19, ఆగస్టు 2020, బుధవారం

భగవద్గీత


(నాకు నేనే శత్రువు ! నాకు నేనే మిత్రుడు!).....
....
మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
.
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
.
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
.
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
.
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
.
 తరువాత?
.
 మెసపొటేమియా!
.
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
.
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
.
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
.
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,

రా! నా ప్రక్కన పడుకో!
.
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!
.
అని అడిగాడు!..డియోజినస్.
.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
.
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు!
.
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
.
Life style disorders అని పేరు పెట్టుకున్నాం!
.
ఒక మనిషికి ఎంతకావాలి?
.
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా?
.
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!...
.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
.
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
.
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
.
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
.
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
.
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
.
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
.
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
.
That path is as sharp as Razor's edge.....
.
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
.
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
.
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
.
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
.
అని ఎంత అనునయంగా చెపుతున్నారో పరమాత్మ!
..
ఉద్ధరేదాత్మనాత్మానామ్ నాత్మనమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః......
.
భగవద్గీత చదవండి ! చదివించండి!
...

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: