30, మే 2026, శనివారం

సుందరకాండ-హనుమ* *7వ భాగం*

 🌷🪷🏹🛕🏹🪷🌷🔯

      *శనివారం 30 మే 2026*

            

          *బ్రహ్మశ్రీ చాగంటి*    

       *కోటేశ్వరరావు గారి*

          

   *సుందరకాండ-హనుమ*                               

             *7వ భాగం*


సుందరకాండ పారాయణం 

మీ సర్వ సమస్యల పరిష్కారం..

```      

```

*శ్రీమద్రామాయణం గాయిత్రీ స్వరూపం, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చరితం ఓ యదార్థగాధ! ఓ చారిత్రక వాస్తవం!*   


తండ్రీ కొడుకులు, భార్యాభర్తలు,స్నేహితులు, సోదరులు, యజమాని, సేవకుడు, గురుశిష్యులు, రాజు ప్రజలు అనుసరించవలసిన తీరుతెన్నులకు అపురూప అద్వితీయ మానవ సంబంధాలకు శ్రీమద్రామాయణం అత్యంత ప్రమాణం.


*సురస నుండి అభయం పొంది వాయువేగంతో హనుమ ఆకాశమార్గాన వెడుతున్నారు. హనుమకు ఆతిథ్యమివ్వాలని సముద్రం నుండి బయటకు వచ్చిన మైనాకుడి ఎదుట ఇంద్రుడు ప్రత్యక్షమై “ఓ మైనాకుడా నాకు తెలుసు నీవు ఈ సముద్రంలో దాగివున్నావని, రామకార్యం చేపట్టిన హనుమకు సహాయం చేయడానికి ముందుకు వచ్చావు కావున నీ రెక్కలను నరకడం లేదు నిశ్చింతగా వుండు”, అని పలికి మాయమైపోయాడు. 


రామాయణం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు మహర్షి, రామకార్యంపై వెడుతున్న హనుమకు సహాయం చేయాలనే ఆలోచనకే దేవేంద్రుడి నుండి క్షమాభిక్ష లభించింది మైనాకుడికి. 


రామకార్యంపై వెడుతున్న వారికి కేవలం మాట సహాయం చేసినందుకు సంపాతికి పోయిన రెక్కలు వచ్చాయి. 


ఇది రామాయణం యొక్క గొప్పదనం.


*సురస అంటే సంసారం, సురసును దాటి వెళ్ళడం అంటే సంసారమును దాటి వెళ్ళడం. సంసారాన్ని దాటడమే సుందరకాండ తత్వం. 

మనిషి సంసారంలోకి వెళ్ళకుండా వుండిపోవడం కుదరదు, అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేస్తే నాశనమైపోవడం తథ్యం. కామమునకు అర్థమును ధర్మమునిచ్చి ధర్మముతో కట్టి సంసారములో కి ప్రవేశించి, పరిశీలించి, నమస్కరించి, సంసారము యొక్క అనుగ్రహం పొంది వైరాగ్యములోకి అడుగుపెట్టాలి, ఇది కేవలం ప్రజ్ఞావంతులకు మాత్రమే సాథ్యం. ఈ సాధనే సురస నోట్లోకి వెళ్ళి బయటకు రావడం. ఆవిధముగా ప్రజ్జావంతుడైన హనుమ సురసను దాటి కొంతదూరం ముందుకు సాగిపోతుండగా అకస్మాత్తుగా ఆయన వేగం కుంటుపడిపోయింది, ఏదో శక్తి తనను ఆవహించి వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది స్వామికి. నలుదిక్కులా పరికించి చూసారు, సముద్రంలోకి చూసారు, సముద్రంలో ఒక అతిపెద్ద శరీరంతో రాక్షస స్త్రీని గమనించారు. ఆ క్షణమున దక్షిణ దిక్కుకు బయలుదేరుతున్నప్పుడు తన రాజు సుగ్రీవుని పలుకులు జ్ఞాపకం వచ్చాయి హనుమకు. ఆ రాక్షసి సింహిక, సింహిక అపారమైన శక్తి కలది. తన ముందు నిలిచిన వారిని హింసించకుండా తాకకుండా వారికి వున్న శక్తిని తాను హరించే వరం కలది సింహిక. కావున సింహికని సంహరించాలని నిర్ణయించుకున్నారు, కాని సురసకు నమస్కరించారు. సురస భక్షించదు కేవలం పరీక్ష చేస్తుంది. ప్రసన్నం చేసుకుంటే అనుగ్రహించి మార్గదర్శకాన్ని యిస్తుంది, సంసారాన్ని చక్కగా వినియోగించగలిగిన వాడు అర్థాన్ని కామాన్ని ధర్మంతో ముడివేసి, వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి చేరువై పిదప ఈశ్వరుని పొందగలుగుతాడు.


*సింహికను సంహరించడానికి హనుమ ఒక్కసారి తన శరీరాన్ని పెంచగా సింహిక కూడా తన శరీరాన్ని పెంచిన వెంటనే స్వామి సూక్ష్మ రూపమున సింహిక యొక్క శరీరములోకి ప్రవేశించి ప్రాణాలకు పట్టు అయినటువంటి గుండెను ఊపిరితిత్తులను తుంచి లిప్త పాటు సమయమున బయటకు వచ్చేసారు, సింహిక మరణించింది. సింహిక మరణాన్ని చూసిన దేవతలు మహర్షులు జయజయధ్వానాలు పలికి పుష్పవృష్టి కురిపించారు.


*ముందుకి సాగిపోతున్నారు స్వామి హనుమ, మరికొంత దూరం పయనించి ఎదురుగా కనిపించిన లంబపర్వతంపై దిగి ఒక్క క్షణం చూట్టూ చూస్తూ సంతోషంగా వున్నారు స్వామి. 


రామానుగ్రహంతో నూరు యోజనముల సముద్రాన్ని దాటిన యోగిపుంగవుడు, వ్యాకరణ పండితుడు, కపిరాజు అల్లంత దూరమున కనిపిస్తున్న లంకా నగరాన్ని చూడసాగారు.


             *(సశేషం)*``

             *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: