21, జులై 2022, గురువారం

అదృష్టవంతుడు

 అదృష్టవంతుడు 

ఎప్పుడు ఉషారుగా వుండే రామారావు ఎందుకో రోజు మూడీగా వున్నాడు.  ఎందుకా అని నేను వెళ్లి ఏమిటి రామారావు రోజు నీవు ఏదో కోల్పోయినట్లుగా ఏమిటి అట్లా వున్నావు అన్నాను.  ఏమి చెప్పమంటావురా సుబ్బారావు నా భార్య ఆగడాలు రోజురోజుకి ఎక్కువైతున్నాయి.  రోజు కొట్టినంత పనిచేసింది (నిజానికి కొట్టింది ఆలా చెపితే బాగుండదని) అందుకే దిగులుగా కూర్చున్నాను.  రోజు క్షణక్షణం ఈశ్వరుని వేడుకొంటున్నాను నా భార్యకు మంచి బుద్దిని ప్రసాదించమని.  కానీ నా కర్మ ఇలా  కాళింది. అదే మా యింటిప్రక్క వెంకటేశ్వర రావు భార్య ఆయనను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళు తరచుగా సినిమాలకు షికార్లకు రయ్యి మని వెళుతుంటే నాకు కడుపులో దేవినట్లవుతుంది అదుష్టవంతుడు అంటే వాడురా అని అని కళ్లనీళ్లు తుడుచుకున్నాడు.  నాకు ఒక నిమిషం మాటలు రాలేదు.  యెంత మంచివాడు రామారావు ఆఫీసులో ఎవరికి సమస్య వచ్చిన యిట్టె పరిష్కరించే రామారావేనా నేను చూస్తున్నది అని అనుకున్నాను

రామారావు కొంత తమాయించుకున్న తరువాత చూడు రామారావు నిజానికి అదృష్టవంతుడు మీ ఇంటిప్రక్క వెంకటేశ్వర రావు కాదు  నీవే. వెంకటేశ్వర రావే దురదృష్టవంతుడు. అని నేను అనేసరికి ఏరా నన్ను యెగతాళి చేస్తున్నావా అని నవ్వుతు నన్ను చిన్నగా కొట్టాడు

చూడు రామారావు నేను నీ నోటితోటె నీవు అదృష్టవంతుడివి అని చెప్పేస్తాను.  ఇప్పుడు చెప్పు ఇందాక నీవు నాతొ ఏమన్నావు అన్నాను.  ఏమన్నాను నా భార్య ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అన్నాను అని అన్నాడు.  తరువాత ఏమన్నావు చెప్పు అన్నాను.  ఏమన్నాను నేను ప్రతి క్షణం ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అన్నాను.  అదే నేనంటున్నాను. నీకు ఈశ్వరుని అనుగ్రహం వున్నది కాబట్టే నీవు అనుక్షణం ఈశ్వరుణ్ణి తలుస్తున్నావు. అన్నాను. ఎన్నో జన్మలను ఎత్తినతరువాత మనకు భగవంతుడు ఇచ్చిన  అపూర్వ వరం లాంటిది    మానవ జన్మ జన్మలోనే మనం భగవంతుడి సన్నిధానం అంటే మోక్షాన్ని పొందగలం.  భగవంతుడు సాధకునికి అనేక అవాంతరాలను కలుగ చేస్తాడు.  అటువంటి అవాంతరమే నీకు వున్న పరిస్థితి అని ఎందుకు అనుకోవు.  ఒక్కసారి బాహ్య ప్రపంచంచుడు ఎంతమంది ఎన్నిరకాలుగా కస్టాలు, బాధలు అనుభవిస్తున్నారో.  కొందరికి కళ్ళు లేక అంథులుగా వుంటున్నారు, కాళ్ళు లేక, చేతులు లేక అనేకవిధాల నివారణ కానీ, లేని వ్యాధులతో భాదపడుతున్నారు.  కొంతమందికి తినటానికి తిండి, కట్టుకోటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు లేక ప్లేటుపారాలమీద, పెద్ద పెద్ద నీళ్ల పైపులలోన, చెట్లకింద జీవనం గడుపుతున్నారు వారిని చూసావా.  ఒక్కసారి ఆలోచించు నీకు వున్న కష్టం వారిముందు ఏపాటిది.  నిజానికి నీ భార్య గయ్యాలే అవవచ్చు నీకు చక్కగా భోజనం వండి పెడుతున్నది, పిల్లలను చక్కగా చేసుకుంటున్నది. ఇంకా ఏమికావాలి.  మనం ఒక్క సత్యాన్ని ఎప్పుడు మారుస్తాం అదేమిటంటే ప్రపంచంలో ఒక మనిషి మనస్తత్వాన్ని పోలిన మనిషి ఇంకొకడు ఉండదు.  కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులను బట్టి సర్దుకొని పోవటమే. మనిషి పరిస్థితులను అర్ధంచేసుకుని నడుచుకుంటాడో వాడికి ఎప్పుడు సంతోషమే ఉంటుంది.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహం నాస్తి, నాస్తి జగరతో భయమ్

కష్టపడే వారికి దారిద్ర్యం ఉండదు, జపం చేసే వారికి పాతకం ఉండదు అలాగే నిశబ్ధంగా ఉండేవారికి పోట్లాటలు వుండవు, జాగర్తగా వుండే వారికి భయం ఉండదు.  కాబట్టి మిత్రమా నీవు అనవసరమైన జగడాలకు వేళ్ళకు, సాధ్యమైనంత వరకు నిశబ్ధంగా వుండు.  కొన్ని మాటలు విన్న వినునట్లు వుండు మితంగా మాట్లాడు. తప్పకుండా నీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు  సుబ్బారావు. దానితో రామారావుకు కొత్త శక్తి వచ్చినట్లైయిన్ది.  తన డ్రాలో వున్నా భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చి నీకు సందేహం, అశాంతి, భయం కలిగిన గీత చదువు నీకు పూర్తి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంగా రామారావు ఇంటికి వెళ్ళాడు. ఆలా మూడు నాలుగు రోజులు గడిచాయి.  ఎవరి పనులల్లో వాళ్ళు వున్నారు.  సుబ్బారావు రామారావుతో క్యాజువల్గా గడిపాడు.  నాలుగవ రోజు సుబ్బారావు ప్రొద్దున్నే ఆఫీసుకు వచ్చి ఫైళ్లు   వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నారు. " కృష్ణ భగవానునికి వందనం"  మాటలు ఎవరు అంటున్నారు అని వెనుకకు తిరిగి చూసాడు వెనుక రామారావు చెందుతులుజోడించి నిలుచున్నాడు.  సుబ్బారావు నిజంగా నాకు పునర్జన్మని ఇచ్చావు నేను ఆత్మహత్య చేసుకోవాలని  అనుకున్నాను. నీ మాటల ప్రభావం వలన గీతాపారాయణ వలన నేను ఏమిటి నాకర్తవ్యం ఏమిటన్నది నాకు తెలిసింది.  ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా వున్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పు నీవు అదృష్టవంతుడవా కాదా అని సుబ్బారావు అడిగాడు.  అవును నిజంగా అదృష్టవంతుడినే అని రామారావు  అన్నాడు . ఆత్మహత్య ప్రయత్నం చేసే ప్రతి మానసిక బలహీనునికి నీలాంటి మిత్రుడు వుంది గీత  చదవమని ప్రబోధిస్తే ప్రతివాని జీవితం  వెలుగుని చూస్తుంది. అని సంతోషంగా అన్నాడు. 

ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా వుండవు   అట్లా అని ఎప్పుడు ప్రతికూలంగాను వుండవు. స్థితప్రజ్ఞుడు కష్టాలలోను సుఖాలలోను తొణకక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కానీ ఇది చెప్పినంత సులభం  కాదు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిత్యం సాధన చేస్తే  ఏదైనా సాధించవచ్చు.

 అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

 తినగ తినగ వేము తియ్యగుండు

 సాధనమున పనులు సమకూరు ధరలోన

 విశ్వధాభిరామ వినుర వేమ

కాబట్టి మిత్రమా పరిస్థితులను బట్టి మన ప్రవర్తన మార్చుకుంటే మంచిది. సత్వగుణ సంపత్తి సదా ఉత్తమం.

ఇటీవల ఒక వేదపండితుడు తన భార్య, అత్తగార్లు పెట్టిన  వేదనలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నంచేయగా తీవ్ర అనారోగ్యగ్రస్తుడు అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడని పెట్టిన పోస్టుకు భాదతో స్పందించి వ్రాసిన కధనం ఇది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: