30, ఆగస్టు 2023, బుధవారం

భూచక్రగడ్డ విశేషాలు -

 భూచక్రగడ్డ విశేషాలు  -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను  ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు.  నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


   

   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

తుం గ భ ద్రా న ది

 శు భో ద యం!👏👏

              చొప్పకట్ల.


తుం గ భ ద్రా  న ది

...........................


గంగా సంగమ మిచ్చగించునె, మదిన్  కావేరి  దేవేరిగా 

అంగీకారమొనర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, 

రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాక రేంద్రుండు నీ 

అంగంబంటి సుఖించునేని, గుణభధ్రా తుంగభద్రా నదీ!


తెనాలి రామకృష్ణ కవి

పాండురంగ మాహాత్మ్యము

ప్రథమాశ్వాసం

139 వ పద్యం


తెనాలి రామకృష్ణ కవి తుంగభద్రానదిని స్తుతిస్తున్నాడు. 


ఓ తుంగభద్రా నదీ!

నీవు గుణభద్రవు, నీవు సముద్రునితో కలవడం లేదు. ఒకవేళ, తన ఉత్తుంగ తరంగ హస్తాలతో రత్నాకరేంద్రుడైన సముద్రుడు నీ స్పర్శా సౌఖ్యాన్ని గనక పొంద గలిగి వుంటే, అతడు తానిప్పుడు అనుభవిస్తున్న గంగాసంగమాన్ని ఇష్టపడతాడా? కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందాన్ని పొందుతాడా? 

అవేవీ ఆ నదులతో పొందబోడని పద్యభావం.


ఈ పద్యంలో సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు రెండు - గంగ, కావేరి. అట్లా కలవని ఉపనదులు రెండు - యమున, తుంగభద్ర. తక్కిన నదీ సముదాయాన్ని కవి పేర్కొనడం లేదు. యమున శాఖానది. త్రివేణి వద్ద గంగతో సంగమిస్తుంది. కాకపోతే, సముద్రుడు యమునతో కూడా ఆనందాన్ని పొందుతున్నాడని వక్కాణిస్తున్నాడు. అంటే, యమునానది, గంగతో బాటు రహస్యంగా ప్రవహించి, సముద్రునితో రహస్య దాంపత్యం నెరపుతున్నదని కవి భావం. అందుకే యమునతో "ఆనందమున్ పొందునే" అంటున్నాడు.

 

విశ్వనాథ వారు ఈ పద్యం గురించి రాస్తూ ఇట్లా అంటారు: "యమున ప్రయాగ వద్ద గంగతో కలిసి ఆమె వెనక దాగికొని వెళ్ళుచున్నది. గంగకు కూడా తెలియకుండా వెళ్ళు చున్నదేమో! సముద్రునకు యమున తోడి సంగమం చాల రహస్య సంగమం. అందుచేత అతడధికమైన సుఖాన్ని పొందుచున్నాడు. అందుకనియే గంగా కావేరుల విషయంలో ఉపయోగించి ఆనంద శబ్దమును వాడినాడు. గంగా కావేరితో సంసారం చేయుచున్నాడు. యమునతో ఆనందమును పొందుచున్నాడని అర్థము" .


ఇది విశ్వనాథవారి వ్యాఖ్య. మరి తుంగభద్ర విషయం? ఆ నది సముద్రునితో రహస్య కాపురం చెయ్యడం లేదని, ఒక్కసారి గనక తుంగభద్రా సౌఖ్యం సముద్రునికి కలిగితే, యమునను పరిత్యజించి, తుంగభద్ర తోనే ఆనందాతిరేకాన్ని పొందుతాడనీ కవి తాత్పర్యం.


ఇదంతా రామకృష్ణ కవి పద్యరచనలో చూపించే గడుసుదనం.


శబ్ద సౌందర్యంలో ఈయన ఎవరికీ తీసిపోడు. ఈ పద్యంలో తుంగభద్ర పొంగులను చూపడానికి శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు. ఇతర నదులను వర్ణిస్తున్నా ఆయన ధ్యాస తుంగభద్ర పైనే. అందుకే అందుకు అనుగుణమైన పాదప్రాసను ఎన్నుకున్నాడు. గంగాసంగమము, అంగీకార మొనర్చడము, రంగత్తుంగ తరంగ హస్తాల సముద్రుడు, అంగంబంటి సుఖించడము - తుంగభద్రానదిని స్ఫురింపజేసే శబ్దాలు ఇవన్నీ. 

All the sounds that rhyme with the spelling of Tungabhadra.


ఇవి గాక, కావేరి దేవేరి కావడము, తుంగభద్ర గుణభద్ర కావడమూ, ఈ ప్రాసా సౌందర్యాలన్నీ ఒలకబోసి, మీదికి లంఘించే శార్దూల పద్యంలో సముద్రుడు, కనీసం భావనా ప్రపంచంలో నైనా తుంగభద్రను తన ఉత్తుంగ తరంగ హస్తాలతో గాఢ పరిష్వంగంలో చేర్చుకొక పోతాడా అనే భ్రమను సృష్టిస్తాడు.


 ( మోహన్ గారి సుదీర్ఘవ్యాసంలో ఇది కొంతభాగం మాత్రమే!)


అక్టోబర్ 1971 - నివర్తి మోహన్ కుమార్


 


👏🌸🌷🌷💐💐🌷🌷🌷👏🌷🌷💐

A


 

భూజనసురభాష

 *1866*

*కం*

భూజనసురభాష కరణి

తేజములొందెడి గతులను తీరిన తెలుగున్

ఓజులు సైతము విడిచిన

నోజమ్ములు తగ్గబోవు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భూజనులకు దేవభాషవలె వెలుగొందేవిధంగా సంస్కరించబడిన తెలుగు ను ఉపాధ్యాయులు (ఓజులు) కూడా విడిచిపెట్టి ననూ దాని ప్రకాశములు(ఓజములు) ఈ భువిలో తరగవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ రాజీవ్ లోచన్ Temple

 🕉 మన గుడి 


⚜ ఛత్తీస్‌గఢ్ : రాజిమ్ (రాయపూర్)






⚜ శ్రీ రాజీవ్ లోచన్ Temple


💠 రజిమ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని ప్రయాగ్ అని పిలుస్తారు.  నదులు, అందమైన దృశ్యాలు మరియు దేవాలయాలు ఈ మూడింటిని ఒకే చోట చూడాలనుకుంటే, ఖచ్చితంగా రజిమ్‌కు రండి. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది.  


💠 ఇది గరియాబంద్ యొక్క ఈశాన్యంలో మహానది యొక్క కుడి ఒడ్డున ఉంది, ఇక్కడ పరి మరియు సొంధూర్ అనే దాని ఉపనదులు కలుస్తాయి. 

మహానది, పారి నది మరియు సొంధూర్ నది సంగమించడం వల్ల దీనిని ఛత్తీస్‌గఢ్ త్రివేణి సంగమం అంటారు.  ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ నుండి మహాశివరాత్రి వరకు ఇక్కడ భారీ జాతర జరుగుతుంది.  


💠 సంగం మధ్యలో కులేశ్వర్ మహాదేవ్ యొక్క భారీ ఆలయం ఉంది. 

శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మహాదేవ్‌ను పూజించాడని నమ్ముతారు.  

ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కూడా కమల క్షేత్రం.


💠 రాజిమ్‌లో అనేక ప్రధాన ఆలయాలు మరియు ఆకర్షణీయ కేంద్రాలు ఉన్నప్పటికీ.  అయితే ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ప్రసిద్ధ రాజీవ్ లోచన్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం.  


💠 రాజీవ్‌లోచన దేవాలయం చతుర్భుజంగా నిర్మించబడింది.  ఇది శంఖం, చక్రం, గద మరియు పద్మాలతో నల్లరాతితో చేసిన నాలుగు చేతుల శ్రీ మహావిష్ణువు విగ్రహం. 


💠 ప్రజల విశ్వాసాల ప్రకారం, రాజీవ్ లోచన్ ఆలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు.

రాజీవ్ లోచన్ దేవాలయం ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు హస్తకళల యొక్క ఏకైక సంగమం.  ఈ ఆలయంలో విష్ణువు విశ్రమిస్తాడని ప్రజల నమ్మకం.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠 ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది.  

ఈ ఆలయం లోపల 1197  యొక్క శాసనం ఉంది . ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కమల క్షేత్రం.  విశ్వం ప్రారంభంలో విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం ఇక్కడ ఉందని మరియు బ్రహ్మా ఇక్కడ నుండి విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు, అందుకే దీనికి కమలక్షేత్రం అని పేరు వచ్చింది.  ప్యారీ నది, సొంధూర్ నది మరియు మహానది సంగమం అయిన రజిమ్ ఛత్తీస్‌గఢ్ యొక్క ప్రయాగగా పరిగణించబడుతుంది.  

ఈ స్థలంలో అస్తికల నిమజ్జనం మరియు పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు మరియు పిండతర్పణం నిర్వహిస్తారు.


💠  రాజీవ్‌లోచన్ దేవాలయంలో ఉత్తరం మరియు దక్షిణంలో ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మహామండపం మధ్యలో గరుడుడు ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. గర్భగుడిలో, రాజీవ్లోచన్ అంటే సింహాసనంపై విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ విగ్రహం నల్లరాతితో చేసిన చతుర్భుజి విష్ణుమూర్తి. శంఖ, చక్ర, గద, పాదములను చేతిలో ఉన్నవాడు, లోచన నామముతో పూజింపబడువాడు. ఆలయానికి రెండు వైపులా పరిక్రమ మార్గం ఉంది.

మహామండపం పన్నెండు రాతి స్తంభాలతో నిర్మించబడింది.


💠 ఉత్తరం వైపున ఉన్న ద్వారంలోంచి బయటకు వస్తే సాక్షి గోపాల్‌  ఆలయం కనిపిస్తుంది. తరువాత, చుట్టూ నరసింహ అవతారం, బద్రీ అవతారం, వామనావతారం, వరాహ అవతారం ఉప ఆలయాలు ఉన్నాయి.


💠 రెండవ ప్రకారంలో రాజరాజేశ్వర్, సతీ మాత ఆలయం ఉన్నాయి.

దీని తరువాత నదుల వైపు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఇక్కడి ద్వారం పశ్చిమ దిశలో ఉన్న ప్రధాన మరియు పురాతన ద్వారం. దానిపై రజిమ్ పురాతన పేరు కమలక్షేత్ర పద్మావతి పూరి అని వ్రాయబడింది.


💠 నది ఒడ్డున భూతేశ్వర్ మరియు పంచేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయాలు ఉన్నాయి మరియు త్రివేణి మధ్యలో కులేశ్వర్ నాథ్ మహాదేవ్ యొక్క శివలింగం ఉంది.


💠 రాజీవ్‌లోచన్ దేవాలయం ఇక్కడి దేవాలయాలన్నింటిలో కెల్లా పురాతనమైనది.


💠 రాజీవ్‌లోచన ఆలయంలో ఒక మూలలో, గజరాజు తన తొండంతో తామరపువ్వును పట్టుకొని ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయి.

గజేంద్ర మోక్షాన్ని గుర్తుకు చేస్తూ గజరాజు పుష్పాలతో చతుర్భుజడైన శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తున్న విగ్రహం దేశంలో ఇంకా ఎక్కడ ఉండదు. ఇది ఇక్కడి విశేషం.


💠 దీని గురించి ప్రముఖ కథనం ఇలా ఉంది : మొసలి చేత హింసించబడిన గజరాజు తన తొండంతో తామర పువ్వును పట్టుకుని రాజీవ్ లోచన్‌కు అందించాడు. ఈ తామర పువ్వు ద్వారా, గజరాజు తన బాధనంతా విష్ణువు ముందు విన్నవించాడు. ఆ సమయంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహాలక్ష్మి అతని పాదాలను నొక్కుతోంది. గజరాజు బాధను చూసిన దేవుడు వెంటనే లేచి చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ ప్రస్తుతం రాజీవ లోచన ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకుని గజరాజును రక్షించాడు. గజేంద్రమోక్ష ఘట్టం ఈ ప్రదేశంలోనే జరిగింది అని ఈ ప్రాంత వాసుల నమ్మకం.


💠 త్రివేణి సంగమం మధ్యలో ఉన్న "కులేశ్వర్ మహాదేవ్" ఆలయం, దాని మహామండపం దగ్గర ఒక శాసనం ఉంది, దాని ప్రకారం ఈ ఆలయం 8-9వ శతాబ్దంలో నిర్మించబడింది . ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ దేవాలయం సజీవ సాక్ష్యం. 


💠 రైలులో : రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి 50 కి.మీ.

నీలిరంగు చందమామ

 🎻🌹🙏నేడు నీలిరంగు చందమామ  ఆవిష్కృతం..!!



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హైదరాబాద్ :ఆగస్టు 30

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. 


🌸బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.


🌿ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. 


🌸నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..


🌿కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. 


🌸సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు.


🌿 సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..స్వస్తి.. సేకరణ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్రువబేరం:*


తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. 


మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


 నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.



 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


 నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ

, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


 ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి



వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి.


నాగేంద్రభూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసిమాలప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 27*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 27*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


.               *ఆధ్యాత్మిక అనుభూతి*


1.ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలను ధ్రువీకరించడానికిగల ఒకే మార్గం ప్రత్యక్ష అనుభవమే. శాస్త్రాలు సంకేత ఫలకాలలా ఈ సత్యాలను సూచించ గలుగుతాయేగాని వాటిని నిరూపించలేవు. వర్షం ఎప్పుడు పడుతుందో పంచాంగం తెలుపుతుంది. అలాగని పంచాంగాన్ని పిండితే ఒక చుక్కనీరు కూడా రాదు.


2. ఆధ్యాత్మిక అనుభవాలకు హద్దులు లేవు. కనుక పొందిన అనుభవాలతో తృప్తిచెంది ఆగిపోకుండా ముందుకు సాగాలి.


 3. కుండలినీ శక్తి జాగృతమయినప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి.


4. ద్వైతం కాని స్థితియైన అద్వైతానుభవమే అత్యంత ఉన్నతమైన అనుభవం.


5. కాని అద్వైతం చరమ అనుభూతి కాదు. అద్వైత అనుభవం పొందిన కొందరు మళ్లీ సామాన్య స్థితికి వస్తారు. వారు సర్వత్రా భగవంతుణ్ణి చూస్తారు, ఆ భగవదానందంలోనే జీవిస్తారు. ఈ స్థితి 'విజ్ఞానం' అనబడుతుంది. ఈ స్థితిని పొందిన వ్యక్తిని 'విజ్ఞాని' అని పేర్కొంటారు. ఆ వ్యక్తి భగవంతుడు (నిత్యం), జగత్తు (లీల) రెంటినీ సత్యంగా దర్శిస్తాడు.


6. ఎన్నడూ బద్ధుడుకాని, సదా ముక్తి స్థితిలోనే నెలకొనివున్న వారుకొందరున్నారు.

నిత్యముక్తులయిన వీరు భగవంతుడు అవతరించే తరుణంలో ఆయనతో బాటే జన్మించి, ఆయన అవతార కార్యానికి తోడ్పడతారు. వీరిని ఈశ్వర కోటులుగా పేర్కొంటారు.


శ్రీరామకృష్ణులు వీటిని బోధించడంమే కాక సత్యాలను ధ్రువీకరించడానికి కొందరి జీవితాలను రూపొందించి నిష్క్రమించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹