*సర్వేజనాః సుఖినోభవన్తు*
*🙏శుభోదయమ్🙏*
*🏵️నేటిపెద్దలమాట🏵️*
పదిమంది కూర్చున్న చోట మనం వెళ్లి కూర్చుంటే అది మర్యాద.
మనం కూర్చున్న చోట పదిమంది వచ్చి కూర్చుంటే అది మన మీద అభిమానం, గౌరవం.
*🪷నేటిమంచిమాట🪷*
భూతకాలం నీ ఆధారం.
వర్తమానం నీ గమనం..
భవిష్యత్తు నీ లక్ష్యం...
త్రికాలాల లోనూ శోధన, సాధన నీ కర్తవ్యం.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
*సర్వేజనాః సుఖినోభవన్తు*
పంచాంగం - 09 మే 2026 - శనివారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు
వైశాఖ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - తె. 5:50
సూర్యాస్తమయం - సా. 6:35
తిథి - సప్తమి మ. 1:59 వరకు
తరువాత అష్టమి
సంస్కృత వారం - స్థిర వాసరః
నక్షత్రం - శ్రవణ రా. 11:13 వరకు
తరువాత ధనిష్ఠ
యోగం - శుక్ల రా. 2:25+ వరకు
కరణం - బవ మ. 1:59 వరకు, బవ మ. 1:59 వరకు
వర్జ్యం - తె. 3:38 నుండి తె. 5:20 వరకు
దుర్ముహూర్తం - ఉ. 7:32 నుండి ఉ. 8:23 వరకు
రాహుకాలం - ఉ. 9:01 నుండి ఉ. 10:37 వరకు
యమగండం - మ. 1:48 నుండి మ. 3:23 వరకు
గుళికాకాలం - తె. 5:50 నుండి ఉ. 7:25 వరకు
బ్రహ్మ ముహూర్తం - తె. 4:14 నుండి తె. 5:02 వరకు
అమృత ఘడియలు - మ. 12:23 నుండి మ. 2:08 వరకు
అభిజిత్ ముహూర్తం - ఉ. 11:47 నుండి మ. 12:38 వరకు.
*నేటి మాట....*
మనిషి ఎన్నడూ తనని తాను కించపరచుకోకూడదు. తనను తానే నిందించుకునే వానికి ఎదుగుదలే ఉండదు.
భగవంతుడు మన మీద పగబట్టలేదు. మనకూ మంచి సమయం వస్తుందని గుర్తుంచుకో!”అని ఓదార్చాడు.
ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగుండవు. వెలుగు నీడల్లా మంచి చెడు రోజులు వస్తుంటాయి.
అయితే శాశ్వత సత్యం ఒకటుంది. అది భగవంతుడు ఎల్లప్పుడు మన వెంట ఉంటాడు అనేది.
కష్ట సమయాల్లో వాటి నుంచి విముక్తి పొందడానికి అతను పరోక్షంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అతడెలాంటి సహాయం ఎలా, ఎప్పుడు చేస్తాడో మన ఊహకందనిది.
కష్టాలలో మనను ఒంటరిగా వదిలేయడు..
సుఖాలు తాత్కాలికమైనవేనన్న అనుభూతి కలిగిన నాడు కష్టాలు కూడా సుఖాలుగా గోచరిస్తాయి.
సహాయాలే కాదు కష్టాలనధిగమించడానికి కృషి చేయమని ప్రేరణనిచ్చేది కూడా భగవంతుడే. ఆ ప్రేరణతోనే సత్కార్యాలు చేయగలుగుతాం. అవి మనకు తృప్తినిస్తాయి.
ఈ సృష్టికి మూల కారణం భగవంతుడు. ప్రాణి కోటికి ప్రాణం పోసినది, వాటిని పోషిస్తున్నది ఆ సర్వేశ్వరుడే. సుఖదుఃఖాలు అతను సృష్టించినవే*.
మన అహంకారం పెరిగిపోకుండా ఉండడానికి మధ్యమధ్య కష్టాలనే పరీక్షలు పెడుతుంటాడు. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమోగుణాల మార్పుల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉండగా అహంకారంతో అన్నింటికి కర్తను నేనే అని మానవుడు విర్రవీగుతాడు.
చెడు జరిగితే భగవంతుని నిందించడానికి కూడా వెనుకాడము.
అన్ని జన్మలలోకెల్ల ఉత్తమమైనది మానవ జన్మ. ఇంతటి మంచి జన్మనిచ్చినందుకు ఆ భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అది మన విధి.
👉 ఆ కృతజ్ఞతను యజ్ఞం, ధ్యానం, జపం, తపం, వ్రతం, పూజ, నామ సంకీర్తనం లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారానైనా తెలుసుకోవాలి.
👉 భగవంతుడిని మనం ధ్యానిస్తే ఆయన మన చెంతనే ఉంటాడు.
👉 సంకల్ప వికల్పాత్మకమైన బుద్ధిని నిగ్రహించి, బుద్ధిని ఏకాగ్రం చేసి అతనిని శరణు కోరాలి. అలాంటి వారికి కష్టాలు దాపురించినా భగవంతుడు తప్పక ఆదుకుంటాడు.
👉 ఒక్కోసారి బాధలు తాళలేక భగవంతుని నిందించినా మనకు జరగవలసిన మేలు చేస్తాడు. అదే అతని లీల.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనాః సుఖినోభవన్తు*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి