4, మార్చి 2023, శనివారం

మాతృభాషాదినోత్సవం

 *ప్రపంచ మాతృభాషాదినోత్సవం సందర్భంగా పంచపద్యరత్నాలు*


గోగులపాటి కృష్ణమోహన్

సూరారంకాలని, హైదరాబాదు.


ఆవె||

తెలుగుభాషలోని తేటతెల్లనిపదం

వ్యాకరణముతోడ వాసికెక్కి

పద్యసంపదగల పదునైన భాషయౌ

జ్యోతి నవ్య కృష్ణ జూఁడుమఖిల


ఆవె||

మరువకండి మీరు మాతృభాషనెపుడు

భావివార్కితెలుపు భాధ్యతగొని

మధురమైనభాష మన తల్లిభాసయౌ

జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల


ఆవె||

అమ్మ నాన్న పలుకు లానవాలేలేదు

మాతృ భాష మీద మక్కువేది

తెలుగు మాటలాడు తెలుగు ఘనతచాటు

జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల


ఆవె||

అమ్మ నాన్న యనెడి యాత్మీయ పలుకులు

పద్య సంపదగల భాష మనది

తేనెలూరుభాష తేటతెలుగుభాష

జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల


కం||

తెలుగంటే నాకు భయము

తెలుగంటే వ్యాకరణము తెలుగే కష్టం

బిలలో తెలుగన ప్రేమయె

తెలుగును నే నేర్చుకొందు తెలియగ కృష్ణా



ప్రపంచ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో...

మీ

*గోగులపాటి కృష్ణమోహన్*

కవి, రచయిత, జర్నలిస్టు

9700007653

గుండెపోటు

 *గుండెపోటు - సొరకాయ* ️


*3000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో చాలా పెద్ద మహర్షి ఉండేవాడు.*

 *అతని పేరు మహర్షి వాగ్వత్ జీ !!*


 *అతను ఒక పుస్తకం రాశాడు*

 *దాని పేరు అష్టాంగ*

*హృదయం !!*

 *(అస్తాంగ్ హృదయం)*


 *మరియు ఈ పుస్తకంలో అతను* *రోగాలను నయం చేయడానికి* *7000* *సూత్రాలు వ్రాసాడు!*

 *అందులో ఇది ఒకటి మాత్రమే!!*


 *వాగ్వత్ జీ వ్రాశారు, ఎప్పుడైనా గుండె చంపబడుతుందని!* *అంటే గుండె గొట్టాలలో అడ్డంకులు మొదలవుతాయి!*


*అంటే రక్తంలో ఎసిడిటీ పెరిగిపోయిందని!*

*మీరు అసిడిటీ  అని అర్థం చేసుకుంటారు!*

 *దీనినే ఇంగ్లీషులో అసిడిటీ అంటారు!!*

 *అసిడిటీ రెండు రకాలు!* 


 *ఒకటి కడుపులోని ఆమ్లత్వం!*


 *మరియు ఒకటి రక్తం యొక్క ఆమ్లత్వం !!*


 *మీ కడుపులో ఆమ్లత్వం పెరిగినప్పుడు!* *అప్పుడు మీరు ఇలా చెబుతారు*

 *కడుపులో మంటగా ఉంది !!*

 *పులుపు పుల్లటి త్రేనుపు వస్తోంది!*

 *నోటి నుండి నీరు వస్తోంది!*

 *మరి ఈ ఎసిడిటీ మరింత పెరిగితే!*

 *హైపర్‌యాసిడిటీ ఉంటుంది!*

 *మరియు కడుపు యొక్క ఆమ్లత్వం పెరిగినప్పుడు మరియు రక్తంలోకి వచ్చినప్పుడు, అప్పుడు రక్తంలో ఆమ్లత్వం ఉంటుంది.*

 *మరియు రక్తంలో ఆమ్లత్వం పెరిగినప్పుడు, ఈ ఆమ్ల రక్తం గుండె గొట్టాల నుండి బయటకు రాలేకపోతుంది!* *మరియు ట్యూబ్‌లలో అడ్డుపడుతుంది!*

 *అప్పుడే గుండెపోటు వస్తుంది!!  అది లేకుండా గుండెపోటు వచ్చేది కాదు!!*

 

*ఏ వైద్యుడూ చెప్పని ఆయుర్వేదంలోని అతి పెద్ద నిజం ఇదే!*

 *ఎందుకంటే దీని చికిత్స చాలా సులభమైనది!!*


 *చికిత్స ఏమిటి ??*


*రక్తంలో అసిడిటీ పెరిగినప్పుడు వాగ్వట్ జీ రాసారు!* *అప్పుడు మీరు ఆల్కలీన్‌గా ఉండే వాటిని వాడండి!*

*రెండు విషయాలు మీకు తెలుసా!*

 *ఆమ్ల మరియు ఆల్కలీన్*


 *ఇప్పుడు మీరు యాసిడ్ మరియు బేస్ కలిపితే ఏమవుతుంది!*


 *మీరు యాసిడ్ మరియు ఆల్కలీన్ కలిపితే ఏమి జరుగుతుంది ????**


*తటస్థము*

*అది అందరికి తెలిసిందే!!*


*కాబట్టి వాగ్వట్ జీ రాశారు!* 

*రక్తంలో ఆమ్లత్వం పెరిగితే, క్షార పదార్థాలు తినండి!*

*అప్పుడు రక్తం యొక్క ఆమ్లత్వం తగ్గిపోతుంది*


*కాబట్టి జీవితంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉండదు!!*


*ఇదంతా కథ!!*


*ఇప్పుడు మీరు అడిగేవి ఏవి ఆల్కలీన్ పెరగాలి అంటే మనం తినాలి ?????*


*మీ వంటగదిలో ఆల్కలీన్‌గా ఉండే ఇలాంటివి చాలా ఉన్నాయి!*

*అత్యంత క్షార గుణాలున్నవి అన్నీ ఇంట్లో తేలిగ్గా దొరుకుతాయని కనుక ఇది మనందరికీ తెలుసు  సొరకాయ!!*

 *దీనినే దూధి అని కూడా అంటారు!!*

*ఇంగ్లీషులో బాటిల్ గార్డ్ అంటారు!!!*

*మీరు కూరగాయగా తింటారు!* *ఇంతకంటే క్షారగుణం మరొకటి లేదు!*

*కాబట్టి మీరు రోజూ సొరకాయ రసం తీసి తాగండి !!* 

*లేదా పచ్చి సొరకాయ తినండి !!*

*రక్తంలోని అసిడిటీని తగ్గించే గొప్ప శక్తి సొరకాయకు ఉందని వాగ్వట్ జీ చెప్పారు.* 


 *ఎంత తినాలి /త్రాగాలి?????????**


*రోజుకు 200 నుండి 300 mg త్రాగండి!!*


*మీరు ఎప్పుడు తాగుతారు?*


*ఉదయం ఖాళీ కడుపుతో (మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత) త్రాగవచ్చు !!* 

*లేదా అల్పాహారం అరగంట తర్వాత తాగవచ్చు !!*

 *మీరు ఈ సొరకాయ రసాన్ని మరింత ఆల్కలీన్‌గా చేయవచ్చు!*

 *దీనిలో 7 నుంచి 10 తులసి ఆకులు వేయండి* 

*తులసి చాలా ఆల్కలీన్!!*

*దీనితో 7 నుంచి 10 పుదీనా ఆకులను కలపవచ్చు!* *పుదీనా కూడా చాలా క్షారమే!* *దీనితో మీరు బ్లాక్ సాల్ట్ లేదా సైన్ధవఉప్పు వేయండి!*

 *ఇది చాలా ఆల్కలీన్ కూడా!!*

*అయితే గుర్తుంచుకో*

*ఉప్పు నలుపు లేదా రాయి లాగా ఉండాలి !* 

*ఆ ఇతర అయోడైజ్డ్ ఉప్పును ఎప్పుడూ వేయవద్దు !!* 

*ఈ అయోడైజ్డ్ ఉప్పు ఆమ్లమైనది !!!!!*


 *కాబట్టి మిత్రులారా, మీరు తప్పకుండా ఈ సొరకాయ రసాన్ని తీసుకోవాలి !!*


 *2 నుండి 3 నెలల వ్యవధిలో మీ హార్ట్ బ్లాక్‌లన్నింటినీ నయం చేస్తుంది !!*


 *21వ రోజు మీరు చాలా ఎఫెక్ట్‌ను చూడటం ప్రారంభిస్తారు!!!*


 *మీకు ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు!!*


 *దీనిని మన భారతదేశంలోని ఆయుర్వేదంతో ఇంట్లోనే చికిత్స చేస్తారు !!*


 *మరియు మీ విలువైన శరీరం మరియు లక్షల రూపాయలు ఆపరేషన్ నుండి ఆదా చేయబడతాయి !!*



బాల్యం

 💐బాల్యం💐


🌹*బాల్యంలో మనం విన్న  పెద్దల మాటలు*🌹


నిన్న మధ్యాహ్నం  భోజనం చేస్తుంటే  పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటు న్నట్లున్నారు. బహుశా మీ లక్ష్మక్కో చెల్లో తలుచు కున్నారేమో అంది మా ఆవిడ.


"అయ్యుండొచ్చు" అన్నాను నేను కాస్త నిమ్మళించాక.


అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. 'ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళూచేతులు శుభ్రంగా కడుక్కున్నాకే,  పీటల మీద మఠం వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం'. 


వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు,గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి.  మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా  తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి.  కట్టె పొయ్యల మీదే వంటంతా...


అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది. "ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా" అంటూ అందరినీ కనుక్కుంటూ వడ్డించేది.


ఒకవేళ భోంచేస్తున్నప్పుడు ఎవరికైనా పొలమారితే గానీ, పచ్చడి కారానికి ఎక్కిళ్ళు వస్తేగాని, పక్కనే కూచున్న అమ్మ కొన్ని నీళ్లు తీసుకుని వారి నెత్తి మీద జల్లి  "నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు?" అని అడిగేది.


నేను మా చెల్లి అయితే విజయనగరం అని,  చెప్పేవాళ్ళం. కాస్త స్థిమిత పడ్డాక నా పేరుకి, ఊరు పేరుకీ,  ఎక్కిళ్ళకి ఏమి సంబంధం అని ఆడిగితే,  "ఏమో తెలీదు గానీ నీకు ఎక్కిళ్ళు పోయాయా లేదా" అని తిరిగి ప్రశ్న వేసేది అమ్మ. నిజంగానే గమ్మత్తుగా ఎక్కిళ్ళు ఆగిపోయేవి.


అమ్మ నవ్వేసి " ఊరికే...నీ దృష్టి మళ్ళిద్దామని" అనేది నవ్వుతూ


అలాగే "అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు" అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం వంటికి పట్టదుట.


"అన్నం తింటూ మధ్యలో కంచం దగ్గిరనుంచి లేవకూడదు" అనేవారు.


కంచంలో ఏమీ వదిలేయకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటినుంచే తెలుసుకున్న తరం మనది.


 మనతో కూచున్న అందరూ అన్నం తినడం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం.


అమ్మ మాత్రం అందరం తిన్నాక,  తానూ అన్నం తినేది.


రాత్రిపూట "ఉప్పు" అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు.  ఎందులోనైన ఉప్పు తగ్గినా, మజ్జిగలోకి కావలసి వచ్చినా, "కాస్త చవి చూపించు" అనేవారు. కంచములో ఒక పక్కకి వేసేవారు గానీ చేతిలో వేసేవారు కాదు.


అలాగే ఆదివారం రోజూ, మళ్లీ ప్రతిరోజూ రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి నిషేధం. తినకూడదు అనేవారు.


వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ల  చేతికి కత్తి ఇచ్చి  ఒక చిన్న గాటు పెట్టించిన  తరవాత ఆ కాయని ముక్కలు చేసేది అమ్మ


చీకటి పడితే చెట్టు మీద చేయి వేయవద్దు అనేవారు. పూలు గానీ, పళ్ళు గానీ, కరివేపాకు గానీ సూర్యాస్తమయం ముందే కోయాలి అనేవారు. 


పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాలని ఊపవద్దు అనేవారు. అమ్మాయికి పుట్టిన పిల్లలకి నామకరణం చేసిన తర్వాత   మూడో నెలలోనో, ఐదో నెలలోనో వారి నాయనమ్మగారి ఇంటికి సారె పెట్టి మనవళ్లను పంపిస్తు, ఉయ్యాలలో చందనం బొమ్మ పెట్టే వైనం ఇప్పటికీ జ్ఞాపకం. 


తలంటు పోసుకోవానికి నూనే రాసుకున్న తర్వాత యేమీ తిన్నా కాఫీ లాంటిది తాగినా పెళ్ళపుడు వర్షం వస్తుంది అనేవారు. 


ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా "అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి"   అంటూ దండం పెట్టుకుని మమ్మల్నీ అలా చేయమనేది  అమ్మ.


వినాయకచవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్లి  ఆ ఇంటి వినాయకుడిని చూసి  రమ్మనేవారు. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుంది అనేవారు.


నాన్నగారూ ఏదైనా పని మీదో, లేక ఏదైనా ఊరికో ప్రయాణమవుతుంటే శకునం చూసి మరీ రోడ్ ఎక్కేవాళ్ళు.


 "పాలమ్మాయి వస్తోంది. మంచిది వెళ్ళిరండి"అని అమ్మ అనేది. ఎవరూ ఎదురు రాకపోతే అమ్మ గానీ, అక్క గానీ అటు వెళ్లి ఇటు ఇంట్లోకి శకునంగా రావడం కూడా జరిగేది మధ్యేమార్గంగా.


గడప మీద కూచోకూడదు  అని చెప్పేవారు. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు.


ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని  ఉండకూడదు అనేవారు. 


దొడ్లో కాకి ఆగకుండా కావు కావుమంటుంటే చుట్టాలు వస్తారు అనుకునేవాళ్ళం. అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే "రండి రండి" అని  సంతోషంగా ఆహ్వానిస్తూనే "పొద్దున్న కాకి అరచినప్పుడే అనుకున్నా ఎవరో ఇంటికి వస్తారని..." అనేవాళ్ళం.


ఒక కాకి చనిపోతే దాని చుట్టూ పది కాకుల గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావమో, సంతాపమో తెలియచేస్తే వాటి స్నేహాభావాన్ని మెచ్చుకున్నాము. ఆబ్దికాలలో కాకి పిండం తిన్న కాకులను మన పితృదేవతలలాగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం.


ఇప్పటి తరానికి ఇవన్నీ చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు లాగ అనిపించవచ్చు గానీ ఇవన్నీ వింటూ, చూస్తూ, ఆచరిస్తూ పెరిగిన తరం మనది. ఎందుకు అని ఎదురు తిరగలేదు, ఇప్పటి వారిలా వితండవాదం చేయలేదు, చాదస్తాలు  అని కొట్టి పారెయ్య లేదు.

పెద్దల మాట చద్ది మూట అనుకుంటూ ఆచరించాం. హాయిగా ఆనందంగా పెరిగాము...


కాదంటారా?

పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం

 కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం


🔔🔔🔔🔔🔔🔔


తమిళనాడులోని ఓ పుణ్యక్షత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.


వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు


కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.


అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.


ఆనంద తాండవం


చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు.


అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.


శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు.


అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు.


అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.


స్వామివారిని సేవిస్తే


పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.దీనికి విభాసిత మహర్షి , వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు.


దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.


ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.


ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా


ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి " చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత " అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.


మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో ...


ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు.


దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.


ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.


5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత


ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది.


ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5 5.


వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు.


ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు.


ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి.


అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి.


వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు.


ఇక్కడ 5 రథాలు ఉన్నాయి.


ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు.


ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.


పాతాళ వినాయకుడుశ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విగ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.


ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.


వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు :


ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.


సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ట చేసిన 28 శివలింగాలు


శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.


ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.


ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే


ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.


దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.


చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.సేకరణ


🔔🔔🔔🔔🔔🔔 🔔🔔🔔🔔🔔 🔔🔔🔔🔔🔔


కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం 

పుంగనూరు 

జ్ఞానం ప్రధానమే కానీ

 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


            _*సుభాషితమ్*_


శ్లో.

*జ్ఞానం ప్రధానం న తు కర్మ హీనం*

*కర్మ ప్రధానం న తు బుద్ధి హీనమ్l*

*తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధిః*

*న హ్యేక పక్షో విహగః ప్రయాతిll*


తా॥

*"జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం నిరుపయోగము. కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే. జ్ఞాన, కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు. ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!"*


*శాస్త్రస్య గురువాక్యస్య*

*సత్యబుద్ధ్యవధారణం |*

*స శ్రద్ధా కథితా సద్భిర్-*

*యయా వస్తూపలభ్యతే ।।*

                  - వివేకచూడామణి-26


భావం: ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రములలో గురువాక్యములో అచంచలమైన నమ్మకమే *శ్రద్ధ*. ఇటువంటి దృఢమైన నమ్మకముంటే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి. ఆత్మ లాభము కలుగుతుంది.

గురూపదేశాన్ని శ్రద్ధతో గ్రహించేవానికే జ్ఞానం లభిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు *శ్రద్దావాన్ లభతే జ్ఞానం* అన్నాడు.


అశ్రద్ధతో ఈశ్వరద్వేషంతో తలపెట్టిన దక్షయజ్ఞం సత్ఫలితాలనివ్వకపోగా ఘోరమైన విధ్వంసంతో ముగిసింది.

ఋతుశూల

 ఋతుశూల హరించుటకు నేను ప్రయోగించిన సులభ ఔషధ యోగం  - 


    ఈ ఋతుశూల అనునది చాలామంది స్త్రీలలో కనిపిస్తుంది. దీనిని ముట్టునొప్పి అనికూడా అంటారు. ఇది చాలా భయంకరమైన నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇది కేవలం బహిష్టు సమయంలో వస్తుంది. కొంతమంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడతారు. మరికొంతమందికి ఈ ముట్టునొప్పి ఉండటం వలన సంతానం ఉండదు.  


      ఇప్పుడు మీకు నేను చెప్పబోయే చికిత్స నా అనుభవపూర్వకం . మరియు అతి సులువు అయినది. దీనిని ఉపయోగించి చాలమంది సమస్య నివారించగలిగాను . 


    ముట్టునొప్పి ఉన్నవారు తెల్లజిల్లేడు పాలు 5 చుక్కలు చక్కెరకేళి అరటిపండులో గుంటలా చేసి అందులో వేసుకొని ఉదయం పూట మాత్రమే 4 రోజులు సేవించినచో ఋతుశూల తగ్గిపోవును . 


 మరియొక నా అనుభవ యోగం  - 


    ముదురు చింతచెట్టు బెరడు తెచ్చుకొని ఆ బెరడుని కాల్చి బూడిద చేయవలెను.   వేరే కర్రపుల్లలు వాడరాదు . ఆ బూడిదని జల్లించి ఆ పొడిని భద్రపరచుకొని ఇంకో రెండు రోజుల్లో బహిష్టు అవుతారు అనగా ఆ బూడిదని ఒక గ్రాము మోతాదుగా ఉదయం పూట కొంచెం నిమ్మరసంలో కలిపి తీసికొనవలెను . మరలా సాయంత్రం పూట ఒక గ్రాము తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి . బహిష్టు మూడు రోజులు కూడా ఇలాగే సేవించాలి . దీనివల్ల ముట్టునొప్పి పూర్తిగా తగ్గును. సంతాన యోగ్యత కలుగును. 


   పైన సూచించిన రెండు యోగాలతో చాలా మందికి చికిత్స చేశాను . వీటిలో మీకు ఏది సులభంగా అనిపిస్తే దానిని పాటించండి.


        


  

ఎక్కిళ్ళు

 శ్లోకం:☝️

*పూరత్రయం వినేచ్ఛవాసం*

 *నిమేషార్ధం చ ధారణం ।*

*ముఖేన రేచనం మందం*

 *కార్యం హిక్కానివృత్తయే ॥*

 - అరవింద అయ్యర్


భావం: డయాఫ్రామ్ (diaphragm) యొక్క అసంకల్పిత సంకోచాల వల్ల కలిగే ఎక్కిళ్ళు (hiccups), ఎప్పుడైనా సంభవించవచ్చు. మరి వాటిని ఆపడం ఎలా? ముక్కుతో వరుసగా మూడుసార్లు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని, ఆ శ్వాసను 15-30 సెకన్ల పాటు (కుంభకము లాగా) నిలుపుకుని తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా విడవండి. వెంటనే ఎక్కిళ్ళు మాయం! అంటున్నారు డాక్టర్ ఆండ్రూ డి. హుబెర్మాన్, న్యూరోబయాలజీ ప్రొఫెసర్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం.

3, మార్చి 2023, శుక్రవారం

*పరమాచార్య పరిపూర్ణ కటాక్షం!*

 *పరమాచార్య పరిపూర్ణ కటాక్షం!*

                    ➖➖➖


చాలా ఏళ్ళక్రితం ఒకరోజు మాకు పరమాత్మ కంచి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం లభించింది. 


ఒకసారి నేను, నా భార్యా,కూతురుతో కలిసి కాంచీపురం వెళ్ళాము. పరమాచార్య స్వామి, పుదు పెరియవ, బాల పెరియవ ముగ్గురిని దర్శించాము. రాత్రి చంద్రమౌళీశ్వర పూజ చూశాము. మరుసటి రోజు ఉదయం మహాస్వామివారి విశ్వరూప దర్శనం, మరియు గోపూజ తిలకించాము. 


అమ్మవారి దేవస్థానంలో అప్పుడే కొత్తగా విడుదల చేసిన ముగ్గురు ఆచార్యులూ కలిగి ఉన్న చిత్రపటాలను రెండింటిని తీసుకున్నాము. వాటిని పరమాచార్య స్వామివారికి ఇచ్చి వారి అనుగ్రహం పొందాలని శంకర మఠానికి వెళ్ళాము. 


స్వామివారిని దర్శించుకుని ఆ చిత్రపటాలను ఇచ్చి ఆశీస్సులు కోరాము. వాటిని తీసుకుని స్వామివారు, “వీటిని ఎక్కడ కొన్నారు?” అని అడిగారు. బహుశా వీటిని స్వామివారు మొదటిసారి చూస్తున్నారు కాబోలు. 


ఒక పరిచారకుణ్ణి పిలిచి, వాటికి ఫ్రేము కట్టి మఠంలో రెండు చోట్ల వాటిని పెట్టమని ఆదేశించారు. మేము ఇచ్చిన చిత్రపటాలు శ్రీమఠం గోడలపై ఉంటాయని మాకు ఎల్లలు లేని ఆనందం కలిగింది. ఏమి పరమాచార్య స్వామి కరుణ! మఠంలో వేయడానికి బంగారు ఫ్రేముకట్టి ఇచ్చే భక్తులు ఎంతమంది లేరు? అటువంటప్పుడు ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వడం మా పూర్వజన్మల అదృష్టం. 


శ్రీకృష్ణ పరమాత్మ సుధాముని (కుచేలుడు)తో అడిగి మరీ అటుకులు తీసుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. 


రెండు పటాలకు ఫ్రేము కట్టించి, మాకోసం అని మరొక ఫోటో కొనుక్కొని మద్యాహ్నం ఒంటిగంటప్పుడు శ్రీమఠానికి వెళ్ళాము. మూడున్నరకు మహాస్వామి వారు వచ్చి కూర్చున్నారు. స్వామికి ఇవ్వమని మూడు చిత్రపటాలను అక్కడున్న శిష్యునికిచ్చాము. 


ఫ్రేము కట్టిన పటాలను మఠం గోడలకు వేలాడదీయమని స్వామివారు ఆదేశించారు. ఇంకొక చిత్రపటాన్ని స్వామివద్దనే ఉంచుకున్నారు. ఈ చర్యకు కారణం మాకు తరువాత తెలిసింది. ఇది కేవలం శంకారాచార్యులు నలుగురు శిష్యులతో కలిసి చేసే వేదాంత విచారణను మాకు చూపించాలనే స్వామివారు అలా చేశారు.


కొద్దిసేపట్లోనే మాకు ఆ పరమాద్భుతమైన దృశ్యం కనిపించింది. 


పరమాచార్య స్వామివారు వచ్చి ఆదిశంకరులు లాగా కూర్చున్నారు. వారిముందు బాల పెరియవ కూర్చున్నారు. ఇద్దరు వేద పండితులు చిన్నస్వామి పక్కనే కూర్చున్నారు. వేదాంత విచారం మొదలుపెట్టారు. 


ఆదిశంకరులు తమ శిష్యులకు ఉపదేశించే దృశ్యమే మాకు అగుపించింది. 


తైత్తరీయోపనిషత్తులోంచి బ్రహ్మాత్మానంద అనుభవం గురించిన ఒక శ్లోకాన్ని చిన్న స్వామివారు చెప్పారు. వాటికి పరమాచార్య స్వామివారు వ్యాఖ్యానం చేశారు. 


దక్షిణామూర్తి గురించి “గురోస్తు మౌనం వ్యాఖ్యానం” అని చెబుతాము కదా? కాని మాకు ఇక్కడ “గురోస్తు లలిత వ్యాఖ్యానం” లాగా తోచింది. అప్పుడు జరిగిన వేదాంత విచారంలో ఇప్పటికీ నాకు ఒక శ్లోకం గుర్తు ఉంది. “తద్ బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత” దీనికి చిన్నస్వామి వారి వ్యాఖ్యానం: “పరిమరీయతే ఇతి పరిమరః - వాయురిత్యర్థః” పరిమరం అంటే వాయువు అని చిన్నస్వామి వారు చెప్పారు. 


చిన్నస్వామి పక్కన కూర్చున్న ఇద్దరు పడితులు కూడా ఈ వేదాంత వాదనలో పాల్గొన్నారు. 


మేము ముగ్గురము ఈ బ్రహ్మానంద అనుభవాన్ని దాదాపు గంట పాటు అనుభవించాము. 


తరువాత మహాస్వామివారు చిన్నస్వామికి, ఆ ఇద్దరు పండితులకు పెరుగు నింపిన కొబ్బరి చెక్కలను ప్రసాదంగా ఇచ్చారు. 


కేవలం మాకు ఈ అనుభవం ఇవ్వడానికే పరమాచార్య స్వామివారు చిత్రపటముల ఫ్రేము వంకతో మమ్మల్ని ఇంతసేపు మఠంలో ఉంచుకున్నారని తెలుసుకుని మాకు అద్వితీయమైన ఆనందం కలిగింది. 


తరువాత ఆ మూడవ చిత్రపటాన్ని మంత్రాక్షతలతో పాటు స్వామి వారు మాకు అనుగ్రహించారు. 


ఈ సంఘటన వల్ల నాకు తెలిసినది ఏమంటే 

మమ్మల్ని కరుణించడానికే స్వామివారు మావద్ద అడిగిమరీ చిత్రపటాలను తీసుకున్నారు (బంగారు ఫ్రేము కట్టి ఇవ్వగలిగిన భక్తులు వున్నప్పటికి). 


పవిత్రమైన శంకర మఠంలో మేము ఇచ్చిన చిత్రపటాలను వేలాడతీయవలసిందిగా ఆజ్ఞాపించడం మాకు కలిగిన అదృష్టం. 


ఎక్కడా దొరకని బ్రహ్మానంద అనుభూతిని వేదాంత విచారం ద్వారా ప్రత్యక్షంగా మాకు ప్రసాదించడం. 


--- డా. యస్. రామకృష్ణన్, చెన్నై - 92. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥


#KanchiParamacharyaVaibhavam

# కంచి పరమాచర్య స్వామి వైభవం#

వశపఱచు కొనవలెను

 *సుభాషితమ్* 


శ్లో𝕝𝕝 హస్తీ అంకుశ హస్తేన 

వాజీ హస్తేన తాడ్యతే |

శృంగీ లగుడ హన్తేన

ఖడ్గహస్తేన దుర్జనః || 


తా𝕝𝕝 ఏనుగును చేతిలోని అంకుశముతోను, గుఱ్ఱమును చేతిలోని కొరడాతోను, కొమ్ములుగల జంతువును చేతిలోని కఱ్ఱతోను, దుర్జనుని చేతిలోని ఖడ్గముతోను కొట్టి వశపఱచు కొనవలెను.

ఆలోచించెదరు గాక ....

 తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు.

ఇదంతా అతనికి వింతగా అనిపించిందితనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.

తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి అసలు విషయం చెప్పాడు. అది విన్న మన భారతీయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తైవాన్ మిత్రుడు భారతీయుణ్ణి అడిగిన ప్రశ్న:200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు’’

‘‘బహుశా 10 వేల మంది ఉండి ఉండవచ్చు’’ బదులిచ్చాడు భారతీయుడు

 ‘‘మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?వాళ్ళందరూ భారతీయులే కదా? ఔనంటావా?

నిరాయుధులుగా ఉన్న 1300 మందిని కాల్చిపారేయమని జనరల్ డయ్యర్ ఆదేశించాడు.అప్పడు కాల్పులు జరిపింది బ్రిటిష్ ఆర్మీ కాదు. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?’’అడిగాడు తైవాన్ స్నేహితుడు.

మరో ప్రశ్న అడిగాడు తైవాన్ స్నేహితుడు

‘‘ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు?వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించారు? భారతీయులను తమ బానిసలుగా భావించారు. మీలోనే కొందరిని మతం మార్చి మీకు వ్యతిరేకంగా పోరాడేలా చేసారు. మీలోనే కొందరు డబ్బు కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు.కాబట్టి మిత్రుడా, మీ ప్రజలే శతాబ్దాల పాటు మీ ప్రజల్ని చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు కోసం. మీలాంటి స్వార్ధపరులు, మోసగాళ్ళు, విద్రోహులు, అల్ప బుద్ధులు, శత్రువులతో స్నేహం చేసి, తమ వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారిని మా దేశస్తులు ద్వేషిస్తారు’’ అన్నాడుమరో విషయం చెప్పాడు తైవానీయుడు. ‘‘బ్రిటిషర్లు హాంగ్ కాంగ్ ని స్వాధీనం చేసుకొన్నప్పుడు ఒక్క స్థానికుడు కూడా సైన్యంలో చేరలేదు. తమ వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం వారికి లేదు.

కపట మనస్తత్వం కలిగిన చాలా మంది భారతీయులు ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉంటారు.ముందూ వెనకా ఆలోచించరు’’ 

‘‘అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఉతమిచ్చేందుకు వెనుకాడరు. భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరూ మీ కుటుంబం ప్రధానం.సమాజం, దేశం ఏమైపోయినా సరే మీకు బాధనిపించదు’’ అని ముగించాడు తైవాన్ దేశస్తుడు

 

ఇది మనకెవరికీ మింగుడు పడని చేదు నిజం.

చివరగా చెప్పాలనుకున్న దేమిటంటే ! మనలో దేశభక్తి కన్నా స్వభక్తి పేరాశ ఓటును అమ్ముకోవడం ,వ్యక్తి సమర్ధతను విస్మరించి కులానికి ఓటు వేయడం ఇవన్నీ మన దేశ పురోగతిని అడ్డుకుంటామన్న బాధ మెలిపెడుతోంది ! ఆలోచించెదరు గాక ....