24, జులై 2024, బుధవారం

జాషువా కవీంద్రుడు

 గుఱ్ఱము  జాషువా కవీంద్రుడు

(నేటి వర్థంతి సందర్భమున)


' కరుణామయుడు క్రీస్తు ' కమనీయ చరితంబు 

            దివ్యకావ్యంబుగా తీర్చిదిద్ది 

గబ్బిళం , ఫిరదౌసి , కాటిదృశ్యంబుల 

            పద్యంబులను జెప్పి హృద్యముగను

విశ్వనాథకవిచె వినుతించబడియును 

            సాహితీలోకాన సన్నుతొంది 

ధరణికోటందున దంతావళమునెక్కి 

            పురవీధి నూరేగి పొంది ఘనత 

చళపిళ్ల వేంకటశాస్త్రులు చేతితో 

            గండపెండేరంబు కాలి కొంది 

తెలుగు కవనంబు నందున తేజరిల్లి 

పద్మభూషణ బిరుదాన పరిఢవిల్లి 

చరిత కెక్కిన గుఱ్ఱము జాషువాకు 

వందనంబుల నొనరింతు వంచి శిరము.       


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: