24, ఆగస్టు 2023, గురువారం

దేవాలయాలు

 మనకు దగ్గర ఉన్న ఎన్నో దేవాలయాలు *ప్రాముఖ్యత* పొందినవి చూడ్డానికి అవ్వకుండా ఉంటున్నాయి అలాంటి దేవాలయాలు కొన్ని కొన్ని రెండు రోజుల్లో చూసి రావడానికి వీలు అయ్యేటట్టు ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేసాము


1.  *ఎర్రవరం లక్ష్మీనరసింహస్వామి* రెండవది .. *వేదాద్రి లక్ష్మి నరసింహ* *స్వామి* 

 మూడవది .. *వాడపల్లి* *లక్ష్మీనరసింహస్వామి* మరియు *ఆగస్త్య ఈశ్వరయ్య* 

నాల్గవది *యాదగిరిగుట్ట* *లక్ష్మీనరసింహస్వామి* ఈ నాలుగు కలిపి సెప్టెంబర్ రెండో తారీకు ఉదయం 6 గంటలకు బయలుదేరుదాం సెప్టెంబర్ 3 సాయంత్రం ఆదివారంకి క్లోజ్ అవుతుంది


బస్సు చార్జీలు ఉదయం కాఫీ టీ టిఫిన్ భోజనం రాత్రి అల్పాహారంతో కలిపి రూములు తో కూడా కలిపి ఒక మనిషికి 3500 టైం చాలా తక్కువ ఉన్నందున మీ సీట్లు తొందరగా రిజర్వ్ చేసుకోగలరు శ్రావణమాసం 4  లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో మరియు ఈశ్వరాలయం ఒకటి కృష్ణా నది స్థానం తొందరగా మీ సీటు రిజర్వ్ చేసుకోగలరు సంప్రదించవలసిన నెంబర్  *శ్రీమతి  యనమండ్ర* *శారద ** *924 71 60 975**

అరుణాచలం ఈ శైవక్షేత్రం

 నిత్యాన్వేషణ:


అరుణాచలం ఈ శైవక్షేత్రం గురించి వివరించండి?


మొదటి సమాధానం: 

అరుణా చలం తమిళనాడు లో ఉన్న శైవ క్షేత్రం. పంచ భూత లింగాలలో ఒకటి ఇది. అరుణాచలం లో శివుడు అగ్ని లింగంగా వెలిసాడు. అందుకే గర్భాలయం లో అర్చకులు చెమటతో తడిసి కనిపిస్తారు. అంతరాలయ దర్శనం చేసుకున్న భక్తులకు కూడా ఈ వేడి అనుభవం లోకి వస్తుంది. అరుణాచలం లో ఉన్న శివుడిని అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ స్వామి దేవేరిగా పూజలు అందుకుంటున్నది ఆపీత కుచాంబ. మిగిలిన క్షేత్రాలను దర్శిస్తే మాత్రమే పుణ్యం. కానీ అరుణాచలాన్ని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుంది. "కాశ్యాంతే మరణం ముక్తి: స్మరణాత్ అరుణాచలం" అని అంటారు. కాశీ లో మరణిస్తే ముక్తి కానీ అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుంది. తమిళం లో ఈ క్షేత్రాన్ని 'తిరువణ్ణామలై' అని పిలుస్తారు. అరుణాచలం అనే కొండ వుండడం వలన ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. ఇది ఒక వైపు నుంచి చూస్తే నంది ఆకారం లో కనిపిస్తుంది. ఇది విశ్వానికి మేరువు గా వ్యవహరిస్తుంది అని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఈ అరుణాచలం కొండ లో మేధో దక్షిణామూర్తి కొద్ది మందికి దర్శనం ఇస్తారు అని కూడా చెపుతారు. కార్తీక దీపోత్సవానికి అరుణాచలం ప్రసిద్ది. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల క్షేత్ర వీధులు క్రిక్కిరిసి కనిపిస్తాయి. చాలా మంది సిద్ద పురుషులు నేటికీ ఇక్కడ కనిపిస్తారు. అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రమణ మహర్షి ని సూదంటు రాయి లాగా ఆకర్షించిన క్షేత్రం ఇది. అప్పట్లో రమణు మహర్షి కూడా గిరి ప్రదక్షిణ తరచూ చేసేవారు. ఇక్కడ రమణాశ్రమం ఉంది. ఇక్కడ గదులు కూడా దొరుకుతాయి. ఈ రమణాశ్రమం సాధకులను సిద్ధ స్థితి కి తీసుకుపోగల ప్రసిద్ద ప్రదేశం. పాల్ బ్రంటన్ లాంటి విదేశీయులు రమణ మహర్షిని సందర్శించారు. పాల్ బ్రంటన్ Search in Secret India అనే పుస్తకం రచించాడు. వీలైతే చదవండి. తెలుగు అనువాదం కూడా దొరుకుతుంది. చలం జీవితం మలి దశలో రమణాశ్రమం లోనే ఉన్నారు. రమణాశ్రమం పక్కనే ఉన్న శేషాద్రి స్వామి అనే సిద్ధ పురుషుడి సమాధిని కూడా దర్శిస్తే మంచిది. "అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అమర శివ" అనుకుంటూ అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు పరిహారం అవుతాయి. తిరుపతి కి వెళ్ళే యాత్రికులు, చిత్తూర్ నుంచి వేలూర్ మీదుగా అరుణాచలం వెళ్ళవచ్చు. "న ఋణం న చలం అరుణాచలం" అని ఆర్యోక్తి. అరుణాచలం వెళితే మీకున్న అన్నీ ఋణాలూ తీరిపోయి, మీ బుద్ధి నిశ్చలం గా మారి సిద్ది వస్తుంది.

-    G L N Prasad,    21-05-23

రెండవ సమాధానం


ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. ఒకసారి దేవతలు పరమశివుని అడిగారు మోక్షం ఎలా వస్తుంది స్వామి అని. దానికి ఆయన, '"దర్శనాత్ అప్రసదశి, జననాత్కమలాలయే, కాస్యాంతు మరణాన్ముక్తిహి, స్మరనాత్ అరుణాచలే'". అంటే, "అంతటా శివుడే అన్న భక్తితో చిదంబరాన్ని దర్శిస్తే మోక్షం, తిరువారూరులో పుడితే మోక్షం, కాశీలో మరణిస్తే మోక్షం, అరుణాచలంలో స్మరిస్తే చాలు మోక్షం". అంత పవిత్రమైనది అరుణాచల క్షేత్రం. పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షణ చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది.

చూడండి. వేదామృత స్పిరిచువల్ ఛానల్

- శ్రీనివాస్ 20-07-23

మూడవసమాధానం:


అరుణాచలం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్ర శైవ పుణ్యక్షేత్రం. ఇది చెన్నై నగరానికి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణ్ణామలై పట్టణంలో ఉంది.

అరుణాచలం భారతదేశంలోని అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన శైవ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది 2,000 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని నమ్ముతారు. ఈ ఆలయం హిందూ మతం యొక్క ప్రధాన దేవుళ్ళలో ఒకరైన శివునికి అంకితం చేయబడింది. ఇది భారతదేశంలోని ఐదు ప్రధాన శైవ పవిత్ర ప్రదేశాలలో ఒకటి.

"అరుణాచలం" అనే పేరుకు "ఎర్రని పర్వతం" అని అర్ధం, ఇది తిరువణ్ణామలై పట్టణంలో ఆధిపత్యం వహించే పవిత్ర కొండను సూచిస్తుంది. ఈ కొండ శివుని యొక్క ఆవిర్భాగం అని నమ్ముతారు. ఇది శివుని శక్తి మరియు దయ గుణములకు పవిత్ర చిహ్నంగా గౌరవించబడుతుంది. ఆలయ సముదాయం కొండ దిగువన ఉంది ఇక్కడ అనేక మందిరాలు ఉన్నాయి, అందులోని ప్రతి ఒక్క దేవాలయం, శివుని యొక్క విభిన్న కోణానికి అంకితం చేయబడి ఉంటుంది.

అరుణాచలంలో అత్యంత ముఖ్యమైన ఆకృతులలో ఒకటి అన్నమలైయర్ ఆలయం, ఇందులో శివుని సృజనాత్మక శక్తికి చిహ్నంగా లింగం ఉంది. ఈ ఆలయంలో అనేక ఇతర ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి, ఇందులో శివుని స్త్రీ శక్తికి సంబంధించిన అంశంగా విశ్వసించబడే దైవిక తల్లి అయిన దేవి మందిరం కూడా ఉంది.

అరుణాచలం వార్షిక పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇది తమిళ మాసం కార్తీకైలో జరుగుతుంది, ఇది నవంబర్ లేదా డిసెంబర్‌లో వస్తుంది. పండుగ సందర్భంగా, ఆలయం వేలాది దీపాలతో అలంకరించబడుతుంది. భారతదేశం నలుమూలల నుండి భక్తులు తమ ప్రార్థనలు మరియు వేడుకలలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తారు.

మొత్తంమీద, అరుణాచలం శైవ మతం అనుచరులకు గొప్ప గౌరవమును ఇస్తుంది మరియు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.

అన్నామలైయార్ ఆలయంతో పాటు, అరుణాచలం దాని సముదాయంలో అనేక ఇతర ముఖ్యమైన దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలను కూడా కలిగి ఉంది. శివుని భార్య అయిన పార్వతి దేవతకి అంకితం చేయబడిన ఉన్నములై అమ్మన్ ఆలయం, భవన సముదాయంలోని పురాతన కట్టడాల్లో ఒకటిగా భావించే తిరువణ్ణామలై ఆలయం కూడా వీటిలో ఉంది.

అరుణాచలం ప్రత్యేకతలలో ఒకటి గిరివాళం, ఈ పవిత్రమైన కొండకు ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి సమయంలో కొండ చుట్టూ నడవడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. చాలా మంది యాత్రికులు ఈ ప్రదక్షిణ అభ్యాసాన్ని భక్తితో చేస్తారు.

అరుణాచలానికి గొప్ప చరిత్ర మరియు పురాణ కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, అరుణాచలం కొండ, శివుడు అగ్ని స్తంభ రూపంలో కనిపించిన ప్రదేశం, దీనిని అరుణాచల లింగం అని పిలుస్తారు. 20వ శతాబ్దం ప్రారంభంలో తిరువణ్ణామలై పట్టణంలో నివసించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షితో సహా అనేక మంది సాధువులు మరియు రుషులు ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించారని నమ్ముతారు.

నేడు, అరుణాచలం శైవమతం యొక్క అనుచరులకు, అలాగే భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పర్యాటకులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొనసాగుతోంది. ఈ ఆలయ సముదాయం తమిళనాడు ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది మరియు సంవత్సరం పొడవునా సందర్శకులకు తెరిచి ఉంటుంది.

వెఱ్ఱివాళ్ళకిందే


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*_జ్ఞాన తత్త్వస్య లోకోయం*

*జడోన్మత పిశాచివత్_*

*_జ్ఞాన తత్త్వోపి లోకస్య* 

*జడోన్మత్త పిశాచివత్_*


𝕝𝕝తా𝕝𝕝

మిథ్యా ప్రపంచాన్ని అర్థం చేసుకొన్న జ్ఞానికి లోకం వెఱ్ఱివాళ్ళమయమని అనిపిస్తే....మరి మొదటినుండి  తత్త్వజ్ఞానులు అందరినీ వెఱ్ఱివాళ్ళకిందే జమకట్టింది ఈ మాయాలోకం.

Pesara pachade


 

Kasi


 

శ్రీ కాళహస్తీశ్వర శతకం - 74

 🌸<*



శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 74




ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ:

ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ

బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం

జాలుఁజాలుఁగవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో

చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!




తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! 

నావంటి కవులు తమ పరిమితమగు బుద్ధి శక్తి తో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము చాలు చాలును.


సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా...



ఓం నమః శివాయ


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

23, ఆగస్టు 2023, బుధవారం

Jai ganesh



 

Sambaar







 

Siva


 

సత్యనారాయణ స్వామి వ్రత కధల

 💐💐💐సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం 💐💐💐💐


మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. 


ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.


1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు. 


ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.


2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.


౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.

ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.


4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది. 

పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.


5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు.

 

💐 కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం.💐


1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు.


2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.


3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.


4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.


5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది. 

ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి.