19, ఆగస్టు 2022, శుక్రవారం

కుష్టువ్యాధిని నివారించే ప్రక్రియ

 వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ  - 


     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 


       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 


  గమనిక  -


          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.


     

కామెంట్‌లు లేవు: