1.12d4.;291f5;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*గాంధారి శ్రీ కృష్ణుణ్ణి శపించడంలో 36 సంవత్సరాల ప్రసక్తి ఏమిటి? ఆ సంఖ్య ప్రత్యేకత ఏమిటి?*
➖➖➖✍️
*"ఋషీణాం పునరా ద్యానాం వాచం అర్థోఽనుధావతి "*```
అని భవభూతి మహాకవి అంటాడు (ఉత్తర రామచరితమ్).
మనమందరం ఒక విషయం అనుకొని దానికి తగినట్లే మాట్లాడుతాము. అయితే ఋషుల నోటివెంట వాళ్లు అనుకోకుండానే మాటలు వస్తాయి. దాని ప్రకారమే జరుగుతుంది..అని! (అవి భవితవ్య ద్వారాలు.)
శ్రావణుని తండ్రి శాపం— దశరథుడికి దుఃఖానికి బదులుగా ఆనందం కలిగించింది! ‘ముందు నాకు సంతానం కలుగుతుంది. తర్వాత గదా, పుత్ర వియోగంతో చావు!— అని ఆ సంతోషం.
శాపాలు అందరికీ తగలవు. వాటిని అవసరమైతే తప్పించివేసే శక్తి గలవారి ముందు ఆ మాటలు సాగవు.
శ్రీకృష్ణుడు అలాంటి శక్తిగలవాడు..!
తన బిడ్డలందరూ మరణించారనే దుఃఖంలో ఉన్న గాంధారి పొలికలనిలో (యుద్ధం జరిగి శ్మశానమైన చోట) ఆగ్రహం పట్టలేక శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. అంతకుముందే ధర్మరాజును, భీముణ్ణి చూచి ఆగ్రహం పొంది, వ్యాసమహర్షి మాటలతో కొంత శాంతించింది. దుర్యోధనాదుల శవాలను చూచిన ఆమె దుఃఖాన్ని, ఆమె కోడళ్ళు అనుభవిస్తూన్న నవ వైధవ్యవేదన ఇబ్బడి ముబ్బడి చేసింది.```
పొంగి వస్తూన్న ఆక్రోశంతో —*“నీకు చేతనై యుండి గూడా ఈ జ్ఞాతుల వైరాన్ని నీవు ఆపలేదు. వీళ్ళ చావుకు నీవే కారణం. మీ వంశం గూడా ఇలాగే దాయాదులు ఒకరినొకరు చంపుకొని,*
*నేటికి 36 సంవత్సరాలు దాటిన ఈ రోజుకు నాశనమౌతుంది!”*
*“నీవు గూడా దిక్కు లేని చావు చస్తావు”* అనింది గాంధారి.```
అంతకు ముందే పాండవుల విషయంగా ఆమెను వేదవ్యాసుడు అనునయించాడు:—
“నీవే దుర్యోధనుడు యుద్ధ విజయార్థియై నీ ఆశీర్వాదం పొందగోరి వచ్చి, నీకు మొక్కినపుడు..``` — *యతో ధర్మః తతో జయః*— ```
అన్నావు గదా! —నీ బిడ్డలు మీ మాట వినకుండా ఎప్పుడూ తమకు ఏ అపకారమూ తలపెట్టని సోదరులైన పాండవులను బాధించి తమ దుర్గతికి తామే కారణమైనారు. నీ మాట ప్రకారం చూచినా, పాండవుల వైపే ధర్మమున్నట్టు గదా!”— అని నచ్చ జెప్పాడు.
ఇపుడు మళ్ళీ ఆమె కృష్ణుణ్ణి శపించబోయింది!
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ```
*"నీవు చేయ వలసినది చేయక, నీబిడ్డలను అదుపులో పెట్టుకొనక నన్ను ఆడిపోసుకున్నావు. మాకెట్లాగూ ఋషుల శాపముంది . అది జరిగి తీరుతుంది. నీ పాతివ్రత్యఫలమూ, నీ తపస్సుల ఫలమూ ఎందుకు వ్యర్థం చేసుకుంటావు ? ఇందువల్ల నీకేమి వచ్చింది!"* ```అన్నాడు.```
*కోపము తపమును జెరచును….క్రోధిగాన్ తపస్వికి జన్నే ?* అంటుంది భారతం.
*మా యాదవులను ఒకరు చంపలేరు. కాబట్టి వాళ్లే ఒకరినొకరు చంపుకోక తప్పదు*— ```అన్నాడు శ్రీకృష్ణుడు.
పోనీ! ఆ విధంగానైనా ఆమె దుఃఖ భారం తగ్గిందిలే అనుకుంటాడు ఆయన. ఆ శాపం ఆయన మీద ఏమీ పని చేయలేదు.
(ద్వారకకు ఆ 36 వ సంవత్సరం కృష్ణ దర్శనం కోసం వస్తూన్న కణ్వ, నారద విశ్వామిత్ర ఋషులను, చూచి —పోగాలం దాపురించి ఉన్నందువల్ల — జాంబవతికి కొడుకైన'సాంబుడికి' గర్భవతి వేషం వేసి, యాదవ యువకులు ఆ ఋషులకు అతడి చేత దొంగ దండాలు పెట్టించారు.```
*“స్వాములూ! ఈ నిండు చూలాలికి ఏ బిడ్డ పుడ్తాడు?”* ```అని ఎకసెక్కాలాడారు.```
*"మీ వంశం నాశనం చేసే ముసలం" పుడుతుంది!”* ``` అన్నారు ఋషులు. అట్లే జరిగింది.
ఈ సందర్భంలో 36 సంవత్సరాలు అని గాంధారి ఎందుకు అన్నది? పది, ఇరవై, ముఫ్ఫై అనకుండా 36 ఏమిటి?
ఈ ప్రశ్న చిరకాలం ఆలోచింప జేసింది.
యాదవ పాంచాలుర ప్రమేయంతోనే —-ద్రౌపదితో వివాహమై పాండవులు హస్తినకు వచ్చిన తరువాత— పాండవులకు వాళ్లు జయించుకొని వచ్చిన రాజ్యాలూ(అపుడే అర్జునుడికి “ధనం జయుడు” అనే బిరుదనామం వచ్చింది), పాండురాజు జయించిన రాజ్యాలు చేర్చి అర్ధరాజ్య విభాగం కొత్తగా చేసి ఇచ్చారు.
అది గూడా 5 సంవత్సరాలు తాత్సారం చేసి విధిలేని పరిస్థితిలో ఇచ్చాడు ధృతరాష్ట్రుడు.
వారణావతంలో లక్క యింట తగలబెట్టే పనికి ముందే```
*నిజమైన వారసుడైన ధర్మరాజును రాజును చేయవలెను*```
అనే ఒత్తిడి తన కులపెద్దల నుండి రాగా, విధిలేక నాడు "యువరాజు"ను మాత్రమే చేసి, కాలయాపన చేశాడు ఆ పెదతండ్రి.
పరస్పర వైరాలు కౌరవ పాండవుల మధ్య రోజు రోజుకూ పెరిగి పోతూన్నందువల్ల— ఈ అర్ధ రాజ్య విభాగం అపుడు అనివార్యమయింది. భీష్ముడు మొదలగు పెద్దలకు ఈ పని చేయక తప్పనిదయింది.
జూదంలో రాజ్యాలు పోయి, అరణ్యవాసం ప్రారంభమైన తొలిరోజులలో—శ్రీకృష్ణుడు వాళ్లను కలుసుకొన్నపుడు ఆగ్రహావేశంతో..```
*”ఇపుడే హస్తినకు వెళ్లి భీష్మాదులతో మాట్లాడి ధర్మరాజును పదస్థుణ్ణి చేస్తాను. ఒప్పుకోకుంటే యాదవ పాంచాలురతో కలిసి యుద్ధం చేసి, జయించి ధర్మం నిలుపుతాను"* అంటాడు..```
అర్జునుడు అప్పటికి ఆయనను ఆపుతాడు. (జూదంలో ఓడాము గాబట్టి 13 సంవత్సరాలు పూర్తి కాకుండా అందుకు పూనుకోగూడదని పాండవుల ఆలోచన).
అందుచేత అపుడు కృష్ణుడు విరమించాడు.
కాబట్టి పాండవులకు ఏ కొంచెము రాజ్యమూ ఇవ్వడం —ఏనాడూ కౌరవ శతానికీ, వాళ్ల అమ్మ,అబ్బలకూ కించిత్తు గూడా ఇష్టం లేదు —అనేది నాటి పెద్ద వాళ్లకందరికీ తెలిసిన సత్యం.
తనకు పరాభవం జరగబోయే ముందు ద్రౌపది తనను రక్షించమని ఈ తల్లి వెనక భయంతో దాక్కున్నది.
అంతటి విపత్తులోనూ ఇంటి పెద్ద కోడలిని రక్షించబూనుకోలేదు ఈ గాంధారి..!
ఎట్లయినా సరే —నా బిడ్డలే రాజ్యానికి వారసులు కావాలి — అనే పేరాశ ఆ తల్లికీ లేక పోలేదు.
రాజసూయవైభవం పాండవులకు కలగడం, కృష్ణుడు అవన్నీ వాళ్లకు కలిగించడం —తన బిడ్డలకు ఆ గౌరవం కలగకపోయెనే— అనే బాధ —గూడా ఆ తల్లి హృదయంలో లేవనలేము.
ఇంద్ర ప్రస్థంలో 23 సంవత్సరాల పాండవ వైభవానికి శ్రీకృష్ణుడే మూలకారణం అని ఆమె ఆగ్రహం కావచ్చు.
(ధర్మరాజు పుట్టాడని వినగానే— గర్భవిచ్ఛిత్తి స్వయంగా చేసుకున్న క్రౌర్యం వెనక — *తనకు ముందు బిడ్డ పుడితే— వాడు కౌరవ సామ్రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యే అవకాశం కలుగుతుంది అనే —ఆశే కారణం.)
ఆ నాటికి రాజ్య విభాగం చేసి 36 సంవత్సరాలు అయింది.
రాజ్యవిభాగమే జరిగి ఉండక పోతే— యుద్ధమే వచ్చిఉండదు గదా! రాజ్య విభాగమూ, పాండవులకు వైభవమూ ఈ కృష్ణుడి వల్లనే అని ఆమె బాధ.
ఇంద్రప్రస్థంలో 23 సంవత్సరాలూ + అరణ్య అజ్ఞాతవాసాలు 13 సంవత్సరాలూ చేరి 36 సంవత్సరాలు!
అందుచేత 23+13= 36 సంవత్సరాలు తానూ, తన బిడ్డలూ కృష్ణుడు కారణంగా అనేక బాధలు పడ్డామనీ, ఈయనే ఇంత ఘోర కలికి కారణమనీ ఆమె పట్టరాని ఆగ్రహం పొందింది.
సంఖ్య వరకూ ఎట్లో సరిపెట్టుకున్నా —వెంటనే కాక —
'ఇంక 36 సంవత్సరాల నాటికి —అనడంలో ఆంతర్యమేమో ఊహకు అందలేదు.
ద్వాపర యుగాంతం 36 సంవత్సరాలలో కాబోతున్నదని వాళ్లు గణన చేసి ఉండరని అనుకోలేము.
ఆ కాలంలో జ్యోతిష గణన విశేషంగా ఉన్నట్టు భారత గ్రంథ అంతర్గత సాక్ష్యాలున్నాయి.అది పాక్షిక వినాశమే!
అపుడు మీ వంశంలో ఎవరూ మిగల గూడదు,మీ యాదవకాంతలు గూడా మా వాళ్ల మాదిరిగానే ఏడ్చి అల్లాడాలి —అని ఆమె కోరిక కావచ్చు.
ఒకరి స్వభావాన్ని కష్ట కాలంలో చూడాలి అంటారు.
గాంధారీ ధృతరాష్ట్రుల స్వభావం ఆ వేళలో సుస్పష్టమయింది.
వీళ్ళ నైజం కృష్ణుడికి ఎపుడో తెలుసు. —ఉద్యోగపర్వంలో రాయబారానికి పోయే ముందు ధర్మరాజు — ’మా తండ్రి’ అంటూ రక్త సంబంధ స్నేహాన్ని బట్టి గౌరవం చూపిస్తూ, ‘దుర్యోధనుడి వల్లనే మాకిన్ని కష్టాలు’— అని అన్నపుడు ఒకే మాట అంటాడు
శ్రీకృష్ణుడు.```
*ఆ ధృతరాష్ట్రుడున్ అట్టివాడ. తత్తనయుడ యేల?* అనీ —
*"వారెల్లరు పాముల యట్ల సర్వులకు వధ్యులు"* అనీ అంటాడు.```
శ్రీకృష్ణుణ్ణి భారత యుద్ధం అయిపోయి, ద్వారకకు మరలి పోతూన్నపుడు ఉదంకుడనే ఋషి ఇట్లనే శపించబోతాడు.
కృష్ణుడు జరిగింది చెప్పి, వరమిచ్చి ఆయనను శమింప చేస్తాడు. అత్యంత అధర్మంగా ప్రవర్తించిన అశ్వత్థామను ఒక బ్రాహ్మణుణ్ణి శపించగల యోగీశ్వరుడాయన.
అవతార ప్రయోజనం తీరిపోయి, యాదవులు ఆ విధంగా నిర్యాణం చెందవలసి ఉంది గాబట్టి, ఋషుల శాపాన్ని మరలించే యత్నం చేయదలపెట్టలేదు. రాబోయే విపత్తు తెలిసి, ముందే యాదవ వీరులనందరినీ ప్రభాస తీర్థానికి తరలించి వాళ్లకు సద్గతి కలిగించారు.✍️```
*యిది చదవినవారందరికీ ఆభగవానుడు సద్గతులు కలిగించుగాక!*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి