2, డిసెంబర్ 2024, సోమవారం

మిత్రాజీ కలం నుండి....

 *మిత్రాజీ కలం నుండి........*


మనమే శిలలం. మనమే శిల్పులం. మనమే శిల్పాలం.మనకు మనమే తీర్చి దిద్దుకోవాలి. మన మనస్సును మనమే సంస్కారవంతంగా తీర్చి దిద్దుకోవాలి సంస్కారవంతులంగా మారాలి మన రూపాన్ని అందంగా మలుచుకోవాలి. అంటే మన హృదయాన్ని స్వచ్చంగా, నిర్మలంగా ఉంచుకోవాలి.ధైర్యంతో నిబ్బరంగా ఉండాలి. ఎటువంటి సమస్యనైనా, ఎలాంటి ఉపద్రవమైన ఎదుర్కునేందుకు ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంటూ సాహసదృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఆశాభావాన్ని, సోమరితన భావాన్ని విడనాడాలి.మన శక్తిపై మనం నమ్మకాన్ని పెంచుకోవాలి మనకు మనమే సంతోషాన్ని, ప్రశాంతతను తెచ్చుకోవాలి.

భగవంతునిఫై భక్తి, అధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.


తనలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఒడి దొడుకులు ఉన్నా, ప్రకృతి పచ్చగా ఎంతో అందంగా కనిపిస్తూ చూపరులకు ఆనందాన్ని ఇస్తూంది.

తనలో ఎన్ని అలజడులు అల్లకల్లోలం సృష్టిస్తూన్న సముద్రం చూసేవారికి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తూంది. 


అన్నీ తెల్సి మంచి చెడు ఏదో గ్రహించే మనం అపార జ్ఞాన సంపద కలిగి ఉన్న మనం ఎందుకు బాధ పడాలి. దిగులు ఎందుకు చెందాలి. తప్పులు ఎందుకు చేయాలి. నేరాలకు ఎందుకు ఒడిగట్టాలి. మన ప్రశాంతమైన జీవనానికి మనమే ఎందుకు భంగం కలిగించుకోవాలి.


కష్టంలోనే సుఖం చూసుకోవాలి. అత్యాశలకు అర్రులు చాచకూడదు. ఉన్నదాంట్లో సంతృప్తిని పొందాలి. అందరితో ఆత్మీయతతో కల్సిమెల్సి ఉంటూ ఆనందమైన జీవితాన్ని గడపాలి.క్షణభంగురం అయిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. 


భగవంతుడు ఇచ్చిన ఇంత మంచి జీవితం మళ్ళీ వస్తూందా!!?

తమలపాకు ప్రాముఖ్యత..

 🔔 *సనాతనం* 🔔


*హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత....*


హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో


(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ) 

 ఒకటిగా భావిస్తారు.


కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.


పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు.


 భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. 


దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.


తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?


క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది.


శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి .


తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.


తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.


సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.


తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.


జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.


విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.


శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.


తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.


భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.


సుబ్రహ్మణ్య స్వామి అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది...




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మార్గశిర మాసం*

 🌹🌷🪷🛕🪷🌷🌹

*సోమవారం,  డిసెంబర్ 2, 2024*


నేటి నుండి,*మార్గశిర మాసం*   

             

 *”మార్గశిర మాసం” - ముక్తికి మార్గం!*

```                  

మార్గశిర మాసం అనగా...

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. 



ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.``` 


భగవద్గీతలోని విభూతియోగంలో …. *”మాసానాం మార్గశీర్షం”* ``` మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.


ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. 


బ్రాహ్మీముహూర్తంలో

నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది.


అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం, సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి. 


అందుకే.... 

మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. 


ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.


ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళములతో పూజించడం పుణ్యప్రదం. 


ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి.  


శ్రీ విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో...  ```

*”ఓం నమో నారాయణాయ”* ```

అనే మంత్రాన్ని స్మరించాలి.


ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని,```  

*”ఓం నమో నారాయణాయ”* ```

అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.


మార్గశిర శుద్ధ షష్ఠి - ```

*”స్కంద షష్ఠి•”*``` 

శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని ```*”సుబ్రహ్మణ్య షష్ఠి”* ```అని అంటారు.


మార్గశిర శుద్ధ ఏకాదశి``` *”వైకుంఠ ఏకాదశి”* ```దీనినే``` *“మోక్షైకాదశి”*``` అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. 

తిరుపతి, శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.


మోక్షదా ఏకాదశి... ```

*”గీతాజయంతి.”*``` సమస్తమానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని``` *విమలైకాదశి, సఫలైకాదశి* ```అనికూడా పిలుస్తారు.


త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. 

ఈ``` *”దత్తాత్రేయ జయంతి”* ``` ని మార్గశిరంలోనే ‘శుక్లపూర్ణిమ’ నాడు జరుపుకుంటారు.


మార్గశిర శుక్ల త్రయోదశినాడు...``` 

*”హనుమద్‌వ్రతం,”* *"మత్స్యద్వాదశి",* *"ప్రదోష వ్రతం"* ```ఆచరించడం పరిపాటి.

```

*ఈ మాసంలోనే....*```


"అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, కృష్ణ(మల్ల)ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం, శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే! 

ఈ ధనుస్సంక్రాంతినే “ధనుర్మాసం” అనిఅంటాము.

తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయుణ్ణి తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపొందించుకొనుటకు దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా  నిలుస్తుంది.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*🙏


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*🙏


*ఆధ్యాత్మిక బృందంలో నాకు వచ్చినది భాగస్వామ్యం చేయడమైనది* 


          🌹🪔🕉️🕉️🪔🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

02, డిసెంబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

        🕉️ *సోమవారం*🕉️

🌹 *02, డిసెంబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                


          *ఈనాటి పర్వం* 

             *పోలిస్వర్గం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


🌴🌷🌹🪔🛕🪔🌹🌷🌴

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

    👉 _*ఈ రోజు విశేషం*_

   🙏 *మా దంపతుల*🙏

 🎊 *37 సంవత్సరాల* 🎊  

   🌹 *నరసింహారావు*🌹

       🪷 *భారతిల* 🪷 

     *వివాహ బంధం రోజు*

         🔯💖💝💓🔯

 🤝 *ప్రేమానుబంధము*🤝 

🎈🔯🎈🔯🎈🔯🎈🔯🎈


*తిథి     : పాడ్యమి* మ 12.43 వరకు ఉపరి *విదియ*

*వారం: సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* మ 03.45 వరకు ఉపరి *మూల*


*యోగం  : ధృతి* సా 04.01 వరకు ఉపరి *శూల*

*కరణం  : బవ* మ 12.43 *బాలువ* రా 12.59 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 10.00 - 12.00 సా 03.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 06.27 - 08.09*

అభిజిత్ కాలం  :  *ప 11.35 - 12.19*


*వర్జ్యం         : రా 12.04 - 01.44*

*దుర్ముహూర్తం  : మ 12.19 - 01.04 & 02.34 - 03.19*

*రాహు కాలం : ఉ 07.45 - 09.09*

గుళికకాళం      : *మ 01.21 - 02.45* 

యమగండం    : *ఉ 10.33 - 11.57*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.21* 

సూర్యాస్తమయం :*సా 05.33*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.21 - 08.35*

సంగవ కాలం    :      *08.35 - 10.50*

మధ్యాహ్న కాలం :*10.50 - 01.04*

అపరాహ్న కాలం : *మ 01.04 - 03.19*

*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ విదియ*

సాయంకాలం  :  *సా 03.19 - 05.33*

ప్రదోష కాలం   :  *సా 05.33 - 08.07*

రాత్రి కాలం    :  *రా 08.07 - 11.32*

నిశీధి కాలం     :*రా 11.32 - 12.23*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.39 - 05.30*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

    

     🕉️ *శివ తత్వం:-*🕉️


*➡ శివం* - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.

*➡ త్రినేత్రం* - ధ్యానం.

*➡ ఢమరుకం* - సంగీతం.

*➡  తాండవాభినయం* -  నృత్యం.

*➡ శివుని చేతిలోని అగ్ని* - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.

*➡ భిక్ష పాత్ర* -  ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.

*➡ కపాలం* - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.

*➡ కోరుకునేది* - చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)


🕉️ *ఓం నమః శివాయ*🕉️

          

🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

అంతే అవసరం.

 లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక ఎంత ముఖ్యమో, రోజులు గడిచేకొద్దీ ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆవిరి కాకుండా పని చేయడమూ అంతే అవసరం. 


అందుకోసం లక్ష్యసాధన దిశగా మీ పనితీరును కొలవగలిగే స్పష్టమైన మైలురాళ్లను నిర్దేశించుకోండి. 


ఒక్కో మైలురాయిని నిర్దేశిత సమయంలో చేరుకోగానే ఆనందంగా వేడుక చేసుకోండి. దీనివల్ల తర్వాతి దశను పూర్తి చేయడానికి నూతనోత్సాహంతో పనిచేస్తారు.


 ఒకవేళ అనుకున్న సమయంలో ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోతే మీ పనితీరును సమీక్షించుకుని అవసరమైన మార్పులు చేసుకోండి.🍁🙏Good Night 🙏

ఎందరెందరో హైందవులు.

 *

సభ్యులందరి ఎఱుకలో ఉన్న విషయమే మన భారత దేశం *ఆసేతు హిమాచలం విభిన్న సంస్కృతుల, మతాల, కులాల, వర్గాల సంప్రదాయాల సమాహారమని* ముందుగా మన రాష్ట్రం గురించి పరిశీలిస్తే, తెలుగు వారితో బాటు ఆంధ్రులు, కన్నడిగులు, తమిళులు, మరాఠీలు, మహా రాష్టీయులు, అస్సామీలు, రాజస్థానీలు, ఒరిస్సా వాసులు ఇంకా ఎందరెందరో హైందవులు. ఇతర మతస్తులలో ముస్లింలు, కిరస్తానీలు, బౌద్ధులు, జైమినీయులు మరియు కొంత మంది విదేశీయులు గూడా మన రాష్ట్రంలో  భిన్నత్వంలో ఏకత్వంలాగా జీవిస్తున్నారు.

 ఇతర మతస్తులు, లేదా విదేశీయులు *అందరు దేశ  ద్రోహులు కారు*. 


గత వ్యాసంలో ప్రస్తావించబడిన హిందు దేశానికి మరియు ధర్మానికి పట్టిన జాడ్యాల, రుగ్మతల మరియు ప్రమాదాల నివారణకు చతుర్విధ బలముల (మనో, బాహు, జన మరియు ధన) శక్తి మరియు చతుర్విధ (సామ, దాన, భేద, దండో) ఉపాయముల అవసరమగు విషయము సభ్యులకు అవగతమే. 


ధర్మ మరియు దేశ రక్షణ నేపథ్యంలో లక్షలాది మంది జనాభాను అనుసంధానించాలనే ప్రయత్నం ఒక బృహత్ కార్యమే. *ప్రయత్నిస్తే ఇవన్నీ సాధ్యమే అను భావన కూడా నిర్వాహకులలో  దృఢంగా ఉండాలి*.  

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానంలో *Neighbour hood first* అను ప్రణాళిక అమలులో ఉన్నది.  ఈ ప్రాతిపదికపై తొలుత *మాన్యులు* మన రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్కృతుల, మతాల, కులాల వారిని ఈ హైందవ ధర్మ రక్షణ  అను *బృహత్ ప్రణాళిక* అమలుకు ఆహ్వానించాలి. 

ఈ కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమం అనడం జరిగింది కాబట్టి ఇందుకు అన్ని వర్గాల సమిష్టి కృషి అవసరము. 


మన రాష్ట్రంలో ప్రతి కులానికి, ప్రతి వర్గానికి సంస్థలు, సంఘాలు ఉన్నవన్న విషయం సత్యదూరం కాదు. ప్రతి కులం మరియు ప్రతి వర్గం వారు, *వారి  వారి* అభివృద్ధి కొరకు *మాత్రమే* సభలు, సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక, ప్రభుత్వ అధికార  అధికార పెద్దలను,  తత్సంబంధ రాజకీయ నాయకులను దర్శిస్తూ కార్యాలు సాధిస్తున్నారు, స్థితిమంతులుగా (విజయవంతులుగా) ఎదుగుతున్నారు. కార్యక్రమాలన్నీ సజావుగా సాధించుతున్న సంఘ మరియు సంస్థల పెద్దలందరూ అభినందనీయులే. అవుతే, *హైందవ ధర్మ రక్షణ అను అంశము బహు విస్తృతమైనది. ఇందుకు గాను రాష్ట్రంలోని అన్ని  సంస్కృతుల, కులాల, వర్గాల నాయకులు మరియు ప్రజలు ఏకం కావాలి. సంస్థలు, సంఘాలు తమ తమ సమావేశాలను మాసవారిగా నిర్ణయించుకున్నా, రాష్ట్రంలోని అన్ని సంఘాల పెద్దలు  తమ తమ ప్రాంతాలలో ఒక వేదికపై త్రై మాసిక సమావేశాలు ఏర్పాటు చేసు కొనవల్సిఉన్నది, ఉంటుంది. వీరి ముఖ్య కర్తవ్యం ధర్మ మరియు దేశ రక్షణనే ప్రథమ ధ్యేయంగా ప్రజలను మరీ ప్రధానంగా యువతను ఉత్సాహ, ఉత్తేజ పర్చాలి.* 

అన్ని వర్గాలలో ఆత్మ నిర్భరత  పెంచాలి, *దేశ ప్రయోజనాలే మిన్నగా* వారిని ప్రోత్సహించాలి. *స్వధర్మ ప్రోత్సాహము మరియు క్షేమము అనుసరణీయమే*. 


ధన్యవాదములు.

*(సశేషం)*

ఎత్తుల్ గానని ధర్మ కోవిదుల

 శా.ఎత్తుల్ గానని ధర్మ కోవిదుల సంహిద్భావ సంధాన స

చ్చిత్తాలంకృత దివ్య సిధ్ధియుత సంసేవ్యాత్మ జిజ్ఞాసులన్

బత్తిన్ సాగిల మ్రొక్కుచుందు నెపుడున్ ప్రజ్ఞా ప్రసాదంపు వి

ద్వత్తున్ గూర్చగ నెంచు వారలకు విద్యార్థ్యైక లక్ష్యమ్ముతో౹౹ 51


చ.వినయము సద్గుణాళికి వివేకము గూర్చును జీవితమ్మునన్

వినయమె సర్వ సంపదల ప్రీతి నొసంగగ ప్రేరణమ్మునౌ

వినయమె మూలమౌ సకల విద్యల నార్జన సేయ సర్వదా

వినయమె మానవాళికగు విస్తృత మైన యశస్సునందగన్౹౹ 52

1, డిసెంబర్ 2024, ఆదివారం

కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

 ॐ కార్తీకపురాణం - 30 వ అధ్యాయం ॐ

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉🕉🕉


♦️చివరి రోజు పారాయణం.


🍃🌷కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి: 


నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు” మని కోరిరి...


అంత సూతుడా ప్రశ్న నాలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు... 


కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము - ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.  


ఓం నమః శివాయ…🙏🙏

సమస్య పూరణ.

 *వారము లోన వచ్చె రవివారము మిత్రమ మూడు మార్లుగన్*

ఈ సమస్యకు నాపూరణ. 


చేరితినయ్య కొల్వునను చైత్రమునందున, మూడు మాసముల్


పోరితి - నిద్ర మానితిని, పుస్తకముల్ పఠియించి వ్రాయ యీ


వారము లోన వచ్చె - రవి వారము మిత్రమ! మూడు మార్లుగన్


హారతు లిత్తు దేవునికి నన్నిట నాకు జయంబు లీయగన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

అధ్యాపకుడు


అంత రంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు, కాలాన్ని మించిన గురువులు లేరు, లోకాన్ని  మించిన సద్గ్రంథము లేదు, సన్మార్గ జీవితాన్ని మించిన ధర్మము లేదు. ఇంత స్పష్టంగా వేదాంతాన్ని, జీవితాన్ని అభేద్యంగా, సమన్వయంగా దర్శించిన వారే ఇతరులకు మార్గ దర్శనము చేయగలరు.*ఇటువంటి  దార్శనికులకు మన గ్రూప్ లో కొదవ లేదు*.


అవుతే, ఈ కలియుగంలో, అందునా ఈ అధునాతన యుగంలో, మరీ ఈ ధార్మిక హాని/గ్లాని ఏర్పడుతున్న సమయంలో ఏదీ సులభంగా లభించదు *ఒక్క దుర్మార్గులకు తప్ప*.

 ఏదీ సాధించాలన్నా అకుంఠిత దీక్ష,  నిరంతర శ్రమ, అనన్య సామాన్య కృషి, మొక్కవోని పట్టుదల, క్రియాశీలత, సామాజిక సమన్వయము, సహకారము అన్నిటికంటే మించి స్థిర ధైర్యము సహనం తప్పనిసరి. *సాధకులకు తగ్గ  సౌశీల్యము, సౌశీల్యానికి తగ్గ సాహసము ఉంటే  "విధి" కూడా సాధకులకు సహకరిస్తుంది*. శాస్త్ర వాక్యమొకటి  చూద్దాం *సాధనాథ్ సాధ్యతే సర్వం*.


ఇవన్నీ మాన్యులకు తెలియవని కాదు కాని, ఇది ఒక పునశ్చరణ మాత్రమే. *చేరాల్సిన శిఖరాలు చేరాను, జీవితంలో స్థిరపడ్డాను, ఇదే జీవిత సాఫల్యం అని అనుకుంటే సరిపోదు. జీవన సార్ధకతకు విద్య, సంపాదన, ధనం ఎంత గొప్పవో దేశ సేవ మరియు ధర్మ సేవ గూడా అంత గొప్పవే. అవే అసలైన పురుషార్థాలు*.


ధార్మిక దివిటీలైన  ఈ గ్రూప్ సభ్యులకు వినతి మన దేశంలోనూ, పొరుగు దేశాలలోనూ హిందూ ధర్మానికి, సంస్కృతికి మరియు హిందువులకు మన ముందు వాటిల్లుతున్న హాని కురించి "క్లుప్తంగా".

 *1) హిందువులపై మరియు హిందు దేవాలయాలపై దాడులు*

*2) హిందువుల మతాంతీకరణ*

*3) భారత దేశంలో హిందువుల "సంఖ్యా బలంలో  తగ్గుదల", హైందవేతరుల "సంఖ్యా/ప్రజా బలంలో హెచ్చుదల*

4) హైందవేతరులచే ఆహార పదార్థాల కల్తీ/హలాల్/ ఎంగిలి మరియు విష తుల్య కృత్యాలు.

5) ఇతర మతస్తులచే *"జిహాదీ చర్యలు*"

6) సెక్యులర్ ముసుగులో హిందువులకు అన్యాయము,  పైగా  హైందవేతరులు  బహిరంగంగా చేసే దేశ/జాతి వ్యతిరేక పనుల పట్ల  చట్టం అవసరమైనంత పదునుగా  ఉండక పోవడం.

7) waqf board చే హిందువుల,దేవాలయాల భూమి ఆక్రమణ ఆగడాలు.

 8) సెక్యులర్ ముసుగులో పాలకులు, హిందు దేవాలయాలలో అన్య మతస్తులను ఉద్దేశ్య పూర్వకంగా నియమించడం. హిందు సంస్కృతి, సంప్రదాయాలను భ్రష్టు పట్టించే చర్యలకు ఒడిగట్టడం.

9)  హిందు దేవాలయాల సన్నిహిత ప్రాంతాలలో దర్గా మరియు చర్చ్ లాంటి అన్య మతస్తుల ప్రార్థనా మందిరాలను అనుమతించడం. 


సభ్యులందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం *అన్య మతస్థులందరూ దుర్మార్గులు కారు*. కరడు గట్టిన అన్యమత చాంధసవాదులు, వారికి వత్తాసు పలికే సెక్యులర్ కుహానా మేధావులు వలననే హైందవ ధర్మానికి, దేశానికి పెను ముప్పు పొంచిఉన్నది. 


*శ్లో! పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతామ్* I

*ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే* ll 

భగవద్ గీత.

ధర్మానికి హాని జరిగినప్పుడు భగవద్ గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ తెలియజేసినట్లు, ఈ కలియుగంలో భగవంతుడు శంఖు, చక్రాలతో తాను స్వయంగా  భువికేతెంచే  అవకాశాలు మృగ్యము.

 *భగవాన్ మానుష రూపేణ* అని కూడా చదువుకున్నాము కాబట్టి ధర్మ సంస్థాపన కొరకు మనమే సంఘటితంగా ఉద్యమించ వలసి ఉంటుంది. మన హిందూ జాతి ఐకమత్యం మాత్రమే మన ధన,మాన ప్రాణాలను కాపాడగలుతుంది.


జీవితంలో ప్రతి మలుపును, మార్పును కాలానికే వదిలివేయడం, నిశ్చేష్టులుగా జీవించడం *నాలాంటి* కొంతమంది 

 *సామాన్యుల స్వభావం*.

 కాని, స్వ ప్రయత్నాన్ని నమ్ముకుని *ఆశించిన  గమ్యాలను చేరుకోవడం మీలాంటి అసామాన్యుల, మాన్యుల లక్షణం*. సమాజ సహకారంతో నిర్దేశించుకున్న ఫలితాలు పొందగల్గుతారు. *జయం భవతు*.


ధన్యవాదములు

*(సశేషం)*