17, మే 2021, సోమవారం

అరుణాచల ఆలయంలో

 *అరుణాచల ఆలయంలో జరిగిన యదార్థ సంఘటన.*


ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.


ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.


అందులో ఒకడు "ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.


ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి 'మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ )' అన్నారు.


ఇలా ప్రతీ రోజూ పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.


ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు... వీళ్లిద్దరూ ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని.


'అరేయ్ పిల్లలూ...! మీరు ఇద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. ఇదే మీకు శిక్ష...!' అన్నాడు అధికారి.


పిల్లలు ఇద్దరూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చుని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. 


ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృళ్లి పడ్డారు. పరిశీలించి పిల్లల్ని మరొకసారి  చూసారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు, ఎవరో మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం కనిపించింది. మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు... మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.


అద్భుతం!!

మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి, గర్బాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు.


అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా...! అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.


ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "అసలేం జరిగింది...?" అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. 


అది విని పూజారీ...అధికారీ కూడా ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు.


సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. 


ఆలయం లో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి...?!


నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తికీ అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే...! అరుణాచలుడు  కాంతి రూపంలో ఉంటాడనీ, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో  మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు ఎన్నో కలవు.


అరుణాచలశివ...  అరుణాచలశివ... అరుణాచలశివ... అరుణాచలా...!

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: