30, మే 2024, గురువారం

తిరుమలనంబి

 తిరుమలనంబి .....

1000 ఏళ్ళ క్రితం తిరుమలలో ఎవరూ నివాసం ఉండేవాళ్ళు కాదు., 

అప్పుడు తిరుమల భయంకరమైన క్రూర జంతువులతో నిండి ఉన్న కీకారణ్యం.,

ఈ రోజుల్లోనే అప్పుడప్పుడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయంటే అప్పట్లో ఎంత భయంకరంగా పులుల సంచారం ఉండేదో ఊహించండి., విపరీతమైన చలి, భయంకరమైన దోమలు.,

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నర సంచారం ఉండేది.

తిరుమలలో అప్పట్లో నివాసం అనేది కనీసం ఊహించడానికే భయపడే అంశం.,

అటువంటిది మొదటిసారిగా ప్రాణాలకు తెగించి స్వామి వారికి నిత్య కైంకర్యాల కోసం మొదటిసారిగా తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి తిరుమలనంబి.,

అందుకే ఆయనను First Citizen of Tirumala అని కీర్తిస్తారు.,

వెంకటేశ్వరస్వామి ఆయనకు స్వయంగా  బోయవాని రూపంలో ప్రత్యక్షమై ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పరచిన సన్నివేశం అద్భుతం.,

తిరుమలనంబి దక్షిణ మాడవీధిలో చిన్న కుటీరం ఏర్పరచుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపేవారు.,ఈ తిరుమలనంబి నివశించిన ప్రాంతంలోనే గుర్తుగా ఆయనకు గుడి కట్టారు., మార్గానికి కుడి ప్రక్కగా దక్షిణ మాఢవీధిలో ఈ మహానుభావుడి గుడి ఉంది., బ్రహ్మోత్సవాలు/ఊరేగింపులలో స్వామివారు ఈ గుడికి ఎదురుగా రాగానే నైవేద్యం/హారతి సమర్పిస్తారు.,ఓసారి బ్రహ్మోత్సవాల్లో ఈవిషయం మర్చిపోయారు.,దానితో స్వామివారి రధం ముందుకు కదలలేదు, తరువాత విషయం తెలుసుకుని ముందుకు కదిలించారు....

Shared from WhatsApp

https://whatsapp.com/dl/source=sfw

ఆస్తి పాస్తులు

 మన ఆస్తి పాస్తులు అంటే ఇళ్ళు, బండి, కారు, స్థలం & పొలం డబ్బు ఇవేనా నీ ఆస్తులు? దేశం నీ ఆస్తి కాదా? ధర్మం నీ ఆస్తి కాదా? సంస్కృతి నీ ఆస్తి కాదా? సాంప్రదాయం నీ ఉనికి కాద?హిందుత్వం నీ అస్తిత్వం కాద ?ఎప్పుడు ఆలోచిస్తావు హిందువా? నీ హిందూ ధర్మం కోసం నీ సనాతన ధర్మం కోసం, నీ తాత ముత్తాతలు వాళ్ల తాతలు,వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులు అంతస్తులు కావాలి  కానీ వాళ్ళు నీకు వారసత్వంగా  ఇచ్చిన ధర్మం నీకు వద్దా ! వాలిచ్చిన ఆచారాల వ్యవహారాలు నీకు వద్దా! ఎప్పుడు తెలుసుకుంటావు హిందువా, నీ ఆస్తులతో పాటు మీ తాత ముత్తాతలు ఇచ్చిన ధర్మాన్ని కూడా కాపాడుకో అదే నీ అస్తిత్వం నీ జీవితానికి ఆలంబన. "ధర్మో రక్షిత రక్షితః"

అని విన లేదా


ఒక జాతి, ఒక ధర్మం,సాంప్రదాయం, ఆచారవ్యవహారాలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు 

1) చరిత్ర తెలుసుకోకపోవడం., 

2) ఐకమత్యం లోపించడం., 

3) సంస్కృతీ-సాంప్రదాయాలను వదిలివేయడం.  

4) అందరూ మనవాళ్లే అని నమ్మటం

5) ముఖ్యంగా కొంతమంది దుష్ట శక్తులు వారి స్వార్థం కోసం హిందూ ధర్మం మీద  హిందూ ఆచారాల మీద హిందువుల మీద దుష్ట ప్రచారాలు చేస్తున్నారు అని తెలుసుకోలేకపోవటం ఆ దుష్ట ప్రసారాలను తిప్పి కొట్టలేకపోవటం...    ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిఘటించే సత్తా లేక పోవడం.ఉన్న నిమ్మకు నీరెత్తి నట్టు ప్రవర్తించడం. తస్మాత్ జాగ్రత్త సోదరులారా సమయం ఆసన్నమైంది నీ ఉనికిని నిలుపుకో కాపాడుకో సత్తా చాటి సనత ధర్మాన్ని పునః ప్రారంభం దిశలో అడుగు వ్వేయి  భావి తరాలకు ఈ ఫలాలు అందించాలి.  ఇదే 

సదావకాశం.           

జై శ్రీరామ్ 

జై జై శ్రీరామ్ 

భారత్ మాతాకీ జై 

భారత్ మాతాకీ జై.... వందేమాతరం...వందేమాతరం

పంచాంగం 30.05.2024

 ఈ రోజు పంచాంగం 30.05.2024  Thursday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష: సప్తమి తిధి బృహస్పతి  వాసర: ధనిష్ఠ నక్షత్రం వైధృతి యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి పగలు 11:42 వరకు.

ధనిష్ఠ ఉదయం 07:30 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:42


వర్జ్యం : మధ్యాహ్నం 02:19 నుండి 03:49 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:04 నుండి 10:56 వరకు తిరిగి మధ్యాహ్నం 03:15 నుండి 03:49 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:24 నుండి 12:55 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

చదువుకొనుటను తగ్గించు

 *2024*

*కం*

చదువుకొనుటతగ్గించుచు

చదువు‌ను కొన నేర్చినంత చపలము ప్రబలెన్.

చదువును కొన మదము బలియు

చదువుకొనగ మేధమెరియు చక్కగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చదువుకొనుటను తగ్గించు చూ చదువును కొనడం నేర్చుకోవడం వలన అస్థిరత్వం పెరిగిపోయింది. చదువును కొనడం వలన దురహంకారం పెరుగుతుంది, కానీ చదువుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది.

*సందేశం*:-- గురువుల మెప్పుపొంది వారి అనుగ్రహం వలననూ, స్వయంగా గ్రంథాలు చదివి గురువులద్వారా సందేహనివృత్తులు చేసుకోవడం వలన జ్ఞానం వర్ధిల్లుతుంది. అదే చదువు ను ధనం తో కొనుగోలు చేయడం వలన మెదడు కు ఆలోచించే పని తగ్గి, అస్థిరపడి తద్వారా దురహంకారం పెరుగుతుంది.

*గురువులేనివిద్య రాణించడం కష్టం*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

హైదరాబాద్ ప్రాంతం వారికి

 30.05.2024.       గురువారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*   


సుప్రభాతం......


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *సప్తమీ* తిథి ఉ.11.43 వరకూ తదుపరి *అష్టమి* తిథి, *ధనిష్ఠ* నక్షత్రం ఉ.07.31 వరకూ తదుపరి  *శతభిష* నక్షత్రం, *వైధృతీ* యోగం రా.08.53 వరకూ తదుపరి *విష్కుంభ* యోగం, *బవ* కరణం ఉ.11.43 వరకూ, *బాలవ* కరణం రా.10.42 వరకూ తదుపరి *కౌలవ* కరణం ఉంటాయి.

*చంద్ర రాశి* :కుంభం లో

*సూర్య రాశి*: వృషభం (రోహిణీ నక్షత్రం లో)

*నక్షత్ర వర్జ్యం*: మ.02.20 నుండి మ.03.51 వరకూ.

*అమృత కాలం*: రా.11.25 నుండి రా.12.56 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.47

*చంద్రోదయం*:రాత్రి 12.48

*చంద్రాస్తమయం*: ప.11.52

*అభిజిత్ ముహూర్తం*: ప.11.48 నుండి మ.12.40 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.10.03 నుండి ఉ.10.55 వరకూ మరలా మ.03.17 నుండి సా.04.09  వరకూ.

*రాహు కాలం*: మ.01.52 నుండి మ.03.30 వరకూ

*గుళిక కాలం*: ఉ.08.58 నుండి ఉ.10.36 వరకూ

*యమగండం*: ఉ.05.41 నుండి 07.19 వరకూ


ఈరోజు *మాస కాలాష్టమీ*. కాలభైరవ భక్తులు ప్రతీ బహుళ పక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుడు ని పూజిస్తారు.


ఈరోజు *శైవ నక్త వ్రతం*. శైవ భక్తులు ఈరోజు పగటి పూట ఉపవాసం ఉండి, నక్షత్ర దర్శనం అయిన తరువాత రుద్రాభిషేకం చేసి పారణ  చేస్తారు.


శివ స్మరణం తో......సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

రాఘవశతకము

 శు భో  ద యం 🙏


తనువిది యుద్ధరంగము, నధార్మికవాంఛలు ధార్తరాష్ట్రులున్

మనమిది ద్రౌపదీసతియు, మానధనుండు నహమ్ము, పాండవుల్

వినయవివేకసంపదలు, వీరలు పోరుచునుంద్రు నిత్యమున్

కనునిది యంతరాత్మ యదుకాంతుడు, నన్ గృపఁజూడు రాఘవా !


నీదు హృదంబుజంబు కడునిర్మల బ్రహ్మము, రుద్రుడై చనున్

నీదగుకోపమున్, నయననీరజ యుగ్మము సూర్యచంద్రులౌ,

నాదిజురాణి జిహ్వయు, చరాచరవిశ్వము దేవవర్గమౌ,

నీదగు సీత లక్ష్మి, హరి నీవయి , నన్ గృపఁజూడు రాఘవా!


నీవె పరాత్మ, సీతయె మనీషయు, భృత్యులు ప్రాణముల్, సదా

దేవళమౌ శరీరము, త్వదీయసుపూజ సుఖోపభోగమున్

భావసమాధి నిద్రయగు, వాక్కగు స్తోత్రము, కర్మజాతమున్

తావకపూజనంబె, భవతారక, నన్ గృపఁజూడు రాఘవా!

          -రాఘవశతకమునుండి.

స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లోని 456 వ పేజీలో

 



మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు :

ఎందుకో తెలియదు కానీ - నెహ్రూ "హిందూ మతంమీద ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.

హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు.

కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు :

"నేను జీవించి ఉన్నంత కాలం.. మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను..

ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో వస్తాను" అని..

పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె.బి. కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు!

ఆయన ఇలా అన్నారు : "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.

నిజంగా ఇది లౌకిక దేశమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు

కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది.

కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది!

కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో,

అప్పుడే హిందువులంతా, హిందూ ద్రోహుల యొక్క, ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా కూడా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు.. ఏమీ జరగనట్టుగా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 1947నుండి 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !

హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది....ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు !

తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !

చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు!

తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు 

సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !

మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు.. కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు..

అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !

2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం, CWG, అగస్టా, వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్, వంటి భారీ కుంభకోణాలు జరిగాయి, శరీరం శబ్దం చేయలేదు!

కానీ.

గొడ్డు మాంసం, ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది !

జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.. అసంతృప్తి బయలుదేరింది.

వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు.. వారి నాలుకలు కథాకళి నృత్యం చేశాయి...

డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు.. కోపం వారితో భరత నాట్యం చేయించింది..

ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !

రోహింగ్యాల వెలికితీత - ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది.

ఆలోచించండి.............................

కాంగ్రెస్ = ఖన్☪️ గ్రీకు✝️ = హిందుదేశ్ వినాశనం

హిందువులకు ఏమి చేసింది ??

చర్చి కిటికీ కి లేదా

మసీదు పై రాళ్ళు పడితే..మీడియాలో వారాలపాటు చూపబడుతుంది

వందల గుళ్ళు కూలగొడితే ఎవ్వరూ కిమ్మనరు..

ఎంతో కొంత భాజపా కొట్లాడితే, అది మతతత్వం అంటారు..

ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !

ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !

ఒకటి కాదు, రెండు కాదు...........లెక్కలేనన్ని వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!

దీని గురించి ఏ ఒక్క హిందువుకు తెలియనీయలేదు !

మొదట హిందువులను కాశ్మీర్ లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది ! మొత్తం కాశ్మీర్ లోయ నుండి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూసారు!

LK అద్వానీ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం రాకపోతే ఇది ఎవరికీ తెలిసేది కూడా కాదు !

వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల, కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?

వీళ్లకు తోడుగా, ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు., బయాస్డ్ మీడియా, సూడో సెక్యులర్లు అందరూ హిందూ పండుగలను, సాంప్రదాయాలను దేవుళ్లను సైతం వెక్కిరిస్తూ ఇతర మతాల జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు..

ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివి !

సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు !

దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా....కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది!

మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని, ఎన్ని డ్రామాలు ఆడిందో...! దీని గురించి ఆలోచించండి,

ఈ సందేశాన్ని మీకు సాధ్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న అన్ని హిందూ సోషల్ మీడియాలద్వారా

ప్రపం చంలో ఉన్న హిందువులకి చాటండి. ఇతరులకు పంచమని ఒక అంతర్జాతీయ వాదిగా అఖండ విశ్వ సనాతన హైందవ హిందూ భారతీయ భగవత్ స్వరూపులైన

భారతీయ జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తూ

ఓ భరతమాత జనులారా దేశ చరిత్ర తెలుసుకో....దేశ ఖ్యాతి తెలుసుకో.....నీ గొప్పదనం గూర్చి అప్పుడే తెలుస్తుంది.

నీకున్న ఔన్నత్యం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిస్తేనే, మనలను ప్రపంచం గౌరవిస్తుంది

జగమెరిగిన నగ్న సత్యం.. జై హింద్.! జై భారత్.!!

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.30.05.2024

బృహస్పతివాసరే( గురువారము)

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే సప్తమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే సప్తమ్యౌపరి అష్టమ్యాం

బృహస్పతివాసరే  అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.26

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం 

సప్తమి ప. 11.06 వరకు. 

గురు వారం. 

నక్షత్రం ధనిష్ఠ ఉ.7.20 వరకు. 

అమృతం రా.11.09 ల 12.33 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.47 ల 10.39 వరకు. 

దుర్ముహూర్తం మ.2.59 ల 3.41 వరకు. 

వర్జ్యం మ.2.04 ల 3.34 వరకు. 

యోగం వైధృతి  రా.8.52 వరకు. 

కరణం బవ ప.11.06 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ.1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ అష్టమి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. స్పాట్ రిజిస్ట్రేషన్ లు  ఏర్పాటు చేయటం జరిగినది.

 ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ సప్తమి  - ధనిష్ట -‌‌ గురు వాసరే* (30.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 


రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. . బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి,  . కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే,, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 


+91 9848647145