25, ఫిబ్రవరి 2026, బుధవారం

శమీకుడు

శమీకుడు ఒక ముని. పరీక్షిత్ మహారాజు వేటాడి అలసి జలమునకై వెదకుకొనుచు ఇతని ఆశ్రమమును చేరి జలమును ఇయ్యమని ఇతనిని అడిగెను. ఇతడు సమాధి యందుండుటచే ఆ మాటలు వినలేదు.కనులు తెరచి చూడ లేదు. రాజునకు మిక్కిలి కోపము వచ్చినది. ఆ ప్రక్కన చచ్చిపడి యున్న సర్పమును తెచ్చి ఇతని మెడలో పడవేసి చనియెను. రాజు ఇట్లు చేసెనని శమీకుని కుమారుడైన శృంగి విని తండ్రి మెడలో నుండి సర్పమును తీసివేసి ఆ సర్పమును వేసినవాడు ఏడు దినములలో సర్పహతుడగునని శపించి తండ్రి కన్నులు తెరచిన పిమ్మట అతనితో ఈ వృత్తాంతమును చెప్పెను. రాజును శపించినందులకు శమీకుడు మిక్కిలి చింతనొందెను.తమను కాపాడుచుండు భూపాలకుని శపింపరాదని చెప్పెను. కానీ శాపము మరలించుటకు సాధ్యము కాదు కావున ముందు జాగరూకతకై పరీక్షిత్తునకు శాపవృత్తాంతమును తెలుపుమని తన శిష్యు నొక్కని

పంపెను.

కామెంట్‌లు లేవు: