9, జులై 2024, మంగళవారం

ప్రసాదం తింటారా

 అజ్మీర్ రైల్వే స్టేషన్ ఆరోజు చాలా రద్దీగా ఉంది. ఒక బెంచీ వద్ద బురఖా ధరించిన ఒక ముస్లిం స్త్రీ, ఒక హిందూ యువకుడు ఉన్నారు.


ఆమె అతనిని అడిగింది: మీరు అజ్మీర్ వాసులా? లేక చూడడానికి వచ్చారా?


అతను అన్నాడు: నా తల్లి దండ్రులతో పుష్కర్ లోని బ్రహ్మ దేవుని ఆలయం చూడడానికి వచ్చాను. (బ్రహ్మ దేవుని కి ఆలయం అక్కడే ఉంది. మరెక్కడా లేదు)


ఆమె అడిగింది: మరి అజ్మీర్ షరీఫ్ దర్గా దర్శనం చేసుకున్నారా? అని. (బ్రహ్మ దేవుని ఆలయం కు వచ్చిన హిందూ యాత్రికులు అందరూ దర్గా కి కూడా వెళ్లి, అక్కడ కూడా దణ్ణం పెట్టుకోవడం ఆనవాయితీ)


యువకుడు ఆమెను అడిగాడు : మీరు ఎప్పుడైనా బ్రహ్మ దేవుని ఆలయం దర్శించారా?


ఆమె ముఖం ముడుచుకుని, వారి అల్లాను ఒకసారి తలుచుకుని, మేము అలా ఇతర మతస్తుల గుడులకు వెళ్లడానికి మా మతం ఒప్పుకోదు, అని చెప్పింది.


అలాంటప్పుడు మేము మాత్రం ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించాడు యువకుడు.

 దాంతో ఆమెకు ఒళ్ళు మండి, యువకునిపై, అతని తల్లికి ఫిర్యాదు చేసింది:


 చూడండి, మీ అబ్బాయి లాంటి వ్యక్తుల వల్లనే దేశం లో సర్వమత సౌభాతృత్వం కు విఘాతం కలుగుతోందని.


తల్లి చిరునవ్వు తో జవాబు ఇచ్చింది ఇలా: మాలాంటి హిందువుల వల్లనే ఈ దేశంలో సర్వమత సమానత్వం ఉంది, మేమే గనుక మా పిల్లలకు ఆ దర్గాలో, సమాధిలోని ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ , ముస్లిం మతంలోకి మారడానికి నిరాకరించిన హిందూ రాజు పృధ్వీరాజ్ చౌహాన్ ను ఎలా హింసించినదీ, అతని భార్య సంయోగిత ను వివస్త్రను చేసి అందరిముందూ బలాత్కారం ఎలా చేసినదీ వివరిస్తే ఏ హిందువు ఆ దర్గా కి వెళ్లి తలవంచి నమస్కరించడు - అన్నది.


పృధ్వీరాజ్ దయగల హిందూ రాజపుత్ర రాజు. మహమ్మద్ ఘోరీని 17 సార్లు ఓడించి కూడా అతన్ని సంహరించలేదు. కానీ పృధ్వీరాజ్ ఓడినప్పుడు అతని కళ్ళు పొడిపించాడు ఘోరీ. శబ్దభేధి విద్య తెలిసిన పృధ్వీరాజ్ బాణం ఘోరీ కంఠంలో దిగి అతడు చనిపోయాడు.

ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ కూడా పృధ్వీరాజ్ కొడుకుల చేతిలో చనిపోయాడు.


ముస్లిం సైనికులు పృధ్వీరాజ్ భౌతిక కాయాన్ని ఆఫ్ఘనిస్తాన్ తరలించి అక్కడే సమాధి చేసారు. ముస్లిం ఆచారం ప్రకారం రోజూ ఆ సమాధి ని చెప్పులతో కొట్టేవారు.


ఈ విషయం తెలిసి షేర్ సింగ్ రాణా అని రాజపుత్ర వీరుడు ఆ దేశం వెళ్లి, పృధ్వీరాజ్ కు దహన సంస్కారాలు చేసి, తిరిగి వచ్చి ఆ అస్తికలను గంగా నదిలో కలిపాడు. ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ తన జీవిత కాలంలో 90 లక్షల మంది హిందువులను ముస్లింలుగా మార్చాడని వారు అతనిని కీర్తిస్తారు.


 అతనే ఘోరీ ని ఉత్సాహ పరిచాడని కూడా చెబుతారు. అలాంటి వాడి సమాధికి రోజూ వందలాది మంది హిందువులు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.


ముస్లిం లకుగానీ, క్రైస్తవుల కుగానీ లేని ఈ సర్వమత సమానత్వం మనకు మాత్రం ఎందుకు?


వారి పండగలకు మన వాళ్ళు వెళ్లి, వాళ్ళ మతానికి జై కొట్టి, వాళ్ళు పెట్టింది తిని వస్తున్నారు. మన పండగలకు ఇతర మతాల వారు వచ్చి, మన చేత బొట్టు పెట్టించుకుని, మనం పెట్టిన ప్రసాదం తింటారా?


హిందూ దేవాలయాలపై పెత్తనం చేసే మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మతాల దేవాదాయాల విషయంలో వేలు పెట్టగలవా?

ఎందుకు మనకీ " సెక్యులర్" పదం?


ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: