23, ఆగస్టు 2024, శుక్రవారం

*శ్రీ మహంకాళి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 418*


⚜ *కర్నాటక  :- అంబలపడి - ఉడిపి* 


⚜ *శ్రీ మహంకాళి ఆలయం*







💠 చెడును నాశనం చేయడానికి మరియు మానవాళిని రక్షించడానికి భూమిపైకి వచ్చిన దేవతలు గురించి హిందూ పురాణాలలో అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. అటువంటి సంఘటనలు జరిగినట్లు చెప్పబడే అనేక ప్రదేశాలు అప్పటి నుండి ఎంతో గౌరవించబడ్డాయి మరియు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి. 


💠 ఉడిపికి సమీపంలోని అంబల్‌పాడి

మహంకాళి జనార్దన దేవాలయం అలాంటి వాటిలో ఒకటి.


💠 శక్తి (మాతృ దేవత) పూజించబడే చాలా దేవాలయాలలో శివుడు కూడా పూజించబడతాడు, అయితే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో మరొక లక్ష్మీ జనార్దన్ ఆలయం కూడా ఉంది.  

అంబల్‌పాడి అనే పేరు అంబా అంటే తల్లి మరియు పాడి అంటే స్థానిక భాష తుళులో "కొండ శిఖరం" నుండి వచ్చింది. 



💠 తుళులో 'పాడి' అంటే కొండ లేదా అడవి (ఉడిపి స్థానిక భాష). అంబల్‌పాడి అనే పేరు అమ్మనా పడి (అమ్మ అడవులు) అని అర్థం.


💠 శ్రీ కృష్ణ భగవానుడి భూమి అయిన ఉడిపి నగర పరిసరాలలో అంబల్పాడి ఒక పవిత్ర ప్రదేశం . 

పక్కనే మహాకాళీ మందిరం, ముందు భాగంలో జనార్దన పుష్కరిణి, ముఖ్యప్రాణ అవతారాలతో కూడిన ఆంజనేయ దేవాలయం, పరిసరాల్లో రాఘవేంద్ర స్వామీజీ యొక్క బృందావనం ఉన్న పురాతన శ్రీ జనార్దన దేవాలయం ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.

కర్ణాటక రాష్ట్ర తీర ప్రాంతంలో తూర్పున శ్రీకృష్ణ దేవాలయం మరియు పశ్చిమాన శ్రీ మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహాన్ని పొందిన పవిత్ర బీచ్‌తో, అంబల్పాడి ఉడిపి బస్టాండ్ నుండి 2 మైళ్ల దూరంలో ఉంది.


💠 శ్రీకృష్ణుడు పడమర ముఖంగా ఉంటే, అంబల్‌పాడులో జనార్దనుడు తూర్పు ముఖంగా ఉన్నాడు.  అంబల్‌పాడుకు జనార్దనుడు పీఠాధిపతి

అతని ఆగ్నేయంలో మహంకాళి దేవత ఉంది , ఆమెను ఎక్కువ ఉత్సాహంతో పూజిస్తారు. పిల్లలు తమ తండ్రి కంటే ఎక్కువగా తల్లి వద్దకు వెళ్లి సహాయం కోసం తల్లిని ఒప్పుకోవడం వలన ఇది సర్వసాధారణం. అదే నమ్మకంతో, భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మరియు వారి సమస్యలకు పరిష్కారం పొందడానికి మహాకాళి దేవి వద్దకు వస్తారు. 


💠 ఇక్కడ ఆమె ఆధిపత్యానికి మరో కారణం కూడా ఉంది. భూమిని రక్షించడానికి ఆమె ఇంతకు ముందు ఈ ప్రాంతానికి వచ్చింది మరియు ఆమె కారణంగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

అంబల్పాడి 'అమ్మన పడి', లేదా 'అమ్మల అడవులు'.

 ప్రారంభంలో మహాకాళి దేవత ఒక రాతిలో పూజించబడిందని నమ్ముతారు. 

 మహాకాళి చెక్క విగ్రహంతో పాటుగా ఇప్పుడు కూడా అదే రాయిని పూజిస్తున్నారు. 

ఆ విధంగా, ఈ ప్రాంతంలో పూర్వం మహంకాళిని పూజించారు మరియు జనార్దన స్వామి దేవతను వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చి ఇక్కడే ఉండి భక్తులను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. 


🔆 చరిత్ర 🔆


💠 ప్రచారం లో కథ ప్రకారం, ఈ ప్రదేశాన్ని రక్షించడానికి మహంకాళి దేవి ఇక్కడ నివసించడానికి భూమిపైకి దిగింది.

 దేవతని వెతుక్కుంటూ వచ్చిన విష్ణువు లేదా జనార్దనుడు ఇక్కడ నివసించాలని నిర్ణయించుకున్నాడని మరియు అతను గ్రామంలో ఉన్న సమయంలో భక్తులను దెయ్యాల నుండి రక్షించాడు. 

అందువలన, అంబల్పాడు ప్రజలు అమితంగా ప్రేమించే మరియు గౌరవించే అంబల్పాడు యొక్క ప్రధాన దేవతగా జనార్దనుడు అయ్యాడు. 

అప్పటి నుండి, అంబల్‌పాడి దేవాలయాలలో జనార్దన్‌తో పాటు మాతా మహాకాళిని కూడా పూజిస్తారు. 


💠 ఈ ఆలయాన్ని అంబల్పాడి మహంకాళి జనార్దన దేవాలయంగా పిలుస్తారు.ఆలయ నిర్మాణం తీరప్రాంత ఆలయ శైలిని అనుసరిస్తుంది. 

జనార్దన పుష్కరిణి (ఆలయ చెరువు) కుడివైపున ఉన్నందున, ఆలయ ప్రవేశ ద్వారం విశాలంగా ఉండి ప్రముఖంగా కనిపిస్తుంది. 


💠 నేరుగా ఎదురుగా ఉన్న జనార్ధన ఆలయం చాలా పెద్దది మరియు గంభీరమైనది. మహాకాళి ఆలయం దాని ఎడమ వైపున ఉంది. 


💠 గర్భగుడిలో మహాకాళి చెక్క విగ్రహం 6 అడుగుల ఎత్తు ఉంటుంది.

దర్శనానంతరం, చుట్టూ అన్వేషిస్తే, అయ్యప్ప స్వామికి అంకితం చేయబడిన చిన్న ఆలయాలు మరియు కుడివైపున ఉన్న నవగ్రహాలు కనిపిస్తాయి. 

మహంకాళి దేవాలయం ముందు రాఘవేంద్ర స్వామి సృష్టించిన బృందావనం అని చెప్పబడే అందమైన ఉద్యానవనం. వివిధ జంతువులు, గురువులు మొదలైన  విగ్రహాలతో అలంకరించబడిన ఈ ఆకర్షణీయమైన ఉద్యానవనం దృశ్యమానంగా ఉంటుంది. 


💠 అంబల్పాడి ఆలయంలో చేసే కొన్ని పూజలు తీర్థ స్నానం, కుంకుమార్చన, పంచామృత అభిషేకం, సప్తశతి పారాయణ, చండికా హోమం, రక్షా యంత్రం, మహాపూజ మొదలైనవి.


💠 ఈ ఆలయం యొక్క ప్రత్యేకత "ఒరాకిల్" ఇక్కడ మాతృ దేవత పత్రి అనే వ్యక్తి ద్వారా భక్తులతో మాట్లాడుతుంది. 

ఇది ప్రతి శుక్రవారం సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది.

 ఈ సందర్భంగా ప్రజల వ్యక్తిగత సమస్యలను విని వాటికి పరిష్కారం చూపుతారు.


💠 అంబల్పాడి ఉడిపి బస్టాండ్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది

పెద్దన్నయ్య

 జీవితం మంచికధ*

*పెద్దన్నయ్య*

"దివాకర్. మీ అన్నయ్య వస్తున్నాడు" పక్కసీట్లోని అక్కౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్.

బ్యాంకు గేటునుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి.

బ్యాంకు స్టాఫ్ కొంతమంది శివరాంను చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు. కొంతమంది పలకరిస్తున్నారు.

శివరాం తన దగ్గరికి రాగానే "కూర్చో అన్నయ్యా" అన్నాడు దివాకర్.

శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది.

"ఏమిటి.. ఇలా వచ్చావు..? బ్యాంకులో ఏమైనా పనిబడిందా..?" దివాకర్ అడిగాడు.

"మీ వదిన చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతూంది. ఈరోజు స్పెషలిష్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను. ఆపరేషన్ చేయాలన్నారు" అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ.

"ఎంతవుతుందట..?"

"యాభైవేలు అవుతుందని చెప్పారు"

కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్. తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి "చూద్దాం అన్నయ్యా., నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మంచి సర్జన్లు కూడా. వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను" అన్నాడు.

"ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు"

దివాకర్ ఇబ్బందిగా చూసి "ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్యా. పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడుతాను" అన్నాడు.

"అలాగే.. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు., మనం తర్వాత మాట్లాడుకుందాం.." అంటూ లేచాడు శివరాం.

అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరాంని చూసి "నమస్తే సార్., నేను కుమార్ ని. సంతపేట హైస్కూల్ లో మీ శిష్యుణ్ణి" అన్నాడు రెండుచేతులూ జోడించి.

"నీ పేరు గుర్తులేదుగానీ నువ్వు గుర్తున్నావు..  బాగున్నావా..?" ఆప్యాయంగా అడిగాడు శివరాం.

"బాగున్నాను సార్..! ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాను. రాగానే దివాకర్

సార్ ని మీ గురించి అడిగాను., కూర్చోండి సార్.. టీ తాగి వెళుదురుగాని" అంటూ బాయ్ ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్.

"ముందు కాస్త మంచినీళ్ళు ఇప్పించు కుమార్" అభ్యర్థనగా అడిగాడు శివరాం. కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు.

టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూండిపోయాడు దివాకర్.

"టీ ఆఫర్ చేయాలని ఆ పాతశిష్యుడికి తోచిందిగానీ, తనకెందుకు తోచలేదు..?, ఎండనపడి వస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు..?" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు.

     *          *          *           *

ఆరోజు సాయంత్రం మారుతీ కారు షోరూం నుంచి వచ్చిన రిప్రెజెంటేటివ్ దివాకర్ ని కలిశాడు.

"రేపు మీరు డ్రాఫ్ట్ సిద్దం చేసుకున్నారంటే.. ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది" అన్నాడు దివాకర్ తో.

"అదేం పెద్ద పని కాదు., బ్యాంకు లోన్ తీసుకుంటున్నాను. కాబట్టి ఓచర్లు నింపడమే నా పని. నా మార్జిన్ ఎలాగూ సిద్దంగా ఉంది" అన్నాడు దివాకర్.

రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అక్కౌంటెంటు వేణు వచ్చి "ఎప్పుడు కొంటున్నావు కారు..?" అని అడిగాడు, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

"రేపు లోన్ కోసం ఆప్లై చేస్తాను. ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు"

కాసేపు కారు రంగు, మోడల్, రేటు గురించి మాట్లాడుకున్నాక

"మీ అన్నయ్య ఈరోజు ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు. చాలా డల్ గా కనిపించారు" అన్నాడు వేణు.

"అవును. మా వదినకు ఆపరేషన్ చేయాలట. అందుకు యాభైవేలు..."

దివాకర్ మాట పూర్తికాకముందే "మీ అన్నయ్య వస్తున్నారు. నూరేళ్ళు ఆయుస్సు ఆయనకు..!" అన్నాడు వేణు గేటువైపు చూస్తూ...!

దివాకర్ తలెత్తి చూశాడు. శివరాంని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది.

"నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు" అన్నాడు

వేణుతో.

"నేనెందుకు ఎత్తుతాను" అంటూ వేణు తనసీటుకు వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.

దివాకర్ ని చూసి శివరాం నవ్వుతూ "ఈ రోజు పని పూర్తయిందా..?" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

"పని ఇంకా పూర్తికాలేదు. నేను ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా.. మళ్ళీ నువ్వు రావడం ఎందుకు..? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది. కానీ, నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు..?"

దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా.. అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం..

"సారీరా..! నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం...!"

శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు. వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు. అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది.

    *         *         *           *

దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి "శివరాం బావగారు ఫోన్ చేశారు" అని చెప్పింది.

"ఎన్ని గంటలకు చేశాడు"        విసుగ్గా అడిగాడు శివరాం.

"ఏడు గంటలకు చేశారు. అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు. మీరు బ్యాంకునుంచి వచ్చారా... అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను.."

"బ్యాంకుకు వచ్చి మాట్లాడాడ్లే. వదిన ఆపరేషన్ కు యాభైవేలు కావాలని అడిగాడు.."

"మీరేమని చెప్పారు?"

"ఆలోచించి చెబుతానన్నాను"

"బాగా ఆలోచించండి. ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు. యాభైవేలు మరి ఆయన ఎలా తీరుస్తారు?"

"అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"

"అయిదో, పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి.."

"కానీ మనం కారు కొంటున్నాం"

"కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి. ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి"

"అలాగే చెప్తా. నాకు కాస్త త్రాగడానికి మంచినీళ్ళివ్వు" అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్..

       *           *         *         *

మరుసటి రోజు బ్యాంకు లోన్ తీసుకోవడం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం, తర్వాతి రోజు కారును ఇంటికి తీసుకురావడం, గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్.

ఆరోజు ఆదివారం కావడంతో క్రొత్తకారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్ళాడు. శివరాం ఇల్లు తాళంవేసి ఉండటంచూసి ఆశ్చర్యపోయాడు. శివరాం ప్రక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు.

దివాకర్ ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ. అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచిలో పనిచేస్తున్నాడు.

"చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. నాకు చాలా అనందంగా ఉంది" అన్నాడు రామకృష్ణ.

"నాకూ అలాగే ఉంది. కొత్తకారు కొన్నాను. నీకూ, అన్నయ్యకూ చూపిద్దామని తెచ్చాను"

"అలాగా...కంగ్రాట్స్"

"అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా..?"

"నీకు తెలుసో, తెలియదో నాకు తెలియదుగానీ... మీ వదినగారికి ఈమధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు.."

"ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు. చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు"

"ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. మీ అన్నయ్య స్టూడెంటు ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని, తను ఆ కేసులో స్పెషలిష్టుననీ, తన హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోమనీ, మందులూ ఇతర ఖర్చులూ భరిస్తే ఆపరేషను తను ఫ్రీగా చేస్తాననీ చెప్పి, వాళ్ళను ఒప్పించి, తనతోపాటే కారులో చెన్నై పిలుచుకెళ్ళారు. మీ అన్నయ్య తరచూ అంటూండేవాడు "బీ గుడ్.., డూ గుడ్.., హి విల్ డూ గుడ్..," అని..! ఆ మాట ఆయన విషయంలో నిజమైంది.  ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు" అన్నాడు. రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ "మీ ఆవిడ ఇంట్లో లేరా..?" అని రామకృష్ణని అడిగాడు దివాకర్. "లేదు. మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందనీ, మీ వదిన బాగున్నారనీ చెప్పింది.."

"తను ఊర్లో ఉండీ వాళ్ళకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో..?" అనుకున్నాడు దివాకర్. ఆ తర్వాత "అన్నయ్య ఆపరేషన్ కు డబ్బు అడిగాడు. రెండురోజుల్నుంచీ రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు. ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను.. వాళ్ళు లేరు" అన్నాడు నిరుత్సాహంగా.

"రాలేకపోయానని చెప్పు, ఒప్పుకుంటాను కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా., స్నానం చేస్తున్నావా., భోజనం చేస్తున్నావా., కరెంట్ బిల్లు., టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా..? ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెస్తున్నావా., నీ భార్యకు, పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావా..? మరి., వీటికి సమయం ఎక్కడనుంచి వచ్చింది నీకు..? అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడంలేదు. నీకు గుర్తుందా.. మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకుచిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు. అదృష్టవశాత్తూ ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన్ను చూస్తూంటే నాకేమనిపించేదో తెలుసా..?

"మనుషులు-నా బిడ్డ ఇంజనీర్ కావాలి., డాక్టర్ కావాలి., ఇంకోటి కావాలి. అని కోరుకుంటారు కానీ.. నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి.. అని ఎందుకు కోరుకోరు..?' అనిపించేది. మంచి పొరుగువారివల్ల ఇరుగుపొరుగు వాళ్ళకు ఎంత లాభమో మీ అన్నావదినలద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి., వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి., కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్విప్పుడు మరచిపోయినట్లున్నావు దివాకర్., ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి..? ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు. ఈ మూడేళ్ళలో ఎంత మార్పు నీలో..? దీనికి కారణం ఏమై ఉంటుంది..? నీ ప్రొమోషనా..? లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా..? మీ అన్నయ్య కూడా నీలాగే "నేనూ, నా భార్యాపిల్లలూ" అని గిరిగీసుకుని ఉండుంటే మీరంతా ఎక్కడుండేవారో అలోచించు."

దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు.

ఉన్నట్టుండి రామకృష్ణ లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఐదునిమిషాల తరువాత చేతిలో ఓ కవరుతో వచ్చాడు.

"నేను మీ అన్నయ్యవాళ్ళ ప్రక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోను చేసి చెప్పగానే, నువ్వు నాకు రాసిన ఉత్తరం ఇది. ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు. ఇది నీ గతాన్నీ, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్నీ, ఆయన నీకు చేసిన సహాయాల్నీ గుర్తుకుతెస్తుందేమో ప్రయత్నించు."

దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు.

రామకృష్ణ కారువరకూ వచ్చి "దివాకర్, డబ్బు ఎంత సంపాదించినా... అది మనకు సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఇవ్వగలదేమో గానీ, తృప్తిని ఇవ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం, కష్టాల్లో ఉంటే సహాయపడటంవల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు. నిన్ను నొప్పించి ఉంటే సారీ.. గుడ్ నైట్" అన్నాడు..

"గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్..

    *          *          *          *

"రామకృష్ణా..

నువ్వు మా అన్నయ్య ప్రక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభసందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది.

శివరాం నా సొంత అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నావాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు., ఇద్దరివి చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు. ఇది ఆడవాళ్ళకు నచ్చేది కాదు. క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఉమ్మడికుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు. పెద్దల మధ్య విభేదాలు, పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి.,

అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీనుండి ఇంటికి వచ్చాడు. ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు. నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది. ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు, జోక్స్ చెప్పి నవ్విస్తూ.. ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు. పెద్దలమధ్య కూర్చుని, వాళ్ళు చెప్పుకునే చాడీలు వింటూ, విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదనీ, చదువు చెడితే జీవితాంతం బాధపడాలనీ మాకు చెప్పేవాడు. అందరూ బాగా చదువుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చనీ, అందువల్ల తమ మధ్య విభేదాలు రావనీ, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చనీ చెప్పాడు. మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం. ఆయన చెప్పినట్లే చేశాం., తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు. వాళ్ళు ఏ పనిచెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్ళకు మాటలతోనే అన్ని విషయాలు వివరంగా తెలియజేసి వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు. త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు. పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు. అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దలమధ్య విభేదాలు దూరమయ్యాయి. కాపురాలు వేరైనా పండుగల్ని కలసి జరుపుకునేవారు. అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది.

"తనొక్కడు చదివి బాగుపడితే చాలు" అనుకోలేదు అన్నయ్య. మేమందరం కూడా చదువుకుని బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం. మాతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం. అందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం., మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని, దగ్గరుండి మరీ జరిపించాడు అన్నయ్య.

మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో నాకు తెలియదుగానీ, తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎం.ఎస్.సి.వరకు, తర్వాత ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్లేవాడు. పెదనాన్నకు ఆఫీసు పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్నీ, సోదరుల్నీ చూసి తన తండ్రి కూడా తనతోపాటే వచ్చిఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా..! అనుకునేవాడు. ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాలకోసం పోటీపరీక్షలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతోపాటుగా వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు. ఒకరకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్టియర్ లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు. నేను హర్ట్ అయి, ఇల్లు వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నాను. అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతూంటే.. ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను.

"ఎక్కడికి పోతున్నావ"ని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను.,

"పరీక్ష ఏమైందని" అడిగాడు. చెప్పాను.

"ఫరవాలేదులే., ఫస్టియరే కదా., సంవత్సరం వృధాకాదు. ఈసారి ఇంకా బాగా చదివి రాయి" అన్నాడు. నాకు ఎంతో ఆశ్చర్యంవేసింది. చదువు ప్రాముఖ్యంగురించి అంతగా చెప్పే అన్నయ్య, నా ఫెయిల్యూర్ ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు..

అన్నయ్య నా భుజంపై చెయ్యివేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు "మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు. ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు."

ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేదు. నాకు ఎంతో ఓదార్పునూ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చిన మాట అది.

తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లోనూ, డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆరోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే.. నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో..? ఏమయ్యేవాడినో..? ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నానంటే, ఇది ఆయన పెట్టిన బిక్షే...!

అన్నయ్య ఎం.ఎస్.సి. చదివినా., మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చిత్తూరులోనే టీచరు పోస్టులోనే   స్థిరపడిపోయాడు. పైగా టీచరు పోస్టంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు. మా గురించి ఎలా పట్టించుకునేవాడో, తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్ళకోసం వెచ్చించి, వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు. మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేది. ఇద్దరూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లా ఉంటారు.

మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి, ఓసారి పనిఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు., అరిచిపోయిన వాళ్ళున్నారు., కానీ, వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే., అభిమానపు పలకరింపులే., సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా...వాళ్ళ శిష్యులే కనపడతారు. కావలసిన పని చేసిపెడతారు.

అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూండేవాడు - "ప్రతి మనిషీ ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ తెందూల్కర్ కాలేరు. కానీ, ప్రయత్నిస్తే ప్రతి మనిషీ ఓ సోదరి నివేదిత /మదర్ థెరెసా కాగలరు. ఇందుకు మేధస్సు,ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టంపట్ల స్పందించే హృదయం ఉంటే చాలు..!".అని.  ఈ మాట అనడమే కాదు, ఆచరించి చూపించాడు కూడా., ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని గురించి అస్సలు పట్టించుకునేవాడు కాడు.

మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు.. ఇవే జీవితం అనుకుంటాం., అన్నయ్యలాంటివాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసినది చాలా చాలా ఉందనిపిస్తుంది. ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతుంటాను. అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే. ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు.

ఉంటాను.

నీ...దివాకర్.

ఉత్తరం చదవడం పూర్తిచేసిన దివాకర్ కంటిచివర నుంచి రాలిన కన్నీటిచుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి, అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది.

     *        *         *         *

ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది.

"దివాకర్. మీ అన్నయ్య, వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు.." అని చెప్పాడు రామకృష్ణ.

"అలాగా.. నేను వచ్చి చూస్తాను. రామకృష్ణా..! నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. 'పని ఒత్తిడి ' అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని, నామీద నేనే సానుభూతి చూపుకుంటూ, భార్య చెప్పిందే వేదమనుకుంటూ, ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ, అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకుప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళూ. ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తియ్యగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో., ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో., మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు"

"మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు. నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు"

"తప్పకుండా. నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను.."

తర్వాత భార్యకు విషయంచెప్పి, వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్.

హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి, గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.

"మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండీ..!

నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకుగానీ, స్నేహితులకు గానీ, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ, భయం, కష్టం, నష్టం అన్నీ మీరే భరించి, చివరికి విజయం సాధించారు..!" జానకి శివరాంతో అంటూంది.

"ఎక్కడో ఉన్నవాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు. అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు. అతనూ తనవంతు సాయంచేసి తన మంచితనం నిరూపించుకున్నాడు"

"కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరచింది. ఈమధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది..?" "డాక్టరుగారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది. నా భయం నీతో చెప్పుకోలేను., నువ్వే పేషంట్ వి కాబట్టి., ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు. వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి, ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటిదగ్గర వదిలి, వెంటనే బ్యాంకుకు వెళ్ళాను. వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను. పాపం.. వాడు అప్పుడూ బిజీనే..!"

"అన్నయ్య బ్యాంకుకు వచ్చింది.. నన్ను డబ్బులు అడగటానికి కాదా..?" అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్.

"కానీ, అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు..? మీరు దివాకర్ కు ఎంత చేశారు..? అతని అభివృద్ది కోసం ఎంతగా తపించారు..? అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు" జానకి అంది.

"తప్పు జానకీ., అలా అనకు..! నేను ఏదో ఆశించి వాళ్ళకు చెయ్యలేదు., ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే., పనిఒత్తిడిలో అలా మాట్లాడాడు. ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా.. తరువాత ఆలోచిస్తే, పనిఒత్తిడివల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్ గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి ఎంతో ఆనందించాను" అన్నాడు శివరాం.

దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగునవెళ్ళి శివరాం చేతులు పట్టుకుని, ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ...!

రచయిత శ్రీచంద్రశేఖర్.

*(

Panchaag

 


అగ్ని సాక్షిగా

 


*అగ్ని సాక్షిగా వివాహం అనేది ఎందుకు ?*


అగ్నిసాక్షి గా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.


“సోమః ప్రధమో వివిధే, 

గంధర్వో వివిధ ఉత్తరః

తృతీయాగ్నిష్టే పతిః 

తురీయప్తే మనుష్యచౌః”


అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే, నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు.. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం.


అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు).. ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు.. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు.


గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు.. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు.


 “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు.!!


సనాతన హిందూ సంప్రదాయాలు గౌరవించండి - పాటించండి.

*శ్రీ గరుత్మంతుడి కధ -10 వ భాగం*_

 _*శ్రీ గరుత్మంతుడి కధ -10 వ భాగం*_ 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


 మనం_తెలిసి_తెలియక_ చేసే_పాపాలు_ఏవి ....! 


హరించే వారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు, మంచి వారిని నిందించే వారు, ఋణ గ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ, దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు,ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి

చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే. తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు, పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు. గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ద్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ టంగుటూరి ప్రకాశం

 🌹🦜🙏🏽🦜🌹

    23.08.2024

      శుక్రవారం 


అంశం....శ్రీ  టంగుటూరి ప్రకాశం

 పంతులు గారి జయంతి సందర్భంగా...వారికి నివాళి..


 *తేటగీతి మాలిక....* 


టంగుటూరి ప్రకాశము డస్సిబోక

గాంధి, నెహ్రూల సరసన గదలుచుండి

దేశ స్వాతంత్య సమరాన యాశవిడక

పట్టు సడలని ధైర్యమున్ బగర జూపి

నిలచి, నిలబడి, యెదురొడ్డి, నిగ్గుదేల్చి 

పరుల పాలన దూర్పార బట్టు చుండి

భరత మాతకు బిఢ్ఢడై భాగ్యమొందె...


లోభి, తెల్లోడి తూటాకు రొమ్ము విరచి

యాంధ్ర రాష్ట్రము సాధించి యద్భుతముగ

ముఖ్యమంత్రిగ  పేర్గాంచి ముచ్చటగను 

గాడి దప్పక నేలిన ఘనులు వీరు....


నీతి, జాతికి నిలువెత్తు నిచ్చెనయిన 

జాతి రత్నము 'కేసరి' జనుల మదిని

దోచు కున్నట్టి గడుసరి, తురుపు ముక్క

యుద్ద రంగాన పోరాడు యోధుడయిన

అమరవీరుని స్మరియిస్తు నంజలిడుదు....

.......................................................

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

ఒక్కరు చేయడం కన్నా

 *2048*

*కం*

ఒక్కరు చేయుట కన్నను

చక్కగ పలువురు నొకటగు సంఘాతమునన్

తక్కువ శ్రమనొంది పనిన

ఎక్కువ ఫలమొందగలరు నిజముగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఒక్కరు చేయడం కన్నా ఎక్కువ మంది ఏకమై కలిసి మెలిసి పనిచేసినచో తక్కువ శ్రమతోనే  ఖచ్చితంగా ఎక్కువ ఫలితం పొందగలరు.

*సూక్తి*:-- ఐకమత్యమే మహా బలం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆంధ్రకేసరి

 >


ఆంధ్రకేసరి


టంగుటూరి


సీ. ”బారిష్టరు”జదివి,ప్రముఖులన్వోడించి, న్యాయవాదులలో,నజేయుడయ్యె. సాయమ్ముగానిల్చి,న్యాయమ్ములోగెల్చి, పేదలహృదయాల,వెలుగునింపె, సామ్రాజ్య సిద్ధికై స్వార్థమ్మువిడనాడి, ఆస్తులన్నింటి,దానమ్మివేసె స్వాతంత్ర్య సమరాన,సాహసమ్ములుజూపి, ”గుండు”కెదురుగ దా గుండెనిల్పె తే.గీ. పట్టుబట్టిన విడువని– గట్టివాడు, ఆంధ్రకేసరి”బిరుదుతో–నలరువాడు, పదవినైనను—తృణముగా వదలువాడు హంగులార్భాటములులేని”టంగుటూరి” 


సురభి శంకరశర్మ,

బాలకృష్ణయ్య (అ)మాయకత్వం!

 బాలకృష్ణయ్య (అ)మాయకత్వం!


అమ్మా! మన్నుదినంగ నేశిశువునో?

ఆకొంటినో?వెఱ్ఱినో?

నమ్మంజూడకు వీరిమాటలు మదినన్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేన్

మదీయాస్య గం

ధ మ్మాఘ్రాణము సేసి నావచన ముల్ దప్పైన దండింపవే!!


ఆం:భాగవతము- పోతనమహాకవి: 10 స్కం: 337 ప:


       బాలకృష్ణుని చిలిపి చేష్ఠలకు చిత్రాయమానం బమ్మెఱ వారిభాగవతం!

              ప్రతిపద్యం ఒక రసగుళిక! మనంభౌతికదృష్టితోగాక ఆదిభౌతిక దృష్టితో పరిశీలిస్తే వాటి వెనుక నున్న అర్ధంపరమార్ధం మనకు బోధపడుతుంది.

       కావాలని కృష్ణయ్య బలరామాదులు వీక్షింపగా ఆటలాడుసందర్భంలో మృద్భక్షణ చేశాడు. తమ్ముడుఇలాచేశాడని తల్లితోఅన్న ఫిర్యాదు.(అదేకావాలి ఆనల్లనయ్యకు.) తల్లి మందలింపు .మనయింట్లో పాలు పెరుగు వెన్నలు లేవా?మన్నెందుకు తిన్నావురా?అనియశోద మందలిస్తే 


"నంగనాచి, బుంగమూతిపెట్టి,ఏవిటమ్మా! నువ్వూనమ్ముతున్నావా వీరిమాటలు? ఉత్త అబధ్ధాలమ్మా! ఆవంకతో నీవునన్నుకొడితే చూచి నవ్వటానికి యీయెత్తులన్నీ.మన్నుతినటానికి నేనేమైనా వెర్రివాడనా?ఆకలిగొనియున్నానా? ఇన్నిమాటలెందుకమ్మా !ఇదిగోనా దగ్గరకురా! నానోరు వాసనజూచిచెప్పవమ్మా! మన్నుతిన్నానో లేదో?అంటున్నాడు."

ఆవెర్రిబాగులతల్లి ,అందుకుపక్రమించింది.ఇంకేముంది? సకలప్రపంచం ఆయన ఉదరంలోనే దర్శనమిచ్చింది.(ఇది తొలి విశ్వరూప ప్రదర్శనం)

యశోదకు కళ్ళుతిరిగిపోయాయి.ఒకపక్కనుండి కృష్ణుడంటే భయం పట్టుకుంది. 

              "ఏమిటిది?కలగన్నానా?లేక యదార్ధమా?వీడు నాకొడుకేనా?లేక వైష్ణవ మాయయా?"-అనితబ్బిబ్బయింది.

అంతలోకృష్ణుడు అమాయకంగా మొగంబెట్టి పొట్టచూపిస్తూ అమ్మా!ఆకలిగా ఉందే!ఏదైనాపెట్టవే! అన్నాడు.అంతే ఆవెర్రిబాగులతల్లి అన్నీమరచిపోయింది.పుత్రవ్యామోహం మనస్సు నాక్రమింపగా,కృష్ణుని చంకకెత్తుకొని వంటయింటి వైపుపరుగెత్తింది.

          ఇదీ బాలగోపాలబాలుని అమాయకత్వంలోని మాయకత్వం!

                                 స్వస్తి!

మానవజీవనసాఫల్యతకు

 శు భో ద యం🙏🙏


ఈత్రయం బహు పుణ్య లబ్ధమే!


"జనకుని పూజలంగడుబ్రసన్నుని జేయునతండుపుత్రుఁ,డే

వనితమెలంగు భర్తృవశ వర్తినియైయది సత్కళత్ర, మే

జనుడు విపత్తిసౌఖ్య సదృశ క్రియుడాతడుమిత్రు,డీ

త్రయం

బును జగతిం లభించు నతిపుణ్యముజేసిన యట్టివారికిన్,

     భర్తృహరి సుభాషితములు.

    భావం:తండ్రిని పూజించే కుమారుడు,చెప్పినమాటవినేభార్య, కష్టసుఖాలలో అండగా ఉండే మిత్రుడు,అనే ముగ్గురూ ఎంతోపుణ్యంచేసికున్నవారికే లభిస్తారు. అని భావం.

విశేషాంశములు:

తలిదండ్రులయెడ విధేయుడై యుండుటయే కొమారునికర్తవ్యము.అదేవారికి కొమరుడుజేసే పూజ!

  భర్తకు విధేయురాలై చెప్పినట్లు నడచుకొనుట భార్యకర్తవ్యము.అట్టివనితయే భార్యారత్నమగును.

     కష్టసుఖములలో మిత్రుని వెన్నంటి యుండుట మిత్రధర్మము.దానిని పాటించువారు అరుదు.

    ఈమువ్వురు మానవజీవనసాఫల్యతకు మూలము.వీరులభించుటయనునది .మన పూర్వజన్మ పుణ్యమే!!!👏🙏