27, మే 2023, శనివారం

ఐహికాముష్మిక విషయములు :-*

 *-: ఎల్లరూ తెలుసుకోతగిన  ఐహికాముష్మిక విషయములు :-*

           *( కలగూరగంప )*

💐💐👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐



 *ఏడుగురు అప్సరసలెవరు..?*


 1.రంభ. 2.ఊర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6.ఘృతాచి

 7.మంజుగోష .


 *సప్త సంతానములు అంటే ఏమిటి..?*

 

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 

3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రబంధ రచన. 

6. స్వసంతానం ( పుత్రుడు ).

 

*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి..?*


 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 

3. పరమాత్మ.

 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానాత్మ  

7. మహాధాత్మ . 8. భూతాత్మ . 

9. సకలాత్మ.


 *పదిరకాల పాలు ఏవి..?*


 1. చనుబాలు. 2. ఆవుపాలు . 

3. బర్రెపాలు .

 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు.

 9. ఏనుగు పాలు.10. లేడి పాలు.


 *యజ్ఞోపవీతంలో ఎన్నిపోగులు ఉంటాయి..?*


 యజ్ఞోపవీతం లో 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 

9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 

4. చంద్రుడు . 5. పితృ దేవతలు .

 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .


 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి..?*


 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 

4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 

7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. భృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12.వరాహసంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.


 *గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు..?*


 1. ఈశాన్యంలో పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యంలో  స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుబేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.


 *వివిధ ఫలాల నైవేద్యఫలితాలు:-*


 *కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) :-*

 భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.


 *అరటి పండు:-* భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిధ్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.


 *నేరేడుపండు:-* శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి  ఆప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.


 ద్రాక్ష పండు:-*  భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 

*మామిడి పండు:-*

 మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. 

నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకంచేసిన తేనెలో కలిపి నైవేద్యంగా  పెట్టి అందరికీ పంచి, తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.


 *అంజూరపండు:-* 

భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జూరపండును అందరికీ పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్నీ తొలగి ఆరోగ్య వంతులు అవుతారు.

 

*సపోటా పండు:- సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి.

 

*యాపిల్ పండు:-* 

భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 

*కమలా పండు:-*

  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.


 *పనసపండు:-*  

పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనము, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.


 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి..?*


 1.జన్మ సూతకము. 

2. మృతసూతకము. 

3. రజః సూతకం . 

4.అంటు (రోగ ) సూతకం . 

5 శవదర్శన సూతకం . 


 *దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా..?*


 శివాలయానికి నూరు బారుల దూరం లోపల, విష్ణాలయమునకు వెనుక ఇరవై బారుల దూరం లోపల, 

శక్తి ఆలయముకు సమీపం లోను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేకంగా గృహ నిర్మాణం జరిగితే సకల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు 

ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.


 *తాంబూలం సేవించేటప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి..?*


 తాంబూలం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాధికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబూలం వేసుకోవడం ఆరోగ్యకరం.  అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుధ్ధిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తుంచివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక.


 *శ్రీగోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు..?*


 తిరుపతిలో  శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధిలో కుంచం ఉండటం నిజమే.. దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీవెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేశాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచంతో కొలిచి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గోవింద రాజస్వామి ఈకార్యమును సాగించారని ఒక కధ ప్రచారంలో ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నారు అని ప్రతీతి.


 *నవగ్రహాలకు సంబంధించిన సమిధలు ఏవి..?*


 1. సూర్యుడు - జిల్లేడు. 

2. చంద్రుడు - మొదుగ .

 3. అంగారకుడు - చండ్ర. 

4. బుధుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 

6. శుక్రుడు - అత్తి .

 7. శని - జమ్మి . 

8. రాహువు - దర్భ. 

 9. కేతువు - గరిక .


  *ఎటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు..?*


 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2. స్మశాన భూమికి సమీపం లోను .

 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4.ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5.ఎల్లప్పుడూ నీటి వూటలు గల ప్రదేశాలలోను .

 6.రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7.చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు.. అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .


 *పుజాంగాలు  ఎన్ని రకాలు..?*


 పుజాంగాలు  5 రకాలు.

 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.

 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట

 3. ఇజ్య - ధూప, దీప, నైవేద్యములతో పూజించుట.

 4. స్వాధ్యాయము - తనకు తానుగా మంత్రోఛ్ఛారణతో స్తుతించడం.

 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

  

 *ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి..?*


 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధాన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలో ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుభప్రదంగా ఉండును. ఆ తరువాత 

ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును. కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని పెద్దలమాట.


 *గృహ నిర్మాణంలో ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి..?*


 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలో ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలోను ఉండాలి. అలమరాల గురించి శాస్త్రంలో ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలోనో పెట్టుకోవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు.. కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహంలో ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.


 *వివిధ జన్మలు ఏవి..?*


 1. దేవతలు . 2. మనుష్యులు. 

3. మృగములు.

 4. పక్షులు . 5. పురుగులు. 

6. జలచరములు.

 7. వృక్షములు .


 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు..?*

 

1.శేషాద్రి 

2. నీలాద్రి. 

3. గరుడాద్రి. 

4. అంజనాద్రి. 

5.వృషభాద్రి

6. నారాయణాద్రి.

7. వేంకటాద్రి.


 *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి..?*


  ( 1 )విష్ణుమూర్తి యొక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులో చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రధ్ధలతో వినయంగా నమస్కరించాలి.


( 2 ) ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.


 ( 3 ) గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.


 ( 4 ) మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.


 ( 5 ) తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.


  ( 6 ) తల్లికి ఉదరంపై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.


  *శ్రీచక్రం నందు గల దేవతలు ఎవరు..?*


 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.

 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .


 *ధర్మము యొక్క  లక్షణములు ఏవి..?*

 

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే *"ధర్మము"*


 *సహంపక్తి భోజనాల సమయంలో అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు..?*


 సహంపక్తి భోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి భోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలో మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తిలో కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.

          కనుకనే సహపంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.


 *దేవతా లక్షణాలు ఏవి..?*


 1. రెప్పపాటు లేకుండుట . 

2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.

3. వ్యసనం లేకుండా ఉండుట.


 *నవ వ్యాకరణాలు అనగా ఏవి..?*


 1. పాణి నీయం . 

2. కలాపం. 

3. సుపద్మం. 

4. సారస్వతం. 

5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 

7. వ్యాఘ్ర భౌతికం. 

 8. శాఖటా టా యానం . 

9.శాకల్యం .


 *శ్రీరాముడు ఎప్పుడు జన్మించెను..?*


 శ్రీ రాముడు చైత్ర మాసం , 

నవమి తిధిలో 

కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .


 *పర్వ దినాలలో వడపప్పును ఎందుకు పెడతారు..?* 


 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.

          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .


 *శ్రీవేంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు..?*


 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రభాతాన్ని రచించిన వారు 

శ్రీప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీమనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు 

క్రీ .శ . 1361వ,సం.లోజన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం. వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో 

శ్రీస్వామివారి సుప్రభాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందినది.


 *పంచ కోశాలు అనగా ఏవి..?*


1. అన్నమయ కోశం. 

2. ప్రాణమయ కోశం .

3. మనోమయ కోశం . 

4. విజ్ఞానమయ కోశం .

5. ఆనందమయ కోశం .


 *శౌచమంటే ఏమిటి..?*


 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత బాహ్య అంతరములలో పరిశుధ్ధతని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 

 *1. బాహ్య శౌచం.*

 *2. అంతః శౌచం .*


 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధంగా ఉండేందుకు పూసే సుగంధ ద్రవ్యాలు వంటివి. వీటిని బాహ్య శౌచం అంటారు.


 *అంతః శౌచం:-*

  మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , మాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతఃకరణను కలిగి ఉండటమే అంతఃశౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంబంధించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.


 *ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితంఉంటుంది..?*


 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కానీ ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిధ్యము నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.


 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి..?*


1. వైద్యనాధ లింగం. 

2. వక్రేశ్వర నాద లింగం.

3. సిద్ధినాద లింగం. 

4. తారకేశ్వర లింగం.

5. ఘటేశ్వర లింగం. 

6. కపిలేశ్వర లింగం.


 *పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు..?*


 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లోకాల్లోను ఉంటారు.

 

 నాల్గవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లోకంలో కల్పాంత జీవులు ఉంటారు.


 అయిదోవది అయిన జనలోకంలో బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.


 ఆరవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉండెదరు. 


*అరిషడ్వర్గములు అనగా ఏవి..?*

1 కామం

2 క్రోధం

3 లోభం

4 మోహం

5 మదం

6 మాత్సర్యం



 *భగవంతుడికి నివేదించే సమయంలో గుర్తుంచుకోవలసినవి ఏవి..?*


 భగవంతుడికి నివేదించేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చేసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేదించేటప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .


 1. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు . పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదించరాదు . చల్లారాక పెట్టాలి .

 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.


 *ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు..?*


 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రిపుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రములు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 

     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడాన్నే ఊర్ధ్వ పుండ్ర ధారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రణవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరూపడైన శ్రీమహావిష్ణువును , ఉకారం - చిత్ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేఖలుగా నుదుట ధరిస్తారు .


    తిరుమణి మట్టికి సంబంధించినది . కావున అది మట్టి నుండి కలిగిన 

ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సూచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి ధారణ కూడా 

ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.


  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రములు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర ధారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఊర్ధ్వ పుండ్రంలో ఉపయోగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.


 *నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి..?*

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రుని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి..


 * రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.


 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయంలో ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయోగించి కూడా బట్టలను ఉతకరాదు . 

 * అభ్యంగన స్నానం అంటే కుంకుళ్ళు , షాంపులు మొదలయిన వాటిని ఉపయోగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలమూత్రాలు విసర్జించరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం వస్తుంది.


 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దోషం..


 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు..

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చేయాలి.

 మామూలు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి..!

                *--- 0 ---*

*సర్వం..! పరబ్రహ్మార్పణమస్తు..!*

*శ్రీరామ..! జయరామ..!*

*జయ..! జయ..! రామ..!*

💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐

కామెంట్‌లు లేవు: