18, ఫిబ్రవరి 2023, శనివారం

పెద్దదిక్కు

 *_ఇంటికి పెద్దదిక్కు  వుండాలి అంటారు. ఎందుకంటే..._* 

🪷🪷🪷🪷🪷🪷🪷🪷


 *నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు  తప్పు చేస్తే ఖండించడానికి.* 


*అసలు మాకు పెద్ద దిక్కే వద్దు.. మంచి చెప్పే వాళ్లు వద్దు.. అని అంటే, ఆ కుటుంబం ఏమైపోతుంది..? కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు...* 


*ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది.* 


• *దుర్యోధనునికి తల్లిదండ్రులు అతిప్రేమ వలన చెప్పలేకపోయారు.*

 

• *విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు.* 

• *భీష్ముడు పాపం తాత గారు... చనువు ఎక్కువే, అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు. కానీ, ఆయన్నీ లెక్క చేయలేదు...* 


• *చివరికి ఏమైంది...??? మహా సామ్రాజ్యంతో పాటు సర్వమూ కూలిపోయింది...*

 

     *~~~~~*


*పెద్దలు లేని సంసారమూ, కుటుంబమూ ఏమవుతుందో తెలుసుకోవాలి..*


*వందమంది కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి. ధర్మాన్ని చెప్పేవాడు ఒక్కడైనా వుండాలి.*

 

*_అదే ధృతరాష్ట్రుని గొప్పతనం..._*


*ధృతరాష్ట్రుడు విదురుడిని ప్రక్కన పెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శన భాగ్యం లభించింది.*

*అదే శకునిని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనుడి  స్థితి మనకు తెలుసు...* 


*దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా గుర్తు పెట్టుకోవాలి.*


 *ధర్మరాజు విషయంలో చూడండి.. ఆయన అందరి మాట విన్నాడు. ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు. ధర్మ ప్రవర్తనతో బ్రతికారు.* 


*మరి దుర్యోధనుడో.... ఎవ్వరి మాటయినా విన్నాడా?  తల్లిదండ్రుల మాట వినలేదు. గురువుల మాట వినలేదు. పెద్దల మాట వినలేదు. శ్రేయోభిలాషుల మాట వినలేదు. భగవంతుడి మాట కూడా వినలేదు. చివరికి ఏమయ్యాడు?*


*మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడుకునియైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది, చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు...* 


*ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.*


*ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా?* 

*అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి...* 


*అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడిగితే...*

*_"ఓ తప్పును ఆపలేనప్పుడు అది జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు"_ అని అంటాడు కృష్ణుడు.* 


*ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు...*

 

*అదే విదురుడు కూడా ఆ దృశ్యాన్ని చూడకుండా అక్కడ నుండి వెళ్లిపోయినాడు...*

*కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు.* *అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.....*

*_ఇదీ విజ్ఞులు చేసే పని._*

🌹🍀🙏(సేకరణ)🙏🍀🌹

కామెంట్‌లు లేవు: