19, జులై 2022, మంగళవారం

భోజన నియమాలు

 *హిందూ సాంప్రదాయములో భోజన నియమాలు, క్లుప్తంగా----*

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<<                                     

1. భోజనానికి ముందు,తరువాత తప్పకకాళ్ళు,చేతులుకడుక్కోవాలి. 

తడికాళ్ళను తుడుచుకుని భోజనా నికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు,మొదలైన.) తినే పళ్ళాని కి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరా దు. చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పె ట్టి నెయ్యినీ కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనంచేస్తున్నప్పుడుమధ్య లో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్నిచూ పించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్నిము ట్టుకోన కూడదు. 

ఒకవేళకంచాన్నిముట్టుకుంటే! .వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టు కోనవలెను.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కం చంలో భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్ర మంగా దరిద్రులు అవుతారు.

10  భగవన్నామము ఉచ్చరించి భో జనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపము తో అన్నం పెట్టేవారిని తిట్టడంచేయ రాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోనరాదు. ఏవైనా పదార్థా లలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థా లుఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచంఒడిలోపెట్టుకునిభోజనం చేయరాదు. పడుకునే  మంచం మీ ద భోజనం చేయరాదు. 

(ఇదివృద్ధులకు,అనారోగ్యము గా ఉన్న వారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్నిదేమునకు ని వేదించరాదు.అతిథులకుపెట్టరాదు.15. భోజనం అయ్యాక క్షురకర్మ చే సుకోనరాదు. (వెంట్రుకలు కత్తిరిం చడం)

16. గురువులు లేదా మహాత్ములు అతిథులుఇంటికి వస్తే మనంతినగా మిగిలిన వి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి బేధం చూపరాదు. అనగా ఒకరికి ఎ క్కువ వడ్డించడం మరొకరికితక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటు న్నపదార్థాలలోవెంట్రుకలువస్తే,ఆపదార్ధములోనెయ్యినివడ్డించితినాలి. పురుగులు వస్తే ఆ భోజనం తక్షణం విడిచి పెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలోఆవునెయ్యివేసుకుం టే ఆహారం శుద్ధి అవుతుంది. 

20.భగవన్నామములుతలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ  వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమము. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బల వంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నెలోనిపదార్ధమునుమొత్తం ఊడ్చుకుని తినరాదు.ఆహార పదా ర్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డనసమయంలోఅక్కడఉండరాదు.

26. అరటిఆకులవంటి వాటిలో భో జనం చేసిన వ్యక్తి వాటినిమడవకూ డదు (తిన్న విస్తరిని మడవడం అ నాచారం).తన ఇంటిలో ఒక్కడే ఉ న్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడి కి వచ్చేపుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రము.

(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసినరాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆ కులు ఎత్తాడని మహాభారతం చెబు తోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతు లూ,కాళ్ళూ కడుక్కోవాలి. 

అవకాశం లేనప్పుడు రెండు చేతు లైనా తప్పక కడుక్కోవాలి. 

నోరునీటితోముమ్మారుపుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాకనేలనులేదా బల్లనుశుద్ధిచేయాలి (మెతుకులుతీ సేసి,తిన్నచోట శుద్ధిపేట్టితడిగుడ్డతో శుభ్రం) చేసినతరువాత మాత్రమేఅ క్కడ వేరేవారికి భోజనంవడ్డించాలి.(ఇప్పటికీసదాచారములుపాటించేకొందరి ఇళ్ళల్లో గోమయం లేదా ప సుపునీళ్ళు చల్లి మరీశుద్ధిచేస్తారు.)  

30.స్నానం చేసి మాత్రమే వంట వం డాలని కఠోర నియమము.  

పెద్దలు,సదాచారపరులు,హోటళ్ళలో మరియు ఎక్కడంటేఅక్కడభోజ నం చేయకపోవడానికిఇదేముఖ్యకా రణం.అక్కడవంటచేసేవారుస్నానం చేసారో లేదో తెలియదుకదా,పాచి ముఖంతో వంట చేసినా,రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించివంటచేసినా దోషము. అవి తిన్న వారికి మెల్లగా వారిమనసుపైప్రభావంచూపుతుంది.పుణ్యం క్షీణిస్తుంది.అజ్ఞానంవస్తుం ది జ్ఞాపకశక్తిపోతుంది.

31.ఒకసారివండాకఅన్నము,కూర,పప్పు వంటి ఇతరఆహారపదార్థాల ను మళ్ళీ వేడిచేసి తినరాదు. ద్వి పాక దోషం వస్తుంది. 

32. ఆడవారు గాజులు ధరించకుం డా భోజనం చేయరాదు. ఇతరులకుభోజనమువడ్డించరాదు.

*ఇవీ,క్లుప్తంగా  హిందూసాంప్రదా యంలోని కొన్ని భోజన నియమా లు---//-*

కామెంట్‌లు లేవు: