22, నవంబర్ 2022, మంగళవారం

శరీర విజ్ఞాన పరీక్ష


పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .


 భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .

సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .


శరీర పరీక్ష నేర్చుకునే విదానము.- 


  పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.


 చేదన కర్మం - 


    సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .


 బేధ్య కర్మం - 


   నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .


 లేఖ్య కర్మం - 


   రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .


 వేద్య కర్మం - 


  మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .


ఏష్య కర్మం - 


  పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .


 ఆహార కర్మం - 


   పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.


 విశ్రావ్య కర్మం - 


  విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .


 సీస కర్మం - 


   మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .


స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -


  కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.


 శస్త్ర చికిత్స చేయు విదానం -


   శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.


 శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-


 * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)


 * యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)

 

 * క్షారము - ( Alkali) .


 * అగ్ని - ( Fire for cauterisation) .


 * జలూక - ( Leeches) .


 * శలాక - ( Probe or direetor ).

 

 * జాంబ వోష్ణము -( Cavtersing 

Inusruments) .


 * పిచువు - (Cotton) .

 

 * ప్లోతము - ( Lint) .

 

 * సూత్రము - (Thread) .

 

 * పట్టము - ( Tow ).

 

 * తేనే - ( Honey) .

 

 * నెయ్యి - ( Ghee) .

 

 * కొవ్వు.

 

 * పాలు.


 * నూనే .


 * తర్పణం - ( powederd wheat soaked in 

water ) .


 * కషాయం - ( Decoctions) .


 * అలేపము - ( Medicated Plasters) .


 * కల్కము - ( Paste) .


 * చన్నీళ్ళు.


 * వేడి నీళ్ళు .

 

 * కవలిక - ( Splints) .


 * వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).


 * స్పటికం - ( Lens) .


 * కురువింద రాళ్ళు .


 * అయస్కాన్థములు .


 * గాజు తునకలు.


 * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చెయు పదార్దం


           ఈ విధంగా మన పూర్వీకులు వివిధ రకాల వస్తువులు ఉపయోగించి అత్యద్భుతంగా శస్త్రచికిత్సలు చేసేవారు . 


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034


పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

 పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .


 భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .

సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .


శరీర పరీక్ష నేర్చుకునే విదానము.- 


  పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.


 చేదన కర్మం - 


    సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .


 బేధ్య కర్మం - 


   నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .


 లేఖ్య కర్మం - 


   రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .


 వేద్య కర్మం - 


  మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .


ఏష్య కర్మం - 


  పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .


 ఆహార కర్మం - 


   పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.


 విశ్రావ్య కర్మం - 


  విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .


 సీస కర్మం - 


   మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .


స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -


  కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.


 శస్త్ర చికిత్స చేయు విదానం -


   శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.


 శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-


 * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)


 * యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)

 

 * క్షారము - ( Alkali) .


 * అగ్ని - ( Fire for cauterisation) .


 * జలూక - ( Leeches) .


 * శలాక - ( Probe or direetor ).

 

 * జాంబ వోష్ణము -( Cavtersing 

Inusruments) .


 * పిచువు - (Cotton) .

 

 * ప్లోతము - ( Lint) .

 

 * సూత్రము - (Thread) .

 

 * పట్టము - ( Tow ).

 

 * తేనే - ( Honey) .

 

 * నెయ్యి - ( Ghee) .

 

 * కొవ్వు.

 

 * పాలు.


 * నూనే .


 * తర్పణం - ( powederd wheat soaked in 

water ) .


 * కషాయం - ( Decoctions) .


 * అలేపము - ( Medicated Plasters) .


 * కల్కము - ( Paste) .


 * చన్నీళ్ళు.


 * వేడి నీళ్ళు .

 

 * కవలిక - ( Splints) .


 * వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).


 * స్పటికం - ( Lens) .


 * కురువింద రాళ్ళు .


 * అయస్కాన్థములు .


 * గాజు తునకలు.


 * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చెయు పదార్దం


           ఈ విధంగా మన పూర్వీకులు వివిధ రకాల వస్తువులు ఉపయోగించి అత్యద్భుతంగా శస్త్రచికిత్సలు చేసేవారు . 


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


21, నవంబర్ 2022, సోమవారం

రుద్రాక్ష మాల ధరించుటకు

 రుద్రాక్ష మాల ధరించుటకు పాటించవలసిన ముఖ్య నియమాలు  -


 *  రుద్రాక్ష మాల ధరించాలనుకునేవారు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆవుపాలతో శుద్ధిచేసి ధరించగలరు.


 *  సంవత్సరానికి ఒకసారి రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి ఆ పూజలో రుద్రాక్షమాలను ఉంచి మరలా ధరించవలెను .


 *  ఎల్లప్పుడూ రుద్రాక్ష మాలని ధరించువారు కనీసం సంవత్సరానికి ఒకమారు ఆ రుద్రాక్ష మాలకు " మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం " చేసినచో చాలా మంచిది .


 *  రుద్రాక్ష మాలను బంగారంతో గాని వెండితో గాని చుట్టించుకొని తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరచి , పంచామృతాలతో శుద్దిచేసి ఆయా రుద్రాక్ష యొక్క అధిష్టాన దేవత మందిరంలో ఉంచి పూజించి ధరించవలెను .


 *  రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు పౌర్ణమి , త్రయోదశి , చతుర్దశి , మహాశివరాత్రి , కార్తీకమాస సోమవారముల యందు ధరించవలెను .


 *  రుద్రాక్షలను రుద్రాక్ష పూజా మంత్రములతో పూజచేయకుండా ధరించిన ఫలితం ఉండదు.


 *  రుద్రాక్షలు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉండవలెను అనిన వాటికి ఆవునెయ్యి నెలకొకమారు రాయవలెను.


 *  ప్రతినిత్యం స్నానం చేయునపుడు రుద్రాక్షమాల తీసి పక్కన పెట్టి స్నానం చేయుట మంచిది .


 *  రుద్రాక్షలతో ముత్యాలు , పగడములు , స్పటికములు , శంఖాలు , తులసి పూసలు , నవరత్నాలు కలిపి ధరిస్తారు . ఇలా ధరించేప్పుడు కనీసం రుద్రాక్షలు 27 గాని , 54 గాని ఉండవలెను .


 *  శివరాత్రి పర్వదినమున రుద్రాక్షలతో పూజ చేయుట చాలా శ్రేష్టం .


 రుద్రాక్ష ధారణకు శుభసమయ వేళలు  -


 *  మేష , కర్కాటక , తులా , మకర , కుంభ లగ్నముల యందు రుద్రాక్ష ధారణ చేయవలెను .


 *  అశ్వని , మృగశిర , పునర్వసు , పుష్యమి , హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , రేవతి నక్షత్రాలలో రుద్రాక్ష ధారణ చాలా మంచిది .


 *  పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , త్రయోదశి , పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచిది .


 *  సోమవారం  ధరిస్తే చాలా మంచిది . లేదా శనివారం కూడా ధరించగలరు . కృష్ణపక్షంలో (పౌర్ణమి తదుపరి బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ) ధరిస్తే మంచిది .


 *  కార్తీకమాసంలో ధరిస్తే చాలా మంచిది . లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు . భాద్రపద , పుష్య , శ్రావణ , అశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు .


 *  రుద్రాక్షమాల ధారణకు మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్తమం.


 రుద్రాక్షధారణ కు పాటించవలసిన నియమాలు -


 *  సోమరులు అయి ఉండకూడదు. సేవా కార్యక్రమాలు యందు ఆసక్తి కలిగిఉండవలెను.


 *  అపద్దాలు ఆడకూడదు . దయ, దాక్షిణ్యం , ఏకాంతం , క్షమాగుణములలో సాత్విక అభిప్రాయంతో , శాంతస్వభావులై ఉండవలెను .


 *  కామ, క్రోధ, లోభ, మోహ , మద మాత్సర్యాలను వదిలిపెట్టి సంప్రదాయ బద్ధమైన విషయాలను నిందించకూడదు .


 *  పాపాత్ములతో సావాసం చేయరాదు .


 *  వితంతువులు రుద్రాక్ష ధారణ చేయుట మంచిది .


 *  రుద్రాక్ష ధరించువారు ధూమపానం మానివేయవలెను .


 *  రుద్రాక్ష ధారణ చేసినవారు వెల్లుల్లి , నీరుల్లి , మద్యమాంసాదులు మానివేయవలెను .


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


        

_ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం_*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



*_ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం_*


సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన 

అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. 


ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి 

చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు.


ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల.. 

శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. 


అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా 

ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..


వాస్తవాలు


ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. 

ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.


స్మరణ


యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.


ప్రయోజనాలు


ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, 

నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది.


అనుకూల పరిస్థితులు


ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అనుకూల పరిస్థితులు ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది.


తీవ్రమైన మానసిక ఒత్తిడి


ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది.


108 సార్లు


ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. జీవితంలో ప్రశాంతత పొందుతారు.


ఎప్పుడు స్మరించాలి?


ఓం నమః శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వేకువ జామున స్నానం చేసి, కాళ్లు ముడుచుకుని, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని జప మాల తీసుకుని ఓం నమః శివాయ మంత్ర జపం మొదలుపెట్టాలి. 


ఒకవేళ జపమాల లేకపోతే.. వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు.


ధ్యానం


108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది.


సర్వే జనాః సుఖినో భవంతు


అన్యధా శరణం నాస్తి,త్వమేవ | శరణం మమ, తస్మాత్కారుణ్య భావేనా || రక్షరక్ష మహేశ్వరా...


స్వస్తి..



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

యూపీ ముఖ్యమంత్రి గురించి ఎవరికీ తెలియని నిజాలు

 తెలుగు - हिन्दी - English

              -------------------------------------

   🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩


యూపీ ముఖ్యమంత్రి గురించి ఎవరికీ తెలియని నిజాలు

నేను, చాలా మందిలాగే అతను ఎప్పుడూ కుంకుమపువ్వు ధరించే "సనాయ్" మాత్రమే అని భావించాను

అయితే అతని గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి.

అజయ్ మోహన్ బిష్త్

                        మారుపేరు

          యోగి ఆదిత్యనాథ్


H.N.B గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు (100%).


అజయ్ బిష్త్‌ను అజయ్ యోగి అని కూడా పిలుస్తారు, అతను BSC గణితంలో గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణత సాధించిన గణిత విద్యార్థి.


యూపీలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో అత్యంత పేద కుటుంబంలో 1973లో జన్మించారు. అతడికిప్పుడు 49 ఏళ్లు.


భారతీయ మిలిటరీ యొక్క పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు.


 యోగి ప్రధాని అయితే నేపాల్ భారత్‌లో విలీనమవుతుందని నేపాలీ వార్తాపత్రికలు చెబుతున్నాయి!!


నేపాల్‌లో భారీ ప్రో యోగి ప్రదర్శనలు


మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం.


ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ స్విమ్మర్.


కంప్యూటర్‌ను కూడా కొట్టిన అకౌంటింగ్ నిపుణుడు.


 శకుంతలా దేవి కూడా యోగిని స్తుతించింది!


రాత్రికి నాలుగు గంటలు మాత్రమే నిద్ర. రోజూ తెల్లవారుజామున 3:30కి నిద్రలేస్తుంది.


 యోగా రొటీన్ ఉంది.


రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు..

పూర్తిగా శాఖాహారం.


అతను ఏ కారణం చేత ఇంతవరకు ఆసుపత్రిలో చేరలేదు.


యోగి ఆదిత్య నాథ్ అలియాస్ అజయ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు.


यूपी के मुख्यमंत्री के बारे में कुछ अज्ञात तथ्य

मुझे, कई अन्य लोगों की तरह, यह महसूस हुआ कि वह हमेशा भगवा वस्त्रों में एक "सन्यासी" हैं

लेकिन उनके बारे में तथ्य जानने के लिए नीचे पढ़ें....

अजय मोहन बिष्ट

                        उपनाम

          योगी आदित्यनाथ


एचएनबी गढ़वाल विश्वविद्यालय से उत्तर प्रदेश के इतिहास में सर्वाधिक अंक (100%)


अजय बिष्ट को अजय योगी के नाम से भी जाना जाता है, वे गणित के छात्र हैं, जिन्होंने बीएससी गणित स्वर्ण पदक के साथ उत्तीर्ण किया है।


1973 में यूपी के एक पिछड़े पंचूर गांव में एक बेहद गरीब परिवार में पैदा हुए। वह अब 49 साल के हैं।


भारतीय सेना की सबसे पुरानी गोरखा रेजीमेंट के आध्यात्मिक गुरु।


 नेपाली अखबारों की रिपोर्ट है कि योगी के पीएम बनने पर नेपाल का भारत में विलय हो जाएगा !!


नेपाल में योगी समर्थक का विशाल प्रदर्शन


मार्शल आर्ट में अद्भुत उत्कृष्टता।


उत्तर प्रदेश के जाने-माने तैराक।


एक लेखा विशेषज्ञ जो कंप्यूटर को भी हरा देता है।


 शकुंतला देवी ने भी की योगी की तारीफ!


रात में केवल चार घंटे की नींद। रोजाना सुबह 3:30 बजे उठ जाते हैं।


 एक योग दिनचर्या है।


दिन में दो बार ही खाता है..

पूर्णतः शाकाहारी।


वह अब तक किसी भी कारण से कभी अस्पताल में भर्ती नहीं हुए..


योगी आदित्य नाथ उर्फ ​​अजय एशिया के सर्वश्रेष्ठ वन्यजीव प्रशिक्षकों में से एक हैं।


Little unknown facts about UP Chief Minister

I, like many others felt that he is just a “sanaysi” always in saffron dresses

But read below to know facts about him ….

Ajay Mohan Bisht

                        Alias 

          Yogi Adithyanath


Highest marks in the history of Uttar Pradesh (100%) from H.N.B Garwal University


Ajay Bisht is also known as Ajay Yogi, he is a Mathematics  student who passed with the BSC Mathematics Gold Medal.


Born in 1973 to a very poor family in a backward Panchur village in UP. He is now 49 years old.


A Spiritual Guru of the oldest Gorkha Regiment of the Indian Military.


 Nepali newspapers report that Nepal will merge with India if Yogi becomes PM!!


Huge Pro Yogi demonstrations in Nepal


Amazing excellence in martial arts. 


Well known swimmer from Uttar Pradesh.


An accounting expert who even beat the computer.


 Even Shakuntala Devi has praised Yogi!


Only four hours of sleep a night. Wakes up daily at 3:30 in the morning.


 Has a Yoga routine.


Eats only twice a day ..

Completely vegetarian.


He never hospitalised so far for any reason..


Yogi Aditya Nath alias Ajay is one of the best wildlife trainers in Asia.


🙏

Srimadhandhra Bhagavatha

: m -- 79 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

మీరు ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే మీ మనస్సులను ఎవరో హరించారని తెలుస్తున్నది. అతనిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసింది. ఆయన – నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటినుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు.ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. స్త్రీ తానుచేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.

ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు.

“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోపల ఉన్నవాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రదులయి ఉన్నారు. వ్రతమును చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకుని వ్రతం చేస్తున్నారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము ఫలితం రాలేదని అంటారు. ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రతఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. ముప్పైరోజులనుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రతభంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. ప్రాయశ్చిత్తం అయిపోతుంది మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.

భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలి అంటే రెండుగా ఉన్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు.

ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటెకృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి ఉందాము అనుకున్నారు. మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గడగడ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందని తర్జనభర్జనలు చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక గోపిక – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మని మనం అంగీకరించాము. మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేసి మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్నా దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరిద్దాము అన్నది.

మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. క్రతువులో దోషం జరుగుతున్నది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి ఉంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు ఉన్న దోషమును విరుస్తుంది. అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణపరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు.

ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు ఇచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు ఇస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పోతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. ఉన్నది ఒక్కడే స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది.

ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అన్నది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటారు. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు.

‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణసాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టములో, కాత్యాయనీ వ్రత ఘట్టములో ఇన్ని రహస్యములు చొప్పించి కృష్ణపరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల.

ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ ఉంటే మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుందని నమ్మి సంతోషంతో నామము స్మరిస్తూ పూజచేసినా, అంతే స్థాయిలో పనిచేస్తుంది విశ్వాసము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు.

అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామము చెప్పగలిగితే జ్ఞానితో సమానము. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[20/11, 3:15 pm] +91 81055 36091: SRI SIVA MAHAPURANAM – 26 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu


నటరాజు


పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితే శివలింగం అనే సమాధానం వస్తుంది.


సాధారణంగా శివాలయములలో లింగ స్వరూపమే ఉంటుంది.సాకారంగా పరమశివుడికి, పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి శిక్షించడానికి వస్తాయి.రెండవది ‘అఘోరస్వరూపములు’ మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది.


ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన లోకంలోని మూర్తిని ఆనంద తాండవమూర్తి అంటారు. ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. శైవాగమము దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది.ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి.


ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలో నుంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి.ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి.ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకములైన నాట్యములు పుట్టాయి.ఇప్పటికీ ఈ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు.కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.


ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది.ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం.చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు.అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భృంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు.ప్రదోషవేళలో జరిగే ఈ తాండవం జరుగుతు ఉంటుంది. స్వరూపంలో సమస్త లయకారకమై ఉంటుంది.ఈ తాండవం ప్రదోషవేళలో జరుగుతూంటుంది.ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము.


ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి పెద్ద ఆనంద మూర్తిని చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.


ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు.ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భృంగి.మూడవవాడు పతంజలి. ఆదిశేషుని అవతారము.అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది.మిగిలిన శరీరం పాముగా ఉంటుంది.వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది ఉంటుంది. కింద పాదములు అవీ పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు.


ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు.బ్రహ్మ, శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు.పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికి తోచిన వాద్య విశేషమును వారు వాయిస్తూంటారు.ఢమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న ఢమరుకం కారణముగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి.ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడము అనే సమస్త కదలికలకు ఢమరుక సంకేతం.ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము.


ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు ఢమరుకం ఉంటుంది.ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంటుంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి.ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు.ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని అర్థం అయితే నడవడి యందు మార్పు వచ్చేస్తుంది.నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు.ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు ఏడవడు.మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం.ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది.


కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు.అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది.ఊర్ధ్వముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. ‘నీవు నేనై ఉన్నానని’ తెలుసుకో.దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది.కుడి చేయి అభయముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు.ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు.ఈ ‘శివ’ నుండి ఆనందతాండవమూర్తిలోనికి లయమయి ఆనందంగా మారిపోవాలి.అలా మారిపోతుంటే ఆయన దిగంబరుడుగా వచ్చాడు.అంటే శరీర భ్రాంతి లేకపోవడమును ఆనందం అంటారు.


ఆత్మస్వరూపి అయిన ఆనందతాండవమూర్తియందు సాధకుడు కలిసిపోయి ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు.ఆయనకి మరల చావడం అనేది ఉండదు.ఇదే ఆఖరి చావు.

శివుని విశేషములను వేటినీ సామాన్యముగా తీసుకొనుటకు ఉండదు.కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం, సహస్రం చేస్తాను అంటే ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు.ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం.కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం.ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు.వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో తెలియదు.ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది.మళ్ళీ కూపంలోకి పడిపోతాడు.ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు.తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు.ఏమయిపోయింది ఈ స్తోత్రం? అంతలో మాయ కమ్మింది.అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం.


నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి.శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. ఆనందతాండవమూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేయాలి.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

హైద‌రాబాద్‌లో రాత్రి వేళ్లలోనూ ఆర్టీసీ బ‌స్సు

 హైద‌రాబాద్‌లో రాత్రి వేళ్లలోనూ ఆర్టీసీ బ‌స్సు

హైద‌రాబాద్‌లో రాత్రి వేళ్లలోనూ ఆర్టీసీ బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే..?

హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ప్ర‌యాణించే వారికి టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. న‌గ‌ర ప్ర‌యాణికుల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చే వారు.. త‌మ గ‌మ్య‌స్థానాల‌ను చేరేందుకు వీలుగా రాత్రి వేళ్లలోనూ ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులో ఉండేలా టీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులో ఉండ‌నున్నాయి. 219, 1, 90L/219, 8A, 107V/R, 290U, 279, 222A, 216 నంబ‌ర్ బ‌స్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.


 రాత్రి వేళల్లో అందుబాటులో ఉండే బ‌స్సుల వివ‌రాలివే..

Route Time From To Route Time From To

90L/219 22:00 LB NAGAR PATANCHERU 219 0:10 PATANCHERU SECUNDERABAD

90L/219 22:30 LB NAGAR PATANCHERU 219 0:15 PATANCHERU SECUNDERABAD

219 0:15 SECUNDERABAD PATANCHERU 219 0:40 PATANCHERU SECUNDERABAD

219 1:20 SECUNDERABAD PATANCHERU 219 1:20 PATANCHERU SECUNDERABAD

219 1:30 SECUNDERABAD PATANCHERU 219 2:25 PATANCHERU SECUNDERABAD

219 2:00 SECUNDERABAD PATANCHERU 90L/219 2:50 PATANCHERU LB NAGAR

219 2:25 SECUNDERABAD PATANCHERU 90L/219 3:20 PATANCHERU LB NAGAR

219 3:30 SECUNDERABAD PATANCHERU 219 3:30 PATANCHERU SECUNDERABAD

8A 22:40 SECUNDERABAD CHARMINAR 8A 22:05 CHANDRYANGUTTA SECUNDERABAD

8A 23:15 SECUNDERABAD CHARMINAR 8A 23:25 CHARMINAR SECUNDERABAD

8A 0:20 SECUNDERABAD CHARMINAR 8A 0:15 CHARMINAR SECUNDERABAD

8A 1:20 SECUNDERABAD CHANDRYANGUTTA 8A 1:05 CHARMINAR SECUNDERABAD

8A 2:00 SECUNDERABAD CHARMINAR 8A 2:25 CHANDRYANGUTTA SECUNDERABAD

8A 3:50 SECUNDERABAD CBS 8A 2:45 CHARMINAR SECUNDERABAD

8A 5:55 SECUNDERABAD CHANDRYANGUTTA 8A 4:45 CBS SECUNDERABAD

1 22:50 SECUNDERABAD AFZALGUNJ 1 22:00 AFZALGUNJ SECUNDERABAD

1 0:35 SECUNDERABAD AFZALGUNJ 1 23:40 AFZALGUNJ SECUNDERABAD

1 2:15 SECUNDERABAD AFZALGUNJ 1 1:25 AFZALGUNJ SECUNDERABAD

1 3:50 SECUNDERABAD AFZALGUNJ 1 3:05 AFZALGUNJ SECUNDERABAD

107V/R 22:35 SECUNDERABAD LB NAGAR 107V/R 21:50 DILSUKHNAGAR SECUNDERABAD

107V/R 23:00 SECUNDERABAD LB NAGAR 107V/R 22:15 DILSUKHNAGAR SECUNDERABAD

107V/R 0:25 SECUNDERABAD LB NAGAR 107V/R 23:30 LB NAGAR SECUNDERABAD

107V/R 0:50 SECUNDERABAD LB NAGAR 107V/R 23:55 LB NAGAR SECUNDERABAD

107V/R 2:15 SECUNDERABAD DILSUKHNAGAR 107V/R 1:20 LB NAGAR SECUNDERABAD

107V/R 2:40 SECUNDERABAD DILSUKHNAGAR 107V/R 1:45 LB NAGAR SECUNDERABAD

107V/R 3:45 SECUNDERABAD DILSUKHNAGAR 107V/R 3:00 DILSUKHNAGAR SECUNDERABAD

107V/R 4:10 SECUNDERABAD DILSUKHNAGAR 107V/R 3:25

ప్రలంబాసుర వధ

 Srimadhandhra Bhagavatham -- 78 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రలంబాసుర వధ

ఒకనాడు కృష్ణుడు, బలరాముడు గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు. రెండవ జట్టుకు కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముని ఓ చెట్టు చాటుకు తీసుకువెళ్ళి ‘అన్నయ్యా ! ఈవేళ గోపబాలురలో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు. నిన్ను చంపుదామనే వచ్చాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కోరవద్దు’ అని చెప్పాడు. ఆమాట చెప్పిన తరువాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంభాసురుడికి కడుపులో ఒక బెంగ ఉన్నది. కృష్ణుడు మీదికి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురునికి తెలుసు. కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముని జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానే ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. బలరాముడికి ఏదయినా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్న వాడిని, తనకోసమని అవతారమును స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపయిన వాడిని, తాను కాలుపెడితే పాదపీఠమయిన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగయిన వాడిని, తాను నడుస్తుంటే ఛత్రము పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలికగా వదిలిపెడతాడా? తనవారన్న వాళ్ళని ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటాడు. ప్రలంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు.

ఆట ప్రారంభం అయింది. ఈరోజున కృష్ణుడు బృందం ఓడిపోయింది. బలరాముడి బృందం గెలిచింది. బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మోయాలి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థం అయి సరే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీతవరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలెయ్యాలి. అక్కడవరకు మాత్రం మొయ్యాలి. సరేనని బలరాముడిని ప్రలంబుడు ఎక్కించుకున్నాడు. ‘పర్వతమంత బరువు ఉన్నాడే' అని అనుకుంటున్నాడు. పరుగెడుతున్న ప్రలంబుడు గీతదాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు, ప్రలంబుని ఆగమని అరుస్తున్నా వాడు ఆగడం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ప్రలంబాసురుని తల బ్రద్దలై వాడు నేలమీద పడిపోయి మరణించాడు. పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు.

ఈలీలలో మనం తెలుసుకోవలసిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉన్నది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక, భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్ళ మృత్యువుకు మార్గమును తెరుస్తాడు. ఆ భక్తుడిని ఆయనే, బలరాముడిని కృష్ణుడు రక్షించుకున్నట్లు రక్షించుకుంటాడు. భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దాని వలన ఈశ్వరానుగ్రహమును పొందరు. బలరాముడిని చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రలంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము, వాళ్ళను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదం లోనికి తీసుకువెళ్లవచ్చు భగవంతుడిని ఏమీ చేయలేం కాని భక్తులను ఏమైనా చేయవచ్చని అనుకోవడం అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటిని రెప్ప కాపాడినట్లు కాపాడుతూనే ఉంటాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులయిన వారందరికీ కూడా ఒక గొప్ప అభయమును ఇస్తూ ఈశ్వరుడు ప్రలంబవధ అనబడే ఈ లీలను చేసి, మనకందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయములను ఆవిష్కరించి ఉన్నాడు.

గోపికా వస్త్రాపహరణం

భగవానుడు కృష్ణుడిగా అవతరించి చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమయినది. ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల.

బృందావనంలో ఉండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్కృష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్షమాసములో ఒక వ్రతము చేసారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది. పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేసే కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం, ఒక రహస్యం ఉన్నది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి అన్నాచెల్లెళ్ళు. వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయనీ వ్రతం చేస్తారు. గోపకాంతలు ప్రతిరోజూ ఇసుకతో కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు.

కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి

నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః!

అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా! నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలని దానిని భార్యాభర్త్రు సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతమును ముప్పదిరోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజూ గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునానది తటము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమయినది.అమ్మవారికి ‘కదంబ వనవాసిని’ అని పేరు. అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకుని గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగడానికి ప్రతిబంధకముగా ఉన్న దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయనీ దేవి తియ్యాలి. ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు అదెలా కుదురుతుందని అనుమానం రావచ్చు. పరమేశ్వరుడికి రూపం లేదు ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమయిన రూపం ధరించి పరమాత్మ ఈ భూమిమీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపము అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారత్వమును పొంది ఫలితమును ఇవ్వడానికి వస్తున్న కృష్ణుడు గోపాలబాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడినుండి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడుచేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయం లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రములనన్నిటిని పట్టుకుని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. స్త్రీలు అందరూ నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు

కొంటివి మా హృదయంబులు, గొంటివి మానంబు; లజ్జ గొంటివి; వలువల్

గొంటి; వికనెట్లు సేసెదొ, కొంటెవు గద !నిన్ను నెఱిగికొంటిమి కృష్ణా!

ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడమును అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా ఇవి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడినుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

ఆడదే మగాడికి సర్వస్వం.

 *"భార్య గురించి అద్భుతమైన రచన.* అవకాశం ఉంటే ఎన్ని సార్లు అయినా చదవండి. ఇందులో

ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిన అద్భుతమైన సూచనలు ఎన్నో ఉన్నాయి.

2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. 

అందులో ఒక ఆసక్తికరమైన 

అంశం వెల్లడైంది...

--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. 

తన కన్నా చిన్నదైన భార్య

చనిపోతుందనే సన్నద్ధత

పురుషుల్లో ఉండదట. 

భార్య చనిపోతే భర్త 

కుంగుబాటుకు గురవడానికి 

ఇది కూడా ఒక ప్రధాన 

కారణమని వారు విశ్లేషించారు._

                                                                                                           --భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు., 

కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో 

కొడతారు కూడా ! 

*ఆమె శాశ్వతంగా దూరమైతే*

*మాత్రం  తట్టుకొని బతికేంత*

*మానసిక బలం పురుషులకు ఉండదు.*

‘ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం !!'

అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు 

ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..,

అందరితో కలవలేక..,

మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు 

                                                                                                                                                                                  "నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ., ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు.

ఒరే.., పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. 

‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.

‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా ? అని అనుకోకు., ఉంటారు. 

నాకు మీ మావయ్యంటే 

చచ్చేంత ఇష్టంరా. 

ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది. 

చీకటంటే భయం. 

ఉరిమితే భయం. 

మెరుపంటే భయం. 

నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ? 

అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని 

లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’

ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన.., నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ళ భరణి తీసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !                         

నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.

                                                                                                                                                 ప్రముఖ చిత్రకారుడు, 

దర్శకుడు బాపు సైతం., 

భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.

                                                                                                                                                                                                                                                                                                                                                    సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.

భార్య తన మీద ఆధారపడి ఉందని.,తాను తప్పఆమెకు 

దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. 

కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. 

చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.

 భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికిబాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. 

భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.

స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది 

తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే 

ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. 

ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే., భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.

                                                                                                                                                                                                                        -భావోద్వేగ బలం ఆమెదే !

_*పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.*

సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 

ఒక విధంగా చెప్పాలంటే.. 

ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 

ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. 

అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..

*ఆడదే మగాడికి సర్వస్వం..!*

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత" 

"Save Girl Child, and Respect women"

కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు

 *విస్తరాకును* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.

భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం.

*"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము.

*'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.

*'విస్తరాకుకు'* ఉన్న ఆలోచన భగవంతుడు *"మనుషులకు"* కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ....

*'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.

మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..

ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?

కనీసం *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..


అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*.. *ఇదే జీవిత పరమార్ధం*