8, ఫిబ్రవరి 2026, ఆదివారం

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।

వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 61 ।।


ప్రతిపదార్థ:



తాని — వాటిని; సర్వాణి — అన్నీ; సంయమ్య — లోబరచుకొని; యుక్త — ఐక్యమై; ఆసీత — కూర్చొని; మత్-పరః — నా యందు (శ్రీ కృష్ణుడు); వశే — వశమునందు; హి — నిజముగా; యస్య — ఎవరి యొక్క; ఇంద్రియాణి — ఇంద్రియములు; తస్య — వారి; ప్రజ్ఞా — పరిపూర్ణ జ్ఞానము; ప్రతిష్ఠితా — స్థిరంగా ఉండును.



 తాత్పర్యము :


 ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.



 వివరణ:


ఈ శ్లోకంలో 'యుక్తః' (కూడియున్న) అన్న పదం 'భక్తితో లీనమైన' అనే అర్థంతో ఉన్నది, మరియు ‘మత్ పరః’ అంటే 'శ్రీ కృష్ణుడి పట్ల’. 'ఆసీత' అన్న పదాన్ని ఉపమానముగా 'నెలకొని లేదా స్థితమైఉండి' అని అర్థం చేసుకోవచ్చు. చంచలమైన మనస్సు, ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియచేస్తున్నాడు, అదే భగవత్ భక్తిలో నిమగ్నమవుట.

కామెంట్‌లు లేవు: