24, అక్టోబర్ 2022, సోమవారం

దీపావళి

 🌴🕯️🪔🌹🛕🌹🪔🕯️🌴

*


_*దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలు ఏమిటి ?*_


*ధన్వంతరి త్రయోదశి*


వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు *'ఆయుర్వేదానికి,* ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన *'ధన్వంతరీభగవాన్'* జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.


*నరక చతుర్దశి*


నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము ) ను పాలించే *'నరకుడు'* నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు , కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు ( రాచకన్యలు ) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ ( భూదేవీ అవతారం )తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి ( సత్యభామ ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది *'నరక చతుర్దశి'.*


*దీపావళి*


రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.


*బలిపాఢ్యమి*


వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని *'మూడు అడుగుల'* నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి , *'ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై'* అన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.


*యమద్వితీయ*


సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని ( జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ , మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.


గ్రహణానికి ముందు,  గ్రహణ సమయంలో,  గ్రహణం పూర్తి అయ్యాక పాటించవలసిన నియమములు ఏమిటి? 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


గ్రహణం అనగా పట్టుకోవడం.  సూర్యుడిని లేదా చంద్రుడ్ని, రాహువు లేదా కేతువు పట్టుకుంటే దానిని సూర్య లేదా చంద్రగ్రహణం అంటారు. ఆ సమయంలో సూర్యుడిని లేదా చంద్రుడిని  రక్షించడానికి, తగినబలం వారికి ఇవ్వడానికి  సకల దేవతలు వెళతారు. అందుకే ఇక్కడ ఉన్న ఆలయాలలో దేవతలు ఉండరు. ఆలయాలు  మూసేస్తారు. ఆ సమయంలో చేసే జపం వల్ల దేవతలకు బలం చేకూరుతుంది. వారిని రక్షిస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల దేవతలు మనకు అక్షయ ఫలితాన్ని ఇస్తారు. 



*1.*  గ్రహణానికి ముందు పట్టు స్నానము చేయాలి

*2.*  గ్రహణం పూర్తి అయ్యాక విడుపు స్నానము చేయాలి.

*3.* గ్రహణ సమయంలో గురువు గారి ఉపదేశం ఉన్నవారు మంత్ర జపం చేయాలి,  ఉపదేశం లేని వారు భగవన్నామ స్మరణ చేయాలి. 

*4.* ఈ సమయంలో వీలయినంత వరకు ప్రయాణం చేయకూడదు.

*5.*  గ్రహణానికి 2 గంటల ముందే ఆహారం తీసుకోవాలి.  గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.

*6.*  గ్రహణ సమయంలో    మంత్ర జపం,  పురాణ శ్రవణం  లేదా భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి. 

*7.* పట్టు స్నానము, విడుపు స్నానము వంటివి గంగ లేదా ఇతర నదీనదములలో    చేయడం వల్ల గొప్ప ఫలితం వస్తుంది. 

*8.*  గ్రహణం తరవాత దానం చేయడం, స్వయంపాకం దానం ఇవ్వడం వల్ల చాలా రెట్ల పుణ్యం లభిస్తుంది. 

*9.* ఇల్లు శుద్ధి అయ్యాక  ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం, ఆలయాలను కడగడం అత్యంత పుణ్యప్రదం.  

*10.* ఇంటిలో, వంట సామగ్రి పైన, పూజామందిరం మొదలైన చోట్ల దర్భలు పరచాలి..



సూర్య గ్రహణం పూర్తి అయ్యాక చేసే స్నానాన్ని ఏమంటారు? సూర్య గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేస్తే, ఎక్కడ స్నానం చేసిన ఫలితం వస్తుంది?

ఈసారి దీపావళి పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం, కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఈ పండుగలను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే, 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 24న ఉదయమంతా చతుర్దశి ఉంటుంది. రాత్రంతా అమావాస్య ఉంటుంది. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని అంటున్నారు. 

 

కార్తీక పౌర్ణమి విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్ర 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత కాసేపటి వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. అంటే, చంద్రగ్రహణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం ఉంది. నవంబరు 7 నుంచే పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయని, కాబట్టి అదే రోజున కార్తీక వ్రతాలు, పూజలు చేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.....

🕯️🪔🕯️🌹🛕🌹🕯️🪔🕯️

కామెంట్‌లు లేవు: