3, ఆగస్టు 2024, శనివారం

గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో

 ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 


మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.


01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య


ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*


26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).


ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.


భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.


మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 


వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.


1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!


మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది


మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.


 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.

భాగవత కధా కవితా సుధారసము



భాగవత  కధా కవితా సుధారసము

                                                   --------------------------------------------------- 


              కం: పలికెడిది భాగవతమట!

                     పలికించెడు వాఁడు  రామభద్రుండట!  నే

                     పలికిన  భవహర మగునట!

                     పలికెద,  వేరొండు గాధ  పలుకఁగ  నేలా? 


                       అంటూ సర్వము  భగవత్కర్తృత్వము గా నెంచి  భక్తి భావ సంభరితముగా  రచియింపఁ బడిన  మహాపురాణ గ్రంధము

శ్రీమదాంధ్ర మహాభాగవతము.


                 భాగవతం చదవటం  అంటే  బాగుపడటం"- అన్నారు పెద్దలు. తపస్సు యజ్ఙయాగాదులు చేయటం, వంటి కష్టాలు యేమాత్రం పడకుండా కేవలం  ,శ్రవణ  మాత్రం చేతనే  ముక్తిని పొందే ఉపాయం భాగవత కధాశ్రవణం .


                                 చతుర్వేదములను, అష్టాదశ పురాణములను, పదునెనిమిది పర్వముల మహాభారతమును  రచించించియు,

కలత వొందు వ్యాసుని  చిత్తార్తిని దీర్చుటకు నారదోప దేశమున వ్యాసునిచే నీగ్రంధము విరచింప ఁబడినది .పన్నెండు స్కంథములుగా

విస్తరిం చిన  యీగ్రంధము మహాపురాణముగా కీర్తింప బడుచున్నది.


                                  భగవం తుడే (శ్రీకృష్ణుడు) కథానాయుకుడైన యీగ్రంధమును  పరమ భాగవతాగ్రేసరుడు  ఆంధ్రీకరించి  యాంధ్రులకు  సారస్వత సంబంధమైన విందు సమకూర్చినాడు. కల్పక సదృశమైన యీభాగవతము మందార మకరందములను

గురియించు పద్య సంపదకు నెలవై యాంధ్రుల హృదయ క్షేత్రములలో  నాధ్యత్మికమును పండించుచు ముక్తిద్వారముగా మురిపించుచున్నది.


                              పోతన కవిత్వ మొక పంచదార పాకము. జుంటితేనియ. గొజ్జగి పూమృదులము. తెనుగు పదములకు సంస్కృత సమపదములను జోడించి, శబ్దార్ధాలంకార భాసురమై  నాదసుభగాభిరామమై  చదివినంత సేపు పాఠకుని యొక దివ్య కవితాలోకమున

విహరింపఁజేయును.


                    కృష్ణుని బాల్యక్రీడలు మరపురాని ఘట్టము. భావుకుడైన పాఠకుడా ఘట్టమున మునిగి కన్నుల నానంద భాష్ప శిక్తుడౌట

తథ్యము. యిందలి యుపాఖ్యానములన్నియు నొకదానిని మించి మరియొకటిగా చిత్రిపబడి యుండును. అనుప్రాసలతోను, అంత్యప్రాసలతోను, యమకాదులతోను, ఆపద్యములు పాఠకుని కవితాడోలలో  నూయల లూగించును.


                     పోతన ప్రతిభను "మందార మకరందాది యొండు రెండు పద్యములతో  వివరించుట  సాధ్యము కానిపని.సామాన్యముగా క్రియాపదముతోనో లేక అవ్యయముతోనో ప్రారంభమౌ వృత్తపద్యములు ఆపై వరుసగా విశేషణ ముల

ముక్తాయింపులతో  అంత్యప్రాసల విన్యాసములతో బహు సుందరముగా నుండును.


            "  అట  గాంచెన్  కరణీ విభుండు  నవఫుల్లాంభోజ కల్హారమున్

                నట దిందీవర వారమున్  గమఠ మీన గ్రాహ  దుర్వారమున్

               వట హింతాల తమాల తాల తరుణీ వల్లీ కుటీతీరమున్

                చటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గా సారమున్ి


                                అట, అవ్యయం.కాంచెన్ క్రియ.కాసారమున్  విశేష్యము.తక్కినవన్నీ విశేషణములే!


                     పోతన భాగవత మొక కవితా సాగరము.పద్యములన్నియు మంచి ముత్యముల రాసులే  ఎన్నిని యెన్నగలం? అదిమన శక్తికి మించిన పని.


                        పోతన కవితా తత్వమును బహుముఖములుగా బరిశీలించిన వారిలో  అభినవ పోతన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ప్రశంసా పద్యాలతో మనమీ విషయాన్ని ముగిద్దాం.మరోసారి విపులంగా పోతన గారిగురించి చెప్పుకుందాం.


                "  అచ్చపు జుంటితేనియల  నైందవబింబ  సుధారసాల  గో

                   ర్వెచ్చని  పాలమీగడల  విచ్చిన  కన్నె  గులాబి  మొగ్గలన్

                   మచ్చరికించు  నీ మధుర మంజుల మోహన మైన  శైలి నీ

                   వెచ్చట  నేర్చినావు సుకవీ!సుకుమారకళా కళానిధీ!


                "  ముద్దులుగార  భాగవతమున్  రచియించుచు  పంచదారలో

                    నద్దితివేమొ  ఘంటము  మహాకవి శేఖర!  మధ్య  మధ్య   న

                    ట్లద్దక  వట్టి ఘంటమున  నట్టిటు  గీసిన  తాటియాకు  లో

                    పద్దెములందు  నీ మధుర  భావన  లెక్కడినుండి  వచ్చురా?


                                                         కరుణశ్రీ,


జ      జుంటితేనెల తీయదనం. వెన్నెల లోని యమృతం,  గోరువెచ్చని పాలమీగడల సొగసును,విచ్చిన లేతగులాబి మొగ్గలను మచ్చరికింప జేస్తుందట పోతన కవిత్వం. కరుణశ్రీ యెంతచక్కగా చెప్పారు.అసలు యింత సుకుమారమైన కవితాకళను నీవెక్కడ

నేర్చుకున్నావయా? అనిప్రశ్న? అదియా భగవదత్తము. నిరంహంకారమునకు నిర్మమత్వమునకు ప్రతిఫలము!


ముద్దులుగార భాగవతమున్రచియించుచు,పంచదారలో

నద్దితివేమొ గంటము? మహాకవిశేఖర!మధ్యమధ్య న

ట్లద్దక, వట్టిగంటమున నట్టిటువ్రాసినతాటియాకులో

పద్దెములందు నీమధురభావనలెక్కడనుండి వచ్చురా?--


                     ముద్దులు గారేవిధంగా కవిత్వంవ్రాస్తూ గంటాన్ని పంచదారలోముంచావేమో ?అందుకే నీకవిత్వానికి అంతతీపి! మధ్యమధ్యమరచావేమో నంటాడు కరుణశ్రీ యింతకన్నా యెవ్వరు మాత్రం పోతన కవితను వింగడించగలరు?


                           " అందుకే భాగవతమును రోజూ చదువుకుందాం  అందరం బాగుపడదాం!


                                                                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శనివారం / రాశి ఫలితాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*03-08-2024 / శనివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరస్తి లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన  పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

---------------------------------------

వృషభం


వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నేత్ర సంభంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన కలుగుతుంది.

---------------------------------------

మిధునం


గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు  అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.   వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------

సింహం


ధనదాయం బాగుంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  వృత్తి ఉద్యోగ  విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

కన్య


ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. భూ క్రయ విక్రయాలలో  అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.  చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన. ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

తుల


వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలుంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశజానాకంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.  దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. స్థిరస్తి క్రయవిక్రయాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై  మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

---------------------------------------

ధనస్సు


వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.  దీర్ఘకాలిక  రుణాలు నుండి బయట పడతారు. వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

మకరం


ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు  పెరుగుతాయి.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------

కుంభం


దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మీనం


గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి  శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను కలసివస్తాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

అవిరోధితయా

 *అవిరోధితయా కర్మ నావిద్యాం వినివర్తయేత్ ।*

*విద్యావిద్యాం నిహన్త్యేవ తేజస్తిమిరసంఘవత్ ॥ 3॥*

ఏ చర్య అయినా అజ్ఞానానికి విరుద్ధం కానందున, ఆ చర్య అజ్ఞానాన్ని తొలగించదు. గాఢమైన చీకటిని నశింపజేసేది వెలుగు మాత్రమే అయినట్లే, అజ్ఞానాన్ని నాశనం చేసేది కేవలం జ్ఞానం మాత్రమే.

(ఆత్మబోధ యొక్క ఈ శ్లోకంలో, శ్రీ శంకర భగవత్పాదులు కేవలం జ్ఞానం మాత్రమే ఎందుకు, ఏ విధమైన చర్యలు , ముక్తికి ప్రత్యక్ష మార్గం అని వివరిస్తున్నారు.)

జ్ఞానం ద్వారానే అజ్ఞానం తొలగిపోతుంది. ఏదైనా విషయం యొక్క అజ్ఞానాన్ని ఆ విషయం యొక్క జ్ఞానం ద్వారా తొలగించవచ్చు - అది భౌతిక అజ్ఞానమైనా లేదా ఆధ్యాత్మిక అజ్ఞానమైనా. కార్యం, భౌతికమైనా, ఆధ్యాత్మికమైనా, అజ్ఞానాన్ని తొలగించలేవు. చర్యలు భౌతిక శరీరం (కాయిక కర్మ), వాక్కు (వాచిక కర్మ) లేదా మనస్సు (మానస కర్మ మొదలైనవి)తో కూడిన చర్యలుగా విస్తృతంగా వర్గీకరించబడ్డాయి. వీటిలో ఏవీ అజ్ఞానాన్ని తొలగించలేవు. ఎందుకంటే చర్యలు అజ్ఞానానికి వ్యతిరేకం కాదు. మా స్వంత అనుభవం దీనిని నిరూపిస్తుంది. ఒక నిర్దిష్ట రైలు ఎప్పుడు వస్తుందో మనకు తెలియకపోతే, కొంత ప్రమాణాన్ని (జ్ఞాన సాధనాలు) ఉపయోగించడం ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఉదాహరణకు, మేము రైలు టైమ్‌టేబుల్‌ని చూడవచ్చు లేదా తెలిసిన వారిని అడగవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేదా ధ్యానం రైలు సమయానికి సంబంధించిన సమాచారాన్ని అందించదు.

ఉదాహరణ, *తేజస్తిమిరసంఘవత్* దట్టమైన చీకటి ఉంటే, కాంతి మాత్రమే దానిని తొలగించగలదు. వెలుగులోకి వచ్చేంత వరకు ఎలాంటి చర్య అయినా సహాయం చేయదు. అజ్ఞానానికి, జ్ఞానానికి కూడా ఇదే వర్తిస్తుంది. జ్ఞానం ఉద్భవించినప్పుడే అజ్ఞానం నశిస్తుంది.

*-జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీమహస్వామివారు*

కాశీ

 🪷 _*కాశీ*_ 🪷

             



✳️ అక్కడ పరమేశ్వరుడి అడుగుల ధ్వని బ్రాహ్మీ ముహూర్తంలో వినిపిస్తుందంటారు♪. వేదపఠనాలు, హారతి గీతాలు, శంఖనాదాలు, ఢమరుక ధ్వనులు నిత్యం స్వాగతం పలుకుతుంటాయి♪. అది విశ్వనాథుడి నగరమైన కాశీ! ఆ పక్కనే ఆధ్యాత్మిక రసవాహిని గంగ ప్రవహిస్తుంటుంది♪. గాలిలో ఓంకార ధ్వని వినిపిస్తుంటుంది♪. హోమ జ్వాలలు పరతత్వాన్ని తెలుపుతుంటాయి♪.


✳️ కాశీనగరం ఆధ్యాత్మిక దృశ్యప్రపంచంలో హిమాలయం లాంటిది♪. మోక్షప్రదాయినిగా భావించే ఆ నగరం, సాధకుల పాలిట స్వర్గ ధామం♪. వరుణ, అసి నదుల మధ్య ఉన్న ప్రదేశమే కాశీ. దానికి వారణాసి, ఆనంద కాననం, శివపురి, మహాశ్మశానం, బెనారస్ అనే పేర్లున్నాయి♪. అది సాక్షాత్తు పరమేశ్వరుడి సృష్టి అని 'శివపు రాణం' తెలుపుతోంది♪. అష్టాదశ పురాణాల్లో కాశీ వైభవాన్ని వ్యాసుడు పలుచోట్ల ప్రస్తావించాడు♪.


✳️ కాశీ అంటే 'ప్రకాశించేది' అని అర్థం♪. ఇది ముక్తిక్షేత్రం. 'నేను కాశీ వెళతాను. అక్కడ నివసిస్తాను' అని పలుసార్లు తలచినా శివుడు సంతోషిస్తాడట. జీవులందరికీ మోక్షద్వారం కాశీ, ఇక్కడ మరణించినవారి చెవిలో స్వయంగా విశ్వనాథుడే తారకమంత్రాన్ని ఉపదేశించి కైవల్యప్రాప్తి అనుగ్ర హిస్తాడని 'స్కాందపురాణం' చెబుతోంది•.


✳️ పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడిగా, విశ్వనాథుడిగా కొలువయ్యాడు♪. దేవతాగణాలతో కైలాసంలో పొందే దివ్యానందాన్ని ఇక్కడ పొందుతున్నాడని భక్తులు విశ్వసిస్తారు♪. కాశీనగరాధిపతిగా, రక్షకుడిగా శివాంశతో జన్మించిన కాలభైరవుడు ఇక్కడే ఉన్నాడు♪. ముందుగా దర్శించుకోవాల్సింది. మనసులో మాట విన్నవించుకోవాల్సింది కాలభైరవుడికే♪.


✳️ కాశీ విశ్వనాథుడి ఆలయం బంగారు తాపడం చేసిన గోపురాలతో ఉంటుంది♪. ప్రాంగణమంతా శివలింగాలతో, అభిషేక జలాలతో ప్రకాశిస్తుంటుంది♪. అదే ప్రాంగణంలోని మసీదు, సందర్శకులతో నిండి ఉంటుంది. మతసామరస్యానికి నెలవు ఆ ప్రాంగణం♪. జగన్మాత ఇక్కడ అన్నపూర్ణగా కొలువై ఉంది♪. పుడమిని సుభిక్షం చేసిన వరదాయిని ఆ తల్లి♪. గంగకు అవతలి ఒడ్డు 'వ్యాసకాశీ' గా సుప్రసిద్ధమైంది♪. వ్యాస ప్రతిష్ఠితమైన పరమేశ్వరుడు. ఎత్తుగా ఉండే మందిరంలో కొలువుతీరి కనిపిస్తాడు♪. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడోదైన `విశాలాక్షి' పీఠం ఇక్కడే ఉంది♪.


✳️ లలితాపరమేశ్వరి పరివార దేవతల్లోని వారాహి మాత ఆలయం ఇక్కడ భూగృహంలో ఉంటుంది♪. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని పై నుంచే గవాక్షం ద్వారా దర్శించుకోవాలి♪. 


✳️ చైతన్యస్వరూపానికి నిదర్శనంగా ఇక్కడ తిలభాండేశ్వర్ ఆలయం ఉంది♪. శివలింగం పెద్దగదిలో పట్టేంతగా ఉంటుంది♪. దేశంలోని పెద్దవైన మూడు శివలింగాల్లో ఇదొకటి♪.


✳️ నిత్యమూ - గంగాహారతి ఇచ్చే దశాశ్వమేధ ఘాట్ ఎంతో పేరుపొందింది♪. బ్రహ్మ - ఈ ప్రదేశంలో పది అశ్వమేధయాగాలు చేశాడంటారు♪. ఇక్కడే ఉన్న శీతలమాత ఆలయం ప్రశాంతతకు నిలయం♪. అన్నపూర్ణ, మహాలక్ష్మి పూజలు భక్తిప్రపత్తులతో జరుగుతుంటాయి♪. గంగామాతకు నిత్యమూ ఇచ్చే హారతి, నదుల పట్ల భారతీయుల పూజ్యభావాన్ని వెల్లడిస్తుంది♪.


✳️ భక్తి ముక్తి క్షేత్రంగానే కాక, శక్తి క్షేత్రంగానూ కీర్తి గడించింది కాశీ♪. రాక్షసులను సంహరించిన దుర్గాదేవి ఈ క్షేత్రంలోనే విశ్రాంతి తీసుకున్నదట♪. ఇక్కడే ఆమె స్వయంభువుగా కొలువై ఉంది♪.


✳️ గోస్వామి తులసీదాసు 'రామచరిత మానస్' రాసింది ఇక్కడే♪. అనంతర కాలంలో కాశీలో హనుమాన్ మందిరాల నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి♪. ప్రభాతవేళల్లో - కాషాయాంబరధారులైన సాధువులు దండ కమండలాలతో 'హరహర మహాదేవ్' అంటూ విశ్వనాథుడి దర్శనానికి సాగి పోతుండటం ఓ మనోహర దృశ్యం♪.


✳️ కాశీ పండితుడు, కాశీ విద్వత్ సభ, కాశీలో విద్యాభ్యాసం, కాశీరాజుల సత్కారాలు... అని గొప్పగా చెప్పుకొంటారు♪. కాశీరాజు ఇచ్చిన విరాళ స్థలంలో బెనారస్ విశ్వవిద్యాలయాన్ని పండిత మదన్మోహన్ మాలవ్య స్థాపించారు♪. ఇందులో నిర్మించిన విశ్వనాథ మందిరం సుందరమైంది♪.


✳️ బుద్ధుడు మొదటగా ధర్మ ప్రవచనం చేసిన 'సారనాథ్' ఇక్కడే ఉంది. ఇక్కడి గ్రామదేవత గవ్వలమ్మ.. ఆమెను దర్శించి, యాత్రికుల సంపూర్ణ యాత్రాఫలసిద్ధి పొందుతారు♪.


✳️ ఘనచరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతల కాశీ. దీని దర్శనం వల్ల కలిగే అనుభూతి భావనగా మారి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది♪.



        ❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🚩

వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు

 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇👇


 *51% కంటే ఎక్కువ మంది వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక అధ్యయనం నివేదించింది.  USలో ప్రతి సంవత్సరం, మెట్లు ఎక్కేటప్పుడు పడిపోవడం వల్ల 20,000 మరణాలు సంభవిస్తున్నాయి.   65 ఏళ్లు దాటిన తర్వాత, ఈ క్రింది పనులను స్వయంగా లేదా ఎవరి సహాయం లేకుండా చేయకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు:*


 1. మెట్లు/నిచ్చెనలు ఎక్కడం


 2. చాలా వేగంగా తిరగడం


 3. మీ పాదాలపై వంగడం


 4. నిలబడి ప్యాంటు ధరించడం


 5. కూర్చున్న స్థానం నుండి హఠాత్తుగా లేవడం


 6. త్వరగా ఎడమ-కుడి తిరగడం


 7. అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం


 8. బరువైన వస్తువులను ఎత్తడానికి వంగడం


 9. అకస్మాత్తుగా మంచం నుండి లేవడం


 10. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు


 *65 ఏళ్ల తర్వాత పై 10 పనులు చేయకుండా ప్రయత్నించండి

 *

 *✍🏻వృద్ధాప్యంలో వచ్చే నాలుగు సాధారణ సమస్యలు 👉🏼*

 1. ఆహారం గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఉక్కిరిబిక్కిరి కావడం.


 2. తప్పు దిండును ఉపయోగించడం


 3. లెగ్ తిమ్మిరి.


  4. కాళ్లలో జలదరింపు.


 ఎలా సహాయం చేయాలి:


 1. తినేటప్పుడు ఊపిరి ఆగిపోవడం:


 మీరు "మీ చేతులు పైకెత్తడం" మాత్రమే అవసరం.  మీ చేతులను మీ తలపైకి పైకి లేపడం వల్ల మీ గొంతులో ఇరుక్కున్న ఆహారం ఆటోమేటిక్‌గా క్రిందికి వెళ్లిపోతుంది.


 2. తప్పు దిండు:


 మీరు మేల్కొన్నప్పుడు కొన్నిసార్లు మీ మెడలో నొప్పి వస్తుంది.  దిండు తప్పుగా ఉంటే ఏమి చేయాలి?  మీరు మీ కాళ్ళను మాత్రమే పైకి లేపాలి, ఆపై మీ కాలి వేళ్ళను లాగండి మరియు సవ్యదిశలో లేదా అపసవ్య దిశలో మసాజ్ చేయండి.


 3. కాళ్లలో తిమ్మిర్లు:


 మీ ఎడమ కాలులో తిమ్మిరి అనిపించినప్పుడు, మీ కుడి చేతిని పైకి లేపండి, మీకు మీ కుడి కాలులో తిమ్మిరి ఉన్నప్పుడు, మీ ఎడమ చేతిని పైకి లేపండి, అది వెంటనే ఉపశమనం పొందుతుంది.


  4. జలదరింపు అడుగుల:


 ఎడమ పాదం జలదరించినప్పుడు, మీ కుడి అరచేతిని మీ శక్తితో తిప్పండి, కుడి పాదం జలదరించినప్పుడు, మీ శక్తితో మీ ఎడమ అరచేతిని తిప్పండి.


 ఈ సమాచారాన్ని కేవలం *సేవ్* చేయవద్దు.  దయ చేసి పంచండి*.


 ఎవరికి తెలుసు... *మీరు మరొకరిని రక్షించవచ్చు*.

మదించిన ఏనుగును

 శ్లోకం:☝️

*అల్పానామపి వస్తూనాం*

 *సంహతిః కార్యసాధికా ।*

*తృణైర్గుణత్వమాపన్నైర్*

 *బధ్యన్తే మత్తదన్తినః ॥*


అన్వయం: _లఘూనాం వస్తునాం మేలనేన మహత్ కార్యమపి సాధయితుం శక్యతే యథా తృణైః నిర్మితయా రజ్జ్వా మదాన్వితః గజః బంధయితుం శక్యతే ।_


భావం: మదించిన ఏనుగును గడ్డితో పేనిన తాడుతో కట్టగలిగినట్లు, చిన్న చిన్న వస్తువుల (పనుల లేక విషయాల) సరైన కలయికతో, పెద్ద పనులను కూడా సాధించవచ్చు.

డొనెషన్లు

 

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

సద్గుణ దయను అలవర్చుకోవాలి.*

 *అందరూ జీవితంలో సద్గుణ దయను అలవర్చుకోవాలి.* 


మనం జీవితంలో పెంపొందించుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలలో దయ ఒకటి.  ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం మరియు దుఃఖం మారుతూ ఉంటాయి కాబట్టి, కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేయడం చాలా ముఖ్యం.  ఇతరులకు సహాయం చేయాలనే కోరికను పెంపొందించుకోవడానికి మనలో దయ ఉండాలి. 

 భగవంతుని కరుణ అనంతమైనది కాబట్టి, ఆయన కరుణా సాగరమని వర్ణించబడింది.  లోకసంరక్షణ నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ధరించేలా ప్రేరేపిస్తుంది ఈ దయ. 

 ఒకరు దయతో మరొకరికి సహాయం చేసినప్పుడు, ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు.  అప్పుడే సత్పురుషుడు అని పిలవగలడు. 

 ఆదిశంకర భగవత్పాదులు తన శిష్యునికి గురువు ఉపదేశించడం దయతో అని చెప్పారు.  శిష్యుడు భక్తితో గురువును చేరుకోవాలి.  ఎందుకంటే గురువు కరుణా సాగరం.  మరియు బ్రహ్మ అంటే ఋషులలో ఉత్తముడు అని అర్థం. 

 ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో సద్గుణ దయను అలవర్చుకోవాలి.  ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా పుణ్యం.  ఎదుటివారి గురించి మంచి మాటలు చెప్పడం మంచి పని.  ఆదిశంకరుడు తనకు హాని తలపెట్టడానికి వచ్చిన ఒక కాపాలిక పట్ల కరుణ చూపాడు.  ఇది మహోన్నతమైన దయ. 

 చిన్నతనం నుంచే పిల్లల్లో దయ పెంపొందించాలి.  పాఠశాలలో చదువుకునేటప్పుడే తోటి విద్యార్థులకు చిన్న చిన్న సహాయములు చేయటం నేర్పించాలి.  ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూస్తే వారిని శాంతింపజేసి పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించడం మన ధర్మం.  కరుణతో నిండిన వారు మాత్రమే ఈ ప్రయత్నంలో నిమగ్నమవ్వగలరు. 

 మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తనని యోగ్యతతో కోరుకునే వారికి సహేతుకమైన ఉపకారం చేయాలి.  ఇతరులకు సహాయం చేయడానికి మన జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి.  మీరు వాటిని కోల్పోతే, మీరు చింతిస్తారు.  అది కూడా అజ్ఞానమే. 

 కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడానికి మరియు భగవదనుగ్రహాన్ని సాధించడానికి తమ వంతు కృషి చేయాలి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

మనస్సులోని భావం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *ఆకారైరింగితైర్గత్యా*

           *చేష్టయా భాషణేన చ* l

           *నేత్రవక్త్రవికారైశ్చ*

           *లక్ష్యతేఽన్తర్గతం మనః* ll


తా𝕝𝕝 " ఆకారముచేత, ఇంగితముచేత, నడవడికచేత, వ్యవహారముచేత, మాటలచేత మరియు కళ్ళలో, ముఖములో కలిగే మార్పులచేత మనస్సులోని భావం తెలియజేయబడును"