2, అక్టోబర్ 2023, సోమవారం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - తృతీయ -   భరణి -  ఇందువాసరే* *(02-10-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/qW183jlFWHA?si=ND5UeSoEFaJXVcuG


🙏🙏

భక్తిసుధ

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_*


*వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం౹*

*వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం౹*

*వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం౹* 

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


*శివస్తుతి - 1*

ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

పరమేశ్వర స్తుతికి భాషా భేదాలు లేవు



పరమేశ్వర  స్తుతికి  భాషా భేదాలు లేవు


                

               ఉ:  హెడ్డున  మూను , స్కిన్నుపయి  నెంతయు  డస్టును, ఫైరు నేత్రమున్ ,


                      సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని  గాంజెసు    హైరు లోపలన్ ,


                      బాడికి  హాఫెయౌచు  నలపార్వతి ,  మౌంటెను   డాటరుండ ,   ఐ


                       షుడ్డు  డివోటు ,దండములు   సోకగ  ప్రేయరు సేతు  నెప్పుడున్;


                                      ఆదిభట్ల నారాయణ  దాసుగారు.


                    బహు భాషా  కోవిదులైన  దాసుగారు  పరమేశ్వరుని  మణిప్రవాళ  శైలిలో  యీవిధంగా  నుతించారు. ఇందులో  ఆంగ్లపదాలను బహురమ్యంగా  తెలుగు పదాలకు జోడించి  తమభాషాచాతుర్యాన్ని  ప్రకటించారు.


                      సిరసున  చంద్రుడు , శరీరమునభస్మము , అగ్ని నేత్రము ,(మూడవకన్ను)  వాహనంగా నంది. తలపై గంగ , అర్ధనారీశ్వరియై పార్వతి. (హిమవంతుని పుత్రి) నేను ఒరుల నేల తలచెదను  శంకరునకే  నమస్కృతులు  చేసి  ప్రార్ధింతును.

అనిదీని భావము. 


                    ఇలా అన్సభాషాపదాలను తెలుగు పదాలతోకలిపి వ్రాయటం  శివకవులతో ప్రారంభమైనది.పాల్కురికి సోమనాధుడే

ఈవిధానమునకు ఆద్యుడు. తరువాత తరువాత తక్కిన కవులందరూ ఈపద్దతిని అనుసరిస్తూ  ఈవిధానానికి  "మణిప్రవాళశైలియని" పేరు నిర్దేశించారు.


                                                  బాగుందికదా  తరువాత  మరికొన్ని!


                                                                        స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🙏🌷🌷🌷

సుభాషితమ్

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


*వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం౹*

*వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం౹* 

*వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 


శివస్తుతి - 2


జగత్తు అంతా విహరించే వాడు, సాటి లేని వాడు, అంధకాసురుని నాశనము చేసిన వాడు, దేవతలలో ఉత్తమమైన వాడు, చంద్రుని ధరించిన వాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు, నాగరాజు ఆభరణములుగా కలవాడు, చిదానందుడు, శుద్ధ ప్రకాశుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

⚜ శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 195


⚜ ఢిల్లీ : మయూర్ విహార్ ఫేజ్-1


⚜ శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ ఆలయం


💠 ఇది తూర్పు ఢిల్లీలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి పశ్చిమం వైపు ఉన్న అరుదైన విష్ణు దేవాలయాలలో ఒకటి. 

అంతేకాకుండా, శివుడు, గణపతి, అయ్యప్ప, చొట్టనిక్కర భగవతి (దేవి), మరియు నాగదేవత ఉత్తర గురువాయూరప్పన్ ఆలయంలో పూజించబడే ఇతర దేవతలు.


💠 శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ దేవాలయం, మయూర్ విహార్, తూర్పు ఢిల్లీలో ఉన్న ఒక ప్రధాన పుణ్యక్షేత్రం.

1983లో ప్రారంభమైనప్పటి నుండి రాజధాని నగరం మరియు పొరుగు ప్రాంతాల నివాసితులకు సేవలను అందిస్తోంది. 

ఈ ఆలయం కేవలం మతపరమైన కార్యక్రమాలను ప్రోత్సహించడమే కాకుండా సమాజం యొక్క సామాజిక-సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి కేంద్రంగా కూడా పనిచేస్తుంది.


⚜ శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ అంటే ఎవరు?


💠 ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ గురువాయూరప్పన్ (విష్ణువు).

గురువాయూరప్పన్ చిన్నశిశువు రూపంలో శ్రీ కృష్ణుడిగా పూజించబడ్డాడు మరియు గురువాయూర్ ఉన్నికణ్ణన్ (గురువాయూర్ చిన్ని కృష్ణ) అని పిలుస్తారు. 


💠 గురువాయూరప్పన్ అంటే గురువాయూర్ ప్రభువు అనే పదం గురు అనే పదం నుండి వచ్చింది.

ఇది దేవతల గురువైన గురు బృహస్పతిని సూచిస్తుంది, వాయు అంటే గాలి మరియు అప్పన్ అంటే దేవత, అంటే మలయాళంలో 'తండ్రి' లేదా 'ప్రభువు'.  

గురుడు మరియు వాయువు కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించారు కాబట్టి, దేవుడికి గురువాయూరప్పన్ అని పేరు పెట్టారు.


💠 ఈ విగ్రహం పాతాళ అంజనం లేదా నల్ల బిస్మత్ అని పిలువబడే రాతితో తయారు చేయబడింది మరియు పాంచజన్య (శంఖం), సుదర్శన చక్రం, కౌమోదకి (గద్దె) , మరియు పద్మo (కమలం) పట్టుకొని నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది.


💠 శ్రీ ఉత్తర గురువాయూరప్పన్ ఆలయ నిర్మాణం కేరళ శైలిలో విలక్షణమైనది.  

ప్రధాన కృష్ణ దేవాలయం కాకుండా, ఈ ఆలయంలో  గణపతి, శివుడు మరియు అయ్యప్పలకు చిన్న ఉప ఆలయాలు మరియు సర్ప దేవతలకు చిన్న ఉపాలయాలు కలవు.


💠 ఢిల్లీలోని భక్తుల బృందం కోరిక మేరకు, ఆర్ష ధర్మ పరిషత్ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేశారు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA).

1975 సంవత్సరంలో, జనక్‌పురిలో ఆలయ నిర్మాణం కోసం ఒక స్థలాన్ని కేటాయించింది.  అయితే, జ్యోతిష్య కారణాల వల్ల జనక్‌పురిలో కేటాయించిన స్థలంలో ఆలయాన్ని నిర్మించలేకపోయారు. 

తదనంతరం, మయూర్ విహార్ ఫేజ్-1లో శ్రీకృష్ణ మందిర్ సమాజం పేరుతో భక్తుల చొరవతో భూమి కేటాయింపు మయూర్ విహార్ ఫేజ్-1కి బదిలీ చేయబడింది.


💠 వాస్తవానికి, ఆ తర్వాత జరిగిన సంఘటనల విధానం మరియు క్రమంలో ప్రభువు చిత్తం చాలా స్పష్టంగా కనిపించింది. యమునా తీరానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఈ దేవాలయం కావాలని భగవంతుడు స్వయంగా నిర్ణయించుకున్నట్లుగా ఉంది. 

ఇంకా, తూర్పు వైపు చూసే సంప్రదాయ ఆలయ శాస్త్రానికి బదులు యమునా వైపు చూసేందుకు విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉన్న కొన్ని విష్ణు దేవాలయాలలో ఇది ఒకటి.


💠 బాలాలయాన్ని 1983 ఏప్రిల్ 8వ తేదీన కేరళ నుండి తెప్పించిన భగవాన్ గురువాయూరప్పన్ దివ్య విగ్రహంతో ప్రొ.వేజపరంబు పరమేశ్వరన్ నంబూద్రిపాడ్ ప్రతిష్ఠించారు. 

ప్రముఖ ఆలయ వాస్తుశిల్పి ప్రొఫెసర్ వేజాపరంబు పరమేశ్వరన్ నంబూద్రిపాడ్ ప్రస్తుత ఆలయాన్ని రూపొందించారు. 

అతని సమర్థ మార్గదర్శకత్వంలో, బ్రహ్మమంగళం సుబ్రమణియన్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. 

గర్భ గృహం కోసం శంకుస్థాపన చేసిన కంచి కామకోటి పీఠాధీశ్వరులు.. పవిత్ర జగద్గురువులు జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు 2 అక్టోబరు 1986న గురువాయూరప్పన్ దివ్య విగ్రహం ప్రతిష్టించారు


💠ఈ ఆలయం తూర్పు లేదా పడమర రెండు వైపులా రెండు గోపురాలతో కేరళ శైలిలో నిర్మించబడింది. 

గర్భ గ్రహం రెండు భాగాలుగా విభజించబడింది, ఒకటి శ్రీకృష్ణుడి కోసం మరియు మరొకటి భగవతి దేవి కోసం. 

ప్రొ.వేజాపరంబు పరమేశ్వరన్ నంబూద్రిపాద్ ఆలయ వాస్తుశిల్పి.


💠 ఈ ఆలయంలో ప్రధానంగా  శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ కృష్ణ  జన్మాష్టమి జరుపుకుంటారు . 

ఈ పండుగను భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మహా శివరాత్రి కూడా వేద మంత్రాలతో జరుపుకుంటారు.

ఈ ప్రధాన పండుగలతో పాటు అనేక ఇతర పండుగలు గురువాయూరప్పన్ ఆలయంలో జరుపుకుంటారు.


💠 ఈ పండుగల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 

 ఈ ఆలయాన్ని ఢిల్లీలోని మలయాళీ మరియు తమిళ సమాజాలు అత్యంత గౌరవిస్తారు.


⚜సామాజిక కార్యకలాపాలు :


ఆహారం - 

ఆలయ నిర్వహణలో నిరుపేద ప్రజలకు ఆలయం రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.


విద్య - 

నిరుపేదలు మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆలయ నిర్వహణ ద్వారా స్కాలర్‌షిప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.


వైద్యం – 

నిరుపేద రోగుల కోసం దేవస్థానంచే ఉచిత వైద్య సౌకర్యం కలదు.


💠 వేసవికాలం: 5:30 AM నుండి 11:00 AM వరకు; 6:00 PM నుండి 9:00 PM వరకు

శీతాకాలం: 5:30 AM నుండి 11:00 AM వరకు; 5:30 PM నుండి 8:30 PM వరకు.

Panchaag


 

Photo

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 40*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 40*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*తటిత్వన్తం శక్త్యా తిమిర పరిపన్థి స్ఫురణయా*

*స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేన్ద్రధనుషమ్ |*

*తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం*

*నిషేవే వర్షన్తం హరమిహిరతప్తం త్రిభువనమ్ ‖*


ఇప్పుడు మణిపూర చక్రానికి వచ్చారు. ఇది జలతత్త్వ చక్రం. శంకరులు అంటున్నారు..


తవ శ్యామం మేఘం = శివ స్వరూపం ఇక్కడ నీలమేఘం వలె ఉందట.


తటిత్వన్తం శక్త్యా = అమ్మవారేమో మెరుపుతీగ వలె ఉందట. ఆమె ఇంకా..


తిమిర పరిపన్థి స్ఫురణయా = చీకట్లను పారద్రోలే కాంతి వలెనూ


స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేన్ద్రధనుషమ్ = నానా రత్నాభరణముల ప్రకాశము వలె, ఇంద్రధనస్సు వలె ఉన్నారట. 

మణిపూర శబ్దంలోనే మణులు వున్నాయి కదా! అవి వెలుగులు చిమ్ముతూ ఉంటాయి.


చమత్కారం గమనించండి శివుడు నీలమేఘం వలె ఉంటే, అమ్మవారు ఆయనను విడవకుండా మెరుపుతీగ వలె కలిసి ఉన్నారట. మేఘము జలతత్త్వమయితే, మెరుపుతీగ అగ్నితత్త్వం. రెండూ ఉంటే వర్షం. ఇక్కడ శివ, శక్తుల సమయాచారం చెప్పారు. అలాగే *అగ్నీషోమ తత్త్వం* కూడా దృష్టికి తెస్తున్నారు. ఈ అగ్నీషోమ తత్త్వం  అంతర్యాగానికి చెప్పే మాట. లఘువుగా పరమాత్మ జీవాత్మ సంయోగమునకు సమన్వయమునకు సంకేతముగా చెప్పవచ్చు.


హరమిహిరతప్తం త్రిభువనమ్ నిషేవే వర్షంతం = హరుడు/శివుడు వేడెక్కించిన భూమిని నీవు వర్షంతో చల్లబరుస్తున్నావమ్మా. *భవదా వసుధా వృష్టిః పాపారణ్య దవానలా* అమ్మవారి నామాల్లో ఒకటి.


అగ్ని తత్త్వం తరువాత జలతత్త్వం.వేసవి తరువాత వర్ష కాలం వలె. ఇక్కడ స్వామి అమృతేశ్వరుడని, అమ్మవారు అమృతాంబ అనీ పిలువబడతారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సోమవారం, అక్టోబరు 2, 2023*

 శుభోదయం, పంచాంగం                卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*సోమవారం, అక్టోబరు 2, 2023*

  *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

  *దక్షిణాయనం - వర్ష ఋతువు*

  *భాద్రపద మాసం - బహళ పక్షం*

తిథి  తదియ* ఉ10.42 వరకు  

వారం  సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం *భరణి* రా10.34 వరకు

యోగం : *హర్షణం* మ3.12 వరకు

కరణం  : *విష్ఠి* ఉ10.42 వరకు  తదుపరి *బవ* రా10.10 వరకు

వర్జ్యం  *ఉ8.31 - 10.04* 

దుర్ముహూర్తము : *మ12.14 - 1.02*  

 మ2.37 - 3.25*                   

అమృతకాలం    : *సా5.52 - 7.26* 

రాహుకాలం ఉ7.30 - 8.00*

యమగండ/కేతుకాలం :ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *5.54* || సూర్యాస్తమయం: *5.48*

👉 *మహాభరణి,  సంకష్టహర చతుర్థీ*సర్వేజనా సుఖినో భవంతు

చరిత్ర పాఠాల్లో చొప్పించినవే..

 చమర్/మాదిగ  అంటే ఎవరు?? దళితుడా? వీరాదివీరుడైన క్షత్రియుడా??

చమర్/మాదిగ అంటే దళితుడు కాదు..తనను మతం మారమని హింసించిన మొఘలులను అణిచివేసి తన సనాతన ధర్మాన్ని  వదులుకోని సనాతనధర్మ రక్షకుడు..

భారతదేశంలో చమర్ అని పిలవబడే కులం వాస్తవానికి ' చన్వర్ ' వంశానికి చెందిన క్షత్రియ కులం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు.

మహాభారతంలోని కూడా ఈ వంశం ప్రస్తావించబడింది.. 

హిందూ కుల వ్యవస్థను క్రూరంగా, వివక్షగా మార్చిన వారు హిందువులు కాదు..మార్చిన వారు విదేశీ దురాక్రమణదారులు!..

టర్కీ దాకా భారతదేశ సరిహద్దులు ఉండి..టర్కీని సైతం పరిపాలించిన శతాబ్దంలో ఈ రాజవంశం భారతదేశ పశ్చిమ ప్రాంతంలో పరిపాలించింది..

ఆ సమయంలో చన్వర్ సేన్ వారి మహారాజు..

ఈ రాజ కుటుంబానికి బప్పా రావల్ వంశంతో వివాహ సంబంధాలున్నాయి..

రానా సంగ మరియు అతని భార్య జాలి రాణి చన్వర్ వంశానికి చెందిన సంత్ రైదాస్జీ ని మేవార్ రాజగురుగా చేశారు..

చిట్టోడ్ కోటలో ప్రార్థన చేసేవారు..చేయించేవారు.. నాటి సమాజంలో చమార్ అని పిలవబడే వారు చరిత్రలో ఎక్కడా ప్రస్తావించబడలేదు..

చమర్ అనే పదం మొదట వాడినది సికందర్ లోడి.

హిందూ సంత్ రవిదాస్ కీర్తిప్రతిష్టలు..సమాజం మీద ఆయన ప్రభావం పెరగడం చూసి మొఘల్ పాలకులు భయపడ్డారు..

సంత్ రవిదాస్ ను ముస్లిం గా మార్చడానికి సద్నా కసాయి వాడిని సికందర్ లోడి పంపాడు..సంత్ రవిదాస్ ఇస్లాం స్వీకరిస్తే భారతదేశంలోని అధిక సంఖ్యలో హిందువులు ఇస్లాం స్వీకరిస్తారని అతనికి కుట్ర..

కానీ సంత్ రవిదాస్ ను ఇస్లాంలోకి మార్చడానికి పంపిన సద్నా హిందూత్వం పట్ల ఆకర్షితుడై అతను హిందుత్వ మార్గంలోకి వచ్చేశాడు.. సద్నా కసాయి పేరు నుంచి  అతని పేరు రామదాస్ అయింది. సాధువులు ఇద్దరూ కలిసి హిందూ మత ప్రచారంలో నిమగ్నమయ్యారు. దాని ఫలితంగా సికందర్ లోడి కి  కోపం వచ్చి తన అనుచరులను అవమానించడానికి మొదటిసారి చమర్ అనే పదాన్ని ఉపయోగించాడు.

వారు సంత్ రవిదాస్ ను జైలులో పెట్టారు.. అక్కడ ఆయనచేత పశువుల చర్మం వలవడం..చర్మం సాపు కొట్టడం..బూట్లు తయారు చేయడం మొదలైన వాటి పనిని వారు బలవంతంగా చేయించారు.. ఆయన్ను ముస్లింగా మార్చడానికి చాలా ఫిజికల్ టార్చర్ పెట్టారు..కానీ సంత్ రవిదాస్ అన్నారు :-

"వేద మతమే అతి పెద్దవిశిష్టమైన నిజ జ్ఞానం.. అంత పవిత్రమైన ధర్మాన్ని నేనెందుకు వదలాలి.. మీరు అబద్ధ ఖురాన్ చదవకండి..వేద ధర్మాన్ని..ప్రపంచ సౌభాగ్యాన్ని కోరుకునే సనాతన మతాన్ని వదలకండని ఆయన నినదించాడు '..

వేధింపులు భరించినప్పటికీ తమ వైదిక మతంపై దృఢంగా ఉండి, తమ అనుచరులను..తమ వారసులు మతమ మారకుండా కాపాడుకున్నారు..

మన గొప్ప రవిదాస్ తన జీవితాన్ని మొత్తం ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి అర్పించినారు.. తర్వాత కాలంలో  చన్వర్ వంశ వీరులు ఢిల్లీని చుట్టుముట్టారు.. సికందర్ లోడి గత్యంతరం లేని పరిస్తితుల్లో సంత్ రవిదాస్ ను విడిచిపెట్టారు..

సంత్ రవిదాస్ చైత్ర శుక్లా చతుర్ధశి ఆదివారం నాడు చిత్తూరులో పరమపదించారు..

వారు నేడు మన మధ్య లేరు కానీ వారి జ్ఞాపకం వారి ఆదర్శాలను అనుసరించేలా ప్రేరేపిస్తుంది, వారి జీవితాలు నేటికీ సమాజానికి సంరక్షణ కల్పిస్తుంది..

ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ రోజున ఉన్న చమర్ కులం లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని దారుణాలు భరించిన ఈ వంశ హిందువులు తమ మతాన్ని జాతి హితం కోసం వదలలేదు..

నేడు భారతీయులు వామపక్షవాదులు..బ్రిటిష్ వాడు రాయించిన చరిత్రను ఎక్కువగా నమ్ముతారు.. ఇలాంటి సలీంషాహి బూట్లు నాకే చరిత్రకారులను..

వారు వ్యాప్తి చేసిన వైరాగ్యం తెలుసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలి..

నిజానికి ఈ రోజు హిందూ సమాజం బ్రతికి ఉంది అంటే ఈ వంశ వీరులు చేసిన అతిపెద్ద త్యాగఫలమే..

నాటి సమాజంలో  హీనమైన పని చేయడానికి ఒప్పుకున్నారే గాని ఇస్లాం స్వీకరించలేదు.. ఆ సమయంలో వారు ఇస్లాంను స్వీకరిస్తే వాళ్ళ రాజ్యాలు పోయేవికావు..అలాగే సమాజంలో తమ క్షత్రియ హోదాకూడా కాపాడబడేది..

అవసరమైతే మరణాన్ని సైతం స్వీకరించడానికి సిద్దపడ్డారే కానీ సనాతన ధర్మాన్ని వదులుకోలేదు..

ఈ చన్వర్ వంశ వీరులు తమ మతాన్ని కాపాడటానికి పందులను సైతం పెంచడానికి ఒప్పుకున్నారు కానీ ముస్లిం మతాన్ని మాత్రం ఒప్పుకోలేదు..

మన చమర్/మాదిగ సోదరులకు ప్రణామం చేద్దాం..

గమనిక :- హిందూ సమాజంలో అంటరాని తనం..వివక్ష..అధిక-నీచ భావం లేదు..

ఈwe దుశ్చర్యలన్నీ ముస్లింల దండయాత్ర, ఇంగ్లీష్ ఆక్రమణ..అద్దె మైకు  వామపక్ష మరియు హిందూ వ్యతిరేక చరిత్రకారులు మన చరిత్ర పాఠాల్లో చొప్పించినవే..




Avvaru Srinivasa Rao.