23, ఆగస్టు 2021, సోమవారం

అతిగా ఆలోచించడం వలనే

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴ఇహలోక బంధాలు, వాటి వలన కలుగు సుఖములు గురించి అతిగా ఆలోచించడం వలనే మానవుడు మనశ్శాంతిని కోల్పోతున్నాడు. మనశ్శాంతి మానవుని సహజ సంపద. అది పుట్టుకతోనే ఉంటున్నది. కానీ వయసు పెరుగుతున్న కొలది 'నేను, నాది' అనే అహంకార, మమకార, అనురాగాలు పెంచుకోవడం మూలానా అది క్రమేపి తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా మనిషి నిరంతరం ఏదో ఓ చింతతో బాధపడుతూ ఉంటుంటాడు. కడుపు నిండినంత చాలు ఆకలి తీరడానికి. అంతకు మించి ఎక్కువైతే మనకే ప్రమాదం. బంధుమిత్రులకు  చేయగలిగినంత చేయండి. వారి బుుణబంధ విముక్తికి అవి చాలు. ఈ బంధాలు గురించి ఎంత తక్కువుగా ఆలోచిస్తే అంత మనశ్శాంతి అన్న విషయం మరువకూడదు.🌴_* 

కామెంట్‌లు లేవు: