30, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము



             రచన . 

గోపాలుని మధుసూదన రావు 



శ్రీనైమిశ వనమందున 

 శౌనక ముఖ్యాదులైన సంయమివర్యుల్ 

మానితమగు నొక మఖమును 

 పూనిరి సేయంగ మిగుల పూనిక తోడన్. 1

                    

అనయము భగవన్నామము 

 మనమందున దలచునట్టి మహనీయుండున్ 

ఘనుడగు నారదు డొచ్చెను

 మునిసంఘము లుండు వనికి మోదము తోడన్ 2   


మునిసంఘము నారదుగని 

మనమున యానందమొంది మన్నన సేయన్ 

మునియంతట చిఱునగవున 

ఘనమగు యీ సవనమునకు కర్తెవరనియెన్ 3


హవ్యంబుల భోక్తెవరని 

దివ్యుమ్డగు నారదుండు తెలియగ నడుగన్ 

"మువ్వురు మూర్తులె " యనుచును 

భవ్యులు యచటున్న మునులు పల్కిరి భక్తిన్ 4


విని యా మాటలు సంయమి 

యనియెను నీ రీతి నంత నాశ్చర్యముతో

" ఘన మునులగు మీరెప్పుడు 

వినలేదా సవనవిధులు విజ్ఞులు నుడువన్ 5


మువ్వురు మూర్తుల కొఱకును 

హవ్యము నీయంగ తగదు , యందొక వ్యక్తిన్ 

దివ్యునిగ నెన్నుకొనియును 

నివ్వగ హవ్యంబు , జన్న మిచ్చును ఫలమున్ 6


మువ్వురు మూర్తుల యందున 

నెవ్వడు యత్యంత ఘనుడొ యేర్పడ నెఱిగీ 

నవ్వాని పెద్ద జేసియు 

నవ్వానికె నీయవలయు హవ్యంబెపుడున్ ". 7

శివానందలహరి 12 వ శ్లోకం

 దశిక రాము




" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:

కొండ గుహలలో నివాసం, అగ్నిహోత్ర మధ్యంలో నిలవడం, పర్వతాలపై నివాసం,నీటిలో నిలవడం వాటికంటే, ఈశ్వర పాదపద్మంపై అర్పింౘబడిన 

నిర్మలమైన అంతః కరణము విశిష్టమైన దని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు.


శ్లో" గుహాయాం గేహేవా _ బహిరపి వనేవా‌ ద్రి శిఖరే

         జలేవా వహ్నౌవా _ వసతు వసతేః కిం వద ఫలమ్ ,

         సదా యస్యైవాంతః _ కరణమపి శంభో తవపదే

         స్థితం చేద్యోగో సౌ _ సచ పరమయోగీసచ సుఖీ‍!!


పద విభాగము:

గుహాయాం _ గేహే _ వా _ బహః _ అపి _ వనే _ వా _ అద్రిశిఖరే 

 _ జలే _ వహ్నౌవా _ వసతు _ వసతేః _ కిం _ వద _ ఫలమ్ _

 సద _ యస్య _ ఏవ _ అంతఃకరణమ్ _ అపి _ శంభో _ తవ _

పదే _ స్థితం _ చేత్ _ యోగః _ అసౌ _ సః _ చ _ పరమయోగీ _ 

సః _ చ _ సుఖీ.


తాత్పర్యం :

ఈశ్వరా ! మానవులు పర్వత గుహల యందు గానీ , గృహము నందు గానీ బయట ఎక్కడో గానీ, పర్వత శిఖరంపైకానీ, నీటియందుకానీ, అగ్నియందు కానీ నివసింపవచ్చు. నివసించిన ఆ ప్రదేశంవల్ల ప్రయోజనం ఏముంటుంది.? ఎవరి

హృదయం ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు ఆసక్తమై ఉంటందో , అదే యోగము , అతడే యోగి. అతడే సౌఖ్యవంతుడు. హృదయంలో భక్తి ప్రధానం కానీ నివసించే స్థలము ప్రధానము కాదని భావము.


వివరణ: 

ధ్యానం,అర్చనం, తపస్సు మొదలయిన వాటికి ఒక పవిత్ర ప్రదేశం వుండడం మంచిదే. నిజానికి గంగాది నదీతీరాలు, గ్రామాలకు సమీపంలో వుండే అరణ్య ప్రదేశాలు, పవిత్ర గుహలూ , ఆశ్రమాలూ మొదలైనవి పరమేశ్వర ధ్యానానికి అనుకూల ప్రదేశాలని శాస్త్రములే చెపుతున్నాయి. 

ఇక్కడ ఒకమాట మనం గుర్తుంౘుకోవాలి. ఇటువంటి ప్రదేశాల్లో వుండకూడదని శంకరులు చెప్పలేదు. ఇట్టి స్థలాలు తప్పక వుండాలి. 

వీటితోబాటు భగవత్పాద స్మరణము నందు ఆసక్తి కల చిత్తము కూడా ఉండాలనీ, అలా ఉంటేనే , ఆప్రదేశాలలో నివాసానికి సార్థకత అనీ, శంకరుల అభిప్రాయం గా మనం గుర్తించాలి. లేకపోతే అంతా వ్యర్థమనీ,లోకవంచన, 

ఆత్మవంచన అవుతుందన్నది సత్యము.

🙏🙏🙏


ధర్మము - సంస్కృతి

🙏🙏🙏

🌹 మూకపంచశతి🌹

 **దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏




🌹 ఆర్యాశతకము🌹


🌹12.

కమ్పాతీరచరాణాం

           కరుణాకోరకితదృష్టిపాతానామ్౹


కేలీవనం మనో మే


కేషాఞ్చిద్భవతు చిద్విలాసానామ్౹౹


      🌺భావం:అమ్మకామాక్షీదేవి కంపానదీతీరమున విహరించుచున్నది. కరుణయే మొగ్గతొడిగిన కటాక్షవీక్షణములు గల ఆతల్లి అనిర్వచనీయములైన చిద్విలాసములకు, నా హృది కేళీ(ఆటస్థలము)ఉద్యానవనము అగుగాక !🙏



💮కంపానదీతీరమున ఉన్న కాంచీ పట్టణమున దేవికామాక్షి విహరించుచున్నది. ఆమె వీక్షణములు కరుణాపూరములు. దయతో కూడిన ఆతల్లి విలాసవిహారములే ఎల్లప్పుడూ నామదిలో నిండియుండుగాక !



సశేషం


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏

ధర్మము-సంస్కృతి

https://chat.whatsapp.com/BX9q7cjvzxzLGb99dapVRi


**ధర్మో రక్షతి రక్షితః*



హిందూ సాంప్రదాయాలను 


పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

పునర్వసు నక్షత్రము-గుణగణాలు, ఫలితాలు

 


    పునర్వసు గురు గ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అధితి, పురుష జాతి. పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి. నాలుగవ పాదము కర్కాటక రాశిలో ఉంటాయి. 


పునర్వసు నక్షత్రమున ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. ఎక్కువ శాతం శుభకరమనే చెప్పాలి. ఈ నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే.. ఆమె శాంత స్వభావంతో, బంధువులయందు అమితమైన అభిమానం చూపుతుంది. ఓర్పు ఉంటుంది. ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. క్రమంగా ఆమె ధనవంతురాలు అవుతుంది. ఇక అబ్బాయి జన్మిస్తే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు అయి ఉంటాడు. అయితే అతడు అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు. 


ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. సువర్ణం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు. 


పునర్వసు నక్షత్రము గుణాగణాలు


జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. 


ఇక ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అయితే అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే తత్వం ఉంటుంది. సొంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడే పనికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనుర్విద్య, తుపాకితో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, మటలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది. 

పునర్వసు మొదటి పాదం :- పునర్వసు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. మేషరాసి అధిపతి కుజుడు. పునర్వసు నక్షత్రజాతకులది దేవగణం. కనుక వీరికి గురువు, కుజుడు గ్రహప్రభావం ఉంటుంది. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. వీరు ధైర్యంగా మధ్యవర్తిత్వం వహించగలరు. ధర్మాన్ని రక్షణ చేయడానికి వీరు వెనుకాడరు. భూ సంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయ వృ త్తి వీరికి అనుకులిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరికి బాల్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 15 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. కాలేజ్ చదువులలో కొంత జాప్యం, కొంత మందకొడితనం జరగవచ్చు. కనుక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వివాహం కూడా కొంత జప్యంగా జరుగు తుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి. 51 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ వరకు సాఫీగా జరిగే జీవితంలో తరువాత కేతుదశ కాలం 7 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కానీ తరువాత 58 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితానికి అవకాశం ఇస్తుంది. వృద్ధాప్యం వీరికి సౌఖ్యవంతంగా జరుగుతుంది.


పునర్వసు నక్షత్ర రెండవ పాదం:- పునర్వసు నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది. వృషభరాశి అధిపతి

శుక్రుడు, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు వీరి మీద శుక్రు గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు గురువులుగా లోక పుజితులు ఔతారు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు. వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ పని అయినా సౌమ్యతతో సాధిస్తారు. ఉన్నత ఉపాధ్యాయులుగా , ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. బాల్యంలో వీరు సౌఖ్యాలను అనుభవిస్తారు. 10 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. విద్య లో కొంత మందకొడి తనం నెలకొంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహంలో జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. 46 సంవత్సరాల తరువాత వచ్చే కేతు దశలో కొన్ని సమస్యలు ఎదురైనా 7 సంవత్సరాల అనంతరం 53 సంవత్సరంలో శుక్రదశలో సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం ఔతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా జరిగుతుంది.


  పునర్వసు నక్షత్ర మూడవ పాదం:- పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు . వీరికి బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాధ్యాయులు , విద్యాసంస్థ అధిపతులుగా వీరు రాణిస్తారు. భూ సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. బంగారు వస్తువుల మిద వీరికి ఆసక్తి ఉంటుంది. బాల్యం సౌఖ్యంగా ఆరంభం ఔతుంది. 6 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది. విద్య లో కొంత మందకొడితనం కొనసాగుతుంది. ప్రయత్నా పూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది. 25 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. వీరికి బుధదశ సాఫీ గా జరుగి పోతుంది. 42 సంవత్సరాల తరువాత ఆరంభం అయ్యే కేతు దశ వలన వచ్చే సమస్యలు 7 సంవత్సరాలు ఎదురైనా తరువాత వచ్చే 49 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో వీరికి తిరిగి సౌఖ్యవంతమైన జీవితం మొదలౌతుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.


పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం:- పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది. కతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. వీరికి తల్లితో ఉన్న అనుభందం విడదీయలేనిది. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం. ఉపాద్యవృత్తి కూడా వీరికి అనుకూలమే. తెల్లని వస్తువులు, పసుపు వర్ణ వస్తువులతో సంబంధం ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు వీరికి అనుకూలం. బాల్యం సౌఖ్యంతో మొదలైనా 2 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలంలో సౌఖ్యం కొంత వెనుక పడుతుంది విద్య మందకొడిగా సాగుతుంది. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. 38 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో ఎదురయ్యే సమస్యలు 7 సంవత్సరాల తరువాత తగ్గి 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యాలను అందిస్తుంది. తరువాత జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.  

బాల్యం సుఖవంతంగానే గడుస్తుంది. అయితే క్రమంగా సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 70 

సంవత్సరాల తరువాత సమస్యల నుంచి బయట పడి సుఖ జీవితం కొనసాగించే అవకాశము ఉంది....మీ.... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

మూడు భిన్నమైన యోగ విధానాలని చెప్పడం జరిగింది

 శుభోదయం.


అతి అనేది నిద్రలో, ఆహారం లో, మెలకువ లో ఉంటే సమత్వం సిద్ధించడం కష్టం. ఎంతసేపు నిద్రపోయిన తర్వాత మీకింక నిద్ర పోవాలి అని అనిపించదో, మీ బడలిక తీరుతుందో, మీరు తాజాగా ఉంటారో, అంత సేపు నిద్రపోతే సరిపోతుంది. ఎవరికి వారు ఈ సమయాన్ని నిర్ణయించుకోవాలి.


మానవులు మూడు రకాలుగా ఉంటారని వర్గీకరించి, మూడు భిన్నమైన యోగ విధానాలని చెప్పడం జరిగింది. బుద్ధి ప్రధానంగా గల ఆలోచనాశీలురకు జ్ఞాన యోగము; భావ ప్రధానులకు భక్తి యోగము; కర్మ ప్రధానులకు కర్మ యోగము.


ఎపుడైనా మీ మనస్సు సుఖంగా ఉంది అంటే, మీరు నిజంగానా? అని ప్రశ్నించాలి. అదే దుఃఖం కలిగితే, ఇలా ప్రశ్నించుకోవాలి: దీన్ని దుఃఖం అనుకోవడం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఇంతకు ముందు మనం ఇప్పుడు కోరుకున్నదే, కోరుకున్నప్పుడు, మనకు కలిగింది ఇదే దుఃఖమా? సుఖాన్ని కోరుకుని, దాన్ని దుఃఖమా? ఆంటూ ప్రశ్నించుకున్నది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే, మన లోపల ఎవరున్నారో, ఎవరికి అన్నీ తెలుసో, వారితో పరిచయం ఏర్పడుతుంది.

*మానవత్వం పరిమళించిన మంచి మనిషికి వందనం*







*అతని పేరు మారన్. శ్రీలంక లో అతడు న్యాయశాస్త్రంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఒకానొక ప్రమాదంలో దురదృష్టవశాత్తు మారన్ కనుచూపు కోల్పోయాడు. ఒకసారి స్థానిక టెలివిజన్ మారన్ ను ఇంటర్వ్యూ చేసింది. అందులో మారన్ మాట్లాడుతూ ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. జీవితం నిరాశను ఆశ్రయించింది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను తనివితీరా వింటూ స్వస్థత పొందేవాడిని. ఆ పరంపరలో నేను కూడా బాలు పాటలు పాడుకుంటూ కాలం గడుపుతున్నాను. బాలు పాటలే నాకు వెలుగు రేఖలు’’ అని చెప్పాడు. ఈ విషయం ఎలాగో బాలు చెవిన పడింది. శ్రీలంక లో సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి బాలు అక్కడకు వెళ్లారు. మారన్ చిరునామాను సేకరించి అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మారన్ బాల్కనీలో కూర్చొని తదేకంగా పక్షుల కిలకిలారావాలను వింటూ వున్నాడు. బాలు అతని అతని భార్యకు తనెవరో చెప్పకుండా మారన్ వద్దకు వెళ్ళి అతడు కూర్చున్న కుర్చీ వెనుక నిలబడి ‘’నూరాండ గళ్ నీ వాంగవే’’ అనే ఒక పాట పల్లవి వినిపించారు. తమకంలో ఆ గానం వింటున్న మారన్ వీపు మీద చెయ్యి వేశారు బాలు. వెంటనే మారన్ ‘’ఎంతమంచి బాలు పాట గుర్తుచేస్తున్నారు. ఇంతకీ మీరెవరు?’’ అని ప్రశ్నించాడు. ‘’నేను కూడా బాల సుబ్రహ్మణ్యం లా పాడగలను. నా పేరు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం....’’ అని బాలు అంటూ వుంటే నిజాన్ని నమ్మలేని మారన్ లేచి నిలబడి ‘’నేను ఎంత అదృష్టవంతుణ్ణి. కొలిచే దైవం ఎదుట ప్రత్యక్షమైంది’’ అంటుండగా అతణ్ణి కావిలించుకొని, మరలా కుర్చీలో కూర్చుండబెట్టి బాలు కొన్ని పాటలు తను పాడుతూ, మారన్ చేత పాడిస్తూ అతణ్ణి కొన్ని గంటలసేపు అలరించారు. మారన్ కుటుంబ సభ్యులు ఆ నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. మారన్ మంచి ఫలహారం, కాఫీ ఇచ్చి బాలు కి తన కృతజ్ఞతలు తెలియజేశారు. తన ప్రత్యేక అతిథిగా మారన్ బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొని తన అభిమానాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. మానవత్వం మూర్తీభవించిన గొప్ప ‘మనీషి’ మనందరి హృదయాలను దోచుకున్న బాలు. మంచితనాన్ని మూటకట్టుకొని దేవేంద్రుని ఆస్థానంలో ఘంటసాలతో కలిసి గళం కలిపేందుకు కాస్త తొందరపడి వెళ్ళిపోయారు. బాలుకి నివాళి.... బాలు విశేష గుణసంపదకు పాదాభివందనం.*

Section 102 CrPC

 Whether Immovable Property Can Be Seized By Police Under Section 102 CrPC ?



Background of the Case :-


The premises of the petitioner's hotel were sealed invoking powers under Section 18 of the Immoral Traffic (Prevention) Act. The Trial Court had rejected the prayer for de-sealing of the restaurants, which was upheld by the High Court.In the said judgment, the High Court held that all properties whether movable or immovable could be seized by police under Section 102 of the Code.


Held :-


(1) The Supreme Court has reiterated that an immovable property cannot be seized by Police under Section 102 of the Code of Criminal Procedure.


"Furthermore, the reasoning of the High Court that immovable property can be seized under Section 102, Criminal Procedure Code, is contrary to the law declared in Nevada Properties Pvt. Ltd. vs. State of Maharashtra, 2019 SCC OnLine (SC) 1247. "


(2) "Nevada Properties Pvt. Ltd. vs. State of Maharashtra" 


In this judgment, the Supreme Court had categorically held that The police does not have the power to attach immovable property during investigation under Section 102 of the Code of Criminal Procedure. The Court held that the expression 'any property' appearing in Section 102 of the Code of Criminal Procedure would not include 'immovable property'.



In case and if we allow the police officer to 'seize' immovable property on a mere 'suspicion of the commission of any offence', it would mean and imply giving a drastic and extreme power to dispossess etc. to the police officer on a mere conjecture and surmise, that is, on suspicion, which has hitherto not been exercised, the Court had said.


Case : Downtown Temptations Pvt Ltd vs State of WB

Bench of JJ : R F Nariman and Ravindra Bhat

చదివేప్పుడు ఒక జాగ్రత్త

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 13 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu  


లలితాసహస్రనామస్తోత్రము చదివేప్పుడు ఒక జాగ్రత్త అవసరము ఉంటుంది. కొన్ని పదహారు అక్షరముల నామములు, కొన్ని ఎనిమిది అక్షరముల నామములు ఉంటాయి. వాటిని ఎక్కడా మధ్యలో ఆపడము, విరవడము చెయ్యకూడదు. నామము యొక్క అక్షరసంఖ్య ఎంతో తెలుసుకు చదవాలి.  

ఈ నామము ఎక్కడా ఆపకూడదు. ఈ బ్రహ్మాండములన్నిటినీ అమ్మవారి ఎరుపుకాంతిలో మునిగిపోయాయి. ఉద్యుద్భానుసహస్రాభా అన్నప్పుడు ఎరుపుకాంతి చెప్పలేదు కానీ ఉదయిస్తున్న సూర్యకాంతి ఎరుపని తెలుసు కాబట్టి అర్థమయింది. ఈ ఎరుపు మళ్ళీ ఎందుకు చెపుతున్నారు? మనిషి జీవయాత్రలో మలుపు తిరిగే స్థితి ఇక్కడే ఉన్నది. ఒక గమ్యమును చేరుకునేప్పుడు మలుపు ఒకటి తిరగవలసి ఉంటుంది. ఆ మలుపు తిరగడమన్నది ఎరుపు కాంతిలో ఉంటుంది. దానిని పట్టుకున్న మహాపురుషులు అత్యద్భుతమైన స్థితిలో ఆ కాంతిని దర్శించి వారు అనుభవించిన దానిని ఈ లోకమునకు అందించారు. 

ఒకవ్యక్తిలో ఉన్నప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారిందన్న విషయము ఆలోచిస్తే మలుపు తిరిగినట్టు. ఎవరి మీద రాగ ద్వేషములు ఉండవు. ఆ స్థాయికి చేరడము కొంత కష్టము. అమ్మవారి ప్రేమ సమస్త బ్రహ్మాండము అంతా పంచుతుంది. ప్రార్థనా శ్లోకములో ‘అరుణాంకరుణాంతరంగితాక్షీం’ అని చెప్పినట్టు ఆ తల్లి ఎరుపు, అమ్మ అంటే దయలోపల ఉన్న ప్రేమపైకి వ్యక్తమైతే దయాగుణము. అందులో లోకములు మునిగిపోతున్నాయి. ఆవిడ ‘ఆబ్రహ్మకీటకజనని’ అందరికీ తన ప్రేమను పంచిపెడుతుంది.  

సృష్టి చేసే బ్రహ్మగారు ఎర్రగా ఉంటారు. సృష్టి అనేది రజోగుణము అది ఎరుపుతో కూడుకుని ఉంటుంది. ఈ ఎరుపు సంసారములోకి వెళ్ళి రాగముగా నిలబడితే అది పతనావస్థకు దారి తీస్తుంది. అమ్మా! అని అమ్మవారి వైపు తిరిగి భక్తితో నిలబడినట్లయితే మోక్షము వైపు వెళతారు. ఎరుపు చిక్కబడటము తెలుపును చేరుకోవడానికి పనికి వస్తుంది. ఈశ్వరుని చేరుకోవడానికి మార్గము అవుతుందని చెప్పడము కోసము ఆ తల్లి బ్రహ్మాండములన్నిటినీ తన ఎరుపుకాంతిలో ముంచుతున్నది.

సుఖము, దుఃఖమని రెండుమాటలు ఉంటాయి. సాధారణముగా మనిషి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ అన్న ఐదింటితో సుఖము అనుభవించడము జరుగుతుంది. ఈ ఐదు తన్మాత్రలు తీసేసి ఐదుజ్ఞానేంద్రియములను మాత్రము ఉంచితే బయట ఎన్ని అందములు ఉన్నా ఏమీ తెలియదు ఏమీ సంబంధము ఉండదు. బ్రతుకు కష్టమయిపోతుంది. లోకములో సుఖమన్నమాట ఉండదు. అమ్మవారు పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుంది. బ్రహ్మాండములో అందములు పెట్టి పిండాండము అనుభవించకుండా చేస్తే అమ్మతనమునకు సంతోషము ఉండదు. ఆ అమ్మతనమునకు ఉన్న ప్రేమ రాగరంజితము. ఈ తన్మాత్రలతో పిండాండ, బ్రహ్మాండములను అనుసంధానము చేస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి ఆశ్చర్యకరముగా నడిపిస్తున్న ఎరుపుయొక్క శక్తి అని గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది. అమ్మ ఎరుపు అర్థమై సమన్వయము చేసుకోవడము క్రియాశక్తి పూర్తవడము. అమ్మవైపు తిరిగితే ముందు ఎరుపు, నాలుగుచేతులు, నాలుగు ఆయుధములు, మళ్ళీ వెనక ఎరుపు కనపడితే తప్ప తల కనపడదు. తలలోనే అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు, గెడ్డము, బుగ్గలు, చెవులు, జుట్టు అన్నీ ఉన్నాయి. మంత్రసంబంధముగా చూస్తే అది ఒక మంత్రకూటము. ఈ ఎరుపును అనుభవించి అనుసంధానము చేసుకొని వారు ఎన్నటికీ తలను చూడలేరు. అమ్మవారి కబరీబంధము దర్శనము కాదు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కలనైనా