10, జులై 2024, బుధవారం

రెండువందల గోత్రాలు

 



ద్వారకా తిరుమలలో #నిత్యఆర్జితకళ్యాణం చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. రోజుకి దాదాపు రెండొందలమంది చేయించుకుంటారు. 


ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మూడు గంటలపాటు జరిగే కళ్యాణం ఒక ఎత్తు.. 


ఆ కళ్యాణం అయ్యాక, ఓ మహానుభావుడు వచ్చి మంత్రపుష్పం చదివి, ఆ తర్వాత గోత్ర నామాలు చదువుతారు. ఈ ప్రహసనం ఇంకో ఎత్తు.


కళ్యాణం టికెట్ కౌంటర్లో భార్య భర్త గోత్రం - పేరు కాగితాలమీద రాసి ఈయనకి ఇస్తారు. అవి ఆయన ఎప్పుడు కంఠస్థం చేస్తారో తెలీదు కానీ కళ్యాణం అయ్యాక, మంత్రపుష్పం చదివాక ఆయన గోత్రం - పేర్లు ఆ కాగితాలు చూడకుండానే చదువుతారు. 


మనం రోజూ పూజలో చదివే కేశవ నామాలే ఒక్కోసారి పరధ్యానంలో అటూ ఇటూ చదువుతాం. 


ఈయనమాత్రం ఎవరి పేరున ఏ గోత్రం వ్రాసుంటుందో అదే క్రమంలో తప్పులేకుండా చదువుతారు. ఆయనకి పేరుకానీ, గోత్రంకానీ కొత్తగా అనిపించి అనుమానమొస్తే అప్పుడు ఆయన చేతిలో కాగితం చూసి చదివి, అది కరెక్టేనా కాదా అని మైకులో అడుగుతారు. 


రెండువందల గోత్రాలు - నాలుగువందల పేర్లు సునాయాసంగా చదవడం మామూలు విషయం కాదనిపిస్తుంది. *ఆయనే ప్రధాన పూజారి రాంబాబు గారు*🙏

🙏🚩🕉️🌷🍃🙏🏻👏🙏🏻

కామెంట్‌లు లేవు: