18, జూన్ 2026, గురువారం

మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాము

 *మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాము..?*


• మానవ జాతి మనుగడ కోసమై ఉన్నఫళం గా "500" కోట్ల మొక్కలను నాటవలసిన అవసరం ఉన్నది..!


• "ఈ వేసవి మామూలు వేసవి కాదు..! ఇది ఓ హెచ్చరిక..!"


*ఈ రోజు బయట అడుగు పెడితే మాడిపోతున్నాం..!*


• ఉదయం 6 గంటలకు కూడా వేడి తగ్గడం లేదు, రోజంతా..24 గంటలు రోడ్లన్నీ నిప్పులు కక్కుతునే ఉన్నాయి...ఫ్యాన్ గాలి చాలటం లేదు.. 


• ఏసీ లేనిదే బతకలేని దుస్థితికి వచ్చాం..కానీ మనం ఎంతకాలం ఏసీలను ఆశ్రయిస్తాం..? 


• నిప్పులు కక్కుతున్న నిజాలను చూడండి..!


*1. ఉష్ణోగ్రత పెరుగుదల:*


• భారతదేశంలో 45°C సాధారణం అయిపోయింది..రాజస్థాన్, విదర్భలో 49°C దాటుతోంది..!


• 56°C వద్ద మానవ మెదడు పని చేయడం ఆగిపోతుంది..


• 60°C కి చేరడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాము.

  

*2. ఏసీ మాత్రమే పరిష్కారం కాదు:* 


• ఒక ఏసీ బయటకు వదిలే వేడి..10 వృక్షాలను నరికినంత ప్రభావాన్ని చూపుతుంది...


• మనం చల్లదనం కోసం భూమిని ఇంకా వేడెక్కిస్తున్నాం...


*3. చెట్లు ఎక్కడ..?* 


• భారతదేశానికి ఇప్పుడు తక్షణం 500 కోట్ల మొక్కలను పెంచాల్సిన అవసరం ఉంది...


• 1970లో 40% ఉన్న అటవీ విస్తీర్ణం, ఇప్పుడు 21% కి పడిపోయింది..


*మనం ఏం కోల్పోతున్నాం..?*

 

• ఒక పెద్ద చెట్టు రోజుకు నాలుగురికి "4" సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది. పైగా 20 ఏసీలకు సమానమైన చల్లదనాన్ని ఇస్తుంది...


• భూగర్భ జలాలను పెంచుతుంది..వర్షాలను ఆహ్వానిస్తుంది...


• కానీ మనం అభివృద్ధి పేరుతో నిమిషానికి "15" చెట్లను నరుకుతున్నాం..!


• మొక్కలను నాటడం పెంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమేనా..?, కాదు..కదా..ప్రతి పౌరుడి బాధ్యత.. 


*ఒక మొక్క పెరిగి నీడ ఇవ్వడానికి "5 నుండి 7 ఏళ్లు" పడుతుంది..*


• అంటే మనం ఈ రోజు మొక్కను నాటితే, కనీసం 2032లో ఫలితాన్ని చూస్తాం. 


• ఇంకా ఆలస్యం చేస్తే, 60°C భూమిని మన పిల్లలకు అప్పగిస్తాం...


*మనం ఇప్పుడేం చేయాలి..?*


• వర్షాకాలం మొదలైంది, గట్టి వానలు పడి, భూమి బాగా తడిసిన వెంటనే మొక్కలను నాటడానికి సరైన సమయం అదే.. 


*మనందరి బాధ్యత ఏమిటి..?*


*1. ఈ వర్షాకాలంలో ప్రతీ మనిషి 2 రెండు మొక్కలు చొప్పున నాటండి..*


• తమ ఇంటి ముందు, స్కూల్లో, ఖాళీ స్థలంలో ఎక్కడైనా..వేప, రావి, మర్రి, చింత లాంటి దేశీయ మొక్కలను నాటండి...


*2. నాటిన ప్రతీ మొక్కకూ నీరు పెట్టి ..కంచె వేసి, సంరక్షించి, బ్రతికించే బాధ్యత మనందరిదీ..*


• మనం మారకపోతే, ప్రకృతి మనల్ని మార్చేస్తుంది. ఆ మార్పు "మృత్యువు" రూపంలో ఉంటుంది..లేదా చూడాల్సి వస్తుంది..ఏసీ రిమోట్ పక్కన పెట్టి, ఒక పొలుగు, పార పట్టుకోండి.. 


• "మన పిల్లల ఊపిరి కోసం, ఈ భూమి కోసం ప్రతి ఇంటికి" ఈ రోజే ప్రతీ ఒక్కరు రెండేసి(2) మొక్కల చొప్పున నాటుదాం..  


• "ఈ రెండు మొక్కలకు - ప్రాణం పోసే పనిని చేపట్టి.." మనలను కాపాడుకొంటూ భావితరాలను కూడా కాపాడుకుందాము.


🌹🌱🌴🌲🌳😊🙏

కామెంట్‌లు లేవు: