18, ఏప్రిల్ 2026, శనివారం

పురాణవైరాగ్యం

  పురాణవైరాగ్యం:


అది పరమపవిత్రమైన ''కాశీ'' క్షేత్రం.గంగా నది ఒడ్డున ఓ సత్రంలో డా..సర్వజ్ఞ గారి ప్రవచనం జోరుగా సాగుతోంది. . అందరూ ఆ మహేశ్వరుడి గురించి ఆయన చెపుతుంటే ఆనంద పారవశ్యంలో వింటున్నా రు.


వారిని చూసి మహేశ్వరుడి కి ఆనందం కలిగి పార్వతి తో చూశావా దేవి నాభక్తుల పారవశ్యం నేనంటే వారికి ఎంత ఇష్టమో! అనగానే అమ్మవారు నవ్వుతూ వారంతా భక్తులు గా నటిస్తున్న వారే కాని నిజమైన వారు కారు.కావాలంటే చూసుకోండి అంది అమ్మవారు.

అయితే చూడు పార్వతీ అన్నారు స్వామి. 


కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని సర్వజ్ఞ గారు చెబుతుంటే భక్తులంతా పారవశ్యంతో శివా మమ్మల్ని నీలో కలుపుకో మోక్షం ఇవ్వు మహేశ్వరా అనగానే టక్కున 

శివుడు ప్రత్యక్ష మయ్యాడు.


నా ప్రియ భక్తులారా మీ మొర ఆలకించా మోక్షం కావలసిన వారు

నాతో రావచ్చు రేపు ఇదే సమయానికి వస్తా సిద్ధంగా ఉండమని శివుడు అదృశ్యమైపోయాడు. 


మర్నాడు ప్రవచన సమయానికి శివుడు వచ్చాడు. ఆపాటికే భక్తులంతా సర్వజ్ఞ గారి తో సహా

అలహాబాద్ దాటిపోయారు.


కైలాసం చేరిన శివుడ్ని చూసి అమ్మవారు నవ్వింది ఎగతాళి గా

అప్పుడే అక్కడకు చేరుకున్న నారద

మునీంద్రుడు కి విషయం అర్దమయ్యింది.


అమ్మా జననీ ఇది మహేశ్వర లీల

ఆయనకి తెలియదా నిజ భక్తులు

ఎవ్వరో? పందెంలో నిన్ను గెలిపించాలనే స్వామి వారి లీల.


అది మానవనైజమైన పురాణ వైరాగ్యం.


మానవుడు ధర్మాచరణం చేస్తూ నిర్వహించే నిర్దేశిత కర్మమే మోక్ష సోపానం.


నారాయణ నారాయణ అంటూ ఆది దంపతుల దర్శనానందంతో వెనుతిరిగాడు నారదమునీంద్రుడు.


                            ***

జయంతి లక్ష్మీ నరసింహం

కామెంట్‌లు లేవు: