15, జులై 2022, శుక్రవారం

లక్ష్మీదేవికి అభయమిచ్చిన విష్ణుమూర్తి*🌹

 🙏🌹 *లక్ష్మీదేవికి అభయమిచ్చిన విష్ణుమూర్తి*🌹🙏


🌹లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణు వేడుకుంది.స్వామి! మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడి తనం ఎక్కువ. కొంచం సంపద చేతిలో ఉంటేచాలు నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా? సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను కనికరించండి అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. 🌹


🌹దేవీ! నువ్వు భయపడకు. నీకు తోడుగా ఐదుగురుని పంపుతున్నాను. 

వారు వరుసగా 1. ధర్మం, 2. రాజు, 3. అగ్ని, 4.దొంగ. 5. రోగం


ఈఐదుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు.ధర్మంగా సంపాదించి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతోకాలం ఉండవు. తాత్కాలికంగా ఆపదలు కలిగినా అవి వారిని ఏమిచేయలేవు. వారు ఆచరించిన ధర్మమే వారిని నిలబెడుతుంది. 🌹


🌹ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో! ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలో సంపదను హరిస్తారు. లేక దొంగ రూపంలో వచ్చి వాడి సంపద సర్వం దోచుకొని పోతాడు. 


ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకి, రొష్టులకి తగలబెట్టేస్తారు. వీడి బాధను భరించలేక బంధువులు గాని, ఇంట్లో వారు గాని బయటికి త్రోసేయవచ్చు. లేదా చంపెసేయవచ్చు. 🌹


🌹ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 5 కూడా ఒక్కోసారి ఒక్కసారిగా పట్టేయవచ్చు. అది వాడు చేసిన అధర్మం వలన ఆయా నిమిత్తాలు వాడిని పట్టుకుంటాయి.కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. 


ధర్మం తప్పిననాడు ఈ ఐదుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. ఆనాటి నుండి ధర్మం మార్గం విడిచి అధర్మమార్గంలో నడిచేవారికి ఐదుగురు ఆపదలు సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపద కలగకుండా రక్షిస్తున్నారు.


                 🌷 *సేకరణ*🌷

           🌹🌷🌹🌷🌷🌹

                    *న్యాయపతి*

                 *నరసింహా రావు*

🙏🌴🎋🌾🌹🛕🌹🌾🎋🌴🙏

కామెంట్‌లు లేవు: