*చిరంజీవులు*
➖➖➖✍️
*చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండే వారని అర్థం.*
*1)అశ్వత్థామ,*
*2)బలిచక్రవర్తి,*
*3)వ్యాసుడు,*
*4)హనుమంతుడు,*
*5)విభీషణుడు,* *6)కృపాచార్యుడు మరియు* *7)పరశురాముడు.*
```
వీరు ఏడుగురు చిరంజీవులు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా జీవిస్తారు.
సప్త చిరంజీవులు (ఏడుగురు అమరజీవులు) గురించి స్మరించే శ్లోకం ఇది.
హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శ్లోకాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.```
శ్లోకం:~
*అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః |*
*కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ||*
అర్థం:~
*1) అశ్వత్థామ:~*
ద్రోణాచార్యుని కుమారుడు.
*2) బలి చక్రవర్తి:~*
ప్రహ్లాదుని మనుమడు, దానగుణానికి ప్రసిద్ధి.
*3) వ్యాసుడు:~*
వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించిన మహర్షి.
*4) హనుమంతుడు:~*
రామ భక్తుడు,శక్తికి రూపం.
*5) విభీషణుడు:~*
రావణుని సోదరుడు, ధర్మానికి కట్టుబడినవాడు.
*6) కృపాచార్యుడు:~*
కౌరవ-పాండవుల గురువు.
*7) పరశురాముడు:~*
విష్ణుమూర్తి ఆరవ అవతారం.
```
ఈ ఏడుగురిని స్మరించడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో మార్కండేయ మహర్షి పేరును కూడా కలిపి "అష్ట చిరంజీవులు" (ఎనిమిది మంది) అని పిలుస్తారు.```
*అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*
*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥*
*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ తథాష్టమం ।*
*జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥*```
శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థామ, వామనానుగ్రహము వలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, రామానుగ్రహము వలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైనారు. శివానుగ్రహము చేత కల్పంజయుడైన మార్కండేయ మహాఋషిని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులు అవుతారని ఈ శ్లోకం తాత్పర్యము.```
*1. అశ్వద్ధామ స్త్రోతం:~*
*బ్రహ్మసుత్రోజ్వలభుజో రాజత్ కృష్ణా జినాసనః ! అశ్వత్థామ చిరంజీవి దీర్ఘాయుర్ దదాతుమే !!*
*2. బలి చక్రవర్తి స్త్రోతం:~*
*పాతాళ నిలయో ధనుర్భాణ ధనో నృపః ! విష్ణు పాదాంకిత శిరా: చిరంజీవి ప్రసీదతు!!*
*3. వ్యాస మహర్షి స్త్రోతం:~*
*వ్యాసః సమస్త ధర్మాణం వక్తా మునివరేడితః ! చిరంజీవి దీర్ఘమాయుః దదాతు జటిలో మమ !!*
*4. హనుమత్ స్త్రోతం:~*
*హనుమాన్ రామ పాదాబ్జ సంగీవర్ని వరసుచిః ! సంజీవనో స హర్తాచ రోగ శాంతిం దాదాతుమే !!*
*5. విభీషణ స్త్రోతం:~*
*విభీషణో ధర్మపరో రామార్చన పరాయణ:! దదాతు చిరoజీవిత్త్వం చిరంజీవి జితేంద్రియః !!*
*6. కృపాచార్య స్త్రోతం:~*
*కృపః కృపా పయోరాసిః తపస్వీ చిరవస్త్రద్రుతు ! వితనోతు ప్రసన్నాత్మ యావజ్జీవం ఆరోగతాం !!*
*7. పరశురామ స్త్రోతం:~*
*పరసూజ్వల హస్తా హస్తాభ్జో జటా మండల మండితః ! దదాతు చిరoజీవిత్త్వం ప్రసన్నాత్మ భృగూద్వః !!*```
వీరితో పాటు మార్కండేయమహర్షి, ధృవుడు మరియు ప్రహ్లాదుడు కూడా జన్మతః చిరంజీవులు అని చెప్పబడుచున్నారు.
ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి సప్త చిరంజీవి శ్లోకాన్ని చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి