,
☘️(శంకర విజయము)🙏,
"""శ్రీ శంకర భగవత్పాదులవారు శ్రీశారదామాత అందించిన స్వాగతపూర్వక ఆశీస్సులు స్వీకరించి "" సర్వజ్ఞ పీఠం"" మీద జయ జయ ధ్వనులమధ్య విద్యభద్రాసనాన్ని అలంకరించారు.
శ్రీ శంకరాచార్యుల వారు నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలు స్థాపించారు.
1.తూర్పున "" పూరీలో "" గోవర్థన మఠం.హస్తామలకుడు ప్రధమాధితి, "" ప్రజ్ఞానం బ్రహ్మ" మహావాక్యం అనుష్టాన మంత్రం, ఋగ్వేదము.
2. దక్షిణాన """" శృంగేరి""లో శారదా మఠం. సురేశ్వరుడు ప్రధమాధిపతి, "" అహం బ్రహ్మాస్మి "" మహావాక్యం అనుష్టాన మంత్రము,యజుర్వేదము.
3.పశ్చిమాన "" ద్వారక""లో కాళికా పీఠం.పద్మపాదుడు ప్రధమాధిపతి,""తత్వమసి""మహావాక్యం అనుష్టాన మంత్రము, సామవేదము.
4.ఉత్తరాన """" బదరి""లో శ్రీమఠం.తోటకాచార్యడు ప్రధమాధిపతి,""అయ మాత్మా బ్రహ్మ"" మహావాక్యం అనుష్టాన మంత్రము.అధర్వవేదము.
శ్రీ శంకరులు తమ అద్వైతమత సిధ్దాంతానికి ఊతముగ నాలుగు దిక్కులలో నాలుగు మహావాక్యాలను ప్రచారము గావిస్తు "" వేదమాత"" కి నీరాజనాలు అందించారు.
""" ప్రాణాయామం ప్రత్యాహారం,
నిత్యానిత్య వివేకవిచారం,
జాప్యసమేత సమాధివిధానం,
కుర్వవధానం మహాదవధానం""
శ్రీ శంకరులు ముందు శ్లోకాలలో శరీరపరంగ బహిరంగ సాధనల ద్వార ఆత్మజ్ఞానాన్ని సాధించమన్న వారు ప్రస్తుతము మానసికపరమైన సాధనాలు వివరిస్తున్నారు.
అవి వరుసగా ప్రణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్యవస్తు వివేక విచారము, జపముతో కూడిన ధ్యానము, సమాధి విధానాలు ఉపయోగించుకుంటు ఈ ప్రక్రియలు అవధానము అనగా జాగురూకత తో మరియు మహావధానము అనగా మిక్కిలి జాగురూకతతో చేయమని శంకరులు తొందరపాటు లేక శ్రధ్దతో యుండమని హెచ్చరిస్తున్నారు.
హర హర మహాదేవ శంభో శంకర.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి