*నందో రాజా భవిష్యతి* ఉత్తుంగ భుజుడను రాజునకు నందుడను కుమారుడు కలడు. ఈ కుమారునియందును వీని తల్లి యందును రాజు ఉపేక్షవహించి ఒక వేశ్యను కూడియుండెను. రాజు భార్య పేదయై దీనయై యుండెను. ఒక వర్తకుడు ముత్యాల హారమును అమ్ముటకు తీసుకొని రాగా ఈమె చూచి దానిని కొనగోరి ధనము లేమికి మిక్కిలి విచారించెను. ఆమె కడనున్న దాసి " ముందుగా హారమును పుచ్చుకొనుము. తరువాత వర్తకునకు ధనమీయ వలసిన సంగతి చూచుకొనవచ్చును. ఇంతలో రాజు చనిపోవునో ? వర్తకుడు చనిపోవునో ? మన నందుడే రాజుగునో ? ఏమి చెప్పగలము ? అని చెప్పినది. **ఉత్తుంగ భుజనాశోవా
దేశ కాల గతోపివా
వేశ్యా వణిగ్వినాశోవా
నందో రాజా భవిష్యతి**
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి