19, మార్చి 2026, గురువారం

ఉగాది పచ్చడి తినేటప్పుడు



ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ

సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్||

వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.


ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-


అబ్దాదౌ నింబకుసుమం


శర్కరామ్ల ఘృతైర్యుతమ్


భక్షితం పూర్వయామేస్యా


తద్వర్షం సౌఖ్యదాయకమ్॥ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.

కామెంట్‌లు లేవు: