29, మే 2023, సోమవారం

వేదాల్లో ఉన్నవే

 వేదాల్లో ఉన్నవే పాశ్చాత్యుల ఆవిష్కరణలు


సంస్కృతంలో అన్నీ ఎప్పుడో రాసి ఉన్నాయి.


• ఇస్రో చైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యలు


ఉజ్జయిని: గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం, ఆధ్యాత్మిక విద్య తదితరాలన్నీ సంస్కృతంలో రాసి ఉండడంతో వేదకాలం నుంచి మనది విజ్ఞాన సమాజమని 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాధ్ పేర్కొ న్నారు. అయితే ఈ విజ్ఞానమంతా కొన్నివేల ఏళ్ల తర్వాత పాశ్చాత్య శాస్త్రవే త్తల ఆవిష్కరణలుగా తిరిగి మన దేశానికి వచ్చాయని చెప్పారు. బుధవారం ఉజ్జయినిలో మహర్షి పాణిని సంస్కృత, వేద విశ్వవిద్యాలయం' నాలుగో స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. "ప్రపంచంలోనే ప్రాచీన భాషల్లో సంస్కృతం ఒకటి. కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, శాస్త్ర సాంకే తిక రంగాలు, గణితం, ఇతర అనుబంధ పాఠ్యాంశాలన్నీ దానిలో ఉన్నాయి. సూర్య సిద్ధాంత అనే గ్రంథంలో మాకు సంబంధించిన అంశాలున్నాయి. సౌర వ్యవస్థ, సూర్యుని చుట్టూ అవి పరిభ్రమించే తీరు, దానికి పట్టే సమయం వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడి నుంచి అరబ్బుల వద్దకు, ఆ తర్వాత ఐరోపాకు వెళ్లి మళ్లీ మనకు వచ్చాయి. సున్నా, అనంతం, బీజగణితం, వైదా గరస్ సిద్ధాంతం వంటివాటి గురించి సంస్కృతంలో అత్యంత కచ్చితత్వంతో కవితాత్మకంగా ఎప్పుడో మన ప్రాచీనులు వివరించారు. విశ్వం కూర్పు, లోహ శాస్త్రం, వైద్య చికిత్సలు వంటివాటినీ సంస్కృతంలో పొందుపరిచారు. కంప్యూ టర్ భాషకూ ఇది చక్కగా సరిపోతుంది" అని సోమనాథ్ చెప్పారు.

కామెంట్‌లు లేవు: