16, డిసెంబర్ 2022, శుక్రవారం

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

ఈ భూమి మీద వున్న జంతుకోటిలో ఒక్క మానవుడు మాత్రమే బుద్ది జీవి.  అట్లా అని అందరు మానవులు అన్ని విషయాలను తెలుసుకునే స్థాయిలో (LEVEL) ఉంటారని మనం అనలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహనా స్థాయి  ఉంటుంది.  పూర్వం కొంతమంది ఒక్కసారి ఒక పాఠం చెపితే వెంటనే దానిని తెలుసుకొని కంటతహా పట్టేవారట అంటే వారు ఒక్కసారి ఒక్కవిషయాన్ని వింటే వెంటనే ఆదివారికి నోటికే వచ్చేది అన్నమాట.  ఒకసారి మన తెలుగు దేశంలోని ఒక పండితుడు ఇప్పుడు ఆగ్రాగా పిలవబడే పట్టణానికి వెళ్లి అక్కడి యమునా నదిలో స్నానం చేస్తుండగా ఒక స్త్రీని కొంతమంది దుండగలులు తీసుకొని వచ్చి హత్య చేశారట అక్కడ మన పండితుడు తప్ప ఆ దేశంవారు ఎవరు అక్కడ  లేరు. మన పండితునివారికి అక్కడి భాష రాదు.  మరునాడు రాజుగారు ఆ కేసును విచారించటానికి రాజభటులను పంపగా వారు మన పండితుఁలవారిని సాక్షిగా తీసుకొని వచ్చారట.  రాజుగారు అడిగిన ప్రశ్నలకు పండితులవారు ఇలా చెప్పారట.  నాకు అక్కడి దుండగులు మాట్లాడే భాష తెలియదు, కానీ వారు ఏమి మాట్లాడుకున్నారో చెప్పగలను అని విన్నది విన్నట్లు  చెప్పారట. ఆ పండితుడు చెప్పిన మాటలతో ఆ నేరస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకొన్నారు  రాజుగారు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి మీకు బాష రాదుగా మరి ఎలాచెప్పారని అడిగారట.  దానికి మన పండితులవారు రాజా నేను అవధానాలు  చేస్తుంటాను. మాకు అవధానప్రక్రియలో ఏకసంతాగ్రాహ్యం ప్రధాన విషయం అని చెప్పగా మన పండితులవారి తెలివి తేటలకు ముగ్దులైన ఆ రాజుగారు ఆయనను విశేషంగా సన్మానించారట. మన అవధానుల మేధస్సు అంత గొప్పది. పూర్వకాలంలో వేదాలు నోటికే చెప్పేవారు.  బహుశా అప్పుడు భాషలకు లిపికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారుకాదేమో. అందుకే " ముఖే ముఖే సరస్వతి" అని అన్నారు కాబోలు.

నిజానికి మనం రోజు అనేక విషయాలను వింటుంటాము, చూస్తుంటాము కానీ అవి అన్ని మనకు గుర్తుండవచ్చు లేక గుర్తుండకపోవచ్చు. మనజీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనకు ఎల్లప్పుడూ జ్ఞ్యాపకం ఉంటాయి అవి సహజంగా మనం పొందిన అత్యంత ఆనందము, దుఃఖము, బాధలు.  ఎవరో నిన్ను అవమానించారనుకో అది నీకు సదా జ్ఞ్యాపకం ఉంటుంది.  అదే నిన్ను అవమానించిన వానితో నీకు జరిగిన ఇతరవిషయాలు మాత్రం జ్ఞ్యాపకం  ఉండకపోవచ్చు. "అది నేనెట్లా మారుస్తాను జీవితాంతం గుర్తుంచుకుంటా.  అని అనటం" మనం సర్వ సాధారణంగా చూస్తూవుంటాం.  అంటే మనం మనసుకు పూర్తిగా హత్తుకునే విషయాలు అవి మంచివి కావచ్చు లేక చెడ్డవికావచు వాటిని మాత్రమే గుర్తు  పెట్టుకోగలుగుతాము. ఇది నిజం. 

కొన్ని సందర్భాలలో మన ముందు జరిగిన విషయాలు కూడా తెలియనట్లుగా ఉంటాము.  నీవు ఇక్కడే ఉన్నావా అని నీ స్నేహితుడు అడిగితె ఇక్కడే గంటనుంచి బస్సుకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నావు.  రామారావు ఇటుగా వెళ్ళటం చూసావా అంటే మాత్రం ఏమోరా నేను చూడలేదు అని బదులు ఇస్తావు.  ఎందుకు అంటే నీవు రామారావు నీ ముందరిగా వెళ్ళటం నీ కళ్ళు చూశాయి కానీ నీమనస్సు గుర్తించలేదు అదీ సంగతి. 

ఒక విషయాన్ని చూడటం, చూసినదానిని గమనించి అవగాహన చేసుకోవటం, చేసుకున్నదానిని గుర్తుంచుకోవటం మొదలైన అన్నివిషయాలు కూడా ఒక మనిషి మేధాశక్తి మీద ఆధార పడతాయి.  ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ మేధాశక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఏదిఏమైనప్పటికీ తానుచేసిన విషయం మీద మనస్సు లగ్నం కానిఅప్పుడు ఆ విషయాన్ని అవగాహన చేసుకోవటం కుదరదు అంతేకాదు గుర్తుకూడా ఉండదు. భౌతికమైన విషయాలమీదనే ఇన్నిరకాల సమస్యలు ఉంటే ఇక ఆద్యద్మికమైన విషయాల మీద ఇంకా ఎంతో శ్రర్ధ కావలసి వస్తుంది. 

భౌతికమైన విషయాలు మనకు పంచేంద్రియాలతో ముడిపడినవి.  ఎందుకంటె భౌతికజ్ఞ్యానం మనకు ఇంద్రియాలతోటే కలుగుతుంది. ఇంద్రియాలకు అతీతమైనది ఆత్మ జ్ఞ్యానం లేక బ్రహ్మ జ్ఞ్యానం కాబట్టి ఆ జ్ఞ్యానం పొందాలంటే మనుషులకు అవగాహనా స్థాయి చాలా ఎక్కువగా ఉండాలి.  ఎందుకంటె బౌతికంగా పొందే జ్ఞ్యానం తనకన్నా బిన్నంగా వున్నా విషయాల జ్ఞ్యానం అదే బ్రహ్మ జ్ఞ్యానం అనేది తన గూర్చి తాను తెలుసుకునే జ్ఞ్యానం.  కాబట్టి బ్రహ్మ జ్ఞ్యాన పిపాసికి అనగా జిగ్న్యాశువుకి అవగాహనా సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉండాలి. అణువణువున ఎన్నో సందేహాలు  వస్తూవుంటాయి. వాటిని సరైన పూజ్యగురువు సేవనం చేస్తూ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక జీవనం చాలా కఠినంగా కష్టభరితంగా, దుర్లభంగా ఉంటుంది. ఎందుకంటె సాధకుడు తనకు తానూ మోక్షాన్ని పొందాలి అని యోచిస్తాడు  కాబట్టి. ఈ భూమిమీద మానవుడు సాధించవలసిన అతిబృహత్ కార్యం ఏదయినా వున్నది అంటే అది మోక్షం మాత్రమే.  ఒక మనిషి బౌతికంగా చేయగల కార్యాలు అన్నీ కూడా ఏదో ఒక హద్దు కలిగి ఉంటుంది.  కానీ మోక్షం అనేది అట్లా కాదు.  ఇంకొక విషయం బౌతికంగా సాధించేది ప్రతిదీ పూర్తిగా కానీ లేక ఒక స్టాయిమటుకు అయినా తనకన్నా ముందు ఎవరో ఒకరు చేసి వుంటారు, ఆలా చేసినది ఉపలబ్ధం అవుతుంది అంటే దానికి సంబందించిన సమాచారం, ఆధారము, సాక్షం ఉంటుంది.  కానీ మోక్షం ఏమిటో ఎలావుంటుందో అనేది ఒక్కొక్క సాధకుడు తన సాధనా పటిమతో సిద్దించుకునేది మాత్రమే మోక్షార్ధికి గతంలో మోక్షం పొందిన వాని జాడ కుడా తెలియదు.  తెలుసుకునేటందుకు అవకాశం కూడా ఉండదు.  ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం అనేది తనకుతానుగా తెలుసుకుని సిద్దించుకునేది . అంటే స్వయంగా తెలుసుకునేది మాత్రమే. కానీ వేరే ఇతర జ్ఞ్యానం లాగ ఇతరులనుండి నేర్చుకునేది కానీ చూసే తెలుసుకునేది కానీ లేక విని తెలుసుకునేది కానీ లేక గ్రంథపఠనగావించి తెలుసుకునేది కానీ కాదు. మోక్షార్ధి మోక్షంపొందిన తరువాత అది కేవలం అతని అనుభవంలోకి మాత్రమే వస్తుంది కానీ తాను తన అనుభవం ఇట్రారులకి చెప్పటానికి కుదరదు. ఒకడు పండు తిని తియ్యగా వున్నదని, కాకరకాయ తిని చేదుగా వున్నదని చెపుతాడు కానీ నిజానికి తీపి, చేదు అనేవి ఎవరి అనుభవాలు వారివే. ఇతరులు చెప్పేది వారి అనుభవపు కేవలం ఒక సూచనమాత్రమే. కానీ మోక్షాన్ని పొందినవానికి కలిగే దివ్య అబుభవం కానీ అనుభూతికాని ఇతరులకు పంచుకొనటానికి అంతుచిక్కదు ఎందుకంటె వర్ణించటానికి బాషాచాలదు, చెప్పటానికి మాటలు  చాలవు. దివ్యానుభూతులన్నీ వ్యక్తిగతమగా (ఆత్మపరంగా) అనుభవించాలసిందే కానీ మొరొక్కటి కాదు. సత్ గురువులు కేవలం మార్గదరక్షకులు మాత్రమే.  నీ మార్గంలో నీ ప్రయాణం ప్రారంభమైన తరువాత గురువుతోటి పనిలేదు. ఒక నది దాటటానికి తిప్పని ఉపయోగిస్తావు, అది కేవలం నదిని దాటేవరకు మాత్రమే పనికి వస్తుంది తరువాత దానితో పని లేదు. అదే మాదిరిగా సత్గురువు బోధకుడా ఈ విషయం తెలియనివారు అనేకులు గురువుల వెంటపడి వారి అమూల్య జీవితాలను వృధా  చేసుకుంటున్నారు. ఇంకా కొందరు అజ్ఞ్యానులు కొందరిని స్టేగురువులని భావించటమే కాకుండా వారిని పూజిస్తూ ఇంకా ఇంకా అజ్ఞ్యానంలోకి నెట్టబడుతున్నారు. సాధకుడు తన సాధనలో సదా అప్రమత్తతతో వ్యవహరించి మోక్ష జిగ్న్యాసిగా ముందుకు నడవాలి.

ఓం తత్సత్  

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ

 

 


15, డిసెంబర్ 2022, గురువారం

మన పిల్లలను మనం రక్షించుకోవడం ఎలా!?

 మన పిల్లలను మనం రక్షించుకోవడం ఎలా!?

                  -------------------------------------------------------------

   విశ్వనగరంగా మారిన మన హైదరాబాద్ శివార్లలో హై స్కూల్ వయస్సు విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లో అశ్లీల సినిమాలు చూసి ప్రభావితులై తోటి విద్యార్ధిని పై అత్యాచారం చేశారని వార్త చూసాం!బెంగుళూరు లో విద్యార్థుల బాగ్ లు చెక్ చేస్తే డ్రగ్స్,గర్భ నిరోధ సాధనాలు దొరికాయట.పబ్ లో అమ్మాయి రేప్ కేసు లో మైనర్లు   పట్టుబడటం చూసాం.అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలలో స్కూల్ కెళ్లే విద్యార్థుల పాత్ర బయట పడడం వార్తల్లో వస్తున్నాయి.దానితో పాటు ఉపాధ్యాయులు తమ ప్రైవేటు సంభాషణల్లో విద్యార్థులలో పెరుగుతోన్న తాగుడు,గంజాయిలాంటి మత్థు పదార్ధాల వాడకాల గురించి,నేరప్రవృత్తి గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అపరిపక్వ వయస్సులోనే శృంగార నీలి చిత్రాలు అందుబాటులోకి రావడం తో వాళ్ళ ద్రుష్టి వక్రీకరించి స్కూళ్లలో పలు సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు.వాళ్ళను సన్మార్గంలో పెట్టడం తమ శక్తికి మించిన పనవుతోందని ,ఈ సమస్యను ఎలా అధిగమించాలో బోధ పడడం లేదని సతమతమౌతున్నారు.ఉపాధ్యాయులే ఈ విధంగా బాధ పడుతుంటే తల్లిదండ్రులు తమ  పిల్లల భవిష్యత్తు గురించి హడలెత్తిపోతున్నారు.అమ్మాయైనా,అబ్బాయయినా చదువుకోవడానికి వెళ్లి తాగుబోతులుగా,డ్రగ్స్ కు బానిసగా,రేపిస్టులుగా ,లేదా హంతకులుగా మారకూడదని ,ప్రేమలు పెళ్లిళ్ల పేరిట హత్యలు , ఆత్మ హత్యలకు పాల్పడరాదని వేనోళ్ళ మొక్కుకుంటున్నారు.


   ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన ఒక సర్వే రిపోర్టు మరింత ఆందోళన కలిగిస్తోంది."15  ఏళ్లకు పైబడిన వారిలో 90  శాతం మంది పలురకాల మద్యం తాగుతున్నారు.కల్లు ,బీరు,విస్కీ మొదలైన వాటితో మొదలై చివరకు గంజాయి ,డ్రగ్స్ కు బానిసలవుతున్నారు.ఇది చాలా ఆందోళనకరమైన విషయమని ,తెలంగాణలో పరిమితికి మించి మద్యం వినియోగం జరుగుతోందని"ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ ప్రతినిధి శ్రీ పద్మనాభ రెడ్డి ప్రకటించారు.పంజాబ్ లో  ఏ విధంగా యువత డ్రగ్స్ కు బానిసలు అయ్యారో ఆ దారిలోనే తెలంగాణ నడుస్తోందని ఆయన వివరించారు.ఇక మన పొరుగు తెలుగు రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాలో టాప్ లోకి చేరి,తెలంగాణాకు ఏ మాత్రం తీసిపోలేదు.


  ఈ విధంగా రేపటి పౌరులు రకరకాల వ్యసనాలకు బలవుతుంటే వాళ్ళను రక్షించుకోవడం ఎలా అనే ప్రశ్న మన ముందు భూతంలా నిలబడివుంది.ఇదొక తల్లిదండ్రులు ,ఉపాధ్యాయులు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్యకాదు.వాళ్ళు సన్నిహితంగా రోజువారీగా నలిగిపోతుండవచ్చు!యావత్ పౌర సమాజం ఈ దేశ భవిష్యత్తు ఏమై పోతుందాని ఆందోళన చెందుతోన్న విషయం ఇది!వాస్తవానికి ప్రభుత్వమే ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలి.కానీ మద్యం వ్యాపారం తో వచ్చే ఆదాయం మీదనే ఆధార పడుతోన్న  ప్రభుత్వాలు అలాంటి నియంత్రణా చర్యలు తీసుకుంటాయని ఆశించ లేము.


   ఈ పరిస్థితుల్లో మనపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి!అంటే పౌర సమాజమే నడుం బిగించాలి.ముందుగా ఈ సమస్యకు మూలకారణాలను అనేషిస్తే కానీ పరిష్కార మార్గాన్ని కనుక్కోలేము.


  విద్యార్థులను ప్రభావితం చేస్తున్న వాటిలో 1 ) విద్యావ్యవస్థ 2 )సమాజం 3 ) ప్రభుత్వ విధానాలు అనేవి ప్రధానమైనవిగా మనం వర్గీకరించుకోవచ్చు.


  మొదటిదాన్ని పరిశీలిస్తే 1991  సం.  లో ప్రపంచీకరణ విధానాలు ప్రవేశ పెట్టాక విద్యను భవిష్యత్ఘు తరాలను తీర్చిదిద్దే సాధనంగా కాక ,మార్కెట్ అవసరాలను తీర్చే యంత్రాల ఉత్పత్తి కేంద్రంగా మార్పువచ్చింది.దానితో క్రమంగా విద్యలో ప్రభత్వ జోక్యం తగ్గుతూ,ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.నిరుపేద వర్గాల పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళు,కాలేజీలు,ధనిక వర్గాలకు ప్రైవేటు,కార్పొరేట్ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.ఆ క్రమంలో నేడు ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా  పెట్టుకుని చేసే  కోట్ల రూపాయల  వ్యాపారంగా విద్యారంగం మారి పోయింది.ఉద్యోగాల కోసమే విద్య అనేది సిలబస్ గా మారి పోయింది.చిన్న నాటినుండి నైతిక విలువలు,సామాజిక అవగాహన ,సంస్కృతి పెంపొందించడానికి తోడ్పడే సోషల్ సైన్స్ లాంటి సబ్జెక్టుల ప్రాధాన్యత వెనక పట్టు పట్టింది.విద్యార్థులలో రాంకులకోసం అమానుషమైన  పోటీ కి ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు బోధనా పద్దతులను రూపొందించారు.ఆ విధంగా ఎంతో సహజ సిద్ధంగా ,ఆడుతూ పాడుతూ సంపూర్ణ మానవులుగా ఎదగాల్సిన విద్యార్థుల స్థానంలో, ఒకటి..రెండు.. మూడు..అంటూ ర్యాంకులు సాధించి తీరాల్సిన యంత్రాలలాంటి  విద్యార్థులను ప్రవేశ పెట్టారు.ఆ విధంగా కౌమార్య దశలోనే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.మెకాలే విద్యా విధానం స్థానంలో ప్రపంచీకరణ ఫలితంగా "మెకానికల్ విద్యావిధానాన్ని"పాలకులు ప్రవేశ పెట్టారు.ఆ విధంగా పిల్లల సహజ వ్యక్తిత్వ వికాసం  ఆంతరంగికంగా ధ్వంసమై వికృత పరిణామాలకు దారితీస్తోంది.


  సమాజ పరంగా చూస్తే గత మూడు దశాబ్దాలలో వచ్చిన సమాచార విప్లవం ఫలితంగా  మన దేశ ప్రజలకు ఇంటర్నెట్,ఇరవై నాలుగు గంటల చానళ్లు,స్మార్ట్ టీవీ లు,సెల్ ఫోన్ లు, పేస్  బుక్,వాట్సాప్ లాంటి సోషల్ మీడియా   అందుబాటులోకి వచ్చాయి.మన రోజువారీ జీవితంలోని అవసరాలన్ని కూడా సెల్ ఫోన్ తోనే గడుపుకునే రోజులొచ్చాయి.అనివార్యంగా విద్యార్థులకు కూడా సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.రిలయన్స్ అంబానీ మొదట్లో "దునియా తేరి ముట్టి మే" అంటూ సెల్ ఫోన్ కు ప్రకటనలు ఇచ్చేవాడు.నేడు అదే నిజమైంది.చిన్న పిల్లాడి నుంచికూడా ఏది దాచి పెట్టలేని పరిస్థితి.వాళ్ళ సహజ కుతూహలం కొద్దీ వాళ్ళ కిష్టమొచ్చిన సైట్ లను ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నారు.దీన్ని నిరోధించడం ఎవరి తరం కాదు.సామాజికంగా వచ్చిన ఈ సాంకేతిక మార్పుల ప్రభావం  ప్రజల మీదవుంది.గత కాలపు మన దేశానికే ప్రత్యేకమైన సంస్కృతి,విలువలు ఈ  సమాచార విప్లవ దాడిలో పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఫ్యూడల్ సంస్కృతి ,విలువలు,ఎదిగి ఎదగని పెట్టుబడి దారి సంస్కృతితో మిశ్రమమై బయట ఆధునిక వేషం ,రూపం ,లోపల వెనకబాటుతనం,ఫ్యూడల్ భావజాలంతో వుండే భారతీయులు ఈ దాడితో విలవిలలాడుతున్నారు.భార్య భర్తల మధ్య సంబంధాలు,కుటుంబ వ్యవస్థ కుదేలవుతోంది.స్త్రీ,పురుషుల మధ్య సంబంధాలు,వివాహబంధం పునర్నిర్వచించబడుతోంది.సామ్రాజ్యవాద చొరబాటు అన్ని రంగాలను కబళిస్తూ సాంస్కృతిక రంగంలో కూడా తనకున్న ఆధునిక సాంకేతిక శక్తితో  తన క్షీణ సంస్కృతిని ప్రవేశ బెడుతోంది.సహజంగానే కౌమార్యం,యుక్త వయస్సులోగల పిల్లలు తప్పుడు ప్రభావాలకు  ఆకర్షితులై బలై పోతున్నారు.సామ్రాజ్యవాద పెట్టుబడికి ఊడిగం చేస్తోన్న పాలకులుకూడా ఈ ధోరణికి అన్ని రకాల అండదండలిస్తూనే పైకి మన సంస్కృతి ,విలువలు మంటగలుస్తున్నాయని శోకాలు పెడుతున్నారు.


    నేడు విద్యారంగం లో ఇటువంటి సాంస్కృతిక సంక్షోభం ఏర్పడడానికి ,స్కూలు స్థాయి లోనే పిల్లలు దారితప్పడానికి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు సంబంధం వుంది.మద్యం అమ్మకాలతోనే ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రభుత్వ విధానం నేటి దుస్థితికి కారణం.పిల్లలు, పెద్దలు చెప్పే మాటల నుండి నేర్చుకునే దానికంటే వాళ్ళను అనుకరించి నేర్చుకుంటారని అంటారు.అందుకే "ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా" అనే సామెత వచ్చినట్టుంది.తన చుట్టూరా అందరు తాగడం,అటు సినిమాలో తాను అభిమానించే హీరో తాగడం,సాటివాళ్ళు తాగడంలాంటి వాతావరణం లో పిల్లలు చిన్నప్పుడే మొదలెట్టడంలో ఆశ్చర్యమేముంది!? తాగుడు తమ సంస్కృతి,జీవన విధానంలో భాగమంటూనో,కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదంటూనో పిల్లలకు అలవాటు చేసే వారు కూడా వున్నారు.దాని ఫలితంగా దేశంలో అరుణ చల్  ప్రదేశ్ లోని  15 లక్షల జనాభాలో సుమారు 7 .6  లక్షలమంది మద్యం తాగడం తో అది నెంబర్ వన్ గా ఉండగా ,రెండవ స్థానంలో తెలంగాణా వుంది.తెలంగాణాలో 15  నుండి 49 ఏళ్ళ  మధ్య వయస్సుగల వారిలో యాభై అయిదు శాతం మంది మద్యపానం చేస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019 -21 ) వివరాలు  తెలుపుతున్నాయి.గ్రామీణ ప్రాంతాలలో ఈ అలవాటు అధికంగా 62  శాతం ఉందిట!నేడు హై స్కూల్ స్థాయి పిల్లలు తాగి బడికి వస్తున్నారంటే దానిలో ఆశ్చర్యమేముంది.ఏ విత్తనం   వేస్తే అదే పంట వస్తుందిగదా!?సామాజిక పరిస్థితుల్ని,విద్యావిధానాన్నిఒక పధకం ప్రకారం  భ్రుష్టు పట్టించి నేటి ఫలితాలను చూసి ఏడవడమెందుకు!?


   మన భావితరాలు రక రకాల వ్యసనాలకు లోనవుతూ నిర్వీర్యం,అవుతుంటే ఎంతో ఆందోళన చెందుతున్నాము.మన పిల్లలను విద్యా వ్యవస్థ ద్వారా చదువు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతనుండి తప్పించుకుని ప్రైవేట్ రంగానికి విద్యను అప్పగించింది

.మరో వైపు తన ఆదాయం కోసం మద్యం వినియోగాన్ని నియంత్రించకుండా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది.సామ్రాజ్యవాదానికి గులాంగిరి చేస్తూ దానితాలుకు విష సంస్కృతికి అన్ని ద్వారాలు తెరిచేసింది.మరోవైపు మధ్యయుగాలనాటి తిరోగమన భావజాలాన్ని విద్యావ్యవస్థలో జొప్పించి విద్యార్థులలో మతోన్మాద భావాలు నింపే ప్రయత్నం చేస్తోంది.అందువలన మన పిల్లల సవ్యమైన ఎదుగుదలకు,భవిష్యత్తుకు  ఈ ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదని ముందుగా మనం గుర్తించాలి.ఆ ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితికి చేరామనేది గ్రహించాలి.


    ఒక వైపు తిరోగమన ఫ్యూడల్  సంస్కృతి,మరోవైపు సామ్రాజ్యవాద విష సంస్కృతి డాడి

 చేస్తున్న నేటి  సందర్భంలో తల్లిదండ్రులుగా, ప్రజలుగా ,పౌర సమాజంగా మనం ఒక ప్రత్యామ్నాయ నూతన ప్రజాస్వామ్య సంస్కృతికోసం పోరాడాల్సిన బాధ్యత మన మీద వుంది.విద్యార్థులను సామాజిక బాధ్యతగల  ఉత్తమ పౌరులుగా,ఆరోగ్యకరమైన అలవాట్లు,జీవన శైలి గల వారీగా తీర్చిదిద్దే విద్యా విధానం కోసం ఉద్యమించాలి.ఫ్యూడల్,సామ్రాజ్యవాద భావ జాలాలకు వ్యతిరేకమైన శాస్త్రీయ విద్యను డిమాండు చేయాలి.విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి.మద్యంతో  కలిగే దుష్ఫలితాలను,డ్రగ్స్ వినియోగం తో కలిగే ప్రమాదాలను వివరిస్తూ సమాజాన్ని చైతన్యం చేయాలి.దానికోసం ఒక ఉద్యమాన్నే నడపాలి.ఈ విధంగా ప్రభుత్వ విధానాలతో తలపడకుండా పునాది స్థాయిలో మన పిల్లల భవిష్యత్తును కాపాడుకో లేమని స్పష్టమవుతోంది.ఇదొక అనివార్యమైనా వాయిదా వేయలేని యుద్ధం ! దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.అన్ని ప్రగతిశీల విద్యార్థి సంఘాలు,పౌర ప్రజా సంఘాలు ఈ మహత్తర ప్రజా ఉద్యమానికి సారధ్యం వహించాలి.

                                                 *************************

                                                                                           -సత్య భాస్కర్

                                                                                        9848391638  

(నవతెలంగాణ,15.12.2022)

14, డిసెంబర్ 2022, బుధవారం

ధాతుపౌష్టిక లేహ్యం

 ధాతుపౌష్టిక  లేహ్యం  ఉపయోగాలు  - 


 *  శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును . 


 * రక్తము నందలి దోషములను  పోగొట్టి రక్తమును శుభ్రపరచును . 


 *  కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును . 


 *  వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును . 


 * శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును . 


 *  వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును . 


 *  ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును . 


 *  రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును . 


 *  చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును . 


 *  స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును . 


 * మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని  దరిచేరనియ్యదు . 


 * పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును . 


 *  మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును . 


 *  థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి . 


 *  మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . 


       పైన చెప్పినవే కాకుండగా మరెన్నో సమస్యలకు ఇది వజ్రాయుధములా పనిచేయును . దీనియందు 16 రకాల విశిష్ట మూలికలు మరియు ముత్య , స్వర్ణ , అభ్రక భస్మాల మిళితముగా ఉండి అత్యంత శక్తివంతముగా పనిచేయును . దీనికి ఎటువంటి పథ్యములు పాటించవలసిన అవసరం లేదు . చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనను వాడవచ్చు .  


      ఈ ధాతువృద్ధి లేహ్యము కావలసిన వారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు . 


      కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                9885030034

ఆత్మ విద్య

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

ఉచిత

  ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకులంలో బోధించాలనుకుంటే, 15 మార్చి నుండి 15 జూలై 2023 వరకు ఆచార్య పాణిగ్రాహి చతుర్వేద సంస్కృత వేద్ పాఠశాల హరిద్వార్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.  "అబ్బాయి క్లాస్-6 పాస్ అయి ఉండాలి."  గురుకులంలో ఉండడం, తినడం, తాగడం అన్నీ ఉచితంగానే ఉంటాయి.  మరియు నెలకు 8000 రూపాయల స్కాలర్‌షిప్ కూడా ఇవ్వబడుతుంది.  నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీషు మొదలైన ఆధునిక విషయాలపై కూడా పిల్లలకి విద్యను అందించబడుతుంది మరియు వేదాలలో నిపుణుడిని తయారు చేస్తారు.  ఆచార్య (M.A.) వరకు చదివేందుకు కూడా మార్గనిర్దేశం చేస్తారు.  ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో ఉంచండి మరియు మీ పిల్లల మతం యొక్క అద్భుతమైన పాఠశాలను ప్రోత్సహించడానికి వీలైనంత వరకు ప్రతి హిందువుని చేరుకోవడానికి ప్రయత్నించండి.

  వెంటనే సంప్రదించండి!

   హీరాలాల్ జీ 9654009263


🕉🕉🕉    * 🕉🕉🕉


               🙏🏼 *సత్యం తెలుసుకుంటే మనం చేసే సంకల్పాలన్నీ మనవి కాదని అర్థం అవుతుంది. అన్నం ముద్ద గొంతు దిగేవరకు మనకు తెలుస్తుంది. అప్పటివరకు మన ప్రతిభ అనుకుంటాం. తర్వాత జీర్ణం అవ్వడంలో మన సంకల్పం ఎంత ఉంది? అని ఆలోచిస్తే అహంకారం పతనమవుతుంది. ఒక విత్తనం నాటడం మన సంకల్పమైతే, దాని నుండి వేల ఫలాలు వెలువడడం మన సంకల్పం కాదుకదా?*


       *ఈశ్వరుడి సంకల్పశక్తిని మనం ఆపాదించుకోవడం అహంకారమే అవుతుంది*


               *మనది కేవలం గమనించే లక్షణం మాత్రమే. భగవదనుగ్రహంలో  ఏనాడు పక్షపాతం ఉండదు. యోగాయోగ్యత కలిగినవారికి తదనుగుణమైన ఫలితం లభిస్తుంది. ఈ ప్రపంచం పట్ల మనకున్న వ్యామోహాన్ని విసర్జించి అభ్యాసం ద్వారా దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే చేయవలసిన కర్తవ్యం. మనస్సు పరిశుద్ధం కాకుంటే ఆత్మ దర్శనం, దైవ దర్శనం అసాధ్యం!* 🙏🏼


🕉✡✡🕉☸☸🕉⚛⚛🕉

త్రివిధోపాయములు

 ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు  - 


  ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు అనగా 


                *  దర్శనము . 


                *  స్పర్శ .  


                *  ప్రశ్న . 


    పైన చెప్పిన మూడు విధాలుగా రోగిని పరీక్షించవలెను . వీటిని త్రివిధోపాయాలు అంటారు. 

ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 


  *  దర్శనము - 


       నేత్రములతో రోగి యొక్క ఆకారము , నాలుక , కండ్లు , మలమూత్రాదులను పరీక్షించి రోగమును గుర్తించవలెను . 


 *  స్పర్శ  - 


        రోగి శరీరంను చేతితో తాకి నాడి , ఉష్ణత్వము , కడుపుబ్బరము మున్నగు వాటిని పరీక్షించి రోగము గురించి తెలుసుకొనవలెను . 


 *  ప్రశ్న  - 


        రోగిని ప్రశ్నించి నిద్ర , ఆకలి , బలము , తాపము , బరువు , శరీరము యొక్క మలమూత్ర ప్రవృత్తి మున్నగునవి తెలుసుకొనవలెను . 


               స్త్రీలైనచో పైన చెప్పిన ప్రశ్నలతో పాటు ఋతుప్రవృత్తి , రుతుశూల , కుసుమాది రోగముల గురించి ప్రశ్నించి తెలుసుకొనవలెను . 


       ఈ మూడు పరీక్షలు చేయనిచో వ్యాధి వైద్యుడను తప్పుదోవ పట్టించును. కావున మూడు పరీక్షలు సంపూర్ణముగా చేసి వ్యాధిని సరిగ్గా అంచనావేసి సరైన ఔషధం ఇవ్వవలెను . 


 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

విద్య అన్నివిధాల విలువైనది*.

 *శుభోదయమ్*😊🙏🏼


శ్లో𝕝𝕝 పుస్తక ప్రత్యయాధీతం

నాధీతం గురుసన్నిధౌ|

సభామధ్యే న శోభన్తే

జారగర్భా ఇవ స్త్రియః||


తా𝕝𝕝 *గురుముఖంగా నేర్వక పుస్తకం ద్వారా నేర్చిన విద్యగలవారు గౌరవంతో శోభిల్లరు*..... 


*పుస్తకం ద్వారా నేర్చిన విద్యకంటే గురుముఖతః నేర్చిన విద్య అన్నివిధాల విలువైనది*......

జప_మాల

 #జప_మాల..!👍👍💐💐


జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో... శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108 ను నిర్ధారించార‌ని చెబుతారు.   108 వెన‌క మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశుల‌తో తొమ్మిది గ్ర‌హాలున్నాయి. రాశుల సంఖ్య‌ను గ్ర‌హాల‌తో గుణిస్తే వ‌చ్చేది 108. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌. జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్ష‌త్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్ష‌త్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్ష‌త్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌.  అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్య‌గా భావిస్తారు. హిందూ ధ‌ర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అంటారు. దానికి అనుగుణంగా 108 పూస‌ల‌ను నిర్ధారించార‌ని  ప్ర‌చారంలో ఉంది.

శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం*

 *గుండెలపై కాదు... తలపై కుంపటి ఈ గుడి - "తెలంగాణ కంచి" శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం*


*ఈ దేవాలయంకి వెళ్లే దారి:-*

*E.C.I.L క్రాస్ రోడ్* నుంచి *కుశాయిగుడా, కీసర* గ్రామాలు దాటి *అంకిరెడ్డిపల్లె* చౌరస్తాకి వెళ్లాలి. అక్కడ నుంచి *మూడుచింతల క్రాస్ రోడ్* చేరుకుని, *కరకపట్ల* ఊరు దాటాలి. ఆ తరువాత *8 కి.మీ.* వెళ్తే *వరదరాజుపురం* వస్తుంది. 

ఓ *40 కి.మీ.* ప్రయాణించాలి. దారి బాగుంటుంది. లేదా *షామీర్ పేట* దాటి *ప్రజ్ఞాపూర్* చౌరస్తా వెళ్లి, అక్కడ కుడివైపుకి తిరిగి *12 కి.మీ.* వెళ్తే *వరదరాజ పురం* చేరుకోవచ్చు. ఈ దారిలో *సిద్ధిపేట - భోనగిర్* బస్సులు కూడా వెళ్తాయి


*గూడ పెరుమాళ్లు పంతులు* తలపై కుంపటి...;

చేతుల్లో *వరదరాజపెరుమాళ్* దేవతా మూర్తి...;

కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలున్నాయి...;

ఆయన కళ్లలో మాత్రం మిలమిలలాడే ధృడతసంకల్పం, తళతళలాడే దృఢనిశ్చయం ఉన్నాయి...;

జనం వేల సంఖ్యలో పోగై *పెరుమాళ్* ను చూస్తున్నారు...; *పెరుమాళ్*  చేతులోని *పెరుమాళ్* ను చూస్తున్నారు. భక్తితో జోతలు చేస్తున్నారు. పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు.


అక్కడ *గోల్కొండ నవాబు* సైన్యం మొహరించింది. *జాగీర్దారు* ఓ కుర్చీపై కూర్చున్నాడు. *కంచికి వెళ్లి, వరదరాజ పెరుమాళ్ ని దర్శించి, వస్తూ వస్తూ నా ఊరిలోనూ వరదరాజ పెరుమాళ్ల గుడి కట్టుకుంటానని "గూడ పెరుమాళ్ల పంతులు" అనుకున్నాడు. అనుకోవడమేమిటి... వరదరాజపెరుమాళ్ విగ్రహాన్ని చేయించుకుని, అపార భక్తి శ్రద్ధలతో, అనంత పారవశ్యంతో తలపై మోసుకొచ్చాడు.*


సరిగ్గా *మెదక్* జిల్లా *జగదేవపూర్* మండలానికి వచ్చే సరికి *నవాబు సైనికులు* ఆగమన్నారు. *విగ్రహాన్ని పెట్టడాన్ని, గుడి కట్టటాన్ని ఒప్పుకునేది లేదని* దబాయించారు. *నా దేవుడి గుడిని నేను కట్టుకుంటాను. నన్నూ నా దేవుడిని వదిలేయండి* అని *పెరుమాళ్లు పంతులు* వేడుకున్నాడు. ఆ వెర్రి బాపడిని చూసి నవాబు సైనికులు పగలబడి నవ్వారు. *జాగిర్దారు తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు అనుమతినిస్తానన్నాడు.* పెరుమాళ్లు పంతులు అంతే పట్టుదలగా *నా పెరుమాళ్లుకి ఈ పెరుమాళ్లు భక్తుడు. నా భక్తే నిజమైతే నడవటం ఏమిటి... పరిగెడతాను కూడా* అన్నాడు.

*అయితే ఒక షరతు... కుంపట్లో బొగ్గు మసి కాకూడదు. నీకు వేడి తగలకూడదు*

*నా పెరుమాళ్లు ప్రహ్లాదుడిని రక్షించాడు. గజేంద్రుడిని కాపాడాడు. నన్నూ కాపాడతాడు*

*పాగల్ బొమ్మన్...* పగలబడి నవ్వాడు జాగిర్దారు.


*నాదీ ఒక షరతుంది ఒప్పుకుంటావా!? జాగీర్దార్ సాబ్.. పెరుమాళ్లు గొంతు పెనుసింహం గర్జనలా గర్జించింది...

నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంత మేర భూమిని నాకిచ్చేయాలి. నా దేవుడికి గుడి కట్టుకునేందుకు ఆ భూమి నాకిచ్చేయాలి.

సరే ...కానిమ్మన్నాడు జాగిర్దార్. *జాగిర్దార్ ది హిరణ్యకశిపుడి అహంకారం. పెరుమాళ్లుది ప్రహ్లాదుడి భక్తి...*

పెరుమాళ్లు నడిచాడు... నడిచాడు... రోజు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. అలసట లేదు. ఆయాసం లేదు. ఆగడం అంతకన్నా లేదు. అమ్మా అనలేదు. అయ్యో అనలేదు. వరదరాజ స్వామి వరద హస్తం తలపైనుందో లేక నరసింహుడే అవరించాడో తెలియదు కానీ *1,500 ఎకరాలు* చుట్టివచ్చి, జాగిర్దారు ముందు కుంపటి దించాడు. *బొగ్గు బూడిద కాలేదు. కణకణ మండుతూనే ఉంది. పెరుమాళ్లు తలపై కనీసం మాడినట్టుగా మచ్చ లేదు*. ఖంగుతిన్న జాగీర్దార్ *తూ జీత్ గయారే బొమ్మన్* అని గుడి కట్టుకోవడానికి అనుమతిచ్చాడు. అంతే కాదు... *1,500 ఎకరాలూ* వదులుకున్నాడు.


*ఆ 1,500 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా తన కోసం దాచుకోలేదు పెరుమాళ్లు పంతులు.* మొత్తం గుడి కట్టించాడు. *సువిశాలమైన గుడి, బృహదాకారపు కోనేరు, వసతి గృహాలు, విశ్రామ మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజ గోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం చూస్తే పెరుమాళ్లు పంతులు సమర్పణ భావం కనిపిస్తుంది. తన సంపదను దేవుడికి పెట్టాడు. నగలు, కిరీటాలు, వడ్డాణాలు, యజ్ఞోపవీతాలు చేయించాడు. 16 మంది పూజారుల్ని పెట్టాడు. పండగలు, పబ్బాలు, జాతరలు, తీర్థాలకు లోటు లేకుండా చేశాడు. వరదరాజుల వారికి రక్షణగా ఊరి మొదట్లో అంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాడు.*


ఊళ్లో గుడి వెలియలేదు. గుడి చుట్టూ ఊరు వెలిసింది. వరదరాజ స్వామి పేరిట *వరదరాజపురం* ఏర్పాటైంది. *మెదక్* జిల్లా *జగదేవ్ పూర్* మండలంలో *వరదరాజు* ఇప్పటికీ ఉన్నాడు. *పెరుమాళ్లు పంతులు వారసులు 450 ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు. పరంపరాగత ధర్మకర్తలుగా కొనసాగుతూనే ఉన్నారు. వారిప్పుడు మౌలాలీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్నారు. అలనాటి పూజారుల వారసులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దేవుడిని నమ్ముకుని పూజలు చేస్తూనే ఉన్నారు.*


ఇదంతా *450 ఏళ్ల* క్రితం సంగతి. ఇదంతా కట్టుకథ అనుకునేవాళ్లు, స్థానిక జనసందోహం చేసిన ధార్మిక విప్లవానికి ముస్లిం నవాబు తలొగ్గాడని టీకా చెప్పుకోవచ్చు. *రామదాసు భద్రాచలం గుడి కట్టడం హైందవ జన చైతన్యానికి ఎలా ప్రతీకో, వరదరాజపురం గుడి కూడా అలాగే ఒక ధార్మిక జన విప్లవ ప్రతీక.* అయితే *ఇప్పటి తరానికి ఈ గుడి కథ తెలియదు. దీని గొప్పదనం తెలియదు. ఎప్పుడైనా రాత్రి నిద్ర చేయాల్సి వస్తే మాత్రం పది ఊళ్లకి వరదరాజస్వామే దిక్కు.*


టాల్స్టాయ్ కథ ఒకటుంది. ఓ రైతు రోజంతా ఎంత మేర నడిస్తే అంత భూమి ఇస్తానని జమీందారు చెపుతాడు. అయితే మొదలుపెట్టిన చోటకి తిరిగి రావాలని షరతు పెడతాడు. ఆశ, ఆత్రం కలగలిసి రైతు పరుగు పెట్టి పెట్టి చివరికి గమ్యం చేరకుండానే చనిపోతాడు. *వరదరాజపురం* లో *పెరుమాళ్లు పంతులు* కూడా రోజంతా తిరిగాడు - అదీ తలపై కుంపటిపెట్టుకుని... ఈయన చనిపోలేదు. ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాదిరాయిలో ఇంకా బతికే ఉన్నాడు. తన కోసం చేసుకునే దానికి, ధర్మం కోసం చేసే దానికి ఉన్న తేడా అది.


*_ఒక్కసారి "వరదరాజపురం" వెళ్లండి. వరాలిచ్చే వరదరాజుని దర్శించుకొండి. తరతరాలుగా గుడిని నమ్ముకుని బతుకుతున్న పూజారికి దక్షిణ ఇవ్వండి. శతాబ్దాలుగా గుడికి పోషకులుగా ఉన్న గూడ పెరుమాళ్లు వారసుల ఫోటోలను చూసి దండం పెట్టుకొండి._*.


*మీరు ఈ దేవాలయాన్ని దర్శించండి. ఆ స్వామినే నమ్ముకుని ఆ దేవాలయంలో స్వామీ సేవ చేస్తున్న వంశపారంపర్య అర్చకులకు దక్షిణ ఇచ్చి వారికి ఇతోధికంగా సహాయం చేయండి. మీ మిత్రులతో మరియు సన్నిహితులతో ఈ దేవాలయం గురించి హి వివరించండి. ఈ క్షేత్రం "తెలంగాణా కంచి" వరదరాజ దేవాలయంగా మారడానికి కృషి చేద్దాము_*

దేవుడంటే ఏంటి

 *దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది?* 

అని చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.

మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం… "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని.

మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు, మనం వాడే మాట అదే!.


కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా!

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.

తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.


పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ… మనసుతో చేసే వ్యాయామం…

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ…

"దీప ప్రజ్వలనం" అనేది "త్రాటకం" అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు.

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది,

ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.


పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది…


*1. మూలవిరాట్* 🚩

భూమిలో ఎక్కడైయితే Electronic & Magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ "మూల విరాట్" ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు Catalyst గా పని చేస్తాయి.

 

*2. ప్రదక్షిణ* 🚩

మనం గుడి చుట్టు Clockwise Directionలో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన… ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు? పుణ్యక్షేత్రాలు Vedic Architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరంలోని "షఠ్ చక్రాలను" ప్రభావితం చేస్తాయి.


 *3. ఆభరణాలతో దర్శనం* 🚩

ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు… బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


 *4. కొబ్బరి కాయ* 🚩

ఇది "స్వచ్ఛత"కు గుర్తు. పై 'టెంక మన 'అహంకారాన్ని'… దాన్ని పగలగొడితే వచ్చే 'కొబ్బరి' మన 'కల్మషం లేని మనసును'… అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


 *5.మంత్రాలు* 🚩

ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే Neuronsని ఆక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం… అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి Neuronలను ఉత్తేజపరువస్తాయి.


*6. గర్భగుడి* 🚩

గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


*7. అభిషేకం* 🚩

విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి… వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


*8. హారతి* 🚩

పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి …హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి… దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


*9. తీర్థం* 🚩

ఇందులో పచ్చ కర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.


*10. మడి* 🚩

తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి.!


*సేకరణ*

13, డిసెంబర్ 2022, మంగళవారం

తండ్రిని మించిన తనయుడు

 శ్లోకం:☝️

*అతిరిచ్యతే సుజన్మా కశ్చిత్*

  *జనకాన్నిజేన చరితేన।*

*కుంభః పరిమితమంభః పిబతి*

  *అసౌ కుంభసంభవోంభోధిం॥*


భావం: ఒక కుండ దాని కొలత మేరకు నీరు త్రాగగలదు. అయితే కుండ నుండి పుట్టిన అగస్త్య ముని సముద్రాన్నే తాగాడు (ఆపోశన పట్టాడు). అదే విధంగా కొడుకు తన ప్రతిభ, అభ్యాసముల ద్వారా తండ్రి కంటే గొప్పవాడు కావచ్చు. ఈ శ్లోకంలో ఒక నిర్జీవమైన కుండను తండ్రిగా చెబుతూ "తండ్రిని మించిన తనయుడు" గురించిన చమత్కారం చేసాడు కవి.