14, జూన్ 2024, శుక్రవారం

మూల వేతనంలో 50% పింఛను!*

 *🔊మూల వేతనంలో 50% పింఛను!*


*🍥న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించ నుంది. జాతీయ పింఛను పథకం (ఎన్ పీ ఎస్)లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం( బేసిక్ పే)లో 50% పింఛనుగా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఎన్ పీ ఎస్ పై అభ్యంతరాలు, పలు రాష్ట్రాలు తిరిగి పాత పింఛను విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో 2023లో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్ పీఎస్ ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు చిట్టచివరి మూల వేతనంలో 50% మొత్తాన్ని పింఛనుగా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్ పీ ఎస్ లో మార్పులు చేయాలని కూడా సోమనాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే.. కమిటీ తన సిఫారసులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ఠ గడువు విధించలేదు.*

కామెంట్‌లు లేవు: