2, జనవరి 2022, ఆదివారం

అమావాస్య పూజ

 🌸🌸🌸🌸🌸🌸🌸

🌷అమావాస్య పూజ🌷


పౌర్ణమి కి వెన్నెల పారాయణ చేస్తున్నారు బాగుంది, మరి అమావాస్య రోజు ఎలా చేయాలి అని అడిగారు కదా... ఏమీ చేయాలో ఎలా చేస్తే మంచిసో చూద్దాం...


అమావాస్య రోజు ముజ్యంగా లక్ష్మీ దేవిని, భైరవుడిని, కాళీ మాతను, దుర్గా దేవిని, విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్ది గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపము చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి.. అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ  ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టాలి మీరు తీసుకోవాలి..


1.అమావాస్య రోజు లక్ష్మీ దేవిని పూజించాలి అనుకునే వారు.. మీకు నేను ఇచ్చిన కమలాత్మిక హైమావతి సంపుటికరణ చేసి ఇచ్చిన అష్టోత్తరం తో అర్చన చేసి కమలాత్మిక స్త్రోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి.. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లి పాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది , రావాల్సిన ధనం కి ఆటంకాలు పోతుంది, వృత్తిలో, వ్యాపారం లో అధిక లాభాలు వస్తుంది.. కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజ్ఞాలు తొలగుతుంది.. భార్య స్త్రోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదు..ఈ శ్లోకాలు అన్ని గ్రూవ్ లో ఉన్నాయి గమనించండి..


2.  అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు, ఆస్తి గోడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి  మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిష్ఠి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగి పోతుంది... భైరవుడు ఎన్నో జప మంత్రాలు శ్లోకాలు గ్రూవ్ లో పెట్టాను అవి చేయవచ్చు.. ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి బైరావుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి , తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది.. బైరావుడిని తీపి పదార్ధంలో లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగి పోతుంది..


3. కాళీ మాతకు విశేషం మైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్త్రోత్రం చేసి హారతి ఇవ్వాలి.. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు  ఆ అరటిపండు తాంబులం ఇవ్వాలి ఆమె స్వయంగా స్వీకరిస్తుంది .


4. దుర్గా మాత నా తల్లి విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గ రూపం నా ఆరాధ్య దైవం , ఆ రోజు పసుపు నీళ్లతో  అభిషేకం చేయాలి వేప మండలు అలంకారం చేయాలి అంబలి (అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం) నైవేద్యం పెట్టి  దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్త్రోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకుని తాగాలి.. అన్ని రకాల విజ్ఞాలు ,ఆపదలు తొలగిస్తుంది కుటుంబానికి రక్షణ కవచం లా కాపాడుతుంది.. ముఖ్యంగా మిరియాలు పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి అది పూజ తర్వాత కుక్కకు పెట్టి తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది.


అన్ని బాగానే ఉంది అన్ని చేయాలి అనిపిస్తుంది కదా అన్ని చేసిన గంట సమయం కన్నా పట్టదు అన్ని స్త్రోత్రలు ఇదే గ్రూప్ లో ఉన్నాయి లేదా మీదగ్గరే బుక్స్ ఉంటుంది చూసి చేయండి.. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు పూజ చేయకపోయినా... ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు ఉపవాసం అవసరం లేదు..

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌿🌿


👉అద్దె ఇంటిలో ఉండే వారు అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే చాలు అది కుళ్ళిన తర్వాత మార్చాలి, అదే సొంత ఇల్లు అయితే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయతోనే దిష్టితీసి పగలగొట్టి కొత్త గుమ్మడి కాయ గుమ్మానికి కట్టాలి. ఇలా తరచుగా చేస్తే ఇంటికి యజమానికి క్షేమం..


వ్యాపారస్థలంలో అయితే సొంతం అయినా అద్దె అయినా ప్రతి అమావాస్య కి గుమ్మడికాయ కొట్టాలసిందే, వ్యాపార స్థలంలో మంగళవారం నాడు గుమ్మం ముందు నిమ్మకాయ రెండుగా కోసి కుంకుమ అద్ది ప్రవేశద్వారం వద్ద గడపకు అటూఇటూ ఉంచి మరుసటి రోజు తీసి పడేయాలి.


👉గుమ్మడికాయ లో అధికశాతం మెగ్నీషియం ఉంటుంది కనుక తరచుగా తింటే ఎముకలు గట్టి పడతాయి


ఇంటి యజమాని నిదిరించే గదిలో నైరుతి ములలో రాళ్లఉప్పు ఒక కప్ బౌల్ లో ఉంచాలి అలా మూడు రోజులు ఉంచాక దాన్ని తీసి దూరంగా ఎక్కడైనా మురికి గుంటలో కానీ పారె నీటిలో కానీ పడేసి రావాలి.. తరచుగా వచ్చే తగాదాలు తగ్గుతుంది. దిష్టి పోతుంది..ధనం నిలుస్తుంది. 


👉 కొందరు ఆడవాళ్లకు తల చిక్కు తీసిన వెంట్రుకలు ఇంట్లో దాచే అలవాటు ఉంటుంది అది అన్ని రకాల దరిద్రాలకు ఆహ్వానం చెప్తుంది.. ఇది వరకు కాలంలో ఇంటిబయట సపారులో గూటిలో వెంట్రుకలు దాచి సవరం కట్టుకుని వారు కానీ ధాన్యం ధనం నిలువ ఉండే గృహంలోపల పెట్టేవారు కాదు.

🌷శ్రీ మాత్రే నమః🌷

1, జనవరి 2022, శనివారం

హనుమాన్ చాలీసా

 ॐ హనుమాన్ చాలీసా


31. అష్టసిద్ధి నవనిధి కే దాతా I 

        అసవర దీన(న్హ) జానకీ మాతా ॥ 


    - అణిమాద్యష్టసిద్ధులను, నవనిధులను సంప్రాప్తింప చేసేవాడివి.

      సీతాదేవి ఆవిధంగా వరం నీకు ఒసగింది.


    - Mother Sita granted you the boon that 

       you will be the bestower of the eight powers and nine wealths.


వివరణ


 అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?


అష్టసిద్ధులు...


1.అణిమ,2.మహిమ3. గరిమ,4.లఘిమ,5.ప్రాప్తి, 6.ప్రాకామ్యము,7.ఈశత్వం,8.వశిత్వం.


1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట

2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట

3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట

4) లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట

5) ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట

6) ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట

7) ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట

8) వశిత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట


నవనిధులు...


1. పద్మం,2. మహాపద్మం,3. శంఖం,4. మకరం,5. కచ్చపం,6. ముకుందం,7. కుందం, 8.నీలం, 9. ఖర్వం


(ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి)


          ఆంజనేయ స్వామి సురస పరీక్షను ఎదుర్కొనే సమయంలోనూ,

          సింహికను సంహరించు సమయానా తాను స్వయంగా అణువులా మారి నోటిలో వెళ్ళి తిరిగి బయటకు రావడం మనకు తెలిసిన విషయమే... 

          అలానే సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు.. 

          ఆంజనేయస్వామికి ఇన్ని శక్తులున్నా, అవసరమైనమేరకే విచక్షణతో వాటిని ఉపయోగిస్తారు.

          శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు.. కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప... 

          వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. 

          అందుకే హనుమ గొప్ప నమ్మకస్థుడు, భక్తుడు, దైవం అయ్యారు...


    బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారి వివరణ 👇


    https://youtu.be/rax3zcZJszQ


                    =x=x=x=


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

31, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీకృష్ణదేవరాయలకు

 శ్రీకృష్ణదేవరాయలకు దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిందెవరో తెలుసా ?

...............................................................

శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయయాత్రలో విజయవాటిక అంటే విజయవాడలో కొన్నాళ్ళు వున్న తరువాత శ్రీకాకుళంలోని ఆంధ్రమహ విష్ణువు దర్శనార్థమై వెళ్ళాడు. అక్కడ ఏకాదశి ఉపవాసం వుండి రాత్రి నిద్రించాడు. ఆ రాత్రి నాల్గవ యామంలో శ్రీకృష్ణరాయడుకి స్వామి కలలో కనిపించి ఇంతవరకు అనేక ప్రాంతాలు జయించావు. సంస్కృతంలో మదాలస చరిత్రము, సత్యవధూప్రీణనం, సకలకథాసార సంగ్రహం, సూక్తినైపుణి జ్ఞానచింతమణి, రసమంజరి ఆనే గొప్ప సంస్కృత గ్రంథాలను వ్రాశావు.


కాని దేశభాషలందు తెలుగు లెస్స కాబట్టి శ్రీవైష్ణవ అళ్వారులలో ఒకత్తైన గోదాదేవి చరిత్రను తెలుగులో వ్రాయమన్నాడు. అలా శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో వ్రాసినదే అముక్తమాల్యదగా పిలవబడిన విష్ణుచిత్తియమనే గ్రంథం.


అళ్వారులు 12 మంది, వీరు శ్రీవైష్ణవభక్తులు. తమిళసాహిత్యంలో విష్ణువు మీద 4 వేలవరకు పాశురాలను తమిలంలో వ్రాశారు. వీటికే దివ్యప్రబంధాలని పేరు.

12 మంది అళ్వారులలో గోదాదేవి ఒక్కర్తే స్త్రీ.


ఆళ్వారులు12 మందని చెపుకొన్నాము కదా ! వారెవరంటే.


 (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్ (12) గోదాదేవి.


దేశభాషలలో తెలుగు లెస్స అని శ్రీకృష్ణరాయల కంటే చాలా ముందుగానే పలికినవాడు క్రీడాభిరామమనే గ్రంథాన్ని వ్రాసిన వినుకొండ వల్లభరాయుడు.


వల్లభరాయుడు శ్రీనాథకవికి సమకాలికుడు. వల్లభరాయునికి క్రిడాభిరామ గ్రంథరచనలో సాయ పడ్డాడు కనుకనే కొంతమంది సాహితి విమర్శకులు క్రీడాభిరామ కావ్యాన్ని వ్రాసింది శ్రీనాథకవి సార్వభౌముడేనంటారు.

............................................................................జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.

30, డిసెంబర్ 2021, గురువారం

డయాబెటిస్‌కు

 డయాబెటిస్‌కు శుభవార్త.

 

ఈ సమాచారం అవసరమైన వారికి సహాయపడటానికి మీరు ఈ క్రింది సందేశాన్ని ఫార్వార్డ్ చేయగలరని ఆశిస్తున్నాము ...!

 

ఒక మహిళ (65) గత 20+ సంవత్సరాలుగా డయాబెటిస్ కలిగి ఉంది మరియు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. ఆమె పక్షం రోజులపాటు ఇంటిలో తయారు చేసిన (medicine) ఔషధాన్ని ఉపయోగించింది మరియు ఇప్పుడు ఆమె డయాబెటిస్ నుండి పూర్తిగా ఉచితం మరియు స్వీట్స్‌తో సహా ఆమె ఆహారాన్ని సాధారణమైనదిగా తీసుకుంటుంది.

 

ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెరను నియంత్రించే మందులను ఆపమని వైద్యులు ఆమెకు సూచించారు. దయచేసి మీ అందరికీ ఈ క్రింది మెసేజ్ ను మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపించి, దాని నుండి అధిక ప్రయోజనం పొందమని నేను కోరుతున్నాను.

 

DR. టోనీ అల్మైడా

 (బొంబాయి కిడ్నీ స్పెషాలిటీ నిపుణుడు) పట్టుదల మరియు సహనంతో విస్తృతమైన ప్రయోగాలు చేసి మధుమేహానికి విజయవంతమైన చికిత్సను కనుగొన్నారు.

ఇప్పుడు డయాబెటిస్ కారణంగా చాలా మంది ప్రజలు, వృద్ధులు మరియు మహిళలు చాలా బాధపడుతున్నారు.

 

 కావలసిన పదార్థాలు

 1 - * గోధుమ 100 గ్రా

 2 - * బార్లీ 100 గ్రా 

 3 - *నల్లజీలకర్ర (కొలుంజీ) 100 గ్రాములు *

 కొలుంజీ తమిళంలో * కరుంజీరాహం*

తయారీ విధానం:

 పైన పేర్కొన్న అన్ని పదార్థాలను 5 కప్పుల నీటిలో ఉంచండి.

దీన్ని 10 నిముషాలు మరిగించాలి 

స్వయంగా చల్లారాలి!


ఇది చల్లగా మారినప్పుడు, వడపోసి ఒక గాజు పాత్ర లేదా సీసాలో ఈ నీటిని నిలువ చేయండి!

 

 దీన్ని ఎలా వాడాలి?

ప్రతిరోజూ ఉదయాన్నే మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నీటిని ఒక చిన్న కప్పు తీసుకోండి.

దీన్ని 7 రోజులు కొనసాగించండి.

వచ్చే వారం అదే కానీ ప్రత్యామ్నాయ రోజులలో (రోజుమార్చి రోజు) పునరావృతం చేయండి. ఈ 2 వారాల చికిత్స తో మీ ఆరోగ్యం మామూలుగా మారిందని మీరు ఆశ్చర్యపోతారు. 

 సమస్య లేకుండా సాధారణ ఆహారం తీసుకోవచ్చును!

 

గమనిక:

దీన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని ఒక అభ్యర్థన, తద్వారా ఇతరులు కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.

 

 ఇవి అన్ని సహజమైనవి, వాటిని తీసుకోవడం హానికరం కాదు. ఈ చికిత్స గురించి నైపుణ్యం ఉన్నవారు ఏ హాని లేకుండా ప్రయత్నించవచ్చు.

 

మరోసారి ఈ సందేశం పంపినందుకు ధన్యవాదాలు ...

చాలా మందిని చక్కెర వ్యాధి నుండి కాపాడండి .... (డయాబెటిస్)

సర్పబంధనం

 సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీ "సర్పబంధనం" .అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్ లు లేవు కాబట్టి వారు విలువైన సంపాదన సర్పబంధనం వేసేవారు. అది ఎవరైన తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి.మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు.....? పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట లోతుగా అంటే ఒక తాటి చెట్టు అంత లోతు తవ్వి అందులో సంపద పెట్టి కొంత మట్టి వేసి తరువాత కొన్ని టన్నుల బెల్లం వేసి పెట్టేవారు. ఆ బెల్లం కోసం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చీమలు వచ్చి చేరి పెద్ద చీమల పుట్ట ఏర్పడేది.చీమల పుట్ట లే కదా పాములకు ఆవాసాలు అయ్యేవి.అంత పెద్ద చీమల పుట్ట లో వందల సంఖ్యలో పాములు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కాలక్రమం లో అవి లక్షల్లో చేరుతాయి. అలా సర్పాలకు ఆవాసమయిన ఆ గుంత సర్ప గృహం గా మారుతుంది. పుట్ట కాదు సర్ప గృహం. అది ఎవడైనా తవ్వితే వేల సంఖ్యలో విష సర్పాలు బయటికి వచ్చి వాటి కాటుకు మరణిస్తాడు.


ఆ సంపద తీయలనుకున్నప్పుడు నిపుణుడు అయిన వ్యక్తి అక్కడ సమీపం లో మరొక గుంత తొవ్వి మళ్ళీ సేమ్ బెల్లం తో పెద్ద చీమల పుట్ట ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో హోమం నిర్వహించి ఆ పొగ కు ఆ పాములు అన్ని అక్కడి నుండి వేరే పుట్టలోకి పోయిన తరువాత ఆ సంపద తిరిగి రాజ్యానికి చేర్చేవారు అని "తంత్ర శాస్త్రం" చెబుతుంది

జ్ఞాన మండలి

 జ్ఞాన మండలి...


 రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... 

భగవంతుడు అంటే ఏమిటి...

అంటే.....

ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 


కాబట్టి ఓపిక చేసుకుని... 

ఈ చిన్న కథను చదవండి. 


ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 

అవి... 


1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 

3.దేవుడు ఏం చేస్తాడు? 


ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.


తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 

శాస్త్రకారులను, 

మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 

వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 

దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.


ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. 

రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.


పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘చెప్పేవాడు గురువు, 

వినేవాడు శిష్యుడు. 

గురువు పైన ఉండాలి, 

శిష్యుడు క్రింద ఉండాలి’ 

అని కండీషన్ పెట్టాడు . 


దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 

పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 


‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 


మొదటి ప్రశ్న

దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.


వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.


మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.


ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.


మరి ఇక రెండవ ప్రశ్న.... 


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు.


‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 

పాలు తెచ్చారు.

‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.


‘పాలను బాగా మరుగబెట్టాలి. 

వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 

పెరుగు సిద్ధం అవుతుంది. 

దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.


‘సరిగ్గా చెప్పారు మహారాజా! 

అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 

మనస్సు అనే తోడు వేసి, 

స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 

సాధన అనే కవ్వంతో చిలికితే 

జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


ఇక చివరి ప్రశ్న. 

దేవుడు ఏం చేస్తాడు? అని.


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.

క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 

పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 

దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.


సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 

పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.  


మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..

మంచిని నేర్చుకుందాము..  

మంచిని ఆచరించుదాము... 

మంచిని అందరికి పంచుదాము... 


హరే కృష్ణ 🙏

27, డిసెంబర్ 2021, సోమవారం

ఆయుర్వేద ఔషధాలలోని రకాలు -

 ఆయుర్వేద ఔషధాలలోని రకాలు - 


 * కషాయము - 


     కషాయము కాచునప్పుడు పైన మూత వేయకుండా కాయవలెను . మూసినచో కషాయము చెడిపోవును . కషాయము నందు ఉపయోగించవలసిన ద్రవ్యములు దినుసు (మూలిక) 4 తులముల చొప్పున గ్రహించి వాటిని మెత్తగా నలుగగొట్టి కొత్త కుండ యందు వేసి అందు 2 శేర్ల మంచినీటిని పోసి మందాగ్ని చేత కాచి అష్టాశముగా దింపి వడగట్టి బాలురకు పావుతులము నుంచి తులము మోతాదులో మరియు పెద్దవారికి 4 తులముల మోతాదు వరకు ఇవ్వవచ్చును . ఇందు చక్కర చేర్చవలసి వచ్చిన వాతరోగులకు 4 వ భాగము , పిత్తరోగులకు 8 వ భాగము , శ్లేష్మరోగులకు 16 వ వంతు ఇవ్వవలెను . తేనె కలుపవలసి వచ్చిన శ్లేష్మరోగులకు 4 వ వంతు , పిత్తరోగులకు 8 వ వంతు , వాతరోగులకు 16 వ వంతు చేర్చవలెను . జీలకర్ర , గుగ్గిలము , శిలాజిత్ , క్షారములు , ఇంగువ వంటివి పావుతులము కన్నా ఎక్కువ చేర్చకూడదు . 


 * కల్కము - 


      అల్లము తదితర శుష్కపదార్థాలను ఉదకము ( నీరు ) చే నూరి తీసేడు రసమును కల్కము అందురు . ఈ కల్కము నందు ద్రవ్యము తులప్రమాణములో ఉండవలెను . ఈ కల్కమున నెయ్యి , తేనె , నూనె కలపవలసి వచ్చినప్పుడు ఒకదాని మీద మరొకటి రెట్టింపుగాను , బెల్లము మరియు చక్కెర సమభాగాలుగా చేర్చవలెను . 


 * చూర్ణము - 


      ఎండిన ద్రవ్యములను మెత్తగా నూరి వస్త్రగాలితము ( మెత్తని వస్త్రము నందు నూరిన చూర్ణం వేసి జల్లెడ పట్టుట ) చేసి అరతులము నుంచి 1 తులము వరకు , చిన్నవారు ఒక మాషము ( 1 గ్రాము ) నుంచి 3 మాషములు 

(3 గ్రాములు ) వరకు దేహతత్వమును , వ్యాధి బలమును , దేశ కాలభేదములను బట్టి గుర్తెరిగి పుచ్చుకొనవలెను . 


            ఈ చూర్ణములో బెల్లము కలపవలసి వచ్చిన చూర్ణపు మోతాదుకు సమానంగా , చక్కెర కలపవలసి వచ్చిన చూర్ణముకు రెట్టింపు మోతాదులో కలపవలయును . ఇందు ఇంగువను కలపవలసి వచ్చిన ఇంగువను నేతితో పొంగించి కలుపవలెను . నెయ్యి కలపవలసి వచ్చిన ఇంగువకు రెట్టింపు మోతాదులో , నీటిని కలపవలసి వచ్చిన చూర్ణముకు నాలుగురెట్లు చేర్చవలెను . 


                 చూర్ణము అయినను , మాత్రలు అయినను , లేహ్యమైనను , కల్కమ్ అయినను సేవించిన పిదప పాలు మొదలగువాటిని తాగవలసిన యెడల వాతరోగము నందు 12 తులములు , పైత్యరోగము నందు 8 తులములు , శ్లేష్మరోగము నందు 4 తులములు పుచ్చుకొనవలెను . 


     చూర్ణమును భావన ( నానబెట్టి ఆరబెట్టుట ) చేయవలసిన చూర్ణమును , చూర్ణం మునుగునంతవరకు రసము పోసి ఆ రసం ఇగురునంత వరకు భద్రపరచి ఉంచవలెను . ఒకసారి భావన చేయుటకు 24 గంటలు పట్టును . 


 * ఔషధాలు పుచ్చుకొనవలసిన కాలనిర్ణయం - 


      చూర్ణరూపము , కషాయ రూపము మొదలగు ఔషధములను ఉదయము మరియు సాయంకాలము పుచ్చుకొనవలెను . ముఖ్యముగా ఉదయం ప్రాతఃకాలం అనగా సూర్యాస్తమయానికి ముందు సాయంకాలం సంధ్యాసమయం తరువాత అనగా చీకటి పడిన తరువాత పుచ్చుకొనుట ఉత్తమం . అసాధ్యరోగములకు అనేకసార్లు , వమనము , విరేచనాదులకు ప్రాతఃకాలము నందు కలికాదులకు సాయంత్రసమయం ఉత్తమం . 


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేదం 


                  9885030034

26, డిసెంబర్ 2021, ఆదివారం

కేదార్‌నాథ్_దేవాలయం_పరిష్కరించని_రహస్యం_కోడ్

 #కేదార్‌నాథ్_దేవాలయం_పరిష్కరించని_రహస్యం_కోడ్

కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై చాలా చర్చ జరుగుతోంది.పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు.


కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది.  ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది.


21వ శతాబ్దంలో కూడా కేదార్‌నాథ్ సమీపంలోని భూమి చాలా ప్రతికూలంగా ఉంది.  కేదార్‌నాథ్ పర్వతం ఒకవైపు 22,000 అడుగులు, 

మరోవైపు #కరచ్‌కుండ్ 21,600 అడుగుల ఎత్తు, #భరత్‌కుండ్_మూడో_వైపు_22700 అడుగుల ఎత్తు ఉన్నాయి.ఈ మూడు పర్వతాల నుండి ప్రవహించే ఐదు నదులు #మందాకిని, 

#మధుగంగ_చిర్గంగా_సరస్వతి మరియు #స్వరందరి.  ఇది పురాణాలలో ప్రస్తావించబడింది.


ఈ ప్రాంతం "#మందాకినీ_నది" ఉన్న ఏకైక రాష్ట్రం.  చల్లని రోజున భారీ మంచు మరియు వర్షాకాలంలో భారీ వర్షం.  ఇంత శత్రుభూమిలో గుడి కట్టాలంటే ఎంతో అధ్యయనం చేయాల్సి వచ్చేది.


  ఈ రోజు కూడా మీరు "కేదార్‌నాథ్ ఆలయం" ఉన్నంత వరకు డ్రైవ్ చేయలేరు.  అలాంటి స్థలంలో ఎందుకు నిర్మించారు?  అది కాకుండా, 100-200 కాదు, 1000 సంవత్సరాలకు పైగా, ఇంత ప్రతికూల పరిస్థితిలో ఆలయం ఎలా మనుగడ సాగిస్తుంది?  మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి.  10వ శతాబ్దానికి చెందిన పక్షంలో ఈ ఆలయం భూమిపై చిన్న "మంచు యుగం" కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.


  డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ వారు కేదార్‌నాథ్ ఆలయ శిలలపై "#లిగ్నోమెట్రిక్_డేటింగ్" పరీక్షను నిర్వహించి ఆలయం ఉన్న ప్రదేశానికి సమీపంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేలా చూసుకున్నారు.  "రాతి జీవితాన్ని" గుర్తించడానికి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.  14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని ఈ పరీక్షలో తేలింది.  అయితే ఆలయ నిర్మాణంలో ఎలాంటి నష్టం జరగలేదు.


  2013లో కేదార్‌నాథ్‌లో వరదలు వచ్చినప్పుడు అందరూ చూసి ఉంటారు.  ఈ కాలంలో వర్షపాతం "సగటు కంటే 375%" ఎక్కువ వర్షం కురిసింది.  తదుపరి వచ్చిన వరదలలో కనీసం 5,748 మంది మరణించారు (ప్రభుత్వ గణాంకాలు).  4200 గ్రామాలు దెబ్బతిన్నాయి.  భారత వైమానిక దళం ద్వారా 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలు విమానంలో సురక్షిత స్థలానికి చేరారు.కానీ ఈ విపత్తు వరదలో కూడా, కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం కొంచెం కూడా ప్రభావితం కాలేదు.


ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, వరద తర్వాత కూడా, ఆలయ మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం దేవాలయాలు పూర్తిగా రక్షించబడ్డాయి.  2013 వరదల సమయంలో భవనానికి ఎంత నష్టం జరిగిందో, ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు "IIT మద్రాస్" ఆలయంపై "NDT పరీక్ష" నిర్వహించింది.  ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా చెప్పారు.


1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతంలో ప్రతిదీ ప్రవహించే చోట, ఒక్క నిర్మాణం కూడా మిగిలి లేదు.  ఈ దేవాలయం మనసులో నిలిచి ఉంది మరియు నిలబడడమే కాకుండా చాలా బలంగా ఉంది.  ఈ ఆలయాన్ని నిర్మించిన తీరు చూస్తే నమ్మండి.  ఎంపిక చేయబడిన స్థలం.  ఈ వరదలో ఈ ఆలయం తన కాళ్లపై తాను నిలబడగలిగినందుకు ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి మరియు నిర్మాణమే కారణమని నేడు శాస్త్రం చెబుతోంది.


  ఈ ఆలయం "ఉత్తర-దక్షిణ"గా నిర్మించబడింది.  కేదార్‌నాథ్ నిర్మాణం "దక్షిణ-ఉత్తరం" అయితే భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు "తూర్పు-పడమర"గా ఉన్నాయి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలయం "తూర్పు-పశ్చిమ" గా ఉంటే, అది ఇప్పటికే నాశనం కాబడి ఉండేది.  లేదా కనీసం 2013 చివరి నాటికి నాశనం చేయబడి ఉండేది.


  కానీ ఈ దిశ కారణంగానే కేదార్‌నాథ్ ఆలయం మనుగడలో ఉంది.  ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.  విశేషమేమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు, అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి?  అప్పట్లో అంత పెద్ద రాయిని మోసుకెళ్లే పనిముట్లు లేవు.  ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే, వాతావరణంలో తేడాలు ఉన్నప్పటికీ, మంచు కింద ఉన్న 400 సంవత్సరాల తర్వాత కూడా దాని "గుణాలు" మారలేదు.

 

అందువల్ల, ఆలయం ప్రకృతి చక్రంలో తన బలాన్ని నిలుపుకుంటుంది.  ఆలయంలోని ఈ బలమైన రాళ్లను ఎటువంటి సిమెంట్ ఉపయోగించకుండా "#ఆష్లర్" పద్ధతిలో కలుపుతారు.  అందువల్ల, రాతి కీళ్లపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది.  2013లో విత ఘాలాయికి గుడి వెనుక భాగంలో పెద్ద రాయి చిక్కుకుపోయి నీటి అంచు పగిలిపోయింది.  మరుసటి రోజు భారత వైమానిక దళం ఎవరిని హెర్లిఫ్ట్ చేసింది.


  విశ్వాసం ఉందా లేదా అనేది ప్రశ్న.  కానీ 1200 సంవత్సరాలకు పైగా సంస్కృతిని మరియు శక్తిని నిలుపుకునే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, దాని దిశ, సారూప్య నిర్మాణ వస్తువులు మరియు ప్రకృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నారనడంలో సందేహం లేదు.  టైటానిక్ మునిగిపోయిన తర్వాత, పశ్చిమ దేశాల ప్రజలు "NDT పరీక్ష" మరియు "ఉష్ణోగ్రత" ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు.  కానీ మనం 1200 సంవత్సరాల క్రితం ఇది ఇలా అని అనుకున్నాం.


కేదార్‌నాథ్ అదే స్పష్టమైన ఉదాహరణ కాదా?  

కొన్ని నెలల వర్షం, 

కొన్ని నెలలు మంచు, మరియు కొన్ని సంవత్సరాలు మంచు, ఇప్పటికీ మంచు, గాలి మరియు వర్షంతో కప్పబడి ఉంటుంది.  మరియు 6 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్ యొక్క బలాన్ని బట్టి, మనం ఆలోచించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఎంత సైన్స్ ఉపయోగించబడింది ఇక్కడ.


ఈరోజు, అన్ని వరదల తరువాత," కేదార్‌నాథ్ శాస్త్రవేత్తల సృష్టికి మేము మరోసారి నమస్కరిస్తున్నాము.


వైదిక హిందూధర్మం  మరియు సంస్కృతి ఎంత ముందున్నాయో ఇదొక ఉదాహరణ.

  ||  ఓం నమః శివాయ ||


సేకరణ..

డా॥కె.యు.గిరిధర్

సాధన -3

 సాధన -3

 శరీర సంసిద్ధత 

వంట చేయాలంటే ముందుగా వంటకు వాడే పాత్రలు శుభ్రంగా తోముకొని స్వచ్ఛమైన నీటితో కడుగుకొని వుంచుకుంటాము. అదే విధంగా బియ్యం, పప్పులు, కూరలు మరియు ఇతర వంటకు పనికివచ్చే దినుసులన్నీ స్వచ్ఛమైనవిగా చూసుకొని అప్పుడు కానీ పొయ్యిమీద గిన్నె పెట్టాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటె మనం వండుకునే వంటకం స్వచ్ఛముగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము. 

సాధకుడు తను ఆ అనంతునివైపు పయనించే సాధన చేయాలంటే తన సాధనకు ఉపకారంగా వున్న శరీరాన్ని కూడా శుభ్రంగా, శుచిగా, శుద్ధంగా సిద్ధం చేసుకోవాలి కదా. ముందు శరీరం శుచిగా ఉంటే అప్పుడు మనస్సు కూడా శుచిగా ఉండి చక్కగా  సాధనకు సహకరిస్తుంది. 

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అంటే శుభ్రంగా స్నానం చేయటం అని మనం అనుకుంటాము.  అది కూడా నిజం చక్కగా స్నానమాచరించాలి, అంతేకాక తలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే బుద్ధికుడ శుభ్రంగా అవుతుంది. సాధకునికి దేహ మొహానికి కారణం శిరోజాలు అంటే తలవెంట్రుకలు. అధర్వణ వేదాంతర్గత మైనట్టి ముండకోపనిషత్తు సాధకుని ముందుగా ముండనం చేసుకొని అంటే గుండు చేయించుకోమని తెలుపుతున్నది. ఎప్పుడైతే సాధకుడి తలబొడిది అవుతుందో అప్పుడు అతని బుద్ధికుడ శుభ్రంగా మారుతుంది. మనం తెలుసుకున్న యోగ పురుషులు, ఉదాహరణకు శ్రీ రామకృష్ణ, శ్రీ రమణులు ఇంకా అలంటి వారి కోవకు చెందిన అనేక మహానుభావులు వారి తలలను బోడిగా వుంచుకోవటమే ఇందుకు  నిదర్శనం. ఇప్పుడు కూడా అనేక మంది సన్యాసజీవనాన్ని గడుపుతున్న మహానుభావులు కూడా వారి తలలను బోడిగానే ఉంచుకుంటున్నారు. కాకపొతే సంసార జీవనాన్ని గడుపుతున్న సాధకులు మాత్రము పూర్తిగా బోడి గుండు కాకుండా శిఖను (పిలకను) ధరించాలి. మన సనాతన ధర్మంలో బ్రాహ్మణులకు ఈ రకమైన సంప్రదాయం ఉండటం బహుశా వారి మానసిక ఉన్నతికి తోడ్పాటుకొరకే అయివుండొచ్చు. ఇప్పుడు గుండు పిలక కలిగిన బ్రాహ్మణులను చాలా తక్కువగా చూస్తున్నాము.  కానీ సాధకుడు మాత్రం విధిగా తన సాధనకొరకు గుండు పిలక కలిగి  ఉండాలి. అప్పుడే సాధన సక్రమంగా కొనసాగుతుంది. 

కేశాలను అలంకరించుకొని, ఇంకా మాట్లాడితే రంగు దిద్దుకొని వేదాంత మాటలు చెప్పే వారిని కేవలము మూర్ఖులుగా భావించాలి. తానూ ఆచరించక ఇతరులకు చెప్పటం పెద్ద దోషం. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  సమాజం నా గూర్చి ఏమనుకొంటుందో అనే భావనను పూర్తిగా విడనాడాలి. ఈ సమాజానికి మనం ఎలా కనబడితే అలానే చూస్తుంది. ఒకరికోసం కాదు జీవనం. సాధకుని ఆధ్యాత్మిక అభివృద్ధి అది కేవలం అతని వ్యక్తిగతం. ఎన్నో విధాల శ్రమదమాలను ఓర్చుకుంటేనే సాధన నిరంతరాయంగా సాగుతుంది. 

సాధకుడు సామాజిక జీవనానికి తక్కువ ప్రాధాన్యత, ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయం సదా జ్ఞ్యాపకం ఉంచుకోవాలి. ముముక్షువు లక్ష్యం ఎప్పుడు మోక్షం మీదనే ఉండాలి.  ఈ సమాజంలో ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.  సాధకుడు తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకుంటే పూర్తి ప్రకృతి శక్తులు తన వశం అవుతాయి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



* రాక్షసులతో సమానులు

* రాక్షసులతో సమానులు ఏవరు ?

 

1. రాజాజ్ఞ మీరినవారు.

2. ఆధారం లేక అప్పు చేసినవారు.

3. తనంతటి వాడు లేడని గర్వించేవాడు .

4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.

5. చేసిన ఉపకారాన్ని మరిచేవాడు.

6. ఆడదాని మాటలు విని కలహించేవాడు.

7. నమ్మించి మోసగించేవాడు.

8. స్త్రీని బలాత్కారంగా అనుభవించేవాడు.

9. నిరసంగా పరిహసించువాడు .

10. సభకు విగ్నం కలిగించువాడు.

11. పురుషుని అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .

12. హంతకుడు.