14, డిసెంబర్ 2022, బుధవారం

త్రివిధోపాయములు

 ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు  - 


  ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు అనగా 


                *  దర్శనము . 


                *  స్పర్శ .  


                *  ప్రశ్న . 


    పైన చెప్పిన మూడు విధాలుగా రోగిని పరీక్షించవలెను . వీటిని త్రివిధోపాయాలు అంటారు. 

ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 


  *  దర్శనము - 


       నేత్రములతో రోగి యొక్క ఆకారము , నాలుక , కండ్లు , మలమూత్రాదులను పరీక్షించి రోగమును గుర్తించవలెను . 


 *  స్పర్శ  - 


        రోగి శరీరంను చేతితో తాకి నాడి , ఉష్ణత్వము , కడుపుబ్బరము మున్నగు వాటిని పరీక్షించి రోగము గురించి తెలుసుకొనవలెను . 


 *  ప్రశ్న  - 


        రోగిని ప్రశ్నించి నిద్ర , ఆకలి , బలము , తాపము , బరువు , శరీరము యొక్క మలమూత్ర ప్రవృత్తి మున్నగునవి తెలుసుకొనవలెను . 


               స్త్రీలైనచో పైన చెప్పిన ప్రశ్నలతో పాటు ఋతుప్రవృత్తి , రుతుశూల , కుసుమాది రోగముల గురించి ప్రశ్నించి తెలుసుకొనవలెను . 


       ఈ మూడు పరీక్షలు చేయనిచో వ్యాధి వైద్యుడను తప్పుదోవ పట్టించును. కావున మూడు పరీక్షలు సంపూర్ణముగా చేసి వ్యాధిని సరిగ్గా అంచనావేసి సరైన ఔషధం ఇవ్వవలెను . 


 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

కామెంట్‌లు లేవు: