29, మే 2021, శనివారం

సమర్థుడికి

 🪔 *卐ॐ _సుభాషితమ్_ ॐ卐* 💎


శ్లో|| నాతః శ్రీమత్తరం కిఞ్చిత్ అన్యత్పథ్యతమం మతమ్ |ప్రభవిష్ణోర్యథా తాత క్షమా సర్వత్ర సర్వదా ||


తా|| "సమర్థుడికి అన్నిచోట్ల అన్నివేళలా సహనం కంటే శుభకరమైనది మరొకటి లేదు.

అది అన్నిటికంటే చాలా శ్రేయస్కరం".


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ)

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

)

              🌷🌷🌷

అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ) 


" రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా

రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా"


అనునిత్యపఠనంగా అలరారే లలిత.. రాగబద్ధంగా సాగిపోతోంది గణపతి పెదవులపైన.  


తమకలవాటయిన తమదైన పరదేవతానామం తమ జీవనాడుల అమృతం పోస్తుంటే, ఆ అమృతపాన పునీతులైన ఆ పుష్పగుల్మాలన్నీ, అమ్మకు అంకితంగా తమ సుమహృదయాలను పరమానందంగా అర్పిస్తున్నాయి ఆ కెంజాయ సంజెవేళ! 


             రాజరాజేశ్వరి దేవతార్చనకు ముందురోజే సాయంత్రం మల్లెలూ, గులాబీలూ, సంపెంగెలూ, మరువం, ధవనం కోసి ఉంచుకుంటాడు. మందారాలూ, నందివర్ధనాలూ , పారిజాతాలూ మర్నాడు ఉదయమే తామూ తయారు! అంటాయి. ఆ పూబాలలను పలకరిస్తూ, సున్నితంగా వాటిని కొమ్మనుండి వేరుచేస్తాడు. 


అమ్మపొదుగు నుండి బొజ్జనిండా పాలుతాగిన తువ్వాయి లేలేత గడ్డిలో గెంతులేస్తోంది. చీకటిఛాయలు పరుచుకుంటున్న వేళ... దూరంగా పొదల్లో ఏదో అలజడి. పాము కాదు కదా! అటు పరుగెడుతున్న ఆవుదూడను సంభాళించడానికి వడివడిగా అడుగులేసాడు గణపతి. 


సన్నని ఆర్తనాదం. పొదల మాటున ఇద్దరు యువతులు. పెద్దింటి అమ్మాయిలేమో! దూరంగా పెద్ద కారు! ఏడుస్తున్న అమ్మాయి చేతిలో ఏదో మూట. " నావల్ల కాదు వదినా! నేను పాపాయిని తీసుకుని ఎక్కడికయినా పారిపోతా! నేను విడువలేక పోతున్నా".... హృదయవిదారకంగా ఏడుస్తోంది. పద్దెనిమిది వుంటాయో ఏమో! 


" లాభం లేదు లతా! తప్పుచేసినపుడు ఆలోచించలేదా ఇవన్నీ. ఎంత అజాగ్రత్త! ఐదునెలలకు కళ్లు తెరిచావ్! వాడేమో మీనాన్నకు భయపడి పారిపోయాడు. హాస్టల్ నుంచి నిన్ను తెచ్చి ఈవూళ్లో రహస్యంగా వుంచి, డెలివరీ పూర్తిచేసేటప్పటికి నాతల ప్రాణం తోకకొచ్చింది. మంత్రసాని ఏ పొరపాటు చేసినా నీ ప్రాణం మీదికొచ్చేది. మీ అన్నయ్యకు తెలిస్తే నా తల తెగుతుంది. ఇది మనవల్ల అయ్యేది కాదమ్మా. నాతల్లి కదూ! ఇక్కడ పెట్టేద్దాం బిడ్డను. ఆయుష్షుంటే బతుకుతుంది. ఎవరో ఆదరిస్తారు. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. నాకియ్యమ్మా బిడ్డను. "..... పాతికేళ్లుంటాయేమో వదినగారికి. ఆడపడుచుకు ధీటుగా పచ్చనిఛాయలో మెరిసిపోతోంది. ఆ ఇద్దరి వంటిమీద రవ్వల ధగధగలు వారి చెక్కిళ్లపై జాలువారుతున్న కన్నీటిని మరింత మెరిపిస్తున్నాయి. 


బిడ్డను అక్కడే ఓ మొగలిపొద మొదలులో పెట్టి , ఆడబిడ్డను లాక్కుపోయింది ఆమె. 


" అయ్యో! ఎంత అఘాయిత్యం!" ఆపడానికి పరుగుపెట్టి రోడ్డు మీదకొచ్చాడు గణపతి. 


కారెక్కబోతున్న ఆ నిర్భాగ్యమాతృమూర్తి , ఒక్కసారి తిరిగి, కన్నీళ్లతో నమస్కరించి వెళ్లిపోయింది. ఎంత అభ్యర్ధనో! ఎంత వేడుకోలో! ఆ పెద్దకళ్లల్లో! 


తెల్లారితే విజయదశమి. చేతిలో పొత్తిళ్లలో పాపాయి. కళ్లుమూసుకుని చిన్మయముద్రలో బాలాలీలావినోదినిలా! 


" రాజరాజేశ్వరీ దేవి"...... " నను పాలించగ నడచీ వచ్చితివా తల్లీ! పాదాల తలలనే పారిజాతములుంచి, మోదాన భాష్పాల ముద్దుపూసరులిచ్చి.... ఓ దేవి! నీమ్రోల ఒదిగి ఉన్నానమ్మా"! ..... ఏదో పరవశత్వం! ఏదో ఉన్మాదం! వివశత్వం బిడ్డను చూస్తుంటే! బాలాత్రిపురసుందరిని కళ్లారా చూస్తున్నట్టు! 


తన కుటీరానికి తెచ్చాడు. భార్యను పిలిచాడు. ప్రశ్నించే తెలివిలేని ఆ అమాయకురాలు అపురూపంగా బిడ్డను గుండెకు పొదువుకుంది. కుటీరానికి ఆనుకుని చిన్న మందిరంలో తాను ప్రాణప్రదంగా ప్రతిష్టించుకున్న శ్రీచక్రసహిత రాజరాజేశ్వరీదేవి పంచలోహవిగ్రహం పాదాల చెంత బిడ్డను పెట్టాడు. కళ్లువిప్పిన బిడ్డ కనులారా నవ్వింది. పెద్దపెట్టున ఏడ్చింది. " భావాభావ వివర్ధిని"


            బిడ్డనెలా పెంచాలన్న భయం లేదు ముప్ఫైయేళ్ల గణపతికి. పుష్కలంగా పాలిచ్చే గోవుంది. అమ్మవారు వుండనే ఉంది. పుష్కరకాలం క్రితం తనకు " వినిపించిన తల్లి" ఈరోజు కనిపించింది! " అమ్మా! నీ దయ! "


గణపతి సత్సాంప్రదాయ, సంపన్న కుటుంబంలో ఆరవకొడుకు. తాతతండ్రులు మంచిపేరున్న ప్లీడర్లు. చదువులో చురుకుగా ఉండే గణపతి చిన్నప్పటినుండి తాతగారితో పాటూ దేవతార్చనలో కూర్చుండేవాడు. పద్దెనిమిదో యేట ఉపనయనం జరిగింది. గాయత్రీ మహామంత్రోపదేశం తీసుకోగానే అతనికి బ్రహ్మానందం కలిగింది. 

ఆరోజు అర్ధరాత్రి ఇంట్లో చిరుగజ్జెల చప్పుడు. ఎంత మరలిద్దామన్నా మనసుకు గాలం వేస్తున్న మంజీరకింకిణీ నాదం! ఒంటిపై కొస్తున్న మైమరుపు! మొగలి, మల్లెలు , చందన సుగంధం. పిలుస్తున్న దివ్యకాంతిని అనుసరించి వెళ్లిన గణపతి , దేవుడిగది పక్కగదిలో చిన్న సందువాపెట్టి దగ్గర నియంత్రించబడ్డాడు. పెట్టె తెరవగానే గుప్పున సాంబ్రాణిధూపం. జీర్ణమైపోతున్న పట్టువస్త్రంలో చుట్టబడి శ్రీచక్ర మేరువు, అష్టభుజాంకిత, అఖిలాధారిణి రాజరాశేశ్వరీ దేవి దివ్యవిగ్రహం. 


గాయత్రితో ఆవహించిన మైమరుపు ఇప్పుడు అతని ఆత్మను ఆలింగనం చేసుకుని, అలౌకికమైన స్థితికి తీసుకుపోయింది. 


తమ పూర్వీకులు కొన్నితరాల క్రితం పూజించిన రాజేశ్వరీపీఠం అతన్ని వరించింది. 


కొన్నినెలలు అదే అలౌకికస్థితిలో, పరదేవతా ధ్యానంలో ఉన్మత్తుడయిపోయిన గణపతిని ఐహికస్థితికి తీసుకురావడం అసాధ్యమని గ్రహించిన అతని తాతగారు , కంచి గురుస్వాములచే శ్రీచక్రార్చన చేయించి, అమ్మవారిని ఆహ్వానించి, సద్గురువులచే మంత్రోపదేశం చేయించారు. అనంతరం కొద్దిగా బుద్ధిమాంద్యమున్న అతని మేనత్తకూతురుతో వివాహం జరిపించి, అతనికోరిక మీద ఆ చిన్న ఉపవనం, అమ్మవారి అర్చనకు ఏర్పాటు చేసారు. 


సన్యసించకపోయినా, అవధూతలా విరక్తితో, నిర్గుణ నిశ్చల మార్గంలో తపోధనంతో వెలిగిపోయే గణపతి జీవితంలోకి పెనుమార్పులా ఈ "బాల రాజరాజేశ్వరి" ! 


                స్వయాన వైష్ణవి, వైభవోపేత ఆతల్లి. ఆ పూరికుటీరానికి అష్టైశ్వర్యాలూ వచ్చి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. 


ఒకరోజు నామినేషన్ కు వెళుతూ ఆ కుటీరం దగ్గర దాహానికాగి, అమ్మవారికి దండం పెట్టుకున్న ఒక పెద్దమనిషిని ఏకంగా కీలకమంత్రిపదవి వరించడం , ఆ చిన్నమందిరం రూపురేఖల్నే మార్చేసింది. 

స్వయాన పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వాములు, యతీంద్రుల అధ్వర్యంలో రాజరాజేశ్వరీదేవి విగ్రహస్థాపన జరిగింది. 


ఆగమశాస్త్రానుసారం భూకర్షణ చేసి, అద్భుతమైన శిల్పకళతో, అందమైన పాలరాతి ఆలయం నిర్మింపచేసుకుంది తల్లి. 


ఆలయంతో పాటూ దినదినప్రవర్ధమానమైన రాజరాజేశ్వరికి అందరూ తల్లులే. అందరికీ అపురూపమే! పదిమంది పిల్లలున్న తల్లి కూడా మాతృభావన ఉప్పొంగి, ఆలింగనం చేసుకునే అద్వితీయ ఆకర్షణ ఆపిల్లది. 


ఆ శ్వేతపద్మాసని విద్యాధరి శారదాంబ పిల్లకు విద్యలు అలవోకగా కట్టిపెట్టింది. 


తనప్రమేయం లేకుండానే అఖండమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీరాజరాజేశ్వరీదేవి సంస్థానం పురోగమించడం గణపతి నిశ్చలభక్తికి ఏ ఆటంకం కలుగచేయలేదు. సాక్షీభూతుడిగా తన తపోనిష్ట సాగించుకుంటూ ఆయన తన కుటీరంలో తన శ్రీవిద్యోపాసనలో మహాయోగిలా తేజోవిరాజిల్లుతూ! 


అది ఇరవై ఒకటో విజయదశమి రాజరాజేశ్వరికి. ముగ్గురమ్మలూ పోటీపడి చేసిన ఆ పిల్ల పెళ్లి ప్రస్థావనా   , ప్రయత్నమూ గణపతిని కణ్వుణ్ణే చేసింది. 


ఆమె అకులా సమయాంతస్థ అయినా మానుషరూపిగా ఆమెకు తనకులంలో కాకుండా కులేతర వివాహం చెయ్యలేడు. పైగాఆమె చెయ్యికోరి వచ్చిన వారికి సంస్థానం మీద దురాశ అదనం! "అమ్మా! నీ దయ!" దీర్ఘంగా నిశ్వసించి విశ్రమించాడాయన నవమిరాత్రి. 


      పోటెత్తిన జనసంద్రసమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవికి శాంతికవచం ధరింపచేసి, పూర్ణాహుతి, అఖండ అన్నదానానంతరం.... రాత్రి పదింటికి అమ్మవారికి భార్యాపుత్రీ సమేతంగా మణిహారతులిచ్చి, మొట్టమొదటిసారిగా ఒకేఒక్క కోర్కె కోరాడు అమ్మను! 


                కార్తీకపౌర్ణమి! ప్రత్యూష శీతలపవనాలు హిమగిరితనయ చల్లనిచూపుల్లా ఉన్నాయి. పచ్చనిగరికెలమీద తుహిణకణాలపై లేత అరుణకిరణాలు వక్రీభవనం చెంది, లక్షల ఇంద్రధనుసులు ఆ వనమంతా! అతిసుకుమారంగా పారిజాతాలు ఏరుకుని మొగలిపొదవేపు కెళ్లాడు గణపతి. కేతకీ పుష్పం శివుడికి నిషిద్ధమైనా , ఆయన గణపతి కదా! అమ్మకు ఇష్టంగా ఒకరేకు పెడతాడు రాజరాజేశ్వరి వచ్చినప్పటినుండి. 


      సంస్థానాన్ని విస్తరించి, సంరక్షించే గణపతి అన్నలపిల్లలూ, ధర్మకర్తలూ ఆయన ప్రపంచాన్ని ఏమాత్రం స్పర్శించకుండా ఆయనకేది ప్రియమో ఆ తోటంతా అలాగే ఉంచారు. 


              మొగలిపొద దగ్గర ఇద్దరు స్త్రీలు! ప్రౌఢలు! ఆయన అక్కడకు చేరగానే " స్వామీ!" అని మంద్రంగా పిలిచింది ఆమె. 


ఆయనది సూక్ష్మబుద్ధి ! ఇట్టే కనిపెట్టాడు! 


" ఏమ్మా! జగన్మాతను నాకు వదిలి నువ్వు వెళ్లిపోయావా తల్లీ?" 


కన్నీరుమున్నీరే అయింది ఆ దొరలపిల్ల! 


" మీ జగన్మాత చెయ్యి పట్టుకోడానికే వచ్చాము స్వామీ!".... కొంత ఠీవి. మరింత వినయం! ఆమె వదిన! 


స్వామీ! నాపేరు శ్రీలలిత, ఈమె మా వదిన మణిదీప. ఆ కారు దగ్గరున్నాడే శైలేష్. మా అన్నకొడుకు. హైదరాబాద్ లో డాక్టర్ ! తన అంశను మోసిన గర్భంలో మరొకరికి స్థానం ఇవ్వలేదు ఆ తల్లి. వదిన పెద్దకొడుకు శైలేష్ ను నేనే పెంచుకున్నా! 


నా పాప మీదగ్గర సవ్యంగా పెరుగుతోందని తెలుసు. ఏమిచ్చి మీరు పెంచగలరు అని కూడా ఆలోచించలేదు. మీ ఋుణం ఎప్పటికీ తీరనిది. వైవాహికజీవితం అల్లకల్లోలమవుతుందని నా గతాన్ని పాతిపెట్టేసాను. కానీ అనుక్షణం నా పాపం వెంటాడుతూనే ఉంది. పాపను మీరు చూడకపోతే! ఆ వూహే భయంకరం! 


నా పాపభారంతో ఈ పవిత్రసన్నిధిలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేకపోయా! జీవనసహచరుడు అకాలమృత్యువు పాలయ్యారు. రెండేళ్లయ్యింది నా జీవితం నాచేతిలో కొచ్చి.  అందుకే ఈరోజు ధైర్యంచేసి మీకుమార్తెను నా దత్తపుత్రుడికి చేసుకోమని అర్ధించడానికి వచ్చా స్వామి. 


పిల్లాడు శాఖాహారి. దైవభక్తితో సవ్యంగా పెరిగినవాడు" ...... మాటలూ-దుఖం కలగలుపుగా మాట్లాడుతుంటే,  ఆమె కెంపుల కర్ణాభరణాలమెరుపులు ఆమె చెక్కిళ్ల దుఖపు ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయి! 


" అరుణాం కరుణాతరంగితాక్షీం"..... అమ్మనామం ఆయన నోటంట అప్రయత్నంగా జాలువారింది. 


"రండమ్మ! మందిరంలోకి వెళ్దాం. అమ్మ సమక్షంలో పిల్లతో, ఆమె తల్లితో ఓ మాట చెప్పాలి కదా! 


" మరోమాట స్వామి! ఏతండ్రికి భయపడి నాబిడ్డను వదిలేసి వెళ్లిపోయానో, ఆయన్నే స్వయంగా అమ్మ తన కాళ్లదగ్గరకు తెప్పించుకుంది. అవునండి ! మినిస్టర్ మృత్యుంజయరావు గారు మా నాన్నగారు. ఆయనకు పాప విషయం ఏమీ తెలియదు. అంతా ఆ దేవి దయ"


ఆ తరువాత వచ్చిన మాఘమాసంలోనే రాజరాజేశ్వరీదేవి కల్యాణం తను మెచ్చిన శైలేష్ తో ఆదిత్యనారాయణుడు ప్రత్యక్షసాక్షిగా , ముక్కోటిదేవతల ఆశీస్సులతో శ్రీరాజరాజేశ్వరీ సుందరేశుల సమక్షంలో అంగరంగ వైభవంగా అయింది. 


పిల్లకు అప్పగింతలు పెట్టి పంపించేసారు అత్తవారింటికి. 

ఏడుస్తున్న భార్యతో

" పిచ్చిదానా! తల్లి విశ్వమాత! జగద్ధాత్రి! పుట్టిల్లేంటి? మెట్టినిల్లేంటి? ఆమే బంధాలనిస్తుంది. బంధమోచనీ ఆమే!"అంటూ ఓదార్చారు గణపతి స్వామి! 


ఆరోజు రాత్రి అమ్మవారికి ఒంటరిగా హారతిచ్చి, " కల్యాణీ జగతీకందా కరుణారససాగరా! పిల్లకల్యాణంతో నీవిచ్చిన బంధం ముగిసింది తల్లీ! రాజమ్మను చేర్చాలిసిన చోటికే చేర్చావు. నీలీలలు వర్ణించతరమా..!"అని కన్నీళ్లు పెట్టుకుని.... పిల్ల నీ సన్నిధిలోకి వచ్చింది కనుక నువ్వు చూసుకున్నావు, కానీ ఇలా ఎంతమంది పిల్లలు పురిటిగుడ్లుగా రాలిపోతున్నారో! ఎన్ని పసిబతుకులు ఛిద్రమైపోతున్నాయో! రక్షాకరీ! కాపాడుతల్లీ! నువ్వు కలికల్మషనాశినివి! దౌర్భాగ్యతూల వాతూలా! జరాధ్వాంత రవిప్రభవు! కటాక్షకింకరివి. రక్షించు తల్లీ పసిపిల్లలను! రక్షించు! మాతృరక్షణనుండి దూరం చెయ్యకమ్మా!" 


ఆ అవ్యాజకరుణామూర్తి , అన్నీ తానయిన కర్మసాక్షి అమ్మ ముఖారవిందంలో అదే మందహాసం. ఆ చూపుల్లో అదే కరుణ! " 


ఓలేటి శశికళ 

8-10-2019

సత్యం బ్రూయాత్

 జై శ్రీరామ్


సత్యం బ్రూయాత్

ప్రియం బ్రూయాత్

న బ్రూయాత్

సత్యమ్ అప్రియమ్

ప్రియం చ 

న అనృతం బ్రూయాత్

ఏషః ధర్మః సనాతనః


నాస్తి సత్యసమం బ్రహ్మ

నాస్తి సత్యసమః విష్ణుః

నాస్తి సత్యసమః శివః

నాస్తి సత్యసమం జగత్


సత్యమ్ అదః 

సత్యం ఇదం

సత్యాత్  సత్యమ్ ఉదచ్యతే

సత్యస్య సత్యమ్ ఆదాయ

సత్యమ్ ఏవ అవశిష్యతే


సత్యం బ్రహ్మా సత్యం విష్ణుః

సత్యదేవో మహేశ్వరః

సత్యం సాక్షాత్ పరం బ్రహ్మ

తస్మై శ్రీ సత్యాయ నమః


సత్యజ్యోతి నమస్తుభ్యం

సత్యదే సత్యరూపిణి

సత్యార్థం ప్రార్థయిష్యామి

సత్యం దదాతు  మే సదా


సత్యజ్ఞానం వాచయతు

సత్యమూర్తిం దర్శయతు

సత్యమార్గం ప్రేషయతు

సత్యే అస్మాన్ ప్రవేషయతు


యత్ యత్ సత్యం

తత్ తత్ వదేమ

యత్ యత్ అసత్యం

తత్ తత్ త్యజేమ


యే సత్యమార్గమ్ ఆశ్రయంతి

తే భవంతి యశస్వినః

యే అసత్యమార్గమ్ ఆశ్రయంతి

తే భవంతి అపయశస్వినః


సత్యం ధైర్యేణ వదేమ

సత్యం ధైర్యేణ ప్రసరేమ

సత్యం ధైర్యేణ ప్రచరేమ

తదర్థం సదా సంకల్పయేమ


నాస్తి సత్యసమం బ్రహ్మ

నాస్తి సత్యసమః విష్ణుః

నాస్తి సత్యసమః శివః

నాస్తి సత్యసమం జగత్


సత్యస్య ప్రియః నారాయణః

అతః సత్యనారాయణం భజే

వ్రతేషు ఉత్తమోత్తమం వ్రతం

సత్యనారాయణవ్రతమిహఖలు


సత్యమార్గం దర్శయేమ

సత్యమార్గమ్ ఉత్సాహయేమ 

సత్యమార్గం ప్రవిశేమ

జీవనం పవిత్రం కుర్యామ


సత్యమేవ జయతే

సత్యమేవ ఆశ్రియతే

సత్యమేవ ధార్యతే

సత్యమేవ శిష్యతే


సంభాషణ సంస్కృతమ్

(మాసపత్రికా)


జై శ్రీరామ్

అహల్యాబాయి_హోల్కర్_జయంతి

 #అహల్యాబాయి_హోల్కర్_జయంతి


"ఒక సాధారణ భారతీయ మహిళ అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు అసమానమైన ప్రజ్ఞ కనబరుస్తూ వీరనారిగా రూపాంతరం చెందుతుంది అనడానికి అహల్యాబాయి హోల్కర్ జీవితం ఒక ఉదాహరణ. 


మహారాష్ట్రలోని చౌండి గ్రామంలో జన్మించిన అహల్యాబాయి హోల్కర్ మరాఠా సర్దార్ అయిన ఖండేరావు ని వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధంలో ఆమె భర్త మరణిస్తారు, భర్త మరణానంతరం అహల్యాబాయి మామ గారు యుద్ధ విద్యలు, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై ఆమెకు తర్ఫీదు ఇస్తారు. తర్వాత కొంత కాలానికి ఆమె మామ కూడా మరణిస్తారు, ఆ తర్వాత సంవత్సరం తన ఏకైక కుమారుడు కూడా మృతి చెందడంతో అహల్యాబాయి హోల్కర్ అనూహ్యంగా ఇండోర్ పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. 


ఆమె రాణి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆవిడ ఒక మహిళా సైన్యాన్ని తయారు చేయడంతోపాటు, యుద్ధంలో తన సేనలను ముందుండి నడిపేవారు. తన రాజ్య పరిధిలో లేని అనేక పుణ్యక్షేత్రాలలో ధర్మశాలలు నిర్మించారు. అంతేకాకుండా మహమ్మదీయుల దాడులలో ధ్వంసం కాబడ్డ ఎన్నో దేవాలయాలను ఆవిడ పునః ప్రతిష్ట చేశారు. ముఖ్యంగా సోమనాథ్ లోని ప్రముఖ సోమనాథేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం కాశీ క్షేత్రంలోని విశ్వనాథుని ఆలయం కూడా ఆవిడ నిర్మించినదే, ఇలా మన దేశంలో ఎన్నో తీర్థ క్షేత్రాల సందర్శించినప్పుడు ఆ మహనీయురాలు స్మరణకు రావడం అతి సహజం. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్లోని విమానాశ్రయానికి కూడా ""దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా"" నామకరణం చేశారు. ఇలాంటి మహనీయురాలు వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర చరణాలకు శతకోటి ప్రణామాలు తల్లి 🙏🙏🙏🙏

పూరి జగన్నాథ్ ఆలయంలోని వంట గది

 పూరి జగన్నాథ్ ఆలయంలోని  వంట గది ప్రతీరోజూ అక్షరాలా లక్ష మందికి  కడుపు నింపుతుంది...ఇది ప్రపంచం లోని అతిపెద్ద బహిరంగ పాకశాల...ఇక్కడ జరిగే విశేషమైన పనులు చూడటానికి మన రెండు కళ్లు చాలవు...


ఇక్కడ ప్రతీరోజూ 15000 మట్టి కుండల్లో వంటలు వండుతారు...ఒకరోజు వాడిన కుండలను ఇంకొరోజు మళ్లీ ఉపయోగించరు...ఏరోజు కారోజు కొత్త కుండలను వాడుతారు.... 


పదార్థాలు ఒక ప్రత్యేక పద్ధతిలో వండుతారు...7కుండలను ఒకదానిపై ఒకటి ఒక వరుసలో పేర్చి తాడుతో కట్టి వాటిని పొయ్యి పై ఉంచి వండుతారు...


ప్రతీరోజూ 56 రకాల పదార్థాలు వండి జగన్నాథ స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు... నైవేద్యంగా పెట్టిన ఈ అన్నీ రకాల పదార్థాలను స్వామి వారి మహా ప్రసాదంగా స్వీకరించి రోజూ మధ్యాహ్నం 2-3గంటల ప్రాంతంలో ఆలయం లోని ఆనంద బజార్ అనే ప్రాంగణంలో సందర్శకులకు,భక్తులకు వితరణ చేస్తారు...


ఒక్కరోజు కూడా కొంచం అయినా ఈ మహా ప్రసాదం ఎప్పుడూ వృథా కాదు...


కుల,మతాల కతీతంగా ప్రతీరోజూ లక్ష మందికి కడుపు నింపే ఒక్క మసీదు లేదా చర్చ్ అయినా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ...అందులోనూ ఎవరినీ మతోన్మాదులుగా మార్చకుండా...మతం మార్చకుండా...మన ఆలయాల విశిష్టత ఎంత చెప్పినా చాలదు...దేవుడిని కూడా తమ స్వార్థం కోసం మార్చుకునే గొఱ్ఱెలకు ఏం అర్థం అవుతుంది...సేవ,భక్తి, ఆధ్యాత్మికత లోని గొప్పదనం...


జై జగన్నాథ్...🙏🙏

people would not know this!

 99 % of 99 % of people would not know this!


Indian Medical Association Vs Medical Council of India


IMA Vs MCI

Difference of both?


Indian Medical Association an NGO created by Christian missionaries during British in India


Medical Council of India is a constitutional institution created by the Government of India


The Indian Medical Association was an NGO created by Christian missionaries in India during the British time whose job was to connect Christian doctors in India to promote Christianity in the pretext of medical help in the pretect of service in remote areas


Medical council of India is a constitutional institution created by Govt of India which works for the activities of medical hospitals etc across the country to confiscate or cancel doctors degree etc


Currently the President of the Indian Medical Association is Dr. Austin Jaya Lal who is associated with a Christian missionary


Now you know why IMA is after Ramdev?!


Indian Medical Association Vs Medical Council of India


IMA Vs MCI

Difference of both?


Indian Medical Association an NGO created by Christian missionaries during British in India


Medical Council of India is a constitutional institution created by the Government of India


The Indian Medical Association was an NGO created by Christian missionaries in India during the British time whose job was to connect Christian doctors in India to promote Christianity in the pretext of medical help in the pretect of service in remote areas


Medical council of India is a constitutional institution created by Govt of India which works for the activities of medical hospitals etc across the country to confiscate or cancel doctors degree etc


Currently the President of the Indian Medical Association is Dr. Austin Jaya Lal who is associated with a Christian missionary


Now you know why IMA is after Ramdev?

ధనం అంటే

 ధనం అంటే రూపము లేక వస్తువా శక్తి లక్షణమా లేక మరే దైనానా పరిశీలన. మహా భాగ్యం అనగా ఆరోగ్యమని వేద వచనం. అనారోగ్యం దాపురించిన  అనుభవించుటకు ఏమీ వుండదు. భాగ్యం అనగా పరిమితి అది ఏదైనా కానీ. మహా అనగా అనంతమైన శక్తి వలన ఆరోగ్యం. దీనిని ప్రకృతి వలననే వశపరచుకొనుట తల్లి గర్భం నుండే మూల సూత్రం. ధనం అనగా  అగ్ని, వాయువు, సూర్యశక్తి, వసు భూమి శక్తి ద్వారా సస్య శక్తి సృష్టి చైతన్య శక్తి, యింద్ర యింద్రియశక్తి,బృహస్పతిః,దైవ శక్తి,వరుణ శక్తి నీటి శక్తి, వీటి స్వరూపములు వాటి ద్వారా వచ్చు లక్షణ శక్తిని ధనమని అది శరీరములో ప్రకృతిలో సమ పాళ్ళలో వున్నట్లయితే ఆరోగ్యం. అదే మహా భాగ్యం. శుద్ద లక్ష్మీ మెూక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీః లక్ష్మీ వరలక్ష్మీ ఈశ చ సుప్రసన్న వరదా శుభాః.యిక్కడ మందుగా శుధ్దంతో స్వచఛ్చతో ప్రారంభం మెూక్షమని, తరువాతనే జయం అని అనగా శుధ్ద తత్వ ఙ్ఞానం తో కూడిన పునరావృత్తి రహితరహితే   మెూక్షమని లలితా సహస్రం వలన తెలియుచున్నది. అమ్మ సులువుగా మెూక్షమిస్తుందా? అయితే సృష్టి ఆగిపోవుట అమ్మకు యిష్టంలేదు. అది ధర్మ మార్గమున నడచుటయే తల్లి వుద్దేశ్యం. ధర్మ మార్గమే ప్రకృతి. అధర్మమార్గములో నడచిన తానే లయం చేయుటకు సృష్టించిన వారే లయమునకును కూడా అర్హత కలిగియుండును. పైన తెలిపిన ధనమునకు అర్ధం ప్రకృతి రూపమే శక్తియని ఆ చైతన్య శక్తియే ధనం.ధనం అనగా ఇ అనే శక్తి ++++......వృధ్దియగుట అనంతమగుటయే. అది ప్రకృతి లోనైనా లేక అట్టి ప్రకృతి కారణమైన దేహములోనైనా. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే  వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*మహనీయుని మాటలు..బోధ..*


*(నలభై రెండవ రోజు)*


ఆశ్రమ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి..శ్రీ స్వామివారు ఒక వైపు తన ధ్యానం కొనసాగిస్తూనే విడి సమయాలలో నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు ప్రతి పక్షం రోజులకు ఒకసారి మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారిని కలిసి విచారించి వెళ్లడమూ యధావిధిగా జరుగుతున్నది..అటు మీరాశెట్టి దంపతులు గానీ..ఇటు పద్మయ్య నాయడు గానీ..ఎవరు వచ్చినా..శ్రీధరరావు గారిని ప్రభావతి గారిని కలవకుండా తిరిగి వెళ్లేవారు కాదు..అప్పుడప్పుడూ శ్రీ చెక్కా కేశవులు గారు కూడా శ్రీ స్వామివారి కోసం విజయవాడ నుంచి వచ్చి..కొంత సమయం శ్రీ స్వామివారి సమక్షంలో గడిపి వెళ్లేవారు..శ్రీ స్వామివారి పరిచయం వలన వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరి కలిసిపోయారు..


క్రమంగా మొగలిచెర్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో ..శ్రీధరరావు గారి స్నేహితుల, బంధు వర్గంలో..శ్రీ స్వామివారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది..శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలం తో కొంతమంది మొగలిచెర్ల రావడం..వాళ్లకు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయడం..ప్రభావతి గారి మీద పరోక్షంగా శారీరిక భారం పడసాగింది..వచ్చేవారిని వద్దని చెప్పలేరు..కొంతమంది రెండు మూడు రోజులు తిష్ట వేసి..కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపసాగారు..వాళ్ళను వదిలించుకోవడం శ్రీధరరావు దంపతులకు తలకుమించిన భారంగా మారింది..


ఒకరోజు సాయంత్రం వేళ, శ్రీధరరావు ప్రభావతి గార్లు..శ్రీ స్వామివారి వద్దకు వెళ్లారు..ఆ సమయానికి శ్రీ స్వామివారు ఆశ్రమం కోసం కడుతున్న గోడల మధ్య నిలబడి వున్నారు..వీళ్లద్దరినీ చూడగానే..నవ్వుతూ..


"రండి!..రండి ..మీరొస్తున్నారని అంతర్వాణి చెప్పింది..అందుకే బైటకు వచ్చి నిలుచున్నాను..!..ఆశ్రమవాసానికి అన్నీ  అమరుతున్నాయి..ఏమ్మా!..జటాఝూటం గురించిన చింత పూర్తిగా తీరిపోయిందా?..ఎంత బెంగ పడ్డావు తల్లీ!.." అంటూ..పూరి పాకలోకి వెళ్లి మంచం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారి కెదురుగా బల్ల మీద కూర్చున్నారు..


శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు..ఏదో చెప్పబోతున్నారని శ్రీధరరావుగారు, ప్రభావతి గారు గ్రహించి..సావధానంగా వినడానికి ఉద్యుక్తులయ్యారు..


"జటాఝూటం గురించి నువ్వు ఎంతో ఆరాటపడ్డావమ్మా..ఎందుకు?..ఆ జుట్టు నా ఈ శరీరం తో పాటు నేను చేసిన జప తపాదులలో ఒక భాగమనీ..అందులో మహిమలుంటాయనే ఒక ఆలోచన నీలో బలంగా ఉండిపోవడం వల్ల..అదీకాక నన్ను ఒక గురుస్తానం గా భావించడం వల్ల..నీలో ఆ తపన కలిగింది..ఇందులో కొంత వాస్తవం వున్నా..గురువు యొక్క పరిపూర్ణ అర్ధం ఎంతమంది తెలుసుకుంటున్నారు?..గురువు వాడిన వస్తువులతోనే మనకు మోక్షం సిద్ధిస్తుందా?..లేక గురు వచనాలను బట్టీ పెట్టటం వలన కోరికలు సిద్ధిస్తాయా?..గురు ఉపదేశాన్ని ఆచరించకుండా..ఎన్ని ప్రయత్నాలు చేస్తే.. ఏమి ఫలితం?.."


"గురు శిష్యులలో ఎన్నో రకాలున్నారు..కొంతమంది గురువు నామాన్నే తలుస్తూ వుంటారు..మరికొంత మంది గురువు పాదాలను పదే పదే స్పృశిస్తూ వుంటారు..ఇంకొందరు క్షణానికొకసారి గురువు రూపాన్ని తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటూ వుంటారు..ఇవేవీ నీకు గురు కృప ను సంపూర్ణంగా అందచేయవు.."


"గురువు ఒక పుణ్య తీర్ధం వంటి వాడు..గురువు మనసు ఉల్లాసమై, శిష్యుని పట్ల ప్రేమతో..దయతో..వాత్సల్యం తో నిండిపోయి..తన శరీరము, మనస్సు దైవీ భావం తో పొంగిపోతూ వున్నప్పుడు పలికే పలుకులు..లేదా ఉపదేశించే బోధలను శిష్యులు మంత్రాలుగా గ్రహించాలి..ఉత్తమ శిష్యుడి పై గురుకృప ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుంది..అలాగే గురువు యందు శిష్యుడికీ అనన్య భక్తి ప్రపత్తులుండాలి..శిష్యుడి నుంచి గురువు ఏదో గొప్ప గొప్ప ధనరాసులు కోరుకోడు!..సద్గురువు ఆశించేది శిష్యుని యొక్క శ్రద్ధ!..ఆ శ్రద్ధ లేనినాడు గురువు సమీపం లో వుండే అర్హత కూడా ఉండదు!.."


"నేను, ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అనుసరిస్తూ వుంటాను..దత్తాత్రేయుడు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాసుల నుంచి ఉపదేశం పొందానని చెప్పుకున్నాడు..ఆయన దృష్టిలో పీపీలికాది బ్రహ్మపర్యంతమూ గురు స్వరూపమే..చిన్న పెద్ద తేడా లేకుండా..ఉచ్చ నీచ బేధం పాటించకుండా...ఎందులో ఏ సందేశం వుందో.. దానిని నిష్కర్షగా గ్రహించాడు..తాను గ్రహించిన దానిని తన శిష్యులకు ఉపదేశం చేసాడు.."


"సద్గురుని సేవించటం అంటే..ఆ గురుతత్వాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటం..మనసా వాచా కర్మణా గురూపదేశాన్ని ఆచరించటం.."


"కొన్నాళ్ళు ఒక గురువును సేవించటం..మరి కొన్నాళ్ళు ఇంకొకరిని నమ్మడం..ఇది పరిపక్వత అనిపించుకోదు..సద్గురువును నమ్మి అందుకనుగుణంగా నడుచుకోండి..ఆ గురువే మీకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను ఇచ్చి..మీ సంచిత పాపాన్ని తొలగించి..మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాడు.." అని చెప్పారు..


శ్రీ స్వామివారి ఉపదేశం..వారికి అమృతధారలా అనిపించింది..తమ పూర్వజన్మ సుకృతం మూలానే..తమకు ఇటువంటి అయాచిత భాగ్యం కలిగిందని ఆ దంపతులకు తోచింది..ఈనాటి రోజుల్లో..ఇటువంటి సద్గురు సేవ పొందడం కేవలం దైవ కృపే గాని మరొకటి కాదు అని నిశ్చయానికి వచ్చారు..


పండితులు..పరామర్శలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

*గోత్రం అంటే ఏమిటి?*

 *గోత్రం అంటే ఏమిటి?* 

*గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*సైన్సు ప్రకారము*

*మన పూర్వీకులు*

*గోత్ర విధానాన్ని ఎలా*

*ఏర్పాటు చేశారో గమనించండి*.


*మీరు పూజలో కూర్చున్న* 

*ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా*? 

*మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు*?


*గోత్రం  వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు*- 

*జీన్-మ్యాపింగ్* 

*అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం* 

*పొందిన అధునాతన శాస్త్రమే*!


*గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి* ?


*మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది*? 


*వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము*? 


*కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు*?


*వివాహం తర్వాత కుమార్తె గోత్రం* *ఎలా/ఎందుకు మారాలి*? 

*తర్కం ఏమిటి*?


*ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం*.  

*మన గోత్ర వ్యవస్థ వెనుక* 

*జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం*!


*గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది*.  

*మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం*


*గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం*.


*జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి*, 

*వీటిల్లో సెక్స్ క్రోమోజోములు*

 *(*తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి*) *అని పిలువబడే ఒక జత ఉంది*. 

*ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది*.


*గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు*.


*XY లో - X *తల్లి నుండి* 

*మరియు* *Y తండ్రి నుండి* *తీసుకుంటుంది*.


*ఈ Y ప్రత్యేకమైనది మరియు* 

*అది X లో కలవదు*. 

*కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది* , *అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు*. 

*ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది*. *(తండ్రి* *నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు* ... *అలా*..).


*మహిళలు ఎప్పటికీ Y ను పొందరు*. *అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది*. 


*ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి*...

*గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు* 

*ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది*.....


*ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్  పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి*.


*ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది*.


*కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన* 

*లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం*. *అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు*...


*మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం*. *ఇది*

*మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు*..


*మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు*.


*అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి* ...... *ప్రవర తో సహా చెప్పండి*.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

               *🔥ధన్యవాదములు🔥*

           *మీ కరణం గణేష్ రవికుమార్*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కరోనా సెకండ్ వేవ్ భారత్‎లో

 కరోనా సెకండ్ వేవ్ భారత్‎లో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. దాదాపు రెండు నెలల పాటు మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. మరి, కరోనా మొదటి దశను పకడ్బందీగా ఎదుర్కొన్న భారత్.. రెండో దశలో ఎందుకు ఇబ్బందులు పడాల్సివచ్చింది..? ఫస్ట్ వేవ్ ను అడ్డుకోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మనం.. సెకండ్ వేవ్ ను ఎందుకు ఈజీగా దాటలేకపోయాం..? అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా.. డబుల్ మ్యూటెంట్ అనే పదం భారత్‎లోనే ఎందుకు వినిపించింది..? కరోనా రెండో దశ విధ్వంసం భారత్‎నే ఎందుకు ఇంతగా బాధిస్తోంది..? కరోనా అంటేనే అడ్డూ అదుపూ లేకుండా విస్తరించే మహమ్మారి. దేశాలు, ఖండాలు దాటి విజృంభించే రాకాసి పురుగు. అలాంటి కరోనా.. రెండో దశలో భారత్ నే ఎందుకు ఎక్కువగా బాధించింది..? ఏదో గోడకట్టినట్టు, బోర్డర్లన్నీ మూసేసినట్టు.. డబుల్ మ్యూటెంట్ భారత్ లోనే ఎలా తిష్టవేసింది..? కనీసం పక్కనున్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో కూడా రెండో దశ విధ్వసం కనపడలేదు.. డబుల్ మ్యూటెంట్ పదం వినపడలేదు. అంటే భారత్ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే అంత క్రమశిక్షణ లేకుండా బతుకుతున్నారా..? ఇవన్నీ వింటుంటే ఏదో తేడా జరిగినట్టు అనిపిస్తుంది కదా..! ఎస్.. నాకూ అనిపించింది. అందుకే, ఆ దిశగా కొంచెం లోతుగా వెళ్లి పరిశీలించాలనిపించింది. అలా పరిశీలిస్తూ పోతే.. ఓ భయంకరమైన నిజం బయటపడింది. అదే బయోవార్.

ఎస్.. వీరు విన్నది నిజమే. కరోనా సెకండ్ వేవ్ అనేది భారత్ పై ప్లాన్డ్ బయోవార్..! పైకి బద్ధశత్రువులుగా కనిపిస్తున్నా.. తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి అమెరికా, చైనా కలిసి చేసిన పెద్ద కుట్రగా ఇది కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఒకలా.. ఆ తర్వాత ఒకలా మారిన పరిణామాలే ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. అటు జో బైడెన్, ఇటు జిన్ పింగ్ ఇద్దరు కలిసి మోదీని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరి, ఎందుకు..? మోదీ ఆ ఇద్దరు నేతలకు ఎందుకు టార్గెట్ గా మారారు..? ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ లాగా మోదీ కూడా గ్లోబల్ ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీయింగ్ లకు లొంగడం లేదు కాబట్టి.


ఒక్కసారి వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే.. అసలు నిజం మీకే అర్థమవుతుంది. ముఖ్యాంశంలోకి వెళ్లేముందు.. అసలు డొనాల్డ్ ట్రంప్ ఓటమికి దారితీసిన కారాణాలను ఓసారి పరిశీలిద్దాం. ట్రంప్ అధికారంలో వున్నప్పుడు.. మళ్లీ అధికారంలోకి వస్తే.. నాటో దేశాల బాధ్యతల నుంచి తప్పుకుంటామని ప్రకటించిన విషయం మీకు గుర్తుండే వుంటుంటుంది. అదే ఆయనకు శాపంగా మారింది. యూరప్ అంతటా మిలిటరీ బేస్ లు ఏర్పాటు చేసి.. సంవత్సరాల తరబడి అమెరికా సైన్యాలను అక్కడ మోహరించి ఉంచడం ట్రంప్ కు మొదటి నుంచి ఇష్టం లేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. మొదటి నుంచి అమెరికా జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చారు. ఆయన చర్యలు కూడా అలాగే వుండేవి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం.. పెద్దరికం పేరుతో ఇతర దేశాల కోసం ఏళ్ల తరబడి వేల కోట్లు ఖర్చుపెట్టడం ఆయనకు నచ్చేది కాదు. అందుకే నాటో కూటమి నుంచి అమెరికా వైదొలగుతుంది అని ప్రకటించాడు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్నంత పనీ చేసేవాడే. ఇదే అమెరికా చెప్పుచేతల్లోని గ్లోబల్ ఆయుధ లాబీకి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు చెలరేగాలి. దేశాలు కొట్టుకు చావాలి. బాంబులు విసురుకోవాలి. అప్పుడు అక్కడికి అమెరికా సైన్యం వెళ్ళాలి. తమ ఆయుధాలను అమ్ముకోవాలి. ఇదీ గ్లోబల్ ఆయుధ లాబీ కుతంత్రం. కానీ, ట్రంప్ ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఆయన దిగిపోవాలి.


మరి, ట్రంప్ దిగిపోవాలంటే ఏం చేయాలి..? ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేయాలి. అందుకే, వచ్చిన ఏ అవకాశాన్నీ ఆయుధ లాబీ వదులుకోలేదు. ఇందులో ఒకటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను డెరెక్ షావిన్ అనే పోలీస్ ఆఫీసర్ చంపడంతో ఈ ఉద్యమం మరోసారి ఊపందుకుంది. నల్లజాతీయుల పట్ల శ్వేతజాతీయుల దురహంకారాన్ని ఆయుధంగా చేసుకుని.. ట్రంప్ మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేశారు. ఒక్క పోలీసు చేసిన తప్పు.. ట్రంప్ అధ్యక్ష పీఠానికే ఎసరు పెట్టింది. ఇక్కడ ఎసరు పెట్టింది అనేకంటే కూడా ఎసరు పెట్టేలా చేశారనడం సరిగ్గా సరిపోతుంది. నిజానికి, దేశాధ్యక్షుడు కావచ్చు, ప్రధాని కావచ్చు. దేశంలోని ప్రతి పోలీసును నిలువరించడం సాధ్యమయ్యే పనికాదు. కానీ, ఒక్క పోలీసోడు చేసిన తప్పును.. ట్రంప్ కు విజయవంతంగా అంటగట్టారు. అమెరికాలో అప్పటివరకు అసలు శ్వేతజాతి దురహంకారమే లేనట్టు. నల్లజాతీయులపై మొదటిసారి దాడి జరిగినట్టు విపరీత ప్రచారం కల్పించారు. ఇంకేం.. ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంప్ ఓటమికి బాటలు పడ్డాయి. చైనా రహస్య చేయూతతో గ్లోబల్ ఆయుధ లాబీ అనుకున్నది సాధించింది.


ఇప్పుడు మోదీ విషయానికి వద్దాం. నాడు ట్రంప్ ఓటమికి ఏవైతే శక్తులు వెనుక వుండి పకడ్బందీగా ప్లాన్ చేశాయో. ఇప్పుడు అవే శక్తులు మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే, మోదీ సైతం ట్రంప్ లాగే జాతీయవాదాన్ని భుజానికెత్తుకున్నాడు కాబట్టి. ఆయన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటే.. ఈయన ‘మేకిన్ ఇండియా’, ‘స్టాండప్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ అంటున్నాడు. అదే ఇప్పుడు అగ్రరాజ్య కనుసన్నల్లో నడుస్తున్న ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీలకు నచ్చడం లేదు. ఇక భారతే అన్నీ తయారు చేసుకుంటే, తమ పబ్బం గడిచేదెలా..? తమ ఆయుధాలు, తమ వ్యాక్సిన్లు అమ్ముడుపోయేదెలా..? అందుకే మోదీ వ్యతిరేక ఎజెండాను ఎత్తుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా మొదటి దశ విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. 2020 జనవరి నెల నుంచే పశ్చిమ దేశాల మీడియా ప్రొపగాండ మొదలు పెట్టింది. కరోనా మహమ్మారితో భారత్ లో శవాల గుట్టలు లేస్తాయని జోస్యం చెప్పింది. కనీసం రెండు కోట్ల మందైనా చనిపోతారని అంచనావేసి విపరీత ప్రచారం చేసింది. కానీ, వాళ్ల జోస్యం నిజం కాలేదు. ఫస్ట్ వేవ్ లో భారత్ లో మరణాలు రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడా దాటలేదు. డెత్ రేట్ 1 పర్సెంట్ ను మించలేదు. పైగా హైడ్రోక్లోరో క్వీన్ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసింది భారత్. సాక్షాత్తు ట్రంప్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించాలంటూ మోదీని అభ్యర్థించాడు. నిజానికి, ఇదే సమయానికి, అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. మొదట్లో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్,. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, బ్రిటన్ వంటి దేశాలు అతలాకుతలమవుతున్నాయి. దేవుడిని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామంటూ.. సాక్షాత్తు ఇటలీ అధ్యక్షుడే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, అదే సమయంలో భారత్ మాత్రం పెద్దగా నష్టపోకుండా మొదటి దశ నుంచి బయటపడింది. ఫస్ట్ వేవ్ లో భారత్ కరోనాను కట్టడి చేసిన తీరును చూసి ప్రపంచం నివ్వెరపోయింది. చివరికి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ కూడా.. కొవిడ్ ను ఎదుర్కోవడం ఎలాగో భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాడు.


ఇక వాక్సిన్ విషయానికి వద్దాం. భారత్ కరోనా ఫస్ట్ వేవ్ ను పక్కాగా ఎదుర్కొంది సరే. అత్యధిక జనాభా కలిగిన ఆ దేశానికి కనీసం వ్యాక్సిన్లు అమ్ముకుని అయినా లాభపడదామంటే.. గ్లోబల్ ఫార్మా లాబీకి ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు మోదీ. అన్నీ దేశాల కంటే ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించి వాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టేలా.. స్వదేశీ ఫార్మా కంపెనీలకు వెన్నుదన్నుగా నిలిచాడు. టైం టూ టైం అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాడు. దీంతో భారత్ బయోటెక్ అనుకున్నది సాధించింది. అగ్ర దేశాలకు దీటుగా వ్యాక్సిన్ ను తయారు చేసింది. సరిగ్గా ఇక్కడే గ్లోబల్ ఫార్మా లాబీకి వెన్నులో వణుకుపుట్టింది. ప్రతి ఏటా గ్లోబల్ ఫార్మా చేసే వ్యాపార విలువ ఎంతో తెలుసా..? 4 నుంచి 6 ట్రిలియన్ డాలర్లు. అదే వాక్సిన్ల ద్వారానే 1.25 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. కానీ, భారత్ బయోటెక్ కోవాగ్జిన్,.. లైసెన్స్ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్ వ్యాక్సిన్లు గ్లోబల్ ఫార్మా లాబీ కడుపుకొట్టాయి. ఉత్పత్తిలోనే కాదు.. ధర విషయంలో మిగతా దేశాలకంటే 60 శాతం తక్కువగా ఉండడం.. పశ్చిమ దేశాలకు మింగుడు పడడం లేదు. అదీ చాలదన్నట్టు మోదీ వ్యాక్సిన్ దౌత్యంతో 60 దేశాలకు భారత వ్యాక్సిన్లను పంపిణీ చేయడం జీర్ణించుకోలేకపోయాయి. చివరికి జర్మనీ ఛాన్సిలర్ ఏంజిలా మెర్కెల్.. భారత్ ప్రపంచ ఫార్మా హబ్ గా ఎదిగేదాకా చూడటం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది. దీనిని బట్టి మోదీ పట్ల పాశ్చాత్య దేశాలు ఎంత అక్కసుతో రగిలిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.


అటు, తమ ప్రధాన వ్యాక్సిన్ అయిన ఆస్ట్రా జెనెకా వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం.. మరణాలు సంభవించడం.. అదే సమయంలో అదే కంపెనీ లైసెన్స్ తో భారత్ లో తయారైన కొవీషీల్డ్ ఎలాంటి దుష్ప్రభావాలు చూపకపోవడం.. గ్లోబల్ ఫార్మా లాబీకి పుండుమీద కారం చల్లినట్టయింది. పోనీ, వ్యాక్సిన్ల ఆదాయం పోతే పోయింది.. కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లయినా అమ్ముకుని చిల్లర పోగేసుకుందామంటే.. మోదీ అదీ సాగనివ్వలేదు. మేకిన్ ఇండియాలో భాగంగా.. అన్నీ దేశీయంగానే తయారయ్యేలా ప్రోత్సహించారు. కరోనా ప్రారంభ సమయానికి సాధారణ ప్రజలకు అసలు పీపీఈ కిట్ అంటే ఏంటో తెలియదు. అలాంటిది, ప్రస్తుతం ప్రతిరోజూ లక్షల కొద్ది పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో 500 బిలియన్ డాలర్ల పీపీఈ కిట్లు, మాస్కుల మార్కెట్ కు కూడా గ్లోబల్ ఫార్మాకు భారత్ అవకాశం ఇవ్వలేదు. దీంతోపాటు వాక్సిన్ ఎగుమతులు చేసి సంపాదించాలనుకున్న 1.25 ట్రిలియన్ డాలర్లు కూడా గ్లోబల్ ఫార్మా ఆశల మీద నీళ్ళు చల్లింది. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. దీంతో తమ కీలుబొమ్మ బైడెన్ అధికారంలోకి రాగానే తన అక్కసు ప్రదర్శించింది.


ఎప్పుడైతే 2021 జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారం చేశాడో.. ఆ తర్వాత కొద్దిరోజులకే వ్యాక్సిన్ ముడిసరుకుల ఎగుమతులపై నిషేధం విధించేలా.. గ్లోబల్ ఫార్మా లాబీ ఆయనపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించింది. తమ వ్యాక్సిన్ల తయారీకి ముడిసరుకు సరిపోవడం లేదనే సాకుతో ఇమ్మడిముబ్బడిగా రా మెటీరియల్ బ్లాక్ చేసింది. అసలు ట్రయల్సే పూర్తి కాని తమ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కోసం.. టన్నుల కొద్ది రా మెటీరియల్ ముందే బుక్ చేసి పెట్టుకుంది. ఇలాగే మరికొన్ని అమెరికన్ ఫార్మా కంపెనీలకు భారీ మొత్తంలో ఆర్డర్ చేసింది. దీంతో ఓపెన్ మార్కెట్ లో భారత్ వ్యాక్సిన్ ముడిసరుకు దొరకడం కష్టమైంది. ఫలితంగా భారత్ లో వ్యాక్సిన్ తయారీ నెమ్మదించింది. ఇది వ్యాక్సిన్ కొరతకు దారితీసింది. ఇదంతా తెలియన రాష్ట్రాలు కేంద్రం దుమ్మెత్తిపోయడం ప్రారంభించాయి. ఇలా మనలో మనకు తగువుపెట్టి.. మోదీకి మచ్చతెచ్చేందుకు గ్లోబల్ ఫార్మా ప్రయత్నించింది.


ఇదిలావుంటే, భారత్ లో సెకండ్ వేవ్ ఇంతలా విజృంభించడానికి కూడా గ్లోబల్ ఫార్మా లాబీ కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో విజృంభిస్తున్న కరోనా రకం.. రెండుసార్లు మార్పు చెందినట్టు పరీక్షల్లో తేలింది. ఇలా ఒకే వైరస్ రెండుసార్లు మ్యూటేట్ కావడం.. కరోనా వెలుగుచూసిన ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ జరగలేదు. అసలు డబుల్ మ్యూటెంట్ అన్న పదమే భారత్ లో తప్ప ఎక్కడా వినిపించలేదు. అంటే, ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని చికెన్ నెక్ ప్రాంతం గుండా ఈ మ్యూటెంట్ ను దేశంలోకి ప్రవేశపెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హడావుడిలో వున్న బెంగాల్ అయితేనే ఇందుకు సరైన ప్రదేశమని.. అక్కడి నుంచి అయితేనే ఎవరికీ అనుమానం రాదని.. భావించి.. అక్కడి నుంచే భారత్ లోకి డబుల్ మ్యూటెంట్ వైరస్ ప్రవేశపెట్టారన్నది నిఘా వర్గాల సమాచారం. లేకపోతే, ఒక వైరస్, అదీకూడా ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను కబళిస్తున్న వైరస్.. కేవలం భారత్ లోనే డబుల్ మ్యూటేషన్ ఎలా జరగడం విడ్డూరమే కదా..! దీనిపై భారతీయ శాస్త్రవేత్తలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఇది కచ్చితంగా భారత్ పై అగ్రదేశాలు కలిసికట్టుగా చేస్తున్న బయోవార్ గా అనుమానించక తప్పదు. లేకపోతే, కేవలం డబుల్ మ్యూటెంట్ భారత్ లోనే ఎలా విజృంభిస్తుంది..? పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి సరిహద్దు దేశాల్లో దాని ప్రభావం కొంచెమైనా కనపడకపోవడమేంటి..? బైడెన్ రహస్య ఫ్రెండిషిప్ తో ఇది భారత్ పై చైనా చేసిన కుట్రగా రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


మరి, అమెరికా, చైనా బద్ధ శత్రువులు కదా..! ఎలా మద్దతు ఇచ్చిపుచ్చుకుంటాయనే అనుమానం రావొచ్చు. అయితే, నువ్వు లేదంటే నేను.. మధ్యలో మూడోవాడికి అవకాశం ఇవ్వొద్దన్న సామెత ఉండనే వుంది కదా..! ఇదే ఇప్పుడు జరుగుతున్న జగన్నాటకం. నిజానికి, జో బైడెన్ విజయం వెనుక చైనా హస్తం వుందన్నది సుస్పష్టం. పైగా బైడెన్ మంత్రివర్గంలోని అధికారులంతా కరుడుగట్టినన కమ్యూనిస్టు భావజాలం కలిగినవారే. కాబట్టి, పైకి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మోదీ ఇప్పుడు వారికి ఉమ్మడి శత్రువు. ఆయన భారత ప్రధానిగా వుంటే.. అటు గ్లోబల్ ఫార్మా, ఇటు ఆయుధ లాబీలతో పాటూ.. ఆయిల్ లాబీ పప్పులు ఉడకడం లేదు. అందుకే మూకుమ్మడిగా కుట్రలు చేస్తున్నాయి. వీరి కుట్రలకు, విదేశీ బిస్కెట్లకు అలవాటు పడిన పెంపుడు మీడియా ఓవైపు.. అధికారం కోసం ఆవురావురంటున్న ఇటలీ ఫ్యామిలీ ఓవైపు ఇతోధికంగా సాయం చేస్తున్నాయి. దేశంలో కరోనా మరణాలను మాత్రమే హైలైట్ చేయడం, భారతీయ వ్యాక్సిన్లపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం వీరికి నిత్యకృత్యంగా మారింది. ది గ్రేట్ విపక్ష ఇటలీ ఫ్యామిలీలో ఇప్పటివరకు ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. కొవాగ్జిన్ తీసుకుంటే ఎక్కడ బైడెన్, జిన్ పింగ్ మనసులు గాయపడతాయోమోనని పాపం వాళ్లు వ్యాక్సిన్ కూడా తీసుకోవడం లేదు. బహుశా భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వేయించుకుంటారేమో. మోదీని గద్దె దించేందుకు ఎంతగా రగిలిపోతున్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా..?


అమెరికాలో ఒక నల్ల జాతీయుడు అమెరికన్ పోలీసు చేతిలో హత్యగావింపబడటం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని అక్కడ చైనా అనుకూల లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చింది. ఆ లెఫ్ట్ వింగ్ ను నడిపిస్తున్న గ్లోబల్ ఆయుధ, ఆయిల్, ఫార్మా లాబీలే.. దేశంలో కాంగ్రెస్ మద్దతుతో కరోనాను పెనుభూతంగా చూపిస్తున్నాయి. ఇందుకు మోదీనే బాధ్యుడిగా చిత్రీకరిస్తున్నాయి. కానీ, ఒక్కటి మాత్రం నిజం. మోదీ ఉన్నంత కాలం DRDO అద్భుతాలు చేస్తుంది. త్రివిధ దళాలు శత్రువుకు చుక్కలు చూపిస్తాయి. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడంలోనే కాదు.. విపత్కర పరిస్థితుల్లో పౌరులకు రక్షణగా నిలుస్తాయి. కొవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి. కరోనా ఔషధాలను కూడా కనిపెడతాయి. విదేశీ కుట్రలను వెలుగులోకి తెస్తాయి. అందుకే మోదీని ఏదో విధంగా దించి భారత్ ను అభాసుపాలు చేయడమే గ్లోబల్ ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీల లక్ష్యం. మరి, ఈ కుట్రలను ఛేదించుకొని మోదీ నిలుస్తారా..? లేక ట్రంప్ లా బలవుతారా..? అన్నది మనమీదే ఆధారపడి ఉంది.