1, అక్టోబర్ 2021, శుక్రవారం

రఘుపతి వెంకటరత్నం నాయుడు

 *గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి* బ్రహ్మ సమాజానికి ఆద్యుడు అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గొప్ప సంఘ సంస్కర్త అని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంగం ఆధ్వర్యంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి ఘనంగా జరిగింది. డాక్టర్ శిరీష మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్యావ్యాప్తికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు సహచరుడైన నాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే లను ఆదర్శంగా తీసుకుని విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 19o4 లో పి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలు అందించారన్నారు. 1911 లో ఆ కళాశాలలో కో ఎడ్యుకేషన్ ప్రారంభించారు అని అన్నారు. బ్రహ్మ సమాజాన్ని కూడా నాయుడే స్థాపించారని డాక్టర్ శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు ,సుబ్రహ్మణ్యం, బాపిరాజు, తదితర వాకర్స్ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: