1, ఏప్రిల్ 2025, మంగళవారం

నవ్వుకు ఉండే విలువ

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏           🔥 *నవ్వుకు ఉండే విలువ బాధ కు లేదు.. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు.. అబద్దానికి ఉండే విలువ నిజానికి లేదు.. నేనే అంతా అని అనుకుంటే అహంకారం.. మనదే అని అనుకుంటే మమకారం.. ఏమీ లేదనుకుంటే నిర్వి కారం.. ఒకరికి ఒకరు తోడైతే సహకారం* 🔥నిరాడంబరంగా ఉండడం అంటే అన్నిటికి దూరంగా ఉంటూ అందరికీ నిరాశను కల్పించడం కాదు.. లేనిపోని ఆశలను కల్పించక పోవడమే నిరాడంబరత...బరువులను అదృష్టంగా, బాధ్యత లను భరోసాలుగా మార్చుకోవడమే నిరాడంబరత..ఎన్ని కష్టాలు ఉన్న సమస్యలున్నా సరే వాటిని మనో బలంతో ఎదుర్కొంటూ సర్వ వేళలా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషం పంచడమే నిరాడంబరత..నిరాడంబర జీవితమే నిశ్చింత జీవితం🔥 *అలవాటు మొదట్లో సాలేగూళ్ళు.. అలవాటు పడితే ఆ తరువాత ఇనప గొలుసులులా తయారవుతాయి... పుట్టినప్పుడు ఏడుస్తావు.. ఆది జననం.. ఆయువు తీరాక ఏడిపిస్తావు ఆది మరణం..ఈ రెండిటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంత మందిని ఏడిపించకుండా బ్రతుకుతావో అదే జీవితం*🔥🔥మీ అల్లంరాజు  భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593 .9182075510* 🙏🙏🙏

కర్మయోగం

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ 

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (35)


ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో 𝕝𝕝   తుల్యనిందాస్తుతిర్మౌనీ*

   *సంతుష్టో యేన కేనచిత్|*              *.          అనికేతః స్థిరమతి*

       *ర్భక్తిమాన్మే ప్రియో నరః||*

        *భగవద్గీత*


*తా 𝕝𝕝 శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.....*


 ✍️🌹💐🪷🙏

56 పుస్తకాలు(PDF) ఒకేచోట

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀




*జ్ఞాన యోగం/బ్రహ్మవిద్య/సాధన  సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

నన్ను నేను తెలుసుకోవటం ఎలా? https://www.freegurukul.org/z/AthmaJnanam-Through-Pictures.pdf


బ్రహ్మవిద్యా రత్నాకరము-1 నుంచి 2 భాగాలు www.freegurukul.org/g/JnanaYogam-1


జీవిత పరమార్ధము - వేదాంత శాస్త్రము www.freegurukul.org/g/JnanaYogam-2


అద్వైత సిద్ధి www.freegurukul.org/g/JnanaYogam-3


ఆత్మానాత్మ వివేక దర్శిని www.freegurukul.org/g/JnanaYogam-4


బ్రహ్మ విద్యాసుధార్ణవము www.freegurukul.org/g/JnanaYogam-5


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-6


విశ్వ వేదన www.freegurukul.org/g/JnanaYogam-7


సత్య ధర్మ విచారణ - ధర్మ చర్చ www.freegurukul.org/g/JnanaYogam-8


ఆత్మ అనగా ఏమిటి www.freegurukul.org/g/JnanaYogam-9


ఆత్మబోధ www.freegurukul.org/g/JnanaYogam-10


బ్రహ్మ జిజ్ఞాస-1 www.freegurukul.org/g/JnanaYogam-11


బ్రహ్మ జిజ్ఞాస-2 www.freegurukul.org/g/JnanaYogam-12


బ్రహ్మ జిజ్ఞాస-3 www.freegurukul.org/g/JnanaYogam-13


బ్రహ్మ జిజ్ఞాస-4 www.freegurukul.org/g/JnanaYogam-14


త్రిపురా రహస్య దీపిక-జ్ఞాన ఖండము www.freegurukul.org/g/JnanaYogam-15


ఆత్మ సాక్షాత్కారము www.freegurukul.org/g/JnanaYogam-16


బ్రహ్మవిద్య www.freegurukul.org/g/JnanaYogam-17


వేదాంత విద్యాసారధి www.freegurukul.org/g/JnanaYogam-18


బ్రహ్మవిద్యానుసంధాన దర్పణం www.freegurukul.org/g/JnanaYogam-19


జ్ఞానామృత సారము www.freegurukul.org/g/JnanaYogam-20


బ్రహ్మ విద్యా దర్పణము www.freegurukul.org/g/JnanaYogam-21


శంకరాద్వైత వ్యాసమాల-1 www.freegurukul.org/g/JnanaYogam-22


శంకరాద్వైత వ్యాసమాల-3 www.freegurukul.org/g/JnanaYogam-23


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-24


పరిపూర్ణ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-25


ఆత్మ తత్వ వివేకము www.freegurukul.org/g/JnanaYogam-26


వివర్త వాద వివేకము www.freegurukul.org/g/JnanaYogam-27


బ్రహ్మ విద్యా వైభవము www.freegurukul.org/g/JnanaYogam-28


ఆత్మ తత్వము www.freegurukul.org/g/JnanaYogam-29


అద్వైత బోధిని www.freegurukul.org/g/JnanaYogam-30


బ్రహ్మవిద్య ప్రాధమిక సూత్రములు www.freegurukul.org/g/JnanaYogam-31


సత్యార్ధ ప్రకాశము www.freegurukul.org/g/JnanaYogam-32


మానవ జన్మ సాఫల్యము-ముక్తి మార్గము www.freegurukul.org/g/JnanaYogam-33


జీవన్ముక్తి వివేకః www.freegurukul.org/g/JnanaYogam-34


భగవదన్వేషణ-కొన్ని మంచి మాటలు www.freegurukul.org/g/JnanaYogam-35


సర్వ వేదాంత శిరోభూషణం www.freegurukul.org/g/JnanaYogam-36


మోక్షస్వరూప నిర్ణయము www.freegurukul.org/g/JnanaYogam-37


ఆత్మ దర్శనము www.freegurukul.org/g/JnanaYogam-38


సర్వోపనిషత్ సార సంగ్రహము www.freegurukul.org/g/JnanaYogam-39


ముముక్షు ధర్మము www.freegurukul.org/g/JnanaYogam-40


విజ్ఞాన వీచికలు-ఆధ్యాత్మికతరంగాలు www.freegurukul.org/g/JnanaYogam-41


సాధన www.freegurukul.org/g/JnanaYogam-42


ఆత్మా- చిత్ ప్రవచనములు www.freegurukul.org/g/JnanaYogam-43


ఒకటి సాధిస్తే అన్ని సాధించినట్లే www.freegurukul.org/g/JnanaYogam-44


సాధన సోపానాలు www.freegurukul.org/g/JnanaYogam-45


తత్వబోధ www.freegurukul.org/g/JnanaYogam-46


వివేక చింతామణి www.freegurukul.org/g/JnanaYogam-47


సనత్సు జాతీయము www.freegurukul.org/g/JnanaYogam-48


వేదాంతపు కథలు www.freegurukul.org/g/JnanaYogam-49


గురుప్రభోద తారావళి www.freegurukul.org/g/JnanaYogam-50


జగన్మిధ్యా - తత్వ పరిశీలనము www.freegurukul.org/g/JnanaYogam-51


అద్వైతం www.freegurukul.org/g/JnanaYogam-52


అధ్యాత్మ జడ్జిమెంట్ www.freegurukul.org/g/JnanaYogam-53


మోక్ష సాధన www.freegurukul.org/g/JnanaYogam-54


జ్ఞానదీపిక www.freegurukul.org/g/JnanaYogam-55


సద్గురు తత్త్వభోధ www.freegurukul.org/g/JnanaYogam-56


బ్రహ్మవిద్య/జ్ఞాన యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

⚜ శ్రీ విల్వాద్రినాథ దేవాలయం

 🕉 మన గుడి : నెం 1067


⚜ కేరళ  : తిరువిల్వామల - త్రిస్సూర్ 


⚜ శ్రీ విల్వాద్రినాథ దేవాలయం



💠 విల్వాద్రినాథ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లా తిరువిల్వామలలో శ్రీరాముడికి అంకితం చేయబడిన కేరళలోని నాలుగు ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి, మిగిలిన మూడు త్రిప్రయార్, కడవల్లూర్ మరియు తిరువంగడ్ దేవాలయాలు మరియు లక్ష్మణ భగవానుని కలిగి ఉన్న భారతదేశంలోనే అరుదైన దేవాలయాలలో ఒకటి. 



🔆 స్థల పురాణం 


💠 కశ్యప మహర్షి కుమారుడు అమలక అనే మహర్షి ఈ స్థలంలో విష్ణువును స్తుతిస్తూ భారీ తపస్సు చేశాడు.  

ఉసిరి పండు మాత్రమే తినడం వల్ల అమలక మహర్షికి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. 



💠 విష్ణువు తన భార్యలు శ్రీదేవీ మరియు భూదేవీ మరియు అతని  అనంతుడుతో  ( ఆదిశేషుడు) అతని ముందు కనిపించాడు.  

ప్రజల శ్రేయస్సు కోసం భగవంతుడు అక్కడే ఉండాలని తన కోరికను చెప్పాడు.  

ఆ విధంగా, భగవంతుడు తన భార్యలు మరియు అనంతునితో స్వయంభూ విగ్రహంగా మారిపోయాడు.


💠 విగ్రహాలను ప్రతిష్టించిన తరువాత, విష్ణువు యొక్క శక్తి గ్రామం అంతటా వ్యాపించింది.  

అది విన్న అసురులు మళ్లీ కోపోద్రిక్తులయ్యారు.  ఆ విగ్రహాలను ధ్వంసం చేయడానికి వారిలో ఒకరిని పంపారు.  


💠 అతడు పవిత్ర బ్రాహ్మణుని రూపంలో వెళ్ళాడు.  

ఆ రోజుల్లో ఆలయంలో బ్రాహ్మణులకు రెండు పూటలా భోజనం పెట్టేవారు.  వారితో ఈ అసురుడు కూడా చేరాడు.  పగటి పూట మామూలు బ్రాహ్మణుడిలా ఉండేవాడు, రాత్రి పూట తన రూపం మార్చుకున్నాడు.  

ఆ తరువాత, అతను ఆలయానికి దానం చేసిన ఆవులను తినడం ప్రారంభించాడు మరియు వాటి ఎముకలను ఉత్తరం వైపు విసిరాడు.  అందువలన, ఈ ప్రదేశానికి 'మూరిక్కున్ను' (మూరి అంటే పశువులు మరియు కున్ను అంటే మలయాళంలో కొండ) అని పేరు వచ్చింది.


💠 నిద్రపోతున్న కొందరు బ్రాహ్మణులను కూడా తిన్నాడు.  

కానీ సమీపంలో మాంసాహార జీవి లేకపోవడంతో అసలు హంతకుడు ఎవరికీ తెలియదు.  

ఆవులను తినేది ఏదైనా దెయ్యం అని ప్రజలు భావించారు.  చివరగా, కుంభం మాసం (ఫిబ్రవరి-మార్చి) చీకటి పక్షంలో 11వ రోజు (ఏకాదశి) వచ్చింది.  అసురుడు తన పనిని నెరవేర్చుకోవడానికి ఆ సమయం అత్యంత అనుకూలమైనదిగా భావించాడు.  


💠 ఒక అర్ధరాత్రి పూజలన్నీ ముగించుకుని అందరూ నిద్రపోయాక స్తంభాలను ధ్వంసం చేస్తూ అసురుడు శ్రీ కోవిల్‌లోకి ప్రవేశించాడు.  

ఆ సమయంలో, విష్ణువు తన నాల్గవ అవతారమైన నరసింహ రూపంలో ఒక స్తంభం నుండి కనిపించాడు మరియు హిరణ్యకశిపుని చంపిన విధంగానే అసురుడిని సంహరించాడు.  


💠 అసురుడు చేసిన ఉరుము శబ్దం విన్న ప్రజలందరూ మేల్కొని ఏమి జరిగిందో చూడటానికి పరుగెత్తారు.  స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి చాలా మంది మూర్ఛపోయారు.  

కొందరు వ్యక్తులు నేలపై సాష్టాంగపడి భగవంతుని నామస్మరణ చేశారు.  భగవంతుని ఉగ్రరూపాన్ని చూసే ధైర్యం వారికి లేదు.  


💠 ఆ సమయంలో అమలక మహర్షి 

అక్కడికి వచ్చి భగవంతుని నామస్మరణ చేసాడు. 

 ఆ తరువాత, భగవంతుడు తన అసలు రూపానికి తిరిగి వచ్చి, తన భక్తులను అనుగ్రహించాడు.

 

💠 కేరళలో రాముడు స్వయంభువుగా ఉన్న ఏకైక ఆలయం ఇదే. 

 ఇది సుమారు 5 అడుగుల పొడవు, మరియు 'పాఠలంజన శిలా' అని పిలువబడే అరుదైన రాతితో తయారు చేయబడింది. 

 విగ్రహం పైభాగంలో అనంత గొడుగులా పడుకుని ఉంటాడు. 


💠 తూర్పు ముఖ మందిరంలో లక్ష్మణుని విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తు ఉంటుంది. 

శ్రీరాముని సోదరుడు కోసం నిర్మించబడిన భారతదేశంలోని అరుదైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.  

ఈ విగ్రహం సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది మరియు ఇది కూడా 'పథలాంజన శిల'తో రూపొందించబడింది.  

పడమటి నాడలోలాగా ఈ విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు లేవు.


💠 దక్షిణం వైపున, ఇక్కడ 'కుండిల్ అయ్యప్పన్' అని పిలవబడే అయ్యప్పకు అంకితం చేయబడిన ఒక మందిరం ఉంది, ఎందుకంటే ఈ మందిరం ప్రధాన ఆలయానికి 50 అడుగుల దిగువన ఒక గొయ్యి (మలయాళంలో 'కుండు' అని పిలుస్తారు) మీద ఉంది.  


💠 ఇక్కడ, అయ్యప్ప భగవానుడు తన తండ్రి శివుడు మరియు అతని భార్య పార్వతీ దేవితో కలిసి తూర్పు ముఖంగా ఉంటాడు.  

ఈ ఆలయం నుండి కర్క్కడకం (జూలై-ఆగస్టు) మాసంలో విల్వద్రినాథ భగవానుడు 'త్రిప్పుతరి'కి అన్నం పొందుతాడు.  



🔆 రోజువారీ పూజా సమయాలు 


💠 ఆలయం 7 సార్లు శంఖం ఊదడం ద్వారా శాంతియుతమైన మరియు పవిత్రమైన వాతావరణంలో ఉదయం 4 గంటలకు తెరవబడుతుంది.  

ఆ రోజున జరిగే మొదటి దర్శనాన్ని 'నిర్మాల్య దర్శనం' (అంటే 'మునుపటి రోజు అలంకారాలతో కూడిన దర్శనం' అని అర్థం) అంటారు. 

 ఆ అలంకారాలను తొలగించిన తర్వాత, 'శంఖాభిషేకం' (కుడివైపు శంఖంపై పవిత్ర జలాన్ని తీసుకొని నిర్వహించే ప్రత్యేక అభిషేకం) మరియు ఇతర అభిషేకాలు నిర్వహిస్తారు.  అనంతరం విగ్రహాలను నూతన వస్త్రాలు, గంధంతో అలంకరిస్తారు. 


💠 ప్రతి రోజు మొదటి నైవేద్యంగా మలార్ (వేపుడు బియ్యం ), అరటిపండు మరియు బెల్లం.  

దీని తరువాత, ఉషపూజ (ఉదయం పూజ) కోసం నాడ మూసివేయబడుతుంది, ఈ సమయంలో నెయ్యి పాయసం సమర్పించబడుతుంది.


రచన

©️ Santosh Kumar

15-15-గీతా మకరందము

 15-15-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - సకల జీవుల హృదయములందును తాను వెలయుచున్నాడనియు, అన్నిటికిని తానే యాధారభూతుడనియు భగవానుడు తెలుపుచున్నారు-


సర్వస్య చాహం హృది సన్నివిష్టో 

మత్తః స్మృతి ర్జ్ఞాన మపోహనం  చ | 

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో

వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || 


తాత్పర్యము:- నేను సమస్తప్రాణులయొక్క హృదయమందున్నవాడను; నావలననే (జీవునకు) జ్ఞాపకశక్తి, జ్ఞానము (తెలివి), మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.


వ్యాఖ్య:- ‘సర్వస్య’ - జాతిమతకులతారతమ్య మెద్దియులేక చరాచర ప్రాణికోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుటవలన ఇక నెవరును అధైర్యపడవలసిన పనిలేదు. మహాపాపియైనను చండాలుడైనను తనయందలి దైవసన్నిధిని స్మరించి పవిత్రాచరణద్వారా వారిని తెలిసికొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న, తనకు ఆధారముగనున్న అఖండచైతన్యమును స్మృతియందుంచుకొనినచో తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడే అయి తరించును.

ఇట్టి అవకాశమును శ్రీకృష్ణపరమాత్మ గీతయందు సర్వులకును కల్పించియున్నారు. ఎటువంటివారికైనను తరించుటకు చక్కని అవకాశము నొసంగియున్నారు. తరంగము చిన్నదైనను, పెద్దదైనను రెండిటివెనుక మహాసముద్రమే కలదు. కాబట్టి చిన్నతరంగము (ప్రాణి) అధైర్యమొందవలసిన పనిలేదు.

తనయందలి అంతర్యామియగు పరమాత్మను తెలిసికొనిన చాలును. ఆ పరమాత్మ అందఱి యొక్కయు "జన్మహక్కు” అని గీతాచార్యులు "సర్వస్య” అను పదముద్వారా భేరి మ్రోగించి చెప్పుచున్నారు.


"హృది” (హృదయమునందు) - అని పేర్కొనుటవలన, భగవానుడు ప్రతివానికిని అతిసమీపమున హృదయమందే వర్తించుచున్నారని భావము. కావున శిక్షకుడు చెంతనే యున్నారని గ్రహించి, పాపకృత్యములనుచేయక భగవత్ప్రీతికరములైన కార్యములనే (ధర్మకార్యములనే) చేయవలెను.

"మత్తః స్మృతిర్జ్ఞాన మపోహనం చ" - స్మృతి, జ్ఞానము, మఱపు - ఇవి యన్నియు మనస్సు యొక్క వివిధరూపములు. పరమాత్మయో మనస్సునకు అధిష్ఠానముగ, ఆధారభూతుడుగ నున్నవారు. కావున వారివలననే యవి కలుగుచున్నవని చెప్పబడినది. దీనినిబట్టి కేవలము స్థూలవస్తువులనేకాక, అతిసూక్ష్మములగు జీవుని మానసిక ప్రవృత్తులనుగూడ భగవానుడు గమనించుచున్నట్లును, వారికి తెలియకుండ ఏదియు మనస్సునందు జరుగదనియు స్పష్టమగుచున్నది. కాబట్టి ప్రతివారును తమ మనస్సునం దేలాటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయవాసనలు రానీయకుండ భద్రముగా చూచుచుండవలెను.

"వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” - వేదములందు, శాస్త్రములందు అనేక దేవుళ్లు, దేవతలు చెప్పబడినప్పటికిని, తెలిసికొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయియున్నారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది వివిధదేవుళ్ళందఱును ఒక్క పరమాత్మ యొక్కయే వివిధరూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానందపరబ్రహ్మమే (పరమాత్మయే) యగును.


"వేదాన్తకృత్” - వేదములన్నిటిని సృష్టించినది సాక్షాత్ పరమాత్మయేకాని మానవమాత్రుడుకాడని యిట స్పష్టముగ తెలుపబడుటవలన, ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు (‘ఇవి భగవత్ర్పోక్తములే’ అను) నమ్మకముగలిగి ప్రవర్తింపవలయును. అవి దైవనిర్మితములగుటచే వానియందు అఖండవిశ్వాసముంచవలెను. లోకమున గురు పరంపర చెప్పునపుడును ‘ఓమ్ నారాయణం పద్మభువం.....’ అని మొట్టమొదట ఆ పరమాత్మనే, శ్రీమన్నారాయణునే పేర్కొనుచుందురు.


ప్రశ్న:- భగవంతు డెచటనున్నాడు?

ఉత్తరము:- అందఱియొక్క హృదయమున వసించుచున్నాడు.

ప్రశ్న:- స్మృతి, జ్ఞానము, మఱపు ఎవనివలన గలుగుచున్నవి?

ఉత్తరము:- ఆ పరమాత్మవలననే.

ప్రశ్న:- వేదములన్నిటిచే తెలియబడదగిన వారెవరు? వేదాంతమును సృష్టించినదెవరు? వేదమును లెస్సగ దెలిసినవారెవరు?

ఉత్తరము:- ఆ పరమాత్మయే.

తిరుమల సర్వస్వం 195-*

 *తిరుమల సర్వస్వం 195-*

**శ్రీవారి ఆభరణాలు -7*

 ఆలయంలో ఉండే చిన్న-పెద్ద, కొత్త పాత నగలన్నింటిని పరీక్షించి, అవి నిఖార్సైన బంగారు నగలే అని ధ్రువీకరించారు.


 బీరువాలో భద్రపరిచిన నగల వివరాలను ఆయా రిజిస్టర్ లలో ఉన్న వివరాలతో పోల్చి, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేల్చి చెప్పారు.


 నిఘా వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉన్నదని, అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పరిశీలించే పటిష్టమైన వ్యవస్థ కూడా ఉన్నట్లుగా కమిటీ అభిప్రాయపడింది.


 భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకున్న నగలు చోరీకి గురైనట్లు అప్పుడప్పుడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు నిజం కాదని; ఒకరో ఇద్దరో క్రింది స్థాయి ఉద్యోగులు చాలా అరుదుగా ఆభరణాల విషయంలో అవినీతికి పాల్పడినప్పటికీ, అటువంటి వారి విషయంలో ఆలయ యాజమాన్యం కఠినంగా వ్యవహరించి, ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించుకుంటూ, దేవాలయ యాజమాన్యం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని

2 నిలబెట్టే విధంగా విశేషమైన కృషి జరుగుతోంది.


 ఆభరణంలోని ఏదైనా రాయి ఊడినా, ఆభరణం విరిగినా, ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ రికార్డుల్లో నమోదు చేయబడతాయి. విరిగిన రాళ్లు, ముక్కలు కూడా మిల్లీగ్రాములతో సహా లెక్కగట్టి, వాటిని విడిగా భద్రపరిచే సంప్రదాయం అమలులో ఉంది.


 ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను పేర్కొని, ఆ ఆభరణం యొక్క పూర్తి వివరం, బరువు, రాళ్ల సంఖ్య, ఏ జాతి రాళ్ళు మొదలగు వాటన్నింటినీ రిజిస్టర్ లలో లేదా కంప్యూటర్ లో నమోదు చేస్తారు. ఏ ఆభరణాన్నైనా దాని నిర్దిష్టస్థానం నుంచి ఏ కారణం చేతనైనా బయటకు తీసినట్లయితే, – దానిని ఎందుకు బయటకు తీయవలసి వచ్చింది, ఏ తేదీ నాడు ఎవరిద్వారా తీయబడింది, మరలా ఎప్పుడు యథా స్థానానికి చేరింది – వంటి వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయబడుతున్నాయి.


 1933వ సంవత్సరంలో తి.తి.దే. యాజమాన్యం లోకి వచ్చినప్పుడు, మహంతుల ద్వారా అప్పగించబడిన నగలన్నీ యథాతథంగా ఈనాటికీ ఉన్నాయని, ఎటువంటి అవకతవకలు జరగలేదని కమిటీ తేల్చి చెప్పింది.


 కుప్పలు తెప్పలుగా ఉన్న స్వర్ణాభరణాలన్నీ కేవలం స్వామివారి భౌతిక సంపత్తి అయితే; శ్రీవారిపట్ల కోట్లాది భక్తుల గుండె సవ్వళ్ళలో గూడు కట్టుకున్నట్టి, వెలకట్ట సాధ్యం కాని ప్రేమాభిమానాలు, భక్తితత్పరతలు వారికి అసలైన ఆభూషణాలు.


ఆ ఆనందనిలయుని అలంకారాలన్నీ భక్తులు తనివితీరా చూసి సంతృప్తి చెందడానికే గానీ, వారికివన్నీ నిమిత్తమాత్రం.


 వేల సంవత్సరాల క్రితం ఏ విధమైన ఆచ్ఛాదనా లేని ఒక చిన్న నాలుగు కాళ్ళ మంటపంలో చిన్న కౌపీనంతో ఉన్నప్పుడు; బంగారువిమానం క్రిందనున్న భవ్యమందిరంలో వేలకోట్ల ఆభరణాలను ధరిస్తూ షట్కాల పూజలందు కొంటున్న ప్రస్తుత తరుణంలో అదే చిద్విలాసం, అదే వరదహస్తం. పగిలిన కుండపెంకులో చద్దెన్నం పెట్టిన నిరుపేద కుమ్మరి భీమన్నను; కోట్ల రూపాయలు విలువైన ధన, కనక, వస్తు, వాహనాలను సమర్పించుకున్న దక్షిణభారత చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలును స్వామివారు ఒకే రీతిగా కరుణించారు.


 *'వడ్డికాసులవాడిగా'* తాను పేరు తెచ్చుకొని, వచ్చిన కానుకలన్నింటినీ పరోపకారార్థమే వినియోగించే, వితరణశీలి అయిన ఆ మాధవుడు చేసే 'మానవసేవ' గురించి మరొక ప్రకరణంలో వివరంగా తెలుసుకుందాం.


 *బహుశా భద్రతా కారణాల వల్ల శ్రీవారి ఆభరణాల సంబంధించిన సమగ్రమైన సమాచారం బహిరంగంగా మాధ్యమంలో అందుబాటులో లేదు. అత్యంత అరుదుగా పత్రికల్లో ప్రచురించబడే వార్తలు, ప్రత్యేక కథనాలు, ఆలయంతో చిరకాల అనుబంధం ఉన్న వ్యక్తుల నుండి ముఖతః లభించిన సమాచారం, వీటన్నింటినీ సమన్వయ పరచడం ద్వారా పై వివరాలు సేకరించబడ్డాయి.*


[ రేపటి భాగంలో ... *కలపిల తీర్థం* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*334 వ రోజు*


*సైంధవుని మరణం*


కృష్ణుడు " అర్జునా! సైంధవుని తల నేల మీద పడితే ప్రమాదం. కనుక దానిని ఆపు " అన్నాడు. అర్జునుడు ఒక దాని వెంట ఒక బాణం సంధిస్తూ ఆ తల నేల మీద పడకుండా ఆపాడు. సైంధవుని తల బంతిలా తిరుగుతూ ఉంది. ఒక వైపు యుద్ధం చేస్తూనే ఒక వైపు బాణప్రయోగంతో సైంధవుని తలని ఆపుతూ " కృష్ణా ! ఎంత సేపు ఈ తలని ఇలా ఆపాలి " అన్నాడు. కృష్ణుడు " సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు. అతడు సింధు దేశపు రాజు. అతడికి వర ప్రసాదంగా సైంధవుడు జన్మించాడు. ఒక రోజు ఆకాశవాణి " సైంధవుని తల యుద్ధంలో నరకబడుతుంది " అని చెప్పింది. అది విన్న వృద్ధక్షతుడు " నా కుమారుని తల నేల మీద పడవేసిన వాడి తల ముక్కలౌతుంది " అని శపించాడు. అతడు ఇప్పుడు తపమాచరించుటకు అడవులకు వెళ్ళాడు. కనుక నీవు పాశుపతాస్త్ర సాయంతో సైంధవుని తల అతడి తండ్రి వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేయి " అన్నాడు. అర్జునుడు " కృష్ణా! వృద్ధక్షతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా! వృద్ధక్షతుడు ఇప్పుడు శమంతక పంచకం సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. నీవు అతడి తలను వృద్ధక్షతుడి ఒడిలో పడేలా అస్త్ర ప్రయోగం చేయి " అన్నాడు. అర్జునుడు పరమశివుని భక్తితో స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాడు. సైంధవుడి తల ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షతుడి ఒడిలో పడేలా చేసాడు. హటాత్తుగా తన ఒడిలో పడిన మానవ మస్తకాన్ని చూసి కంగారు పడిన వృద్ధక్షతుడు దానిని నేల మీద విసిరి వేసాడు. వెంటనే శాపప్రభావంతో అతడి తల ముక్కలైంది. కృష్ణుడుఅర్జునుడిని ప్రశంసించాడు. కౌరసేన భయంతో పారిపోయింది. సైంధవుని తల నేల మీద పడే వరకు అలాగే ఉన్న సైంధవుని మొండెము సైంధవుని తల నేల మీద పడగానే కింద పడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్య పడ్డారు. శ్రీకృష్ణుడి సాయంతో అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొనడం చూసి సాత్యకి, భీముడు సింహ నాదాలు చేసారు. కౌరవ సేనలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. అది విని ధర్మరాజు ఆనందసాగరంలో మునిగాడు. పాడవుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పాండవసైన్యం తూర్యనాదాలు, భేరి, మృదంగ నాదాలు చేసారు.

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం *


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ సుందరనారాయణ ఆలయం

 🕉 మన గుడి :


⚜ మహారాష్ట్ర : నాసిక్


⚜  శ్రీ  సుందరనారాయణ ఆలయం



💠 గంగా ఘాట్ సమీపంలో ఉన్న పురాతన ఆలయాలలో ఇది ఒకటి. గంగాధర్ యశ్వంత్ చంద్రచూడ్ దీనిని 1756లో నిర్మించారు. 

లక్ష్మి మరియు  సరస్వతితో పాటు విష్ణువు ప్రధాన దేవత. 


💠 ఈ ఆలయాన్ని "సుందర నారాయణ (విష్ణువు)" అని పిలవడానికి ప్రధాన కారణం, ఒకసారి జలంధర్ (దుష్ట రాక్షసుడు) భార్య వృంద ఇచ్చిన శాపం వల్ల విష్ణువు వికారంగా మారాడు.


💠 పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం ఒకప్పుడు శివునికి అత్యంత భక్తుడైన జలంధర్ అనే దుష్ట రాక్షసుడిచే వెంటాడబడే ప్రదేశం. 

ఆ రాక్షసుడు క్రూరంగా ఉండి దుష్ట పనులు చేసినప్పటికీ, అతనికి ధర్మబద్ధమైన మరియు సద్గుణవంతురాలైన భార్య వృందా దేవి ఉండేది. 

అతని భక్తికి శివుడు ఎంతో ఆకర్షితుడై ఆ రాక్షసుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు. ఈ వరం జలంధర్ ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేలా చేసింది.


💠 మానవాళిని రక్షించడానికి రాక్షసుడిని చంపడం ఎంత ముఖ్యమో దేవతలు గ్రహించారు. 

ఈ గొప్ప పనిలో సహాయం చేయడానికి దేవతలు విష్ణువును సంప్రదించారు. జలందర్ భార్య యొక్క పవిత్రత మరియు భక్తి అతని జీవితానికి కవచంగా పనిచేస్తుందని విష్ణువు అర్థం చేసుకున్నాడు. 


💠 విష్ణువు జలందర్ రూపాన్ని స్వీకరించి తన భార్యతో జీవించడం ప్రారంభించాడు.

అతను జలందర్‌ను చంపాడు. జలందర్ భార్య దేవి వృంద ఈ విషయం తెలుసుకున్నప్పుడు, ఆమె విష్ణువును నల్లగా మరియు వికారంగా మారమని శపించింది. 

ఆ స్త్రీ శాపం అతన్ని నల్లగా మార్చింది మరియు అతను తన అసలు రూపాన్ని తిరిగి పొందడానికి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయాల్సి వచ్చింది. 

తన అసలు రూపాన్ని తిరిగి పొందిన తర్వాత, విష్ణువును సుందరనారాయణ అని పిలుస్తారు.


💠 ఈ ఆలయం ముఖ్యంగా మొఘల్ శిల్పంతో ముడిపడి ఉన్న వంపుతిరిగిన గూడును ప్రదర్శిస్తుంది. 

తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో తోరణాలు మరియు గోళాకార గోపురాలతో కూడిన మూడు వరండాలు ఉన్నాయి. 


💠 లక్ష్మీ మరియు సరస్వతితో చుట్టుముట్టబడిన ప్రధాన దేవత విష్ణువును గర్భగుడిలో ఉంచారు. గోడలపై హనుమంతుడు, నారాయణ మరియు ఇందిరల చిన్న శిల్పాలు ఉన్నాయి. 


💠 ఈ ఆలయం గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది నిర్మించబడిన కోణం. 

ప్రతి సంవత్సరం మార్చి 21న ఉదయించే సూర్యుని కిరణాలు మొదట విగ్రహాలపై నేరుగా పడతాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చూడటానికి ఈ రోజున వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 ఇది మరాఠా నిర్మాణ శైలిలో మరియు హేమద్‌పంతి నిర్మాణ శైలిలో సంక్లిష్టమైన పనితనంతో పూజకు అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటి. 

గర్భగుడి ప్రాంతంలో విష్ణువు యొక్క అందమైన విగ్రహం ఉంది, ఇది సాధారణంగా పండుగల యొక్క వివిధ దశలలో పండ్లు మరియు పువ్వులతో అలంకరించబడుతుంది. 

ముఖ్యంగా పండుగలు లేదా రామ నవమి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర వేడుకల సమయంలో ప్రజలు పూజించడానికి అక్కడికి వెళతారు. మతపరమైన ప్రదేశం కావడంతో, ఆలయ వాతావరణం ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది.


💠 దాని నిర్మాణ నిర్మాణాన్ని పరిశీలిస్తే, సుందరనారాయణ ఆలయానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. 

ఈ స్మారక చిహ్నం నిర్మాణం 13వ శతాబ్దంలో యాదవుల పాలనలో జరిగిందని చెబుతారు, తద్వారా సమకాలీన భవన నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తుంది. అప్పటి నుండి ఈ ఆలయం కొన్ని నిర్మాణాత్మక మార్పులు మరియు సౌందర్య మెరుగుదలలకు గురైంది, అదే సమయంలో సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను నిలుపుకుంది.


💠 విష్ణువు ఆలయం కావడంతో, ఈ ఆలయం మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటి మరియు ముఖ్యమైన యాత్రా కేంద్రంగా ఉంది. చారిత్రాత్మకంగా, శతాబ్దాల క్రితం కూడా ఆచరణలో ఉన్న సంప్రదాయాలు మరియు ఆచారాలను తగిన గౌరవంతో నిర్వహించడం ద్వారా ఇది నాసిక్ యొక్క మతపరమైన జీవితానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.


💠 సమయాలు: 

ఉదయం 6 - మధ్యాహ్నం 12 మరియు సాయంత్రం 5 - రాత్రి 9 గంటల వరకు.



💠 నాసిక్ సెంట్రల్ బస్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో, సుందరనారాయణ ఆలయం నాసిక్ లోని పంచవటి ప్రాంతంలోని రామ్ కుండ్ సమీపంలోని అహిల్యబాయి హోల్కర్ వంతెన మూలలో ఉంది.

మంగళవారం🍁* *🌹01, ఏప్రియల్, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

*🌹01, ఏప్రియల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి       : చవితి* రా 02.32 వరకు ఉపరి *పంచమి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : భరణి* ఉ 11.06 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం  : విష్కుంబ* ఉ 09.48 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : వణజి* మ 04.04 *భద్ర* రా 02.32 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 05.00  - 06.00*

అమృత కాలం  : *ఉ 06.50 - 08.16*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.36*

*వర్జ్యం            : రా 09.58 - 11.25*

*దుర్ముహూర్తం  : ఉ 08.30 - 09.19 రా 11.01 - 11.48*

*రాహు కాలం   :  మ 03.16 - 04.48*

గుళికకాళం       : *మ 12.11 - 01.44*

యమగండం     : *ఉ 09.07 - 10.39*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.20*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *మేషం/వృషభం*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.02 - 08.30*

సంగవ కాలం         :      *08.30 - 10.58*

మధ్యాహ్న కాలం    :      *10.58 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర శుద్ధ చవితి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.20*

ప్రదోష కాలం         :  *సా 06.20 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.48*

నిశీధి కాలం          :*రా 11.48 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.28 - 05.15*

--------------------------------------------------

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*


*రామరిణా కృతహృతౌ జనకాత్మజాయా*

*లంకాస్థితా జనకజేతి సుశోధకారిన్*

*సీతాతిశోకహరణ ప్రబలారి హన్తః*

*శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే||*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹