☘️🌹☘️🌹☘️🌸☘️
పారిజాతాప హరణ కావ్యాన్ని కృతి నందుకున్నప్పుడు కృష్ణదేవరాయలు నంది
తిమ్మనకు తన రెండు కుండలాలు బహుమతిగా నిచ్చెనట.అవి పెట్టుకొని తిమ్మన తన
యింటి అరుగు పై కూర్చుని వుండగా భట్టు కవి ఆ త్రోవన పోతూ ఆయనను
అభినందించి ఈ పద్యము చెప్పెనట.
మాకొలది జానపదులకు
నీ కవనపు ఠీవి అబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నందిసింగయ తిమ్మా!
అర్థము:--మాలాంటి పల్లెటూరి వాళ్లకు నీ లాగ కవిత్వము చెప్పడము యెలాగ
వస్తుంది?బావిలో నాట్యమాడే కప్పలకు ఆకాశ గంగ యొక్క యెగసిపడే నీళ్ళ యొక్క
తడి కూడా అంటనట్టు.(అంటే మేము కూపస్థ మండూకాల వంటి వారము నీవు
ఆకాశ గంగ లో విహరించే వాడవు.నీ కవిత్వము అంత గొప్పది).
తిమ్మన సంతోషించి తనదగ్గర ఏమీ లేనందున తన చెవి కున్న కుండలము నొక దానిని
తీసి యిచ్చెనట.
(రాయల వారు యిచ్చినది.)మరుదినము యిద్దరూ ఒంటి కుండలముతో సభకు వెళ్లి
రట.రాయలు యిదేమిటి? అని అడుగగాతిమ్మన ఒక మంచి పద్యము
భట్టుకవి చెప్పెను.
నేను
బహుమతిగా ఆ కుండలము యిచ్చితిని అని అన్నాడు. అప్పుడు రాయలు ఆ పద్యము మేము వినగోరుతున్నామని అడుగగా తిమ్మన ఆపద్యాన్ని చదివి వినిపించారట. దానికి రాయలవారు. అందులో 'గగనధుని" కాకుండా "నాకధుని" అంటే ఎలా వుంటుంది?
మాకొలది జానపదులకు
నీ కవనపు ఠీవి అబ్బునే కూపనట
ద్భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ నందిసింగయ తిమ్మా!
అన్నాడు. నాకధుని అంటే స్వర్గ ములో వుండే గంగ (గగనము అంటే శూన్యము అని అర్థము. శూన్యములో నీళ్లు వుండవు అని రాయల యొక్క భావము)నీ కవిత్వము చాలా చాలా గొప్పది.నందితిమ్మనా అని.భావము.
.
వారిద్దరూ మహారాజా! మీరు సరిచేసినది ఇంకా అద్భుతంగా వుంది. యని తమ కుండలాలను ఒక పద్యము చెప్పి రాయలకు సమర్పిస్తారు. రాయల వారు వాటిని చెవులకు ధరిస్తారు
"కుండలాలు మీ చెవుల నుండి విడివడి అయ్యో అని దుఃఖిస్తూ వుండినాయి.
.ఇప్పుడు మీ చెవులను చేరి సంతోషముతో యింకా మెరుస్తున్నాయి"
అని అర్థము వచ్చే పద్యము. చెబుతారు రాయలు వారిని తగురీతిని సత్కరించి పంపించాడట
🌸రాయల వారు గొప్పకవి
-----సేకరణ- -------
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి