29, మే 2024, బుధవారం

శ్వేతర్కం (తెల్ల జిల్లేడు ) -

 శ్వేతర్కం (తెల్ల జిల్లేడు ) -


తెల్ల జిల్లెడు దూదితో ఇప్పనూనే తో 5 దీపాలు చేసి 5 వారాలు వెలిగిస్తే ఆంజనేయస్వామి ప్రసన్నలవుథారు . దీని పూలతో శివపుజ, ఆకులతో  సుర్యపుజ దీని సమిధాలతో  సుర్యహోమం చేస్తారు. దీనివేరు తవ్వి తీసుకొనిరావడం ఆదివారం, గురువారం లలో  పుష్యమి నక్షత్రం రోజున మంచిది.


వేరు తీసే విధానం.- 


* ముందుగా చెట్టు గుర్తుఉంచుకోవాలి .

* ఏ రోజున శ్వేతార్కం ఆది, గురు , పుష్యమి నక్షత్రాలు కలిసిన రోజుకి ముందుగా రహస్యంగా (వెరు తీసుకొస్తున్నట్టు ఎవ్వరికి తెలియకూదదు) .

* చెట్టు వద్దకు సాయంకాలం వెళ్ళాలి. వెళ్ళేప్పుడు ఎర్రటిధారం , సింధూరం , నీరు ,అగరవత్తులు అగ్గిపెట్ట తీసుకొని వెల్లాలి.

* చెట్టు దగ్గర తూర్పు ఈశాన్య దిశలలో  ఎటువైపున నిల్చొని  చెట్టుని గణపతిగా భావించి నమస్కరించి చెట్టు మొదలులో నీరుపోసి , సిందూరం సమర్పించి దూపం వెలిగించి ఎర్రని దారాన్ని చెట్టుకి కట్టి ప్రార్ధించాలి.


ప్రార్ధన - 

 

హే గణపతి ప్రభో , శ్వేతర్క దేవా  నా కార్యసిద్ధికై  రేపు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాను. దయతో మీరు నా కార్యం సిద్ధించే నిమిత్తం నాతో రావలసిందిగా ప్రార్ధిస్తున్నాను. అంటూ నమస్కరించి తిరిగివచ్చి రాత్రి ఒంటరిగా పడుకోవాలి.


తెల్లవారుజామున  లేచి స్నానం చేసి శుబ్రమైన వస్త్రం, తవ్వడానికి చిన్న సాధనం తీసుకుని చెట్టు వద్దకు వెళ్లి తుర్పు ,ఉత్తర దిశలలో ఎటైన నిలుచొని నమస్కరించి గణపతి మంత్రం చదువుతూ జాగ్రత్తగా వెరు తవ్వి తీయాలి . ఒకవేళ వేరు మధ్యలో విరిగినా దాన్ని జగ్రత్తగా వస్త్రం లొ చుట్టి ఇంటికి తీసుకురావాలి.


మంత్రాలు - 

                  ఓం గం గణపతయే నమః.

                  ఓం గ్లౌం గణపతయే నమః.


అదృష్టం ఉంటే వేరు అచ్చం గణపతిలా లబించొచ్చు.


పూజా విదానం - శ్వేతార్కం ని శుద్ధజలం లొ కడిగి శుబ్రమ్ గా తుడిచి ఆసనం పైన ఎర్రటి వస్త్రం పరిచి దానిపైన పెట్టలి. ఎర్రచందనం పౌడర్ , ఎర్రకుంకుమ, పసుపు, గంధం పొడి ,సిందూరం, పువ్వులు , అక్షింతలు తో పూజించాలి.


సిద్ది, బుద్ధి, ఐశ్వర్యం కోరేవారు  పైన చెప్పిన మంత్రాలలో 2 వ మంత్రం చదువుతూ పైన చెప్పిన వస్తువులు వేసి పుజించాలి. దూప దీపాలు సమర్పిస్తూ గణపతికి నైవేద్యం గా కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు సమర్పించాలి. ఇది అయినతర్వాత  కనీసం 1116 సార్లు పైమంత్రం జపం చేసి హోమగుండం లొ నెయ్యి, పంచదార, నువ్వులు, జొన్నలు లెదా గోధుమలు గాని కలిపి పై మంత్రం తో హొమం చేయాలి. కనిసం జపసంక్యలొ దశాంశం అనగా 10% హొమం జరగాలి. ఇదైన తర్వాత వీబూది శ్వేతర్కములం పై రాసి దానిని పుజాస్థానం లొ పెట్టి దూప దీప నైవేద్యాలు అర్పించాలి. (వీబుధి హోమాగుండం లోని ధి) .


ఉపయొగాలు -

 

* శ్వేతార్కం ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే.

* ధన, ధన్య  సమృద్ది పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ది. అది ఎలా శాకోపశాకలుగా పెరుగునో  వ్యాపారం అలా పెరుగును.

* విద్యార్ధులు రాణిస్తారు.

* సర్వకార్యాలు జయప్రదం అవుతాయి.

 

ఎలాంటి పరిస్థితులలోను నిరాదరణ చేయకూడదు... 


       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: