీక్షణకు విరుద్ధంగా ఆమె కేక్ తీసుకొని తిన్నది.


ఆమె కేక్ తినడాన్ని విజయంగా భావించి, పాస్టర్ ఆమెతో 'అమ్మమ్మ, మీరు చర్చి యొక్క ప్రసాదము తిన్నారు,  మీరు ఇప్పుడు ఒక క్రిస్టియన్ మరియు మీ పేరు ఆడ్రీ.  నేను నిన్ను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాను "అని ఆయన అన్నాడు. 


అమ్మమ్మ పూజారిని చెవికి లాగి," మీరు పెద్ద గాడిదలాగా ఉన్నరే మరియు మీలాగే మీ మతంలో ఉన్నవారు కూడా ఉన్నారా అంటూ.  


నేను కేక్ ముక్క తినడానికి క్రిస్టియన్ అయితే.  నేను ప్రతిరోజూ నా ఇంటి నుండి మీకు ఆహారం ఇస్తున్నాను కాబట్టి మీరు హిందువు ఎందుకు కాకూడదు?  మీరు మేము దేవునిగా కొలిచే ఈ హిందు భూమి యొక్క ఆహారం రోజు తింటున్నారు, గాలి పిలుస్తున్నారు మరియు నీటిని తాగుతున్నారు, అప్పుడు మీరు ఈ తర్కం ద్వారా చాలా కాలం క్రితం హిందువు అయ్యారు అనే సారికి పాస్టర్ ఎమ్ మాట్లాడాలో తెలియక బిక్కమొహం వేసాడు. "


అమ్మమ్మ అయినా గొప్ప మహిళ తన కుటుంబాన్ని దేశాన్ని తప్పుదారి పట్టించకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించింది మరియు చాలా మంది అస్సామీలను దారితప్పకుండా నిరోధించింది.  ఆమె పేరు # కమలా_దేవి_హజారికా ", అస్సాం యొక్క ప్రసిద్ధ విప్లవకారిని మరియు రచయిత