5, జూన్ 2024, బుధవారం

శ్రీమన్నారాయణ మూర్తి

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*

        *అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే*

        *దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం*

        *నారాయణ ప్రణయినీ సయనాంబువాహః* (08)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: చాతకపక్షిపిల్ల ఎండవేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయుప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షికూన తాపంబాపి, వాన చినుకులచే దప్పికదీర్చి, తృప్తి కల్గించిన విధంగా, శ్రీమన్నారాయణ మూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి యొక్క కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలిచే ప్రేరితమై బహుకాలార్జితమైన *దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి, ధనమనే వానగురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తి కల్గించుగాక*!

4, జూన్ 2024, మంగళవారం

శ్రీ మల్లికార్జున ఆలయం

 🕉 మన గుడి : నెం 338


⚜ కర్నాటక  :-


తొడికాన - దక్షిణ కన్నడ ప్రాంతం


⚜ శ్రీ మల్లికార్జున ఆలయం



💠 ప్రకృతి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. వైద్య ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచే ఆలోచనలు ఈ ప్రకృతిలో దాగి ఉన్నాయి. ఆధునిక కాలంలో అద్భుతాలు గుర్తించబడనప్పటికీ, ప్రజల విశ్వాసం మరియు ఆచరణ కారణంగా అద్భుతాలు ఇప్పటికీ ఆసక్తికరంగా ఉన్నాయి.


💠 దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకాలోని ఆలయంలో నేటికీ ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 

సుళ్య తొడికలోని శ్రీ మల్లికార్జున దేవాలయం చెరువులో దేవుడి చేపలకు తిండి తినిపిస్తే ముఖంపై ఉన్న చర్మవ్యాధులన్నీ నయమవుతాయని భక్తుల విశ్వాసం.

ఎలాంటి చర్మవ్యాధులు వచ్చినా వైద్యులను సంప్రదించే ముందు సుళ్య క్షేత్రాన్ని సందర్శించడం మంచిదని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. 


💠 ఈ క్షేత్రం పక్కనే ప్రవహించే వాగులోని చేపలు అన్ని చర్మ వ్యాధులను నయం చేసే చర్మవైద్యులు. 

అవును ఈ చేపలకు అన్నం, పొట్టు కలిపి తినిపిస్తే చర్మవ్యాధులు మాయమవుతాయని ఈ ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం.


💠 ప్రాచీన క్షేత్రమైన తోడికాన మల్లికార్జున క్షేత్రం పక్కనే ప్రవహించే చెరువులో వేల సంఖ్యలో చేపలు ఉన్నాయని, ఈ చేపలను పూజిస్తే అన్ని రకాల చర్మవ్యాధులు మాయమవుతాయని భక్తుల విశ్వాసం.

ఆలయానికి ఆగ్నేయంగా కొన్ని మీటర్ల దూరంలో మీనుగుండి అనే చేపల తొట్టి ఉంది . 


💠 ఈ నమ్మకం వెనుక ఒక పురాణ కథ ఉంది. కణ్వ మహర్షి తోడికాన క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణ కథనం.

 కణ్వ మహర్షి తొడికాన క్షేత్రం మధ్యలో తపస్సు చేస్తున్నప్పుడు, క్షేత్రం పక్కనే ఉన్న దేవరగుండి జలపాతం నుండి తోడికాన క్షేత్రానికి శివలింగాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సందర్భంగా కణ్వ మహర్షి శివుడిని ప్రార్థించగా, మహర్షి ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. 


💠 శివునితో పాటు విష్ణువు కూడా మహర్షి కోరిక మేరకు మత్సరూపంలో వచ్చి దేవరగుండిలో లీనమై జలమార్గంగా తొడికాన క్షేత్రానికి చేరుకుంటాడు. 

శివుడు మత్స్య వాహనం రూపంలో క్షేత్రానికి వచ్చి స్థిరపడతాడు.

కణ్వ మహర్షులు విష్ణువును ప్రార్థిస్తారు మరియు శివునితో పాటు విష్ణువు క్షేత్రంలో ఉండాలని కోరుకుంటారు. ఈ కారణంగానే ఈ దేవరగుండి వాగులో నేటికీ మహావిష్ణువు మత్సరూపంలో కొలువై ఉంటాడని క్షేత్ర పురాణం.



💠 ఈ వాగులో లక్షలాది చేపలు ఉండడంతో పాటు ఈ చేపలన్నీ తొడికాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. చర్మవ్యాధులు తొలగిపోవాలని ఇక్కడికి వచ్చి పూజిస్తే సమస్యలు తీరుతాయని ఇక్కడి నమ్మకం. 

చేపల దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని అన్నం, మట్టిని హారకే రూపంలో వేస్తామని, చర్మవ్యాధులు నయమవుతాయని ప్రార్థించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.


💠 హిందూ భక్తులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు కూడా వచ్చి హారకే రూపంలో అన్నం, మట్టిని వేస్తున్నారు. అలాగే తొడిక గుడిలో ప్రాతఃకాలం పూజానంతరం ఈ చేపలకు అన్నప్రసాదం పెట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది.


💠 దాహార్తిని తీర్చుకునేందుకు దేవరగుండి వాగు దగ్గరకు వచ్చే భక్తుల పాదాలను ఈ చేపలు చక్కిలిగింతలు పెడతాయి. 

దేవుని చేపలు అని పిలువబడే ఈ చేపలను పట్టుకోవడం లేదా చంపడం నిషేధించబడింది.


💠 తోడికాన, మల్లికార్జున ఆలయానికి ప్రసిద్ధి చెందింది , ఇది బహుశా 13వ శతాబ్దంలో నిర్మించబడి ఉండవచ్చు. 

సోమవార పూజ మరియు రుద్రాభిషేకం రోజూ చేస్తారు. శఠ రుద్రాభిషేకం, ఏక్దశ రుద్రాభిషేకం, రంగపూజ సేవ తొడికానలో శ్రీ మల్లికార్జున స్వామికి ఇష్టమైన సేవలు.

సింహమాస శనివారాలు, కృష్ణాష్టమే, గణేశ చతుర్థి, మరియు నవరాత్రి ఊరేగింపులను ప్రత్యేక రోజులుగా (పర్వదిన) జరుపుకుంటారు.


💠 తొడికాన శ్రీ మల్లికార్జున దేవాలయానికి ధను శంకరమన ధనుపూజ నాడు భజన రంగపూజ చాలా ప్రసిద్ధి.

 ధనుసంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు, ఆలయం తెల్లవారుజామున 3.30 గంటలకు తెరిచి ఉంటుంది.  ఉదయం 5.00 గంటలకు పూజ నిర్వహిస్తారు. 

తమలపాకు

 



🙏🌺తమలపాకు చివరి భాగంలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో, సరస్వతీదేవి, కాడ భాగంలో పార్వతి దేవి వుంటుందని పెద్దలు చెబుతుంటారు.  ప్రతి శుక్రవారం తమలపాకు దీపం వెలిగిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని భావన 

ప్రతి ఇంటా  తులసి మొక్క  ఎంత పుణ్యమో, అటువంటిది తమలపాకుల మొక్క  దైవ కార్యానికి  అంతే శుభమ్ 🌹.

కంచర్ల వెంకటరమణ

Panchaag


 

ఇతరులను నిందించి ప్రయోజనం లేదు

 165


ఇతరులను నిందించి ప్రయోజనం లేదు


పారమార్థిక సాధకుడు అందరితో కలిసిమెలసి ఉండకపోవచ్చు. కానీ ఎవరినీ చిన్నచూపు చూడకూరదు. పవిత్రమైన జీవితం గడపని వారిని నిందిస్తూ, నేను వారికంటే అధికుణ్ణి అని భావించడం మంచిది కాదు. 'నేను నీ కంటే 'పవిత్రుడ్డి' అన్న వైఖరి మనల్ని మితిమీరిన విశ్వాసంలో ముంచివేసి, అజాగ్రత్త వరులుగా తయారుచేస్తుంది. కానీ సాధకుడు అపవిత్రమైన మనుష్యుల నుంచీ, వారి స్పందనల నుంచీ తనను తాను కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక శక్తిని కూడగట్టుకుని, ఇతరులను మార్చగలిగే స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే, అందరితో నిస్సంకోచంగా కలసిపోవచ్చును. భగవంతుడు చరాచర సృష్టిలోని అన్ని జీవులలోనూ ఉన్నమాట నిజమే అయినా, మనం ఉన్న పరిస్థితులలో, ఆయన యొక్క కొన్ని రూపాలతో మిళితం కావడం శ్రేయస్కరం కాదు. ఆయా వ్యక్తీకరణలకు దూరం నుంచే నమస్కరించాలి!


కానీ ఒక్కోసారి తప్పనిసరిగా చెద్దవారితో కలవవలసి వస్తుంది. అప్పుడు ఏమి చేయాలి? మీరు వారిని నిరసిస్తూ, పట్టించుకోకుండా ఉండకూడదు. అత్యంత జాగరూకతతో మెలుగుతూ, మనస్సులోనే ఒక అడ్డుగోడను నిర్మించుకోవాలి. ఒక అంతర్నిర్మిత కవచంతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కూలంకషంగా ఆత్మవిశ్లేషణ చేస్తూ, చెడు ముద్రలు మీలో వేళ్ళూనుకునే లోపలే, వాటిని బయటకు పంపించి వేయాలి. నిజమైన సాధకుడు ఎల్లప్పుడూ తన వివేచనను ఉపయోగిస్తుంటాడు. అది ఒక అలవాటుగా మారుతుంది. భగవంతుని వైపు పరుగుపరుగున చేరే మనస్తత్వంతో మెలగండి. 'బేబి కంగారూ' (ఆస్ట్రేలియా ఖండంలో కనిపించే 'కంగారూ' అనే జంతువు పిల్ల) ఏమి చేస్తుందో దాన్ని అనుకరించండి. అది అపాయం ఎదురైనప్పుడు రక్షణ కోసం తన తల్లి పొట్ట మీదున్న సంచిలోకి దూకినట్లు, మీరు కూడా భగవంతుని సాన్నిధ్యంలోనికి తక్షణం చేరడాన్ని సాధన చేయండి.

జూన్ 05, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌷 *బుధవారం*🌷

   🪷 *జూన్ 05, 2024*🪷

      *దృగ్గణిత పంచాంగం*                   

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః* 

*వైశాఖమాసం - కృష్ణపక్షం*

*తిథి : చతుర్దశి* రా 07.54 వరకు ఉపరి *అమావాస్య*

వారం :*బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : కృత్తిక* రా 09.16 వరకు ఉపరి *రోహిణి*

*యోగం  : సుకర్మ* రా 12.36 వరకు ఉపరి *ధృతి*

*కరణం   : భధ్ర* ఉ 08.56 *శకుని* రా 07.54 ఉపరి *చతుష్పాద*

*సాధారణ శుభ సమయాలు*

*మ 02.00 - సా 06.00 వరకు*

అమృత కాలం :*రా 07.00 - 08.31*

అభిజిత్ కాలం :*ఈరోజు లేదు*

*వర్జ్యం : ఉ 09.55 - 11.26*

*దుర్ముహుర్తం : ప 11.40 - 12.32*

*రాహు కాలం : మ 12.06 - 01.44*

గుళిక కాలం :*ఉ 10.28 - 12.06*

యమ గండం :*ఉ 07.12 - 08.50*

సూర్యరాశి :*వృషభం*

చంద్రరాశి :*వృషభం*

ఉ 05.34 

సా 06.38

*ప్రయాణశూల  :‌ ఉత్తర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.34 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.48*

మధ్యాహ్న కాలం :*10.48 - 01.25*

అపరాహ్న కాలం :*మ 01.25 - 04.01*

*ఆబ్ధికం తిధి : వైశాఖ బహుళ చతుర్దశి*

సాయంకాలం :*సా 04.01 - 06.38*

ప్రదోష కాలం :*సా 06.38 - 08.49*

నిశీధి కాలం :*రా 11.44 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🪷 *శ్రీసరస్వతీద్వాదశనామస్తోత్రం*🪷


*శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ|*

*హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ ||*


ప్రధమం భారతీనామ 

ద్వితీయం చ సరస్వతీ |

తృతీయం శారదాదేవి 

చతుర్ధం హంసవాహనా ||

పంచమం జగతీ ఖ్యాతం 

షష్టం వాగీశ్వరీ తధా |కౌమారీ 

సప్తమం ప్రోక్త 

మష్టమం బ్రహ్మచారిణి ||

నవమం బుద్ధిధాత్రీ చ 

దశమం వరదాయినీ |

ఏకాదశం క్షుద్రఘంటా 

ద్వాదశం భువనేశ్వరీ ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః 

సర్వసిద్ధికరీతస్య ప్రసన్నా పరమేశ్వరీ

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

🌹🌷🪷🌷🪷🌷🪷🌷🌹

పోతన

 గజేంద్ర మోక్షం 

      ఇది చదివితే...సమస్త       కష్టాలు వెంటనే తీరుతాయి.

భవ దారిద్య్రం - భావ దారిద్య్రం


భోజనం వడ్డించమని అడిగాడు పోతన తన భార్యతో. ఆమె చోద్యంగా చూస్తూ ‘అదేమిటండీ! ఇప్పుడే కదండీ భోజనం చేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారు? మళ్లీ అప్పుడే ఆకలయిందా’ అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్వీమణి.

దిగ్భ్రమ చెందాడు పోతన. ఇదేమిటి? ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు. ‘నేను భోంచేశానా?’ అని అడిగాడు. ‘అవును. కూర్చుని ఒక పద్యం కాబోలు వ్రాశారు. ఆపైన నేను భోజనం చేయమంటే చేశారు. మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం, నేను మీరు తిన్న విస్తరిలోనే భోం చేశాను’ అంది.

‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’

‘బైట తొట్లో వేశాను’ అంది ఇల్లాలు.

బయటికి వచ్చి కుప్పతొట్లో చూశాడు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కుని దొరకకుండా పరుగెత్తి పోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చుని తను వ్రాస్తున్న చోట కూర్చుని చూశాడు. అక్కడ ఒక త్రాటియాకుపైన-

అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా/ పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో/ త్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రపన్నుండు వి/ హ్వల నాగేంద్రము పాహిపాహి యన కుయ్యాలించి సంరంభియై’

మొసలితో యుద్ధం చేస్తూ శక్తులుడిగి చేష్టలుల కోల్పోయిన నాగేంద్రము (గజశ్రేష్ఠుడు) ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ‘ఎవ్వనిచే జనించు’ ‘జగమెవ్వని లోపల నుండు లీనమై’ అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది, అపుడుఆ వైకుంఠ నగరంలో సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి, వెంటనే పూనుకుని ఉన్నపళాన ఆపద్రక్షకు డుపక్రమించినవాడై రక్షణకు!

దిగ్భ్రమతో పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! అంతలోనే దుఃఖాతిరేకం!

పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశే్చష్టుడయిన పోతనను చూసి కుదుపుతూ ‘స్వామీ స్వామీ!’ అని పిలిచింది ఆ పతివ్రతామతల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి మళ్లీ అమిత రోదనకు గురయ్యాడు పోతన. కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ఆపైన ఓదారుస్తూ ‘ఏం జరిగింది నాథా! ఎందుకంతగా దుఃఖిస్తున్నారు’ అని అడిగింది ఇల్లాలు. ‘శ్రీరామచంద్రుడు! శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! అనంత భాగ్యరాలివి! ధన్యాత్మవు. నాకా భాగ్యం కలుగలేదు’ అని చెపుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మళ్లా వెంటనే దుఃఖాభ్యాగ్నుడై!

‘అవునా స్వామీ! నిజమా! ఇంతక్రితం వచ్చి వ్రాసి, భోజనం చేసి వెళ్లినవారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తియా?’

‘అవును దేవీ! ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ అని ఆ పద్యాన్ని వెక్కిళ్ల మధ్యనే పాడుతూ, చెపుతూ, ఏడుస్తూ ‘చూడు - నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - వారు వ్రాస్తున్నది చూశావు - నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు - వారి స్పర్శనం పొందావు! నాకేదీ ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ అని మళ్లీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామాత్యుడు.

స్వామీ! మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నానరు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి, మీరు వ్రాసినట్లుగా వ్రాసి, మీరు తిన్నట్లుగా తిని, నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. మీరే తానై స్వామి వస్తే, మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ఇంత గొప్ప ‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి, ఆనందం పట్టలేక, మీ రచనలో తానూ పాలు పంచుకోవాలని నిశ్చయించుకుని, మీకు భ్రమ కలిగించి బయటకు పంపి, తాను మీ రూపంలో వచ్చి, ‘తనను గురించి తానే’ గొప్పగా వ్రాసుకున్నాడు. ఇంత మహాభాగ్యులు మీరు. మీరు తెనిగిస్తున్న ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం ప్రసిద్ధ పొందుతుంది. మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు. దుఃఖం మాని, ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి! మీకే అర్థం అవుతుంది’ అంది.

వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాత్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయాడు. తన హృదయ కుహరంలో కొలువైవున్న ఆత్మారాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడు ‘రామదాసు’లాగా!

‘్భవ సంతృప్తినీ, భావసంతృప్తినీ పూర్తిగా పొందారు పోతన దంపతులు. ఏ మాత్రం భవ దారిద్య్రం కానీ, భావ దారిద్య్రం కానీ లేనివారు! ముక్తజీవులు! ధన్యులు! పుణ్యాత్ములు!

వీరభద్ర విజయం, భోగినీ దండకం పోతన ఇతర రచనలు. పరమ ప్రఖ్యాతి పొందినదీ, ప్రతి కవీ, పండితుడూ, ప్రతి సాహితీ ప్రియుడు పరవశించేది ‘మహాభాగవతం’! ఈ కావ్యానువాదం, ఇందులోని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర అజరామరాలు. పోతన కలికితురాయి మహాభాగతం!

కుటుంబం

 బంధం...అనుబంధం....వివాహ బంధం.


       _**అసలు పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం, ఇష్టం-అయిష్టం గురించి కాదు. కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి తమని తాము ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి చదువుకున్న భర్త, భార్య రావాలనుకకోవడం కన్నా తమ మనసులను చదవగలిగిన భర్త, భార్య రావడం అనేది వారి అదృష్టం.*_


       _*💲*అలాంటి అందమైన మనసున్న వారిని పొందాలని కోరుకోవాలి గాని, బయటకు కనిపించే పైపై అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను మాత్రమే చూసి ఇల్లు కొనుక్కొన్నట్లు ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు "అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు" చూడాలని. అంటే బలమైన పునాదులు, గట్టి గోడలు, నునుపైన పూతలు ఉన్నాయా లేదా అని చూడాలి.. అంటే వారి వంశ పుట్టుపూర్వోత్తరాలు చూడాలి..*_

 

        _**💲భార్య భర్తల బంధం ఎంత బలంగా ఉండాలంటే, భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. అంతేకాదు భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి తప్ప అయోమయం కాకూడదు.*_

           💲💲💲

       _**ఒకరి మనసులోని భావాలను మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకొనేలా ఉండాలి. అంటే ఒకరి మనసులోని ప్రేమను గాని బాధని గాని కళ్లలో చూసి, నోటితో చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు కదా.. అలా అర్థం చేసుకొనే భార్య భర్తలు దొరికితే అడుక్కు తినేవారు కూడా ఆనందంగా హాయిగా జీవిస్తారు..*_


        _**భార్యా భర్తల బంధం ఒక మధురానుభూతిగా మిగిలి పోవాలి. అంటే ప్రతి భర్త తన భార్యను తన తల్లికి ప్రతి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తే అంతకు మించిన మధురమైన బంధం మరొకటి లేదు కదా..*_


       _**సంసారం అంటే భార్య భర్తలు కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ ఒకరికి ఒకరు వెన్నంటి ఉంటూ, తోడూ నీడగా ఒకరిని ఒకరు వీడకుండా ఉండడం..*_


      _**ఏది ఏమైనా, భార్యాభర్తల మధ్య సంబంధం శాశ్వతంగా ఉండిపోవాలి. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. కానీ చివరి వరకు భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇది ప్రతి భార్య భర్తలు గుర్తుంచుకోవాలి..*_

           💲💲💲

        _**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం నీకు లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. అలాగే నీవెన్ని గొప్ప చదువులు చదివినా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఎంతో గొప్పగా సంపాదించినా భర్త అండదండలు లేకపోతే ఆ భార్య జీవితం నిరర్ధకమే..*_


      _**ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ, భార్యను బాగా అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అలాగే ఒక మంచి భార్య తన భర్త మనసెరిగి భర్త మదనపడకుండా, మనస్థాపానికి లోనుకాకుండా చూసుకొంటుంది.. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కదా..*_


       _**అలాకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ, మిడిసిపాటుతో అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ లాంటి వారు కూడా సన్యాసంలో కలవాల్సిందే. అలాగే దురలవాట్లకు బానిసైన వ్యసనపరుడైన భర్త దొరికితే ఆ భార్య జీవితం నరకప్రాయం అయినట్లే..*_


        _**ఒక మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉండాలనుకొంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తానే రాణిగా ఉంటుంది.*_

        💲💲💲

         _**తమ కుటుంబంలో తమ మధ్య ఎన్ని కీచులాటలున్నా సమాజంలో తన భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే అందరిముందు భార్యను చులకనగా చూడకుండా తన భార్యను అందరి ముందు గౌరవించవలసిన ధర్మం భర్తకు ఉండాలి.*_


       _**భార్య భర్తల బంధం ఎలా ఉండాలంటే "గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండేలాంటి గట్టి బంధమై ఉండాలి." అలాంటి బంధం దొరకడం ఒక గొప్ప వరం..*_


       _**భార్య భర్తల స్మృతులు ఎలా ఉండాలంటే "నీ సంతోషం నేను కాకపోయినా, నా చిరునవ్వు మాత్రం నువ్వే అయ్యుండాలి, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే అయ్యుండాలి " అనే విధంగా ఉండాలి..*_


      _**భార్య భర్తలు ఇరువురు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి పనులలో ఒకరు సహాయం చేసుకుంటూ సేవ చేయడం అంటే ఒకరి కింద ఒకరు బానిసగా బ్రతుకుతున్నామని కాదు ఇక్కడ అర్థం, ఒకరి బంధాన్ని మరొకరు గౌరవిస్తున్నామని అర్థం..*_

            💲💲💲

       _**నిజానికి భార్య భర్తల బంధం అన్నది ఒక అందమైన పుస్తకం లాంటిది. జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఆ పుస్తకంలోని అచ్చు తప్పుల వంటివి. అచ్చు తప్పులున్నాయని మంచి పుస్తకాన్ని పారెయ్యలేము కదా.. అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగినంత మాత్రాన బంధాలను తెంచుకోకుండా, మరొకసారి అలాంటి పొరపాటు జరుగకుండా చూసుకొనే వారి బంధం శాశ్వతంగా నిలిచిపోతుంది..*_


        _**నీ భార్య గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేస్తూ గొప్పగా సంపాదించేదిగా ఉండక్కర్లేదు. జీవిత పాఠాలను చదివి ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగి, నీ వంశాభివృద్ధి కోసం నీకు ఇద్దరు ప్రతినిధులను అందించే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!..*_


       _**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ నీ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి మసులుకొనేదే "మాంగల్య బంధం" అంటే..*_


        _**💲అటువంటి బంధాలు తెగిపోకుండా శాశ్వతంగా ఉండాలి అంటే, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమించమని ఎదుటి వారిని క్షమాపణ అడగాలి. ఒకరిపైన ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు ఉండాలి. ముఖ్యంగా ప్రేమ అనేది చాలా విలువైనది. అందుకే "వివాహం"అనే గుడిలో" ప్రేమ" అనే విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకొన్నప్పుడే వివాహబంధం రాణిస్తుంది..*_


       _💲**ఈ సృష్టిలో భగవంతుడు తీర్చిదిద్దిన సుందరమైన అతి గొప్ప కళాఖండం మన "కుటుంబం". ఆ కుటుంబం వ్యవస్థను అర్థం చేసుకొని అవగాహనతో జీవించుదాం.....శుభం భూయాత్. 


💐💐💐💐 💐💐💐💐

చంద్రుడు హాయిని కలుగజేస్తాడు

 సుభాషితం:


చందనం శీతలం లోకే చందనా దపి చంద్రమా1 చంద్ర చందన యోర్మధ్యే శీతలా సాధు సంగత:11


తేటగీతి:


జగతి యందున గంధమ్ము చల్లదనము అంతకును మించి చంద్రుడు హాయినిచ్చు సజ్జనులతోడ సాంగత్య చల్లదనము వాటి రెండింటి కంటెను మేటియగును.


భావం: లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు. చందనం, చంద్రుడు రెండింటి కంటెను సజ్జనుల సాంగత్యం మరీ చల్లదనాన్ని కలుగజేస్తుంది. అంటే మనసుకి ఆహ్లాదమును, ప్రశాంతతను చేకూరుస్తుంది.


6:46 am

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.04.06.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే త్రయోదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే త్రయోదశ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.27

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం

త్రయోదశి రా.9.05 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం భరణి  రా.10.07 వరకు.

అమృతం రా.10.36 ల 12.06 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.04 ల 8.56 వరకు. 

దుర్ముహూర్తం రా.10.51 ల 11.35 వరకు. 

వర్జ్యం ఉ.8.37 ల 9.58  వరకు. 

యోగం శోభన ఉ.5.48 వరకు. 

యోగం అతిగండ తె. 3.16 వరకు. 

కరణం గరజి ప.10.05 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు.    

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ త్రయోదశి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏